అన్వేషించండి

Minister KTR : మోదీ ప్రభుత్వంలో సిలిండర్ వెయ్యి అయింది - కట్టెల పొయ్యి దిక్కైంది : మంత్రి కేటీఆర్

Minister KTR : ధాన్యం కొనుగోలుపై టీఆర్ఎస్ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తుంది. సిరిసిల్లలో మంత్రి కేటీఆర్ రైతు ధర్నాలో పాల్గొన్నారు. ఇవాళ ఛాయ్ పే చర్చ లేదని పెట్రోల్, డీజిల్ ధరలపై చర్చే ఉందన్నారు.

Minister KTR : ధాన్యం కొనుగోలుపై టీఆర్ఎస్ పోరు బాట పట్టింది. తెలంగాణ వ్యాప్తంగా మంత్రులు, టీఆర్ఎస్ నేతలు రోడ్ల పైకి నిరసనలు చేపట్టారు. సిరిసిల్లలో టీఆర్ఎస్ నిర్వహించిన రైతు దీక్షకు మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సభలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో రైతు బాంధవ్యుడు సీఎం కేసీఆర్ ఉన్నా ఇవాళ రైతులు మళ్లీ ధర్నాలు చేపట్టాల్సిన పరిస్థితి కేంద్రం తీసుకొచ్చిందని విమర్శించారు. 2014 ఎన్నికలకు ముందు మోదీ ప్రధాని కాకముందు ఛాయ్ పే చర్చ అన్నారని, కానీ ఇవాళ దేశంలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ పైన చర్చ, పార్లమెంట్ లో తెలంగాణ ధాన్యం గురించి చర్చ జరుగుతోందని మంత్రి కేటీఆర్ అన్నారు. వీటిపై చర్చ తప్పా ఇవాళ దేశంలో ఛాయ్ పే చర్చ లేదన్నారు.  

ప్రధాని మోదీకి చేతకావడంలేదా?

"సిలిండర్ రూ.వెయ్యి అయింది. కట్టెలు పొయ్యి దిక్కు అయింది." అని మంత్రి కేటీఆర్ విమర్శించారు. అధికారం లేనప్పుడు గ్యాస్ ధరలపై స్మృతి ఇరానీ, నిర్మలా సీతరామన్ నిరసన చేసి పేదల వ్యతిరేకమైన ప్రభుత్వం అని అప్పటి కాంగ్రెస్ పై విమర్శలు చేశారన్నారు. అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ అధికారం నుంచి దిగిపోవాలన్నారు. అప్పుడు గుజరాత్ సీఎంగా ఉన్న నరేంద్ర మోదీ రోడ్డెక్కి చేతకాని ప్రభుత్వం కాంగ్రెస్ అధికారం నుంచి దిగిపోవాలని డిమాండ్ చేశారని గుర్తుచేశారు. 2014లో మోదీ అధికారంలోకి వచ్చినప్పుడు క్రూడ్ ఆయిల్ ధర 105 డాలర్లు ఉంటే ఇప్పుడు కూడా 105 డాలర్లే ఉందని మంత్రి కేటీఆర్ గుర్తు చేశారు. ఆ రోజు పెట్రోల్ ధర రూ.70.51పై, డీజిల్ ధర రూ.53.78పై కానీ ఈ రోజు పెట్రోల్ ధర లీటర్ రూ.120 ఉంటే, డీజిల్ ధర రూ.104 ఉందన్నారు. ఆ రోజు మన్మోహన్ సింగ్ దిగిపోమ్మని డిమాండ్ చేసిన మోదీకి ఇప్పుడు చేతకావడంలేదా అని కేటీఆర్ విమర్శించారు. 

Minister KTR : మోదీ ప్రభుత్వంలో సిలిండర్ వెయ్యి అయింది - కట్టెల పొయ్యి దిక్కైంది : మంత్రి కేటీఆర్

పీయూష్ గోయల్ పార్లమెంట్ లో అబద్ధాలు చెబుతున్నారు

"ఇవాళ పెట్రోల్, డీజిల్ ధర తగ్గించమని కేంద్రాన్ని అడిగితే రాష్ట్రాల్లో తగ్గించుకోండి అంటున్నారు. గ్యాస్ సిలిండర్ ధర్ ఇవాళ పెరిగిపోవడానికి కారణం ప్రధాని మోదీ ప్రభుత్వం. ఆనాడు రూ.450 ఉండే గ్యాస్ సిలిండర్ ఇనాడు రూ.1000లకు చేరిందన్నారు. ప్రధాని మోదీ ప్రభుత్వం గ్యాస్ పై ఉన్న రూ.లక్ష కోట్ల సబ్సిడీ తొలగించందన్నారు. పెరిగిన ముడి చమురు ధరలకు రష్యా, ఉక్రెయిన్ ధరలకు ఏమి సంబంధం ఉంది. రష్యా నుంచి ఒక్క శాతం మాత్రమే తెచ్చుకుంటున్నాం. కానీ రష్యా-ఉక్రెయిన్ వార్ ను వంకగా చెబుతున్నారు. కేంద్రం ధరలు పెంచిందని ప్రశ్నిస్తే దేశద్రోహి అని ముద్రవేస్తున్నారు. ఇవాళ ధాన్యం కొనుగోలుపై కొట్లాడుతున్నాం. తెలంగాణ బియ్యం కొనమని కేంద్ర పీయూష్ గోయల్ ఎటకారంగా మాట్లాడుతున్నారు. ఉప్పుడు బియ్యానికి గిరాకీ లేదని పీయూష్ గోయల్ అంటున్నారు. కానీ భారత ప్రభుత్వం కోటి మెట్రిక్ టన్నుల ఉప్పుడు బియ్యాన్ని ఇతర దేశాలకు ఎగుమతి చేస్తుంది. కానీ పార్లమెంట్ లో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ శుద్ధ తప్పులు చెబుతున్నారు. నూకల తినండని కేంద్ర మంత్రి మాట్లాడుతున్నారు. తెలంగాణ రైతులను కించపరిచేలా కేంద్ర మంత్రి మాట్లాడుతున్నారు." మంత్రి కేటీఆర్ అన్నారు. 

ప్రతీ గింజ కొంటామన్న నేతలెక్కడ?

ప్రతీ రంగంలోనూ కేంద్రం మోసం చేస్తుందని మంత్రి కేటీఆర్ అన్నారు. రైతులను రెచ్చగొట్టి మాట్లాడిన బీజేపీ నేతలు ఇవాళ ఎక్కడికి పోయారన్నారు. పండించిన ప్రతీ గింజను కొంటామన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ బండి సంజయ్ ఎందుకు కొనిపించడంలేదన్నారు. మీకు చేతగాకపోతే సీఎం కేసీఆర్ కు అప్పగిస్తే దేశం వ్యాప్తంగా ఉద్యమం చేసి ఈ సమస్యను పరిష్కరిస్తామన్నారు.  మోదీ సర్కార్ ప్రతి రంగంలో ప్రజలను మోసం చేస్తోందన్నారు. రేపు రాష్ట్రంలోని ప్రతి రైతు ఇంటిపై నల్ల జెండా ఎగురవేయాలని పిలుపునిచ్చారు. ప్రతి గ్రామంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మలను దగ్ధం చేయాలన్నారు. ఆ సెగ దిల్లీకి తాకాలన్నారు. ఈ నెల 11న దిల్లీలో రాష్ట్ర మంత్రులు ధర్నా చేసి కేంద్ర ప్రభుత్వానికి నిరసన తెలుపుతామని మంత్రి కేటీఆర్ తెలిపారు. 

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Velugumatla Issue: వెలుగుమట్ల బాధితుల కోసం రోడ్డెక్కిన కవిత పోరాటం - ఖమ్మంలో ఉద్రిక్తత
వెలుగుమట్ల బాధితుల కోసం రోడ్డెక్కిన కవిత పోరాటం - ఖమ్మంలో ఉద్రిక్తత
Telangana Voter List: తెలంగాణలో 50 లక్షల ఓట్లు తొలగింపు..! ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌తో ఏప్రిల్‌లో ఈసీ SIR ! వారి ఓట్లు గల్లంతే
తెలంగాణలో 50 లక్షల ఓట్లు తొలగింపు..! ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌తో ఏప్రిల్‌లో ఈసీ SIR !
Delhi Liquor Scam Case: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం.. కవితకు మళ్లీ నోటీసులు!
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం.. కవితకు మళ్లీ నోటీసులు!
Khammam Crime News: భర్త పేరిట ఇన్సురెన్స్.. బంధువుల సాయంతో హత్య చేయించిన భార్య.. ఖమ్మంలో దారుణం
భర్త పేరిట ఇన్సురెన్స్.. బంధువుల సాయంతో హత్య చేయించిన భార్య.. ఖమ్మంలో దారుణం

వీడియోలు

Santosh Nagar Steel Bridge | హైదరాబాద్ లో వివాదాస్పద స్టీల్ బ్రిడ్జి వద్ద పనులు ఎందుకు నిలిచిపోయాయి?
Sanju Samson on Recent Performance | అదృష్టం తన జీవితంలోనూ ఉందన్న సంజూ శాంసన్ | ABP Desam
Fans worrying Ahmedabad Pitch | పీడకల మిగిల్చిన అహ్మదాబాద్ పిచ్ పైనే మళ్లీ ఫైనల్ | ABP Desam
Axar patel on Golden Catches vs Eng | T20 World cup 2026 లో జడ్డూ లేని లోటును తీరుస్తున్న అక్షర్ | ABP Desam
Abhishek Sharma Poor Form | T20 World Cup 2026 ఫైనల్లో అభిషేక్ ప్లేస్ పై డౌట్స్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nara Lokesh: మంగళగిరిలో మరో ఎన్నికల హామీ నిలబెట్టుకున్న మంత్రి నారా లోకేష్, రూ.294.20 కోట్లతో పనులు
మంగళగిరిలో మరో ఎన్నికల హామీ నిలబెట్టుకున్న మంత్రి నారా లోకేష్, రూ.294.20 కోట్లతో పనులు
Budget Session 2026: ఇరాన్ యుద్ధంపై రాజ్యసభలో జైశంకర్ కీలక ప్రకటన.. గల్ఫ్‌లో భారత పౌరుల భద్రతకు హామీ!
ఇరాన్ యుద్ధంపై రాజ్యసభలో జైశంకర్ కీలక ప్రకటన.. గల్ఫ్‌లో భారత పౌరుల భద్రతకు హామీ!
Telangana Voter List: తెలంగాణలో 50 లక్షల ఓట్లు తొలగింపు..! ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌తో ఏప్రిల్‌లో ఈసీ SIR ! వారి ఓట్లు గల్లంతే
తెలంగాణలో 50 లక్షల ఓట్లు తొలగింపు..! ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌తో ఏప్రిల్‌లో ఈసీ SIR !
Pawan Kalyan CM: ఏపీ రాజకీయాల్లో ఢిల్లీ మలుపు - చంద్రబాబు వ్యూహం..లోకేష్ vs పవన్ రేస్?
ఏపీ రాజకీయాల్లో ఢిల్లీ మలుపు - చంద్రబాబు వ్యూహం..లోకేష్ vs పవన్ రేస్?
Jana Nayagan : జన నాయగన్‌కు మళ్లీ షాక్ - విజయ్ లాస్ట్ మూవీ రిలీజ్ అయ్యేది ఎప్పుడు?
జన నాయగన్‌కు మళ్లీ షాక్ - విజయ్ లాస్ట్ మూవీ రిలీజ్ అయ్యేది ఎప్పుడు?
Stock Market 9 March: మిడిల్ ఈస్ట్ ఉద్రిక్తతలతో భారత స్టాక్ మార్కెట్లో బ్లడ్ బాత్.. సెన్సెక్స్ 2400, నిఫ్టీ సైతం 650 పాయింట్లు పతనం
భారత స్టాక్ మార్కెట్లో బ్లడ్ బాత్.. సెన్సెక్స్ 2400, నిఫ్టీ సైతం 650 పాయింట్లు పతనం
Trisha Krishnan : త్రిషపై కామెంట్స్... హీరోయిన్ స్ట్రాంగ్ కౌంటర్ - సారీ చెప్పిన డైరెక్టర్ పార్తిబన్
త్రిషపై కామెంట్స్... హీరోయిన్ స్ట్రాంగ్ కౌంటర్ - సారీ చెప్పిన డైరెక్టర్ పార్తిబన్
Tamil Nadu Assembly Elections 2026: తమిళనాట మరోసారి గెలిచేందుకు స్టాలిన్ చాణక్య వ్యూహాలు - విజయ్ ఉచితాల వల వర్కవుట్ అవుతుందా?
తమిళనాట మరోసారి గెలిచేందుకు స్టాలిన్ చాణక్య వ్యూహాలు - విజయ్ ఉచితాల వల వర్కవుట్ అవుతుందా?
Embed widget