అన్వేషించండి

Basar IIIT: బాసర ట్రిపుల్ ఐటీలో ఎక్కడేసిన గొంగళి అక్కడే! ఫుడ్ పాయిజన్ జరిగినా ఏం మారలా!

IIIT Basar: బాసర ట్రిపుల్ ఐటీలో ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు కావడం లేదని విద్యార్థులు వాపోతున్నారు. ఇటీవల జరిగిన ఫుడ్ పాయిజన్ ఘటనే ఇందుకు నిదర్శనమని చెబుతున్నారు.

Nirmal District:  నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల సమస్యలు నేటికి పరిష్కారం కాలేదు. 12 డిమాండ్లతో నెల రోజుల కింద ట్రిపుల్ ఐటీ స్టూడెంట్స్ 7 రోజుల పాటు శాంతియుత నిరసనలు చేపట్టారు. దీంతో దిగి వచ్చిన ప్రభుత్వం విద్యార్థుల డిమాండ్లు నెరవేరుస్తామని హామీ ఇచ్చారు. అది హామీల మేరకే గాని అమలుకు నోచుకోవడం లేదన్నది ఇటీవల విద్యార్థులు ఫుడ్ పాయిజన్ ఘటనతో నిరూపితం అయింది. పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటున్నామని అధికారులు చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా పరిస్థితి ఉంది. 

సమోసాలో ఈగ!
హాస్టళ్లు, మెస్ ల్లో సమస్యలు యథాతథంగా ఉన్నాయి. నీటి శుద్ధి ప్లాంట్లు పని చేయకపోవడంతో రెండు రోజుల నుంచి క్యాంపస్ కు కలుషిత నీరు సరఫరా అవుతోంది. విద్యార్థులు మరో గత్యంతరం లేక ఆ నీటినే తాగాల్సిన పరిస్థితి ఉంది. ఇక, క్యాంటీన్ నుంచి ఒక విద్యార్థి సమోసా తీసుకురాగా, అందులో ఈగ కనిపించింది. ఇప్పటికే ఒకసారి ఫుడ్ పాయిజన్ జరిగి పలువురు అస్వస్థతకు గురయ్యారని, క్యాంపస్ లో పరిస్థితులు ఇలాగే కొనసాగితే అందరూ జబ్బున పడే అవకాశం ఉందని విద్యార్థులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా విద్యార్థుల ఆందోళన తర్వాత స్టూడెంట్ వెల్ఫేర్ విభాగంలో పని చేసేందుకు అధికారులు జంకుతున్నారు. స్టూడెంట్ వెల్ఫేర్ డీన్ తోపాటు స్టూడెంట్ వెల్ఫేర్ ఆఫీసర్, కేర్ టేకర్.. ఆయా పదవుల నుంచి తప్పుకొన్నారు. వీరి స్థానాల్లో కొత్త వారిని నియమించాల్సి ఉన్నా.. రెండు, మూడు వారాలుగా జాప్యం జరుగుతూనే ఉంది. విద్యార్థుల సమస్యల పరిష్కారానికి కమిటీ ఏర్పాటు చేస్తామన్న మంత్రి సబిత హామీ నెల రోజులు దాటినా అమలు కాలేదు.

వర్సిటీకి రెగ్యులర్ వీసీని నియమించాలన్న, విద్యార్థుల డిమాండ్ ఇంకా నెరవేరలేదు. ఇటీవల ఇన్ చార్జి వీసీగా ఉన్నత విద్యామండలి చైర్మను వెంకట రమణను ప్రభుత్వం నియమించింది. ఆయనకు కూడా అదనపు బాధ్యతలు కావడంతో పూర్తిస్థాయిలో సమయం కేటాయించలేని పరిస్థితి నెలకొంది. మూడేళ్ల కిందట అడ్మిషన్ పొందిన నాలుగున్నర వేల మంది విద్యార్థులకు ఇప్పటికీ ల్యాప్ టాప్‌లు, యూనిఫామ్స్ అందలేదు. వర్సిటీలో కొత్తగా బోధన సిబ్బంది నియామకాలు జరగలేదు. 300 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 3 వేల మంది పీయూసీ 1, పీయూసీ 2 విద్యార్థులకు మ్యాథ్స్, సైన్స్, ఇంగ్లిష్ వంటి సబ్జెక్టులకు నలుగురు చొప్పున మాత్రమే అధ్యాపకులున్నారు. 

ఐసీటీ ఆధారిత విద్యా బోధన అమలు కావడం లేదు. హాస్టల్ గదుల్లో కొన్నింటికే మరమ్మతులు చేశారు. కొత్త బెడ్స్ ఏర్పాటు చేయకపోవడంతో ఉన్నవాటితోనే సర్దుకుంటున్నారు. వెయ్యి సీలింగ్ ఫ్యాన్లు ఏర్పాటు చేయాల్సిఉండగా.. 300 ఫ్యాన్లు బిగించారు. పుస్తకాలతో కుస్తీ పట్టాల్సిన విద్యార్థులు నిత్యం సమస్యలతో సతమతం అవుతున్నారు. ఎంత గింజుకున్నా ప్రభుత్వం తమ సమస్యలు తీర్చటం లేదని బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొన్నటికి మొన్న దాదాపు 300 మంది విద్యార్థులు కలుషిత ఆహారం తిని ఆస్పత్రుల పాలయ్యారు. అయినా ప్రభుత్వం తమ సమస్యలను పట్టించుకోకపోవడంపై ట్రిపుల్ ఐటీ విద్యార్థులు మండిపడుతున్నారు.

టాప్ హెడ్ లైన్స్

Breaking News: రెండో టీ20లో 4 వికెట్ల తేడాతో భారత్‌పై ఇంగ్లాండ్ ఘన విజయం
రెండో టీ20లో 4 వికెట్ల తేడాతో భారత్‌పై ఇంగ్లాండ్ ఘన విజయం
Asifabad News: ఆసిఫాబాద్ జిల్లా ప్రజల సమస్యల పరిష్కారానికి మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ హామీ
ఆసిఫాబాద్ జిల్లా ప్రజల సమస్యల పరిష్కారానికి మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ హామీ
TRS Chief Kavitha Reaction : కొత్త పేరు ఇచ్చేది లేదు, న్యాయపోరాటం చేస్తా: ఈసీ అభ్యంతరాలపై కవిత తొలి రియాక్షన్!
కొత్త పేరు ఇచ్చేది లేదు, న్యాయపోరాటం చేస్తా: ఈసీ అభ్యంతరాలపై కవిత తొలి రియాక్షన్!
TRS Chief Kavitha: టీఆర్‌ఎస్‌ చీఫ్‌ కవితకు షాక్‌! 15 రోజు సమయం ఇచ్చిన ఈసీ!
టీఆర్‌ఎస్‌ చీఫ్‌ కవితకు షాక్‌! 15 రోజు సమయం ఇచ్చిన ఈసీ!

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rains In AP and Telangana: నేడు ఏపీలో ఈ జిల్లాలకు వర్షసూచన.. తెలంగాణలో వర్షాలు తగ్గుముఖం, 50 కి.మీ వేగంతో ఈదురుగాలులు
నేడు ఏపీలో ఈ జిల్లాలకు వర్షసూచన.. తెలంగాణలో వర్షాలు తగ్గుముఖం, 50 కి.మీ వేగంతో ఈదురుగాలులు
Women T20 World Cup Champ Australia: ఆసీస్ ఏడోసారి.. రికార్డ్ ఛేజింగ్ తో వ‌ర‌ల్డ్ చాంప్ గా నిలిచిన కంగారులు.. ఇంగ్లాండ్ కి నాలుగోసారి భంగ‌పాటు.. స‌త్తా చాటిన మూనీ, లీచ్ ఫీల్డ్..
ఆసీస్ ఏడోసారి.. రికార్డ్ ఛేజింగ్ తో వ‌ర‌ల్డ్ చాంప్ గా నిలిచిన కంగారులు.. ఇంగ్లాండ్ కి నాలుగోసారి భంగ‌పాటు.. స‌త్తా చాటిన మూనీ, లీచ్ ఫీల్డ్..
Prashna Ravan Wife: పవన్ కళ్యాణ్ మాట్లాడితే ఒప్పు.. నా భర్త మాట్లాడితే తప్పా? మమ్మల్ని ఒకేసారి చంపేయండి: ప్రశ్న రావణ్ భార్య
పవన్ కళ్యాణ్ మాట్లాడితే ఒప్పు.. నా భర్త మాట్లాడితే తప్పా? మమ్మల్ని ఒకేసారి చంపేయండి: ప్రశ్న రావణ్ భార్య
Uttam Kumar Reddy: బీఆర్ఎస్ చెప్పింది చేస్తే భద్రాచలం మునిగిపోతుంది: కాళేశ్వరంపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
బీఆర్ఎస్ చెప్పింది చేస్తే భద్రాచలం మునిగిపోతుంది: కాళేశ్వరంపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
KTR Challenges Revanth Reddy: చేతకాకపోతే వారం రోజులు కేసీఆర్‌కి అప్పజెప్పండి.. అన్ని జలాశయాలు నింపి చూపిస్తాం: రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్!
చేతకాకపోతే వారం రోజులు కేసీఆర్‌కి అప్పజెప్పండి.. మొత్తం నీటితో నింపి చూపిస్తాం: రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్!
Satluj OTT : మూడేళ్ల తర్వాత డైరెక్ట్‌గా ఓటీటీలోకి కాంట్రవర్సీ మూవీ - టైటిల్ ఛేంజ్... ఎందులో చూడొచ్చంటే?
మూడేళ్ల తర్వాత డైరెక్ట్‌గా ఓటీటీలోకి కాంట్రవర్సీ మూవీ - టైటిల్ ఛేంజ్... ఎందులో చూడొచ్చంటే?
MLC Duvvada Srinivas: భయపడటం, పారిపోవడం నా బ్లడ్‌లోనే లేదు.. జైలుకు వెళ్లడానికైనా రెడీ: దువ్వాడ శ్రీనివాస్
భయపడటం, పారిపోవడం నా బ్లడ్‌లోనే లేదు.. జైలుకు వెళ్లడానికైనా రెడీ: దువ్వాడ శ్రీనివాస్
Tata Tiago EV on Discount: దేశంలో అత్యంత చౌకైన ఈవీపై రూ.1.45 లక్షల డిస్కౌంట్.. ఫీచర్లు, రేంజ్ చూసి కొనేయండి
అత్యంత చౌకైన ఈవీపై రూ.1.45 లక్షల డిస్కౌంట్.. ఫీచర్లు, రేంజ్ చూసి కొనేయండి
Embed widget