అన్వేషించండి

Munugode By Election : మునుగోడు ప్రజలు కాంట్రాక్టర్లు కాదు మూటలకు అమ్ముడుపోవడానికి- రేవంత్ రెడ్డి

Munugode By Election : మునుగోడు ఉపఎన్నిక కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి ఆ పార్టీ నేతల సమక్షంలో నామినేషన్ దాఖలు చేశారు.

Munugode By Election : మునుగోడు ఉపఎన్నికలో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా పాల్వాయి స్రవంతి నామినేషన్‌ శుక్రవారం వేశారు. నేటితో మునుగోడు నామినేషన్ పర్వం ముగిసింది. నామినేషన్ల ఉపసంహరణకు 17వ తేదీ వరకు గడువు ఉంది. వందకు పైగా నామినేషన్లు దాఖలైనట్లు తెలుస్తోంది. 50కి పైగా నామినేషన్లు చివరి రోజు శుక్రవారం దాఖలు చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి చండూరు తహశీల్దార్‌ కార్యాలయంలో రిటర్నింగ్‌ అధికారికి నామినేషన్ పత్రాలు అందజేశారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, ఎంపీ ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, కాంగ్రెస్‌ సీనియర్ నేతల సమక్షంలో ఆమె నానినేషన్ దాఖలు చేశారు. 

ప్రజలు కాంట్రాక్టర్లు కాదు అమ్ముడుపోవడానికి

నామినేషన్ అనంతరం నిర్వహించిన సభలో మాట్లాడిన రేవంత్ రెడ్డి టీఆర్ఎస్, బీజేపీలపై తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తల  అండతోనే ప్రజా సమస్యలపై పోరాడుతుందన్నారు. ఓటర్లను డబ్బులతో కొనుగోలు చేయాలని బీజేపీ, టీఆర్ఎస్ చూస్తున్నాయని ఆరోపించారు. మునుగోడు ప్రజలు అమ్ముడుపోవడానికి కాంట్రాక్టర్లు కాదని స్పష్టం చేశారు. దిండి ప్రాజెక్టు పూర్తి చేస్తే చివరి ఆయకట్టుకు నీళ్లందుతాయన్నారు. దిండి ప్రాజెక్టుకు రూ.5 వేల కోట్ల ప్యాకేజీ ఇప్పించగలరా అని రాజగోపాల్ రెడ్డికి సవాల్ విసిరారు.  బీజేపీ, టీఆర్ఎస్ ముఠాలు, మూటలతో మునుగోడులో ల్యాండ్ అయ్యాయని ఆరోపించారు.  గత అసెంబ్లీ ఎన్నికల్లో తనను ఓడించేందుకు కొడంగల్‌ను దత్తత తీసకుంటున్నానని చెప్పిన కేటీఆర్‌, ఇప్పటివరకు ఎలాంటి అభివృద్ధి చేయలేదని విమర్శలు చేశారు.  మునుగోడు ప్రజలను కొడంగల్‌ తీసుకెళ్లి చూపిస్తానన్నారు. రోడ్లపై గుంతలు పడితే తట్టెడు మట్టివేసే దిక్కులేదన్నారు. రేపో మాపో మునుగోడుకు సీఎం కేసీఆర్‌ వచ్చి కుర్చీ వేసుకొని ఇక్కడే కూర్చుంటా మునుగోడుకు సముద్రం తెస్తానని చెబుతారని ఎద్దేవా చేశారు.  

రాహుల్ జోడో యాత్రపై 
 
ఈ నెల 23న రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర తెలంగాణలో ప్రవేశిస్తుందని రేవంత్ రెడ్డి తెలిపారు. కర్ణాటక నుంచి కృష్ణా నది బ్రిడ్జి మీదుగా మహబూబ్ నగర్ జిల్లా మక్తల్ నియోజకవర్గంలోకి పాదయాత్ర ప్రవేశిస్తుందన్నారు. యాత్రపై సమన్వయం చేసుకునేందుకు పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా ఇంఛార్జ్ లను నియమించామన్నారు. ఈ నెల 31న జోడో యాత్ర హైదరాబాద్ లోకి ప్రవేశిస్తుందని చెప్పారు. హైదరాబాద్ లో చార్మినార్ నుంచి యాత్ర ప్రారంభమై గాంధీ భవన్ మీదుగా నెక్లెస్ రోడ్ లోని ఇందిరాగాంధీ విగ్రహం వరకు చేరుకుంటుందన్నారు.  ఇందిరాగాంధీ వర్ధంతి సందర్బంగా నెక్లెస్ రోడ్ లో బహిరంగ సభ నిర్వహిస్తామన్నారు. జుక్కల్ నియోజకవర్గంలోని మద్నూర్ వరకు జోడో యాత్ర కొనసాగుతుందని వెల్లడించారు. పాదయాత్రను విజయవంతం చేసేందుకు ప్రతీ కార్యకర్త, నాయకులు కృషి చేయాలని కోరారు. 

Also Read : PhonePe On ContractPe : మునుగోడు కాంట్రాక్ట్ పే పోస్టర్లపై ఫోన్ పే అభ్యంతరం, లోగో వాడినందుకు చట్టపరమైన చర్యలు!

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Sircilla Sarpanchs: సర్పంచ్‌లుగా గెలిచిన వారికి న్యాయసాయం కోసం జిల్లాలో లీగల్ సెల్ - కేటీఆర్ నిర్ణయం
సర్పంచ్‌లుగా గెలిచిన వారికి న్యాయసాయం కోసం జిల్లాలో లీగల్ సెల్ - కేటీఆర్ నిర్ణయం
Prashant Kishor: దేశ రాజకీయాల్లో కీలక మార్పులు - ప్రియాంకా గాంధీతో ప్రశాంత్ కిషోర్ చర్చలు - కాంగ్రెస్‌లో చేరుతారా?
దేశ రాజకీయాల్లో కీలక మార్పులు - ప్రియాంకా గాంధీతో ప్రశాంత్ కిషోర్ చర్చలు - కాంగ్రెస్‌లో చేరుతారా?
IPS officer Sanjay: ప్రభుత్వం నిధుల దుర్వినియోగం కేసులో ఐపీఎస్‌ సంజయ్‌కు బెయిల్‌ మంజూరు!
ప్రభుత్వం నిధుల దుర్వినియోగం కేసులో ఐపీఎస్‌ సంజయ్‌కు బెయిల్‌ మంజూరు!
UP bride: పెళ్లి మండపంలో కారు డిమాండ్ చేసిన వరుడు - పెళ్లి రద్దు చేసుకున్న వధువు -అచ్చం సినిమాలో జరిగినట్లే
పెళ్లి మండపంలో కారు డిమాండ్ చేసిన వరుడు - పెళ్లి రద్దు చేసుకున్న వధువు -అచ్చం సినిమాలో జరిగినట్లే

వీడియోలు

India vs South Africa 3rd T20 Records | మూడో టీ20లో 5 పెద్ద రికార్డులు
Hardik Pandya Records in 3rd T20 | చరిత్ర సృష్టించిన హార్దిక్
Shubman Gill in Ind vs SA 3rd T20 | మళ్లీ విఫలమైన శుభ్మన్ గిల్
Suryakumar Yadav about His Batting | తన ఫార్మ్ పై వరుస క్లారిటీ ఇచ్చిన సూర్య
భారతదేశంలోనే అత్యంత విచిత్రమైన ఆచారాలు పాటించే ఉడిపి శ్రీకృష్ణ మందిరం

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sircilla Sarpanchs: సర్పంచ్‌లుగా గెలిచిన వారికి న్యాయసాయం కోసం జిల్లాలో లీగల్ సెల్ - కేటీఆర్ నిర్ణయం
సర్పంచ్‌లుగా గెలిచిన వారికి న్యాయసాయం కోసం జిల్లాలో లీగల్ సెల్ - కేటీఆర్ నిర్ణయం
Prashant Kishor: దేశ రాజకీయాల్లో కీలక మార్పులు - ప్రియాంకా గాంధీతో ప్రశాంత్ కిషోర్ చర్చలు - కాంగ్రెస్‌లో చేరుతారా?
దేశ రాజకీయాల్లో కీలక మార్పులు - ప్రియాంకా గాంధీతో ప్రశాంత్ కిషోర్ చర్చలు - కాంగ్రెస్‌లో చేరుతారా?
IPS officer Sanjay: ప్రభుత్వం నిధుల దుర్వినియోగం కేసులో ఐపీఎస్‌ సంజయ్‌కు బెయిల్‌ మంజూరు!
ప్రభుత్వం నిధుల దుర్వినియోగం కేసులో ఐపీఎస్‌ సంజయ్‌కు బెయిల్‌ మంజూరు!
UP bride: పెళ్లి మండపంలో కారు డిమాండ్ చేసిన వరుడు - పెళ్లి రద్దు చేసుకున్న వధువు -అచ్చం సినిమాలో జరిగినట్లే
పెళ్లి మండపంలో కారు డిమాండ్ చేసిన వరుడు - పెళ్లి రద్దు చేసుకున్న వధువు -అచ్చం సినిమాలో జరిగినట్లే
Nuclear ash over the Himalayas: హిమాలయాలపై అమెరికా పెట్టిన అణుకుంపటి -ఎవరికీ తెలియని సంచలన విషయాలు ఇవిగో
హిమాలయాలపై అమెరికా పెట్టిన అణుకుంపటి -ఎవరికీ తెలియని సంచలన విషయాలు ఇవిగో
Cheapest Cars in India: దేశంలో అత్యంత చవకైన కార్లు ఇవే! 34 KM మైలేజ్‌తోపాటు ADAS ఫీచర్ ఉన్న వాహనాల ధర ఎంత?
దేశంలో అత్యంత చవకైన కార్లు ఇవే! 34 KM మైలేజ్‌తోపాటు ADAS ఫీచర్ ఉన్న వాహనాల ధర ఎంత?
Lucky Draw Sarpanchs in Telangana: రెండో విడత ఫలితాల్లో చిత్ర విచిత్రాలు.. సమానంగా ఓట్లు, లక్కీ డ్రా సర్పంచ్ లు..!
రెండో విడత ఫలితాల్లో చిత్ర విచిత్రాలు.. సమానంగా ఓట్లు, లక్కీ డ్రా సర్పంచ్ లు..!
Balakrishna : సింగర్‌గా మారనున్న బాలయ్య - 'NBK111'లో సాంగ్ కన్ఫర్మ్ చేసిన తమన్!
సింగర్‌గా మారనున్న బాలయ్య - 'NBK111'లో సాంగ్ కన్ఫర్మ్ చేసిన తమన్!
Embed widget