అన్వేషించండి

Telangana Election 2023: ఇంకా ఓటరుగా నమోదు చేసుకోలేదా!, 18 ఏళ్లు నిండిన వారికి ఇదే లాస్ట్ ఛాన్స్ - ఇంకా 6 రోజులే గడువు

Telangana Election 2023: తెలంగాణలో 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ కొత్తగా ఓటు హక్కు కోసం ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని ఎన్నికల అధికారులు సూచించారు. అక్టోబర్ 31 వరకే అవకాశమని తెలిపారు.

ఓటు హక్కు, ఐదేళ్లు మనల్ని పాలించే నేతలను మనమే ఎన్నుకునే ఓ గొప్ప అవకాశం. ముఖ్యంగా యువత ఎన్నికల్లో కీలక పాత్ర పోషించాలి. ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఓటేసి అందరికీ ఆదర్శంగా నిలవాలి. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని ఎన్నికల అధికారులు సూచిస్తున్నారు. ఈ నెలాఖరు వరకూ ఓటరుగా నమోదు చేసుకునేందుకు అవకాశం ఉందని, సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిస్తున్నారు. 

ఆన్ లైన్ లోనే

తెలంగాణలో ఎన్నికలకు ఈసీ షెడ్యూల్ విడదల చేయడంతో అధికార యంత్రాంగం విస్తృతంగా కసరత్తు చేస్తోంది. ఓటర్ల నమోదు, పోలింగ్ కేంద్రాలు, ఈవీఎంల సన్నద్ధత వంటి అంశాలపై అధికారులు నిమగ్నమయ్యారు. ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెంచేలా అవగాహన కల్పిస్తున్నారు. ఈ క్రమంలో ఈసీ కొత్త ఓటరు నమోదుకు అవకాశం కల్పించింది. అర్హులైన ప్రతి ఒ క్కరూ ఓటెయ్యాలనే సంకల్పంతో సీఈసీ ఈ నిర్ణయం తీసుకుంది. 18 ఏళ్లు నిండిన వారు ఆలస్యం చేయకుండా ఆన్ లైన్ లో ఫారం - 6 నింపి ఓటరుగా నమోదు కావాలని అధికారులు చెబుతున్నారు.

2023 అక్టోబర్ 1వ తేదీ నాటికి 18 ఏళ్లు నిండిన యువత ఎన్నికల సంఘం అధికారిక వెబ్ సైట్ లోకి వెళ్లి ఫారం - 6పై క్లిక్ చేసి వివరాలు నమోదు చేసి ఓటరుగా నమోదు కావాలని అధికారులు తెలిపారు. అక్టోబర్ 31 వరకే ఈ ఛాన్స్ అని, ఇప్పటివరకూ నమోదు చేసుకోని వారికి ఈ ఎన్నికలకు ఇదే చివరి అవకాశమని స్పష్టం చేస్తున్నారు. 

యువత ఆసక్తి

కాగా, ఎన్నికల సంఘం సూచనలతో తెలంగాణలో యువ ఓటర్లు పెద్ద సంఖ్యలో ఓట్ల నమోదుపై ఆసక్తి కనబరుస్తున్నారు. తాజా ఓటర్ల జాబితా మేరకు రాష్ట్రంలో 18-19 ఏళ్ల మధ్య వయసున్న ఓటర్లు 8.11 లక్షల మంది ఉన్నారు. ఈ ఏడాది జనవరి నుంచి అక్టోబరు మధ్య వీరిలో 66 శాతం మంది కొత్తగా ఓటు హక్కు నమోదు చేసుకున్నట్లు అధికారిక లెక్కల ప్రకారం తెలుస్తోంది. అంటే ఏకంగా 5.32 లక్షల మంది కొత్తగా నమోదు చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. గడువు పూర్తయ్యే లోపు యువ ఓటర్ల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు.

ఏమైనా సందేహాలా!

ఓటరుగా కొత్తగా నమోదు చేసుకోవాలనుకునే వారు ఆన్ లైన్ ద్వారానే నమోదు చేసుకోవాలని అధికారులు స్పష్టం చేశారు. గతంలో గ్రామీణ ప్రాంతాల్లో ఓటరు నమోదు, మార్పులు, చేర్పులకు ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేసి వాటి ద్వారా అర్హులైన వారి నుంచి దరఖాస్తులు స్వీకరించేవారు. అయితే, ప్రస్తుతం అధికారులు ఎన్నికల విధుల్లో బిజీగా ఉండడంతో ఆన్ లైన్ ద్వారానే ప్రక్రియ పూర్తి చేస్తున్నారు. దాంతో పాటే మీ సేవ కేంద్రాలు లేదా ఓటర్ హెల్ప్ లైన్ ద్వారా కూడా ఓటరుగా నమోదు చేసుకునే అవకాశం కల్పించారు. ఓటరు నమోదులో ఏమైనా సందేహాలుంటే 1950 టోల్ ఫ్రీ నెంబరుకు కాల్ చేస్తే ఎలా నమోదు చేసుకోవాలి.? ఓటు ఉందా.? లేదా.? అనే అంశాలను తెలుసుకోవచ్చని అధికారులు తెలిపారు.

Also Read: తెలంగాణ ఎన్నికల్లో వారిదే కీలక పాత్ర- అభ్యర్థుల గెలుపోటములు నిర్ణయించేది వాళ్లే

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Nagarjuna: మంత్రి కొండా సురేఖ ఆరోపణల్ని తీవ్రంగా ఖండించిన నటుడు నాగార్జున, అసలేం జరిగిందంటే!
Nagarjuna: మంత్రి కొండా సురేఖ ఆరోపణల్ని తీవ్రంగా ఖండించిన నటుడు నాగార్జున, అసలేం జరిగిందంటే!
YS Sharmila Vizag : చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల -  విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల - విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
Delhi Drugs: ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
AP CM Chandra Babu: ఏపీ ప్రజలకు దసరా కానుక- డ్వాక్రా సంఘాలకు సంక్రాంతి గిఫ్ట్‌ - గుడ్ న్యూస్‌లు చెప్పిన చంద్రబాబు
ఏపీ ప్రజలకు దసరా కానుక- డ్వాక్రా సంఘాలకు సంక్రాంతి గిఫ్ట్‌ - గుడ్ న్యూస్‌లు చెప్పిన చంద్రబాబు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఇజ్రాయేల్‌పై ఇరాన్ భీకర దాడులు, నెతన్యాహు స్ట్రాంగ్ వార్నింగ్తిరుమలలో పవన్‌ చిన్న కూతురు పొలేనా అంజనా డిక్లరేషన్తొలిసారి మీడియా ముందుకి పవన్ కల్యాణ్ రెండో కూతురుతిరుమల ఆలయంలో పవన్ చేతిలో రెడ్‌బుక్‌, అందులో ఏముంది..?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nagarjuna: మంత్రి కొండా సురేఖ ఆరోపణల్ని తీవ్రంగా ఖండించిన నటుడు నాగార్జున, అసలేం జరిగిందంటే!
Nagarjuna: మంత్రి కొండా సురేఖ ఆరోపణల్ని తీవ్రంగా ఖండించిన నటుడు నాగార్జున, అసలేం జరిగిందంటే!
YS Sharmila Vizag : చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల -  విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల - విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
Delhi Drugs: ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
AP CM Chandra Babu: ఏపీ ప్రజలకు దసరా కానుక- డ్వాక్రా సంఘాలకు సంక్రాంతి గిఫ్ట్‌ - గుడ్ న్యూస్‌లు చెప్పిన చంద్రబాబు
ఏపీ ప్రజలకు దసరా కానుక- డ్వాక్రా సంఘాలకు సంక్రాంతి గిఫ్ట్‌ - గుడ్ న్యూస్‌లు చెప్పిన చంద్రబాబు
Adilabad: మద్యం మానేస్తేనే స్థానిక సంస్థల ఎన్నికల్లో టికెట్లు- కాంగ్రెస్ ఎమ్మెల్యే సంచలన ప్రకటన 
మద్యం మానేస్తేనే స్థానిక సంస్థల ఎన్నికల్లో టికెట్లు- కాంగ్రెస్ ఎమ్మెల్యే సంచలన ప్రకటన 
Moto G75 5G: కొత్త 5జీ ఫోన్ లాంచ్ చేసిన మోటొరోలా - మార్కెట్లోకి మోటో జీ75 5జీ ఎంట్రీ - ధర ఎంత?
కొత్త 5జీ ఫోన్ లాంచ్ చేసిన మోటొరోలా - మార్కెట్లోకి మోటో జీ75 5జీ ఎంట్రీ - ధర ఎంత?
Pawan Kalyan Varahi : ప్రాయశ్చిత దీక్ష విరమించిన పవన్ - డిక్లరేషన్ బుక్‌కు పూజలు - వారాహి సభలో సంచలన ప్రకటనలే
ప్రాయశ్చిత దీక్ష విరమించిన పవన్ - డిక్లరేషన్ బుక్‌కు పూజలు - వారాహి సభలో సంచలన ప్రకటనలే
Tripti Dimri Controversy: 5 లక్షలు తీసుకుని ఎగొట్టింది... కొత్త వివాదంలో 'యానిమల్' బ్యూటీ - ఆమె సినిమా బాయ్ కాట్ చేస్తారా?  
5 లక్షలు తీసుకుని ఎగొట్టింది... కొత్త వివాదంలో 'యానిమల్' బ్యూటీ - ఆమె సినిమా బాయ్ కాట్ చేస్తారా?
Embed widget