News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

తెలంగాణలో హీట్ పెంచుతున్న గ్రూప్ 2 పరీక్ష- వాయిదా కోసం పార్టీల ఒత్తిడి

గ్రూప్ 2 పరీక్ష వాయిదా వేయాలని డిమాండ్‌తో బిఎస్పి రాష్ట్ర అధ్యక్షుడు డా.ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. ఆందోళనలకు సిద్ధమైన కాంగ్రెస్

FOLLOW US: 
Share:

తెలంగాణలో గ్రూప్ 2 పరీక్ష వాయిదా వ్యవహారం పొలిటికల్ కాక రేపుతోంది. కొందరు అభ్యర్థుల ఆందోళనతో మొదలైన వివాదాన్ని ఇప్పుడు రాజకీయా పార్టీలు అందుకున్నాయి. ఓ నెల రోజుల పాటు వాయిదా వేస్తే ప్రభుత్వానికి వచ్చిన నష్టమేంటని ప్రశ్నిస్తున్నాయి. 

గ్రూప్ 2 పరీక్ష వాయిదా వేయాలని డిమాండ్‌తో బిఎస్పి రాష్ట్ర అధ్యక్షుడు డా.ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. ఆయన హైదరాబాద్‌లో గన్ పార్క్ వద్ద నిరసన చేపట్టేందుకు యత్నించారు. విషయం తెలుసుకున్నపోలీసులు ఆయన ఇంటిని అర్థరాత్రి ముట్టడించారు. ప్రవీణ్ కుమార్ బయటకు రానీయకుండా కార్యకర్తలు అటువైపు వెళ్లకుండా అడ్డుకున్నారు. 

దీక్షకు అందరూ కదిలి రావాలని ఆయన శుక్రవారమే ట్విటర్‌లో మెసేజ్ చేశారు. " TSPSC ఆధ్వర్యంలో ఆగస్టు 29,30 నాడు జరగబోయే గ్రూప్ 2 పరీక్షను మూడు నెలలు వాయిదా వేయాలని నేను, ప్రొ కోదండరాం ఇతర మేధావులు, సామాజిక ఉద్యమకారులం అందరం తెలంగాణ అమర వీరుల స్థూపం, గన్ పార్క్ వద్ద శాంతియుతంగా సత్యాగ్రహం చేయబోతున్నం. ఇది ఎవరి మీదనో కోపంతోనో, పంతం నెగ్గించుకోవాలనో చేస్తున్న దీక్ష కాదు. కేవలం తెలంగాణలో 5.75 లక్షల అభ్యర్థుల గుండె చప్పుడును పాలకులకు చేరవేసి తెలంగాణ బిడ్డలకు న్యాయం జరిగేలా చూసే ప్రయత్నమే. అనవసరంగా ఆంక్షలు పెట్టకండి." అని రాసుకొచ్చారు. 

అటు కోదండ రామ్‌ని కూడా పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. ఆయనతోపాటు మిగతా నేతలను రాత్రి నుంచి ఇల్లు కదలనీయకుండా చేశారు. 

ఉదయం నుంచి ఆయన్ని హౌస్ అరెస్టు చేయడంతో ప్రవీణ్ కుమార్ తన ఇంట్లోనే దీక్ష చేపట్టారు. సాయంత్రం వరకు ఈ దీక్ష కొనసాగనుంది. గ్రూప్ 2 వాయిదా వేయాలని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. 

కాంగ్రెస్ పార్టీ కూడా ఆందోళనలకు సిద్ధమైంది దీంతో లీడర్లను ముందుగానే హౌస్ అరెస్టులు చేశారు. ఎక్కడి వాళ్లను అక్కడే నిర్బంధించారు. దీనిపై కాంగ్రెస్ నాయకులు మండిపడుతున్నారు. తుపాకులతో తమను కాల్చి చంపేయాలని రిక్వస్ట్ చేశారు. విద్యార్థులకు న్యాయం చేయడం లేదని వారి తరఫున పోరాడే ఛాన్స్ కూడా ఇవ్వడం లేదని ఆరోపించారు కాంగ్రెస్ నాయకులు. 

9 ఏళ్ల పాటు నిద్రపోయిన సర్కారు ఇప్పుడు ఎన్నికల టైంలో నోటిఫికేషన్లు ఇచ్చారని కాంగ్రెస్ లీడర్లు ఆరోపించారు. వాటిని కూడా సక్రమంగా నిర్వహించలేకపోయారని విమర్సించారు. పేపర్ లీక్‌లతో నిరుద్యోగుల జీవితాలతో ఆడుకున్నారన్నారు. వారికి ఇస్తామన్న నిరుద్యోగ భృతి కూడా ఇవ్వడం లేదన్నారు. 

ఇలా నిరుద్యోగుల భరోసా ఇవ్వడానికి అండగా ఉంటే హౌస్ అరెస్టులు చేయడమేంటని ప్రశ్నిస్తున్నారు. 9 ఏళ్ల పాటు నిద్రపోయిన కేసీఆర్‌ నిరంకుశ పాలనకు చరమగీతం పాడే రోజులు దగ్గర పడ్డాయనీ వార్నింగ్ ఇచ్చారు. ఇలా హడావిడిగా నోటిఫికేషన్లు ఇచ్చి నిరుద్యోగుల ఉసురు పోసుకుంటున్నారని ఆరోపించారు. 

ఇలాంటి పెద్ద ఇష్యూను పక్కదారి పట్టించడానికే బిజెపి నాయకులతో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం ధర్నాలు చేయిస్తున్నారని ఆపరోపిస్తోంది కాంగ్రెస్. ఇదంతా చీకటి ఒప్పందంలో భాగంగా ప్లాన్ ప్రకారం నడుస్తోందన్నారు. 3వేల నిరుద్యోగ భృతినీ విద్యార్థుల అకౌంట్లో వేయాలని డిమాండ్ చేశారు. 

Published at : 12 Aug 2023 03:06 PM (IST) Tags: CONGRESS BSP GROUP-2 BRS RS Praveen Kumar Group 2

ఇవి కూడా చూడండి

BRS News: కేంద్రానికి చిత్తశుద్ధి ఉంటే పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టుకి జాతీయ హోదా ఇవ్వాలి: బీఆర్ఎస్ ఎంపీ

BRS News: కేంద్రానికి చిత్తశుద్ధి ఉంటే పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టుకి జాతీయ హోదా ఇవ్వాలి: బీఆర్ఎస్ ఎంపీ

KTR Counter PM Modi: నమో అంటే నమ్మించి మోసం చేయడం! అదానీ చేతిలో బీజేపీ స్టీరింగ్- ప్రధాని వ్యాఖ్యలకు కేటీఆర్ కౌంటర్

KTR Counter PM Modi: నమో అంటే నమ్మించి మోసం చేయడం! అదానీ చేతిలో బీజేపీ స్టీరింగ్- ప్రధాని వ్యాఖ్యలకు కేటీఆర్ కౌంటర్

TSRTC: ప్రయాణికులకు ఆర్టీసీ గుడ్ న్యూస్ - బతుకమ్మ, దసరాకు 5265 ప్రత్యేక బస్సులు

TSRTC: ప్రయాణికులకు ఆర్టీసీ గుడ్ న్యూస్ - బతుకమ్మ, దసరాకు 5265 ప్రత్యేక బస్సులు

PM Modi in Mahabubnagar: తెలంగాణలో వారి చేతుల్లో కారు స్టీరింగ్! ఈరోజు రాత్రి బీఆర్ఎస్, కాంగ్రెస్ కు నిద్రపట్టదు: ప్రధాని మోదీ

PM Modi in Mahabubnagar: తెలంగాణలో వారి చేతుల్లో కారు స్టీరింగ్! ఈరోజు రాత్రి బీఆర్ఎస్, కాంగ్రెస్ కు నిద్రపట్టదు: ప్రధాని మోదీ

PM Modi In Mahabubnagar: తెలంగాణలో పసుపు బోర్టు ఏర్పాటు చేస్తాం: ప్రధాని మోదీ కీలక ప్రకటన

PM Modi In Mahabubnagar:  తెలంగాణలో పసుపు బోర్టు ఏర్పాటు చేస్తాం: ప్రధాని మోదీ కీలక ప్రకటన

టాప్ స్టోరీస్

Pawan Kalyan: వైసీపీ పతనం మొదలైంది, వచ్చేది టీడీపీ- జనసేన ప్రభుత్వమే - పవన్ కళ్యాణ్ ధీమా

Pawan Kalyan: వైసీపీ పతనం మొదలైంది, వచ్చేది టీడీపీ- జనసేన ప్రభుత్వమే - పవన్ కళ్యాణ్ ధీమా

Bigg Boss Season 7 Telugu: బిగ్ బాస్ సీజన్ 7 నుండి రతిక ఎలిమినేట్ - అసలు పట్టించుకోని శివాజీ

Bigg Boss Season 7 Telugu: బిగ్ బాస్ సీజన్ 7 నుండి రతిక ఎలిమినేట్ - అసలు పట్టించుకోని శివాజీ

Jyoti Yarraji: ఏషియన్ గేమ్స్‌లో తెలుగమ్మాయి సత్తా - 100 మీటర్ల హర్డిల్స్‌లో రజతం సాధించిన జ్యోతి!

Jyoti Yarraji: ఏషియన్ గేమ్స్‌లో తెలుగమ్మాయి సత్తా - 100 మీటర్ల హర్డిల్స్‌లో రజతం సాధించిన జ్యోతి!

Top 10 Scooters in India: కొత్త స్కూటీ కొనాలనుకుంటున్నారా? - అయితే ఈ టాప్-10 స్కూటీలపై ఓ లుక్కేయండి!

Top 10 Scooters in India: కొత్త స్కూటీ కొనాలనుకుంటున్నారా? - అయితే ఈ టాప్-10 స్కూటీలపై ఓ లుక్కేయండి!