అన్వేషించండి

Telangana RTI commissioner: ప్రభుత్వ పాలనలో పారదర్శకత, ప్రజలకు భరోసా ఆర్టీఐ: తెలంగాణ ఆర్టీఐ కమిషనర్  

భారత దేశం అతి పెద్ద గొప్ప ప్రజాస్వామ్య దేశం, సమాచారం తెలుసుకోవడం ప్రజల హక్కు అని తెలంగాణ రాష్ట్ర సమాచార హక్కు చట్ట కమిషనర్ డాక్టర్ గుగులోత్ శంకర్ నాయక్ అన్నారు.

‘ప్రభుత్వ పాలనలో పారదర్శకత, అధికార యంత్రాంగంలో జవాబుదారితనమే ఆర్.టి.ఐ  ముఖ్య ఉద్దేశ్యం’ అని తెలంగాణ రాష్ట్ర సమాచార హక్కు చట్ట కమిషనర్ డాక్టర్ గుగులోత్ శంకర్ నాయక్ అన్నారు. విశ్వవిద్యాలయ సెనెట్ హాల్ లో సోమవారం ఉదయం వైస్ ఛాన్సలర్ ఆచార్య తాటికొండ రమేష్ అద్యక్షతన నిర్వహించిన అవేర్నెస్ ప్రోగ్రం ఆన్ ఆర్ టి ఐ (రైట్ టూ ఇన్ఫర్మేషన్ పర్స్పెక్టివ్ అండ్ ప్రాక్టీసు) అనే అంశం పై ఉద్యోగులు, విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. 

భారత దేశం అతి పెద్ద గొప్ప ప్రజాస్వామ్య దేశం, సమాచారం తెలుసుకోవడం ప్రజల హక్కు అని, జటిలమైన సమస్యను కుడా ఆర్ టి ఐ చట్టం వినియోగం ద్వార పరిష్కరించుకోవచ్చు అని, చట్టం పై అందరికి అవగాహనా అవసరం అని అన్నారు. 39 వేల కేసు లలో 33 వేల కేసు లు పరిష్కరించు కోవటం జరిగిందని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పాలనా లో పారదర్శకత పెరిగింది అని, ప్రజలకు ఆర్ టి ఐ ఒక భరోసా అని, కోవిడ్ లో కుడా ఆర్ టి ఐ కేసు లు పరిష్కరించామని చెప్పారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రభుత్వ లబ్ది పొందిన ప్రతి సంస్థ ఆర్ టి ఐ పరిధి లోనికి వస్తున్నది అని, ప్రజా ప్రయోజనం ముఖ్యం అని, ప్రశ్నలు సూటిగా, స్పష్టంగా ఉండాలని, పబ్లిక్ లైఫ్ ప్రైవేటు లైఫ్ వేరు వేరు అని వ్యక్తిగత జీవితం మినహింపు ఉంటుంది అని అన్నారు. 

పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ లకు ఆర్ టి ఐ చట్ట వివిధ సెక్షన్ లపై అవగహన అవసరం అన్నారు. ఆన్లైన్ దిశగా అడుగులు పడుతునట్టు, పరిధిలోకి లోబడి వ్యవహరించాలని, వాస్తవాలు బయటకు రావటానికి చీకటిలో దాగిన అంశాలు బయటకు రావటానికి ఆర్ టి ఐ చట్టం తీసుకోని వచ్చింది అని, అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, ప్రశ్నించటం అంటే తెలుసుకోవటం అని, సానుకూల దృక్పదం తో ఇరువర్గాలు వ్యవహరించాలని అన్నారు. సిస్టంను గౌరవించాలని, రాజ్యాంగ పరిధికి లోబడి చట్టం లో పొందుపరచిన విధంగా ఉండాలని, అధికారుల నిర్లక్ష్య ధోరణి, మూడవ వ్యక్తి జోక్యం వద్దు అన్నారు. కాకతీయ విశ్వవిద్యాలయ పూర్వ విద్యార్థిని అయినందుకు గర్వ పడుతున్నానని, ఆర్ టి ఐ కమీషనర్ హోదా ను పొందిన వ్యక్తులలో దేశం లో అతి పిన్న వయస్కుల జాబితాలో ఉన్నందుకు సంతోషిస్తున్నాను అన్నారు. 

వైస్ ఛాన్సలర్ ఆచార్య తాటికొండ రమేష్ మాట్లాడుతూ.. ప్రజా జీవితం లో ఒక గొప్ప విప్లవాత్మక మార్పు ఆర్ టి ఐ చట్టం తీసుకుని వచ్చింది అని, ఉద్యోగులలో జవాబుదారి తనం, బాధ్యత, పారదర్శకత పెంచటం లో చట్టం చాలా ఉపయోగ పడింది అని, చట్ట పరిధికి లోబడి ప్రతి అధికారి పని చేయాలని, సమాచార హక్కు ఒక మానవ హక్కు అని, విశ్వవిద్యాలయంలో చట్టం అమలు బాగా ఉంది అని అన్నారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ ఆచార్య టి శ్రీనివాసరావు, ఆర్ టి ఐ సెల్ సంచాలకులు డాక్టర్ ఎం శ్రీనివాస్ తో పాటు బోధనా, బోధనేతర ఉద్యోగులు, పరిశోధకులు, విద్యార్థులు పాల్గొన్నారు, సభికులు అడిగిన వివిధ సందేహాలను కమిషనర్ నివృత్తి చేశారు. అనంతరం శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందించి జ్ఞాపిక తో సన్మానించారు.

టాప్ హెడ్ లైన్స్

Allu Arjun : సంధ్య థియేటర్ ఘటన - అల్లు అర్జున్‌కు స్వల్ప ఊరట
సంధ్య థియేటర్ ఘటన - అల్లు అర్జున్‌కు స్వల్ప ఊరట
Jagadish Reddy: పంప్ ఆన్ చేసి నీళ్లివ్వండి.. ప్రాజెక్టుకు ఏమైనా జరిగితే రాజకీయాల నుంచి తప్పుకుంటాం: జగదీష్ రెడ్డి
పంప్ ఆన్ చేసి నీళ్లివ్వండి.. ప్రాజెక్టుకు ఏమైనా జరిగితే రాజకీయాల నుంచి తప్పుకుంటాం: జగదీష్ రెడ్డి
Akbaruddin Owaisi: హైడ్రా ఒకటి కూల్చితే, మేం 100 కడతాం.. బెదిరింపులకు భయపడేది లేదన్న అక్బరుద్దీన్ ఒవైసీ
హైడ్రా ఒకటి కూల్చితే, మేం 100 కడతాం.. బెదిరింపులకు భయపడేది లేదన్న అక్బరుద్దీన్ ఒవైసీ
Uttam Kumar Reddy: బీఆర్ఎస్ చెప్పింది చేస్తే భద్రాచలం మునిగిపోతుంది: కాళేశ్వరంపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
బీఆర్ఎస్ చెప్పింది చేస్తే భద్రాచలం మునిగిపోతుంది: కాళేశ్వరంపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sugali Parvathi Devi On Pawan Kalyan: సుగాలి ప్రీతి కేసులో బిగ్ ట్విస్ట్! మోసం చేశారని పవన్ కల్యాణ్‌పై ఫిర్యాదు!
సుగాలి ప్రీతి కేసులో బిగ్ ట్విస్ట్! మోసం చేశారని పవన్ కల్యాణ్‌పై ఫిర్యాదు!
Nizamabad Crime News: నిజామాబాద్ జిల్లాలో భర్తను భవనంపై నుంచి తోసేసిన భార్య! చనిపోలేదని హార్పిక్‌ ఇంజెక్ట్ చేసి దారుణహత్య! 
నిజామాబాద్ జిల్లాలో భర్తను భవనంపై నుంచి తోసేసిన భార్య! చనిపోలేదని హార్పిక్‌ ఇంజెక్ట్ చేసి దారుణహత్య! 
Allu Arjun : సంధ్య థియేటర్ ఘటన - అల్లు అర్జున్‌కు స్వల్ప ఊరట
సంధ్య థియేటర్ ఘటన - అల్లు అర్జున్‌కు స్వల్ప ఊరట
Revamped Gold Monetization Scheme: ఇళ్లలోని ఇన్‌యాక్టివ్ గోల్డ్‌కు మోక్షం - సరికొత్త గోల్డ్ మానిటైజేషన్ పాలసీతో కేంద్రం భారీ స్కెచ్!
ఇళ్లలోని ఇన్‌యాక్టివ్ గోల్డ్‌కు మోక్షం - సరికొత్త గోల్డ్ మానిటైజేషన్ పాలసీతో కేంద్రం భారీ స్కెచ్!
Aha Series OTT : కమల్ హాసన్ మూవీ టైటిల్‌తో న్యూ సిరీస్ - ఈ స్టోరీ మీదే కావొచ్చు... ఎందులో స్ట్రీమింగ్ అంటే?
కమల్ హాసన్ మూవీ టైటిల్‌తో న్యూ సిరీస్ - ఈ స్టోరీ మీదే కావొచ్చు... ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Vizag Fishermen Missing: విశాఖ తీరంలో చేపల వేటకు వెళ్లిన ఆరుగురు మత్స్యకారులు గల్లంతు, మరో వ్యక్తిని కాపాడిన సిబ్బంది
విశాఖ తీరంలో చేపల వేటకు వెళ్లిన ఆరుగురు మత్స్యకారులు గల్లంతు, మరో వ్యక్తిని కాపాడిన సిబ్బంది
Warangal Crime News: భార్యకు వీడియో కాల్‌లో చూపిస్తూ రైలు కింద పడి భర్త ఆత్మహత్య.. వరంగల్ జిల్లాలో ఘటన
భార్యకు వీడియో కాల్‌లో చూపిస్తూ రైలు కింద పడి భర్త ఆత్మహత్య.. వరంగల్ జిల్లాలో ఘటన
Mavigun vs Amaravati Political Impact: అధినేత మావిగన్ నినాదం.. సొంత కేడరే లైట్ తీసుకుందా? సైలెన్స్ వెనుక అసలు వ్యూహం ఏంటి?
అధినేత మావిగన్ నినాదం.. సొంత కేడరే లైట్ తీసుకుందా? సైలెన్స్ వెనుక అసలు వ్యూహం ఏంటి?
Embed widget