అన్వేషించండి

నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు- నాలుగైదు రోజులు జరిగే ఛాన్స్

ఉదయం 11.30 నిమిషాలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతాయి. సభ ప్రారంభమైన వెంటనే ఇటీవల చనిపోయిన కంటోన్మెంట్‌ ఎమ్మెల్యే సాయన్న మృతికి సంతాప తీర్మానం ప్రవేశ పెడతారు.

తెలంగాణలో ఈ విడతకు ఆఖరి అసెంబ్లీ సమావేశాలు నేటి నుంచి ప్రారంభంకానున్నాయి. షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు జరిగితే మాత్రం ఇవే ఆఖరి సమావేశాలు కానున్నాయి. అందుకే దీన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని అధికార ప్రతిపక్షాలు సిద్ధమవుతున్నాయి. 

ఉదయం 11.30 నిమిషాలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతాయి. సభ ప్రారంభమైన వెంటనే ఇటీవల చనిపోయిన కంటోన్మెంట్‌ ఎమ్మెల్యే సాయన్న మృతికి సంతాప తీర్మానం ప్రవేశ పెడతారు. ఆయనతోపాటు ఈ మధ్య చనిపోయిన మాజీ ఎమ్మెల్యేలకు సంబంధించిన సంతాప తీర్మానాలను కూడా ప్రవేశ పెట్టనున్నారు. అనంతరం సమావేశం రేపటికి వాయిదా పడుతుంది. 

శాసన మండలిలో కూడా మృతి చెందిన మాజీ ఎమ్మెల్సీలకు  సంతాపం తెలనున్నారు. అనంతరం వివిధ ప్రజాసమస్యలపై చర్చిస్తారు. ముఖ్యంగా ఇటీవల కురిసిన వర్షాలు, పంటనష్టం, ప్రభుత్వ సాయంపై చర్చ జరగనుంది. 

సమావేశాలు వాయిదా పడిన తర్వాత బీఏసీ భేటీ కానుంది. సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలి, ఏఏ అంశాలు చర్చించాలనే విషయంపై ఇందులో డిసైడ్ చేయనున్నారు. నాలుగైదు రోజులు మాత్రమే సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ సమావేశాల్లో ప్రభుత్వం నాలుగైదు ముఖ్యమైన బిల్లులు ప్రవేశ పెట్టనుంది. 

చివరి సమావేశాలు అయ్యే ఛాన్స్ ఉండటంతో అటు ప్రతిపక్షాలు, అధికార పక్షం రెండూ కూడా స్కోర్ చేసుకోవడానికి ఈ వేదికను వాడుకోవడానికి ట్రై చేస్తాయి. అందుకే ఈ సారి సమావేశాలు చాలా వాడీవేడిగా ఉండొచ్చని అంచనాలు వినిపిస్తున్నాయి. 

బీజేపీ, కాంగ్రెస్ తీరును ఎండగట్టే అవకాశం 

బిజెపి, కాంగ్రెస్ పార్టీలకు అవకాశం ఇవ్వకుండా శాసనసభ సమావేశాలలో వివిధ అంశాలలో ప్రతిపక్ష పార్టీలను ఎండగట్టడం కోసం బీఆర్ఎస్ సిద్ధమవుతోంది. ఇప్పటికే తెలంగాణ గవర్నర్ కు ప్రభుత్వానికి మధ్య సయోధ్య లేకపోవడంతో అనేక బిల్లులను గవర్నర్ తిప్పి పంపిన వ్యవహారంలో బిజెపిని కేంద్రంగా చేసుకొని తీవ్రస్థాయిలో విరుచుకు పడటం కోసం బీఆర్ఎస్  రెడీ అవుతోంది. అలాగే ఉచిత విద్యుత్ విషయంలో కాంగ్రెస్ తీరును కూడా కేసీఆర్ సభ ద్వారా ప్రజలకు వివరించే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. 

కొత్తగూడెం నుంచి ఎవరు ఎమ్మెల్యే ? 
కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర రావుపై రాష్ట్ర హైకోర్టు వేటు వేయడం, జలగం వెంకట్రావును ఎమ్మెల్యేగా పరిగణించాలంటూ తీర్పు వెలువరించింది. దీంతో అసెంబ్లీ సమావేశాలకు ఈ ఇద్దరు నేతల్లో ఎవరు హాజరవుతారనే చర్చ జరుగుతోంది. తన ఎన్నిక చెల్లదంటూ వెలువరించిన తీర్పుపై స్టే కోసం వనమా తిరిగి హైకోర్టును ఆశ్రయించగా.. హైకోర్టు తోసిపుచ్చింది. దీంతో కోర్టు తీర్పును అమలు చేయక తప్పని పరిస్థితి. మరోవైపు, కోర్టు తీర్పు ఆధారంగా తనను ఎమ్మెల్యేగా గుర్తించాలంటూ జలగం వెంకట్రావు అసెంబ్లీ కార్యదర్శిని కలిశారు. కానీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.

సమావేశాలకు హాజరవ్వాలంటే జలగం వెంకట్రావు ఎమ్మెల్యేగా ప్రమాణం చేయాల్సి ఉంటుంది.స్పీకర్ అలాంటి నిర్ణయం తీసుకోలేదు. ప్రమాణ స్వీకారం చేయించాలని స్పీకర్ నిర్ణయం తీసుకుంటే ఎమ్మెల్యేగా ఆయన అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావొచ్చు. ఈ విషయంపై తన నిర్ణయాన్ని స్పీకర్ పెండింగ్ లో పెడితే మాత్రం ఈసారి అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యే అవకాశం ఇద్దరిలో ఎవరికీ ఉండదని భావిస్తున్నారు.

టాప్ హెడ్ లైన్స్

Telangana BJP Internal Strategy: గ్రేటర్ త్రిశూల పోరుకు బీజేపీ జంగ్ సైరన్! మూడు కార్పొరేషన్ల ఎన్నికల్లో గెలవకపోతే భవిష్యత్తు శూన్యమేనా?
గ్రేటర్ త్రిశూల పోరుకు బీజేపీ జంగ్ సైరన్! మూడు కార్పొరేషన్ల ఎన్నికల్లో గెలవకపోతే భవిష్యత్తు శూన్యమేనా?
Allu Arjun : సంధ్య థియేటర్ ఘటన - అల్లు అర్జున్‌కు స్వల్ప ఊరట
సంధ్య థియేటర్ ఘటన - అల్లు అర్జున్‌కు స్వల్ప ఊరట
Jagadish Reddy: పంప్ ఆన్ చేసి నీళ్లివ్వండి.. ప్రాజెక్టుకు ఏమైనా జరిగితే రాజకీయాల నుంచి తప్పుకుంటాం: జగదీష్ రెడ్డి
పంప్ ఆన్ చేసి నీళ్లివ్వండి.. ప్రాజెక్టుకు ఏమైనా జరిగితే రాజకీయాల నుంచి తప్పుకుంటాం: జగదీష్ రెడ్డి
Akbaruddin Owaisi: హైడ్రా ఒకటి కూల్చితే, మేం 100 కడతాం.. బెదిరింపులకు భయపడేది లేదన్న అక్బరుద్దీన్ ఒవైసీ
హైడ్రా ఒకటి కూల్చితే, మేం 100 కడతాం.. బెదిరింపులకు భయపడేది లేదన్న అక్బరుద్దీన్ ఒవైసీ

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Pradesh Zones: 2 మల్టీ జోన్లు... 6 జోన్లు- 26 జిల్లాల ప్రకారం ఏపీలో ఉద్యోగుల విభజనకు మార్గదర్శకాలు
2 మల్టీ జోన్లు... 6 జోన్లు- 26 జిల్లాల ప్రకారం ఏపీలో ఉద్యోగుల విభజనకు మార్గదర్శకాలు
Modi Cabinet Expansion Postponed: మోదీ క్యాబినెట్ విస్తరణకు బ్రేక్!? మంత్రి పదవుల కంటే రాజ్యాంగ సవరణ బిల్లులకే ప్రధాని తొలి ప్రాధాన్యత!
మోదీ క్యాబినెట్ విస్తరణకు బ్రేక్!? మంత్రి పదవుల కంటే రాజ్యాంగ సవరణ బిల్లులకే ప్రధాని తొలి ప్రాధాన్యత!
Quitting Job in Midlife : 35 ఏళ్లు దాటాక జాబ్ మానేయాలనుకుంటున్నారా? అయితే ఈ విషయాలు ఆలోచించకపోతే భారీ నష్టం తప్పదు
35 ఏళ్లు దాటాక జాబ్ మానేయాలనుకుంటున్నారా? అయితే ఈ విషయాలు ఆలోచించకపోతే భారీ నష్టం తప్పదు
Pradhan Mantri Fasal Bima Yojana: రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. పంట బీమా పథకాల అమలుకు ఉత్తర్వులు
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. పంట బీమా పథకాల అమలుకు ఉత్తర్వులు
Dalit Christian Vote Bank Politics: వైసీపీ ఓటు బ్యాంక్‌పైనే గురి పెట్టిన జడ శ్రవణ్ - ఉపముఖ్యమంత్రి పోస్టుకు కర్చీఫ్ - పెద్ద ప్లానే?
వైసీపీ ఓటు బ్యాంక్‌పైనే గురి పెట్టిన జడ శ్రవణ్ - ఉపముఖ్యమంత్రి పోస్టుకు కర్చీఫ్ - పెద్ద ప్లానే?
ఎక్కువ మంది పిల్లలున్న దంపతులకు నగదు ప్రోత్సాహకాలు.. జనాభా వృద్ధిపై ఏపీ సర్కార్ వ్యూహాత్మక అడుగులు
ఎక్కువ మంది పిల్లలున్న దంపతులకు నగదు ప్రోత్సాహకాలు.. జనాభా వృద్ధిపై ఏపీ సర్కార్ వ్యూహాత్మక అడుగులు
Cumin Water : జీర్ణ సమస్యలకు చెక్ పెట్టాలంటే జీలకర్ర డ్రింక్ ట్రై చేయండి.. ఉదయాన్నే తాగితే ఎన్నో లాభాలు
జీర్ణ సమస్యలకు చెక్ పెట్టాలంటే జీలకర్ర డ్రింక్ ట్రై చేయండి.. ఉదయాన్నే తాగితే ఎన్నో లాభాలు
Vizag Fishermen Missing: సురక్షితంగా తీరానికి చేరుకున్న మత్స్యకారుడు కర్రి చిన్న! మిగతావారి కోసం కొనసాగుతున్న గాలింపు! 
సురక్షితంగా తీరానికి చేరుకున్న మత్స్యకారుడు కర్రి చిన్న! మిగతావారి కోసం కొనసాగుతున్న గాలింపు! 
Embed widget