అన్వేషించండి

ఆంధ్రాపై ఈ చంద్రుడు- తెలంగాణపై ఆ చంద్రుడు స్పెషల్ ఫోకస్!

చంద్రబాబు తిరిగి తెలంగాణ యాక్టివ్ కావడానికి మోడి డైరెక్షన్ అని తెలంగాణ మంత్రులు ఆరోపిస్తున్నారు. మోడి, అమిత్ షా సూచనలమేరకే చంద్రబాబు తెలంగాణలో పర్యటన చేస్తున్నారనీ అంటున్నారు.

పవన్‌ కల్యాణ్‌ ఏ ముహూర్తాన రాజకీయ ముఖచిత్రం మారుతుందన్నాడో అప్పటి నుంచి తెలుగురాష్ట్రాల్లో రాజకీయ వాతావరణం మారుతోంది. నిన్నటి వరకు పక్కచూపులు చూడని కెసిఆర్‌, చంద్రబాబు ఇప్పుడు అటు ఇటు ఫోకస్‌ చేస్తున్నారు. వద్దనుకున్న చోటే కావాలనుకుంటున్నారు. నిన్నటి వరకు ఒక్కచోటే పార్టీ.. ఒక్కచోటే అధికారం అని భావించిన టీఆర్‌ఎస్‌, టిడిపి ఇప్పుడు రెండు తెలుగురాష్ట్రాల్లోనూ బలమైన పార్టీలుగా ఉండాలని నిర్ణయించాయి. 

ఎప్పుడైతే కెసిఆర్‌ జాతీయ రాజకీయాల్లోకి రావాలని డిసైడ్‌ అయ్యారో అప్పుడే ఏపీపైనా దృష్టి పెట్టారు. త్వరలో  అసెంబ్లీ ఎన్నికలు జరిగే రాష్ట్రాలపై ముందు ఫోకస్‌ పెట్టిన కెసిఆర్‌ ఆ తర్వాత ఏపీలోనూ పాగా వేయనున్నారని తొలుత వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు ఆంధ్రకి చెందిన పలు వర్గాల నేతలు కెసిఆర్‌ని కలవడంతో ఒక్కసారిగా రాజకీయ ముఖచిత్రం మారడం మొదలైంది. టీఆర్‌ఎస్‌ పార్టీకి ఆంధ్రలో ప్రజాదరణ ఉండదేమో కానీ బీఆర్‌ఎస్‌ పార్టీకి మద్దతు ఉంటుందన్న గులాబీ శ్రేణులకు ఏపీ నుంచి సానుకూల వాతావరణం రావడం చర్చకు తావిస్తోంది. ఇంకోవైపు తెలంగాణలో దుకాణం బంద్‌ చేసిన టిడిపి ఉన్నట్టుండి మళ్లీ పార్టీని బలోపేతం చేయడానికి ప్రయత్నాలు చేయడంపై కూడా భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. 

కెసిఆర్‌ బీఆర్‌ఎస్‌ పార్టీతో ఏపీ రాజకీయాలపై దృష్టిపెట్టడం వల్లే చంద్రబాబు తిరిగి తెలంగాణ టిడిపికి ఊపిరిపోశారని కొందరి వాదన. అంతేకాదు కెసిఆర్‌ని దెబ్బకొట్టేందుకు, బీజేపీతో స్నేహ హస్తం కలిపేందుకు బాబు పన్నిన వ్యూహంగా ఇంకొందరు చెప్పుకొస్తున్నారు. ఇతర పార్టీల్లో ఉన్న టిడిపి నేతలను తిరిగి సొంతింటికి రమ్మని చంద్రబాబు పిలుపునివ్వడం కూడా రాజకీయ వ్యూహంలో భాగమేనని చెబుతున్నారు. బీఆర్‌ఎస్‌ పార్టీ ఏపీలో అడుగు పెట్టడం వెనక జగన్‌ ప్లాన్‌ ఉందన్న టాక్‌ కూడా ఉంది. టిడిపి-జనసేనని ధీటుగా ఎదుర్కోవాలంటే జగన్‌కి మద్దతునిచ్చే పార్టీ ఉండాలి. కానీ ఏపీలో విపక్షాలన్నీ ఒక్కటవ్వడంతో జగన్‌ మరోసారి ఒంటరి పోరుకి సిద్ధమవ్వాల్సి వస్తోంది. 

175 సీట్లను లక్ష్యంగా పెట్టుకున్న వైసీపీ అధినేత గతంలో వచ్చిన సీట్లు కూడా అటు ఇటుగా అందుకునే ఛాన్స్‌ ఉందని వైసీపీ నేతలు ప్రగాఢ విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే జగన్‌ పాలన కన్నా వైసీపీ నేతల తీరుపైనే ప్రజలు ఎక్కువగా అసహనంతో ఉన్నట్లు టాక్‌. ఈ నేపథ్యంలో ఓట్లు చీల్చేందుకు, విపక్షాల గెలుపు అవకాశాలు తగ్గించేందుకు ఏపీ సిఎం జగనే బీఆర్‌ఎస్‌ని రంగంలోకి దింపుతున్నారన్న గుసగుసలు రాజకీయవర్గాల్లో వినిపిస్తున్నాయి. ఇప్పటికే కెసిఆర్‌-జగన్‌ తెర వెనక రాజకీయాలు చేస్తున్నారని ఇరు రాష్ట్రాల విపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి. ఎవరి వాదనలు ఎలా ఉన్నా కానీ గతంలో కెసిఆర్‌, చంద్రబాబుల తీరుతో ఇబ్బందిపడింది మాత్రం ప్రజలే. ఇప్పుడు మరోసారి వీరి మాటలను నమ్ముతారా ? ఇప్పుడు వ్యక్తులను చూసి ఓటేస్తున్నారే కానీ పార్టీలను కాదన్న విషయం గుర్తిస్తారా ?  అన్నదే ఆలోచించాల్సిన విషయం.

చంద్రబాబు రాక బీజేపీ పనే - తెలంగాణ మంత్రులు 
చంద్రబాబు తిరిగి తెలంగాణ యాక్టివ్ కావడానికి మోడి డైరెక్షన్ అని తెలంగాణ మంత్రులు ఆరోపిస్తున్నారు. మోడి, అమిత్ షా సూచనల మేరకే చంద్రబాబు తెలంగాణలో పర్యటన చేస్తున్నారనీ, బీజేపీ టీడీపీ కలిసి వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేకపోలేదని అంటున్నారు. టీడీపీతో పొత్తు పెట్టుకున్న ఏ పార్టీ కూడా బతకదని మంత్రులు సెటైర్లు వేస్తున్నారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: 2034లో హైదరాబాద్‌లో ఒలింపిక్స్ లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు: సీఎం రేవంత్ రెడ్డి
2034లో హైదరాబాద్‌లో ఒలింపిక్స్ లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు: సీఎం రేవంత్ రెడ్డి
Khammam Devarapalli Greenfield Highway: ఖమ్మం -దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ హైవే రెడీ! హైదరాబాద్ -వైజాగ్ మధ్య 56 km తగ్గనున్న దూరం
ఖమ్మం -దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ హైవే రెడీ! హైదరాబాద్ -వైజాగ్ మధ్య 56 km తగ్గనున్న దూరం
Revanth Reddy: అక్కా!మూసీ ప్రాజెక్టుపై వేసిన కేసులు వెనక్కి తీసుకోమని మీ కొడుక్కి చెప్పు! రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్‌!
అక్కా!మూసీ ప్రాజెక్టుపై వేసిన కేసులు వెనక్కి తీసుకోమని మీ కొడుక్కి చెప్పు! రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్‌!
Telangana: తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే ఉద్యోగుల జీతంలో 15 శాతం కోత! చట్టాన్ని తీసుకొస్తున్న తెలంగాణ!
తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే ఉద్యోగుల జీతంలో 15 శాతం కోత! చట్టాన్ని తీసుకొస్తున్న తెలంగాణ!

వీడియోలు

IPL 2026 Opening Ceremony | ఆర్సీబీ, సన్ రైజర్స్ మ్యాచ్ కి ముందు ఎలాంటి హంగామా ఉండదు | ABP Desam
MS Dhoni Injury CSK IPL 2026 Update | మొదటి మ్యాచ్ కి ముందే తలా అభిమానులకు భారీ షాక్ | ABP Desam
RCB vs SRH Match Preview IPL 2026 | నేటి నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్ 19వ సీజన్ | ABP Desam
Vaibhav Sooryavanshi Turned 15 IPL 2026 | బీసీసీఐ నిబంధనలకు అర్హుడయ్యాడు...సీనియర్స్ టీమ్ లో చోటే తరువాయి | ABP Desam
Surya Tilak in Ayodhya on Ram Navami | అయోధ్యలో అద్భుత ఘట్టం ఆవిష్కృతం | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL 2026 RCB Vs SRH Result Update: ఆర్సీబీ గ్రాండ్ విక్ట‌రీ- రాణించిన ప‌డిక్క‌ల్, కోహ్లీ, డ‌ఫీ- స‌న్ రైజ‌ర్స్ కు నిరాశ‌
ఆర్సీబీ గ్రాండ్ విక్ట‌రీ- రాణించిన ప‌డిక్క‌ల్, కోహ్లీ, డ‌ఫీ- స‌న్ రైజ‌ర్స్ కు నిరాశ‌
Khammam Devarapalli Greenfield Highway: ఖమ్మం -దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ హైవే రెడీ! హైదరాబాద్ -వైజాగ్ మధ్య 56 km తగ్గనున్న దూరం
ఖమ్మం -దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ హైవే రెడీ! హైదరాబాద్ -వైజాగ్ మధ్య 56 km తగ్గనున్న దూరం
CM Revanth Reddy Assembly: అక్రమ మైనింగ్ లో ఎవరున్నా వదిలి పెట్టం - కీలక నేతల కంపెనలపై విచారణకు సీఎం రేవంత్ ఆదేశం
అక్రమ మైనింగ్ లో ఎవరున్నా వదిలి పెట్టం - కీలక నేతల కంపెనలపై విచారణకు సీఎం రేవంత్ ఆదేశం
Amaravati What Next: అమరావతికి చట్టబద్ధత - అసెంబ్లీ తీర్మానం తర్వాత అసలు ప్రక్రియ ఇదే!
అమరావతికి చట్టబద్ధత - అసెంబ్లీ తీర్మానం తర్వాత అసలు ప్రక్రియ ఇదే!
Railway Advertisements: మద్యం, పొగాకు, అశ్లీల ప్రకటనలు రైల్వేలో ప్రదర్శించడంపై నిషేధం: అశ్విని వైష్ణవ్
మద్యం, పొగాకు, అశ్లీల ప్రకటనలు రైల్వేలో ప్రదర్శించడంపై నిషేధం: అశ్విని వైష్ణవ్
Family Entertainers : వీకెండ్ ఈ మూవీస్ చూసి ఎంజాయ్ చెయ్యండి - తెలుగు టాప్ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ ఇవే
వీకెండ్ ఈ మూవీస్ చూసి ఎంజాయ్ చెయ్యండి - తెలుగు టాప్ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ ఇవే
CM Revanth Reddy: 2034లో హైదరాబాద్‌లో ఒలింపిక్స్ లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు: సీఎం రేవంత్ రెడ్డి
2034లో హైదరాబాద్‌లో ఒలింపిక్స్ లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు: సీఎం రేవంత్ రెడ్డి
Iran War Updates: గల్ఫ్ దేశాలపై ఇరాన్ క్షిపణి దాడులు - కువైట్ ఎయిర్ పోర్టుపై దాడి - విస్తరిస్తున్న యుద్ధం!
గల్ఫ్ దేశాలపై ఇరాన్ క్షిపణి దాడులు - కువైట్ ఎయిర్ పోర్టుపై దాడి - విస్తరిస్తున్న యుద్ధం!
Embed widget