అన్వేషించండి

Motkupalli Narasimhulu: టీఆర్ఎస్‌లో చేరనున్న మోత్కుపల్లి నర్సింహులు.. సీఎం కేసీఆర్ సమక్షంలో గులాబీ తీర్థం!

సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు అధికార పార్టీ టీఆర్ఎస్‌లో చేరికకు ముహూర్తం ఖరారైంది. ఇటీవల బీజేపీకి గుడ్ బై చెప్పిన మోత్కుపల్లి తెలంగాణలో అధికార పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు.

Motkupalli Narasimhulu: సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు అధికార పార్టీ టీఆర్ఎస్‌లో చేరికకు ముహూర్తం ఖరారైంది. అక్టోబర్ 18వ తేదీన మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ భవన్ లో తెలంగాణ సీఎం కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో మోత్కుపల్లి చేరనున్నారని తెలుస్తోంది. ఇటీవల దళితబంధు పథకంపై ప్రశంసలు కురిపించిన మోత్కుపల్లి త్వరలోనే గులాబీ కండువా కప్పుకుంటాడని ప్రచారం జరిగింది. తాజాగా ఆయన టీఆర్ఎస్ గూటికి చేరనున్నారని సమాచారం.

రాష్ట్ర విభజనకు ముందు టీడీపీలో కీలకంగా వ్యవహరించిన నేతలలో మోత్కుపల్లి నర్సింహులు ఒకరు. గతంలో టీడీపీ, కాంగ్రెస్‌ పార్టీల్లో ఉన్నత పదవులు చేపట్టిన ఆయన ఇటీవల బీజేపీకి రాజీనామా చేయడం తెలిసిందే. తనకు బీజేపీలో సముచిత స్థానం కల్పించలేదని... అన్యాయం జరిగిందని బీజేపీకి రాజీనామా సందర్భంగా మోత్కుపల్లి నర్సింహులు వ్యాఖ్యానించారు. పార్టీలో తన నిర్ణయాలకు గౌరవం ఇవ్వడం లేదని, నిస్వార్థంగా సేవ చేసేందుకు బీజేపీలో చేరానని.. అది జరిగే పరిస్థితి లేదన్నారు. సుదీర్ఘ అనుభవం ఉన్న తన సేవలు వినియోగించుకోవడంలో పార్టీ పూర్తిగా విఫలమైందని ఇటీవల ఘాటుగా విమర్శించారు. తనకు కనీసం బీజేపీ కమిటీలో కూడా స్థానం కల్పించకపోవడంతో కమలం పార్టీని వీడారు. అయితే అదే సమయంలో టీఆర్ఎస్ ను వీడి బీజేపీలో చేరిన మాజీ మంత్రి ఈటల రాజేందర్‌పై విమర్శలు గుప్పించారు.

Also Read: ఇక ఫుల్ టైమ్ అధ్యక్షురాలిని.... సీడబ్ల్యూసీ సమావేశంలో సోనియా గాంధీ కీలక వ్యాఖ్యలు... జీ-23 నేతలకు క్లాస్ 

యాదాద్రి భువనగిరి జిల్లా (ఉమ్మడి నల్గొండ) ఆలేరు నియోజకవర్గానికి చెందిన మోత్కుపల్లి నర్సింహులు బీజేపీని వీడిన తరువాత తన మార్గమేంటో చెప్పకనే చెప్పేశారు. తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన దళితబంధు పథకాన్ని ప్రశంసించిన సందర్భంలో టీఆర్ఎస్ గూటికి చేరడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు భావించారు. కేసీఆర్‌ను అభినవ అంబేద్కర్‌గా కీర్తించడంతో ఆయన భవిష్యత్ కార్యాచరణ టీఆర్ఎస్‌లో చేరి రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగించడమేనని కథనాలు సైతం వచ్చాయి. 

Also Read: హజూరాబాద్ తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికలు ! టీఆర్ఎస్‌లో పదవుల సందడి !

దళితవాదంతో టీఆర్ఎస్ గూటికి..?
హుజూరాబాద్ ఉప ఎన్నికల సందర్భంగా సీఎం కేసీఆర్ దళితబంధు అస్త్రాన్ని ప్రయోగించారు. దళిత కుటుంబాలకు రూ.10 లక్షల మేర ఆర్థిక ప్రయోజనం అందించి వారి జీవితాలను మార్చాలనేది తమ ప్రభుత్వ ఉద్దేశమని కేసీఆర్ వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో మోత్కుపల్లి నర్సిహులును టీఆర్ఎస్‌లో చేర్చుకుని ఆ పథకానికి సంబందించిన కీలక బాధ్యతలు మోత్కుపల్లికి అప్పగించనున్నారని తెలుస్తోంది. మరోవైపు హుజూరాబాద్ ఉప ఎన్నిక అనంతరం తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. శాసనసభ్యుల కోటా నుంచి ఎన్నికైన ఆరుగురు ఎమ్మెల్సీల పదవీకాలం జూన్ 3న ముగిసింది. తమ పార్టీలో చేరనున్న మోత్కుపల్లికి ఎమ్మెల్సీగా బాధ్యతలు అప్పగించే అవకాశాలున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

Also Read: ఇక ఫుల్ టైమ్ అధ్యక్షురాలిని.... సీడబ్ల్యూసీ సమావేశంలో సోనియా గాంధీ కీలక వ్యాఖ్యలు... జీ-23 నేతలకు క్లాస్

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy Assembly: అక్రమ మైనింగ్ లో ఎవరున్నా వదిలి పెట్టం - కీలక నేతల కంపెనలపై విచారణకు సీఎం రేవంత్ ఆదేశం
అక్రమ మైనింగ్ లో ఎవరున్నా వదిలి పెట్టం - కీలక నేతల కంపెనలపై విచారణకు సీఎం రేవంత్ ఆదేశం
Telangana Assembly: తల్లిదండ్రులను పట్టించుకోని ఉద్యోగులకు షాక్ -వేతనంలో 15 శాతం కోతకు తెలంగాణ సర్కార్ చట్టం
తల్లిదండ్రులను పట్టించుకోని ఉద్యోగులకు షాక్ -వేతనంలో 15 శాతం కోతకు తెలంగాణ సర్కార్ చట్టం
Revanth Reddy: అక్కా!మూసీ ప్రాజెక్టుపై వేసిన కేసులు వెనక్కి తీసుకోమని మీ కొడుక్కి చెప్పు! రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్‌!
అక్కా!మూసీ ప్రాజెక్టుపై వేసిన కేసులు వెనక్కి తీసుకోమని మీ కొడుక్కి చెప్పు! రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్‌!
Telangana: తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే ఉద్యోగుల జీతంలో 15 శాతం కోత! చట్టాన్ని తీసుకొస్తున్న తెలంగాణ!
తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే ఉద్యోగుల జీతంలో 15 శాతం కోత! చట్టాన్ని తీసుకొస్తున్న తెలంగాణ!

వీడియోలు

IPL 2026 Opening Ceremony | ఆర్సీబీ, సన్ రైజర్స్ మ్యాచ్ కి ముందు ఎలాంటి హంగామా ఉండదు | ABP Desam
MS Dhoni Injury CSK IPL 2026 Update | మొదటి మ్యాచ్ కి ముందే తలా అభిమానులకు భారీ షాక్ | ABP Desam
RCB vs SRH Match Preview IPL 2026 | నేటి నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్ 19వ సీజన్ | ABP Desam
Vaibhav Sooryavanshi Turned 15 IPL 2026 | బీసీసీఐ నిబంధనలకు అర్హుడయ్యాడు...సీనియర్స్ టీమ్ లో చోటే తరువాయి | ABP Desam
Surya Tilak in Ayodhya on Ram Navami | అయోధ్యలో అద్భుత ఘట్టం ఆవిష్కృతం | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy Assembly: అక్రమ మైనింగ్ లో ఎవరున్నా వదిలి పెట్టం - కీలక నేతల కంపెనలపై విచారణకు సీఎం రేవంత్ ఆదేశం
అక్రమ మైనింగ్ లో ఎవరున్నా వదిలి పెట్టం - కీలక నేతల కంపెనలపై విచారణకు సీఎం రేవంత్ ఆదేశం
Amaravati What Next: అమరావతికి చట్టబద్ధత - అసెంబ్లీ తీర్మానం తర్వాత అసలు ప్రక్రియ ఇదే!
అమరావతికి చట్టబద్ధత - అసెంబ్లీ తీర్మానం తర్వాత అసలు ప్రక్రియ ఇదే!
Railway Advertisements: మద్యం, పొగాకు, అశ్లీల ప్రకటనలు రైల్వేలో ప్రదర్శించడంపై నిషేధం: అశ్విని వైష్ణవ్
మద్యం, పొగాకు, అశ్లీల ప్రకటనలు రైల్వేలో ప్రదర్శించడంపై నిషేధం: అశ్విని వైష్ణవ్
Family Entertainers : వీకెండ్ ఈ మూవీస్ చూసి ఎంజాయ్ చెయ్యండి - తెలుగు టాప్ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ ఇవే
వీకెండ్ ఈ మూవీస్ చూసి ఎంజాయ్ చెయ్యండి - తెలుగు టాప్ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ ఇవే
Iran War Updates: గల్ఫ్ దేశాలపై ఇరాన్ క్షిపణి దాడులు - కువైట్ ఎయిర్ పోర్టుపై దాడి - విస్తరిస్తున్న యుద్ధం!
గల్ఫ్ దేశాలపై ఇరాన్ క్షిపణి దాడులు - కువైట్ ఎయిర్ పోర్టుపై దాడి - విస్తరిస్తున్న యుద్ధం!
Revanth Reddy: అక్కా!మూసీ ప్రాజెక్టుపై వేసిన కేసులు వెనక్కి తీసుకోమని మీ కొడుక్కి చెప్పు! రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్‌!
అక్కా!మూసీ ప్రాజెక్టుపై వేసిన కేసులు వెనక్కి తీసుకోమని మీ కొడుక్కి చెప్పు! రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్‌!
Telangana: తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే ఉద్యోగుల జీతంలో 15 శాతం కోత! చట్టాన్ని తీసుకొస్తున్న తెలంగాణ!
తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే ఉద్యోగుల జీతంలో 15 శాతం కోత! చట్టాన్ని తీసుకొస్తున్న తెలంగాణ!
Affordable Mileage Cars: రూ. 6 లక్షల ధరలో 6 ఎయిర్‌బ్యాగ్స్.. మీకు ఏ కారు బెస్ట్, వివరాలు చెక్ చేసుకోండి
రూ. 6 లక్షల ధరలో 6 ఎయిర్‌బ్యాగ్స్.. మీకు ఏ కారు బెస్ట్, వివరాలు చెక్ చేసుకోండి
Embed widget