అన్వేషించండి

PM Modi Hyderabad Visit: ప్రధాని మోదీ టూర్‌పై వామపక్షాలు ఆగ్రహం- విభజన హామీల సంగతి ఏంటని ప్రశ్న

PM Modi Hyderabad Visit: రాష్ట్ర విభజన హామీలు నెరవేర్చని ప్రధాని నరేంద్ర మోడీకి రాష్ట్రానికి వచ్చే అర్హత లేదంటూ సీపీఎం, సీపీఐ నాయకులు ఆందోళన నిర్వహించారు. ప్లకార్డులు చేతపట్టుకొని నిరసన చేపట్టారు.

PM Modi Hyderabad Visit:   రాష్ట్ర విభజన హామీలు అమలు చేయని ప్రధాని నరేంద్ర మోడీకి రాష్ట్రానికి వచ్చే అర్హత లేదని సీపీఎం, సీపీఐ నాయకులు అన్నారు. శనివారం మేడ్చల్ జిల్లా షాపూర్ నగర్ రైతు బజారు దగ్గర.. మోడీ హైదరాబాద్ పర్యటనను వ్యతిరేకిస్తూ సీపీఎం, సీపీఐ కుత్బుల్లాపూర్ మండల కమిటీల ఆధ్వర్యంలో " మోడీ గో బ్యాక్" అని నినాదాలు చేస్తూ నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా సీపీఐ, సీపీఎం నాయకులు మాట్లాడుతూ.. సింగరేణి బొగ్గు గనులకు టెండర్లు పిలిచిన నరేంద్ర మోడీకి తెలంగాణలో అడుగు పెట్టే నైతిక హక్కు లేదని విమర్శించారు. తెలంగాణకు తీరని అన్యాయం చేసిన ప్రధాని నరేంద్ర మోడీ, వందే భారత్ రైలు ప్రారంభానికి వచ్చిన మోదీ పర్యటనను వ్యతిరేకిస్తున్నామన్నారు. విభజన హామీలైన బయ్యారం ఉక్కు పరిశ్రమ, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, సాగునీటి ప్రాజెక్టులకు జాతీయ హోదా, గిరిజన విశ్వవిద్యాలయం లాంటి రాష్ట్ర విభజన హామీలు అమలు చేయకుండా తెలంగాణకు ఎలా వస్తున్నారని ప్రశ్నించారు. త్వరగా మీరు హైదరాబాద్ నుంచి వెళ్లిపోండంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. 

ప్రధాని మోడీ హిట్లర్ పాలన కొనసాగిస్తున్నారు..!

ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వ విధానాల వల్ల దేశంలో వివిధ రంగాల్లో అనేక అన్యాయాలు జరుగుతున్నాయన్నారు. అలాగే దేశ సమైక్యత, సమగ్రతకు ముప్పు వాటిల్లే ప్రమాదాలను ప్రజలకు వివరించాలన్నారు. బీజేపీ ప్రభుత్వం ప్రమాదకర ఫాసిస్టు నిరంకుశ హిట్లర్ పాలన  కొనసాగిస్తున్నారని ఆరోపించారు. బీజేపీ ప్రభుత్వం వల్ల తెలంగాణకు ఎలాంటి మేలూ జరగలేదని చెప్పారు. లాభం ఏమో కాని నష్టాలు వాటిల్లుతున్నాయని అన్నారు. రాజ్యాంగానికి దేశ సమైక్య, సమగ్రతలకు, లౌకిక ప్రజాస్వామ్య వ్యవస్థకు ప్రభుత్వ రంగ సంస్థల విధ్వంసానికి బీజేపీ ప్రభుత్వం తలపెడుతుందన్నారు. రాజ్యాంగంలో పొందుపరిచిన సార్వభౌమత్వం విధ్వంసానికి మోడీ ప్రభుత్వం పాల్పడుతుందని దుయ్యబట్టారు. దేశంలో లాభాలతో నడిచే ప్రభుత్వ రంగ సంస్థలు, బ్యాంకులు, ఇన్సూరెన్స్ కంపెనీలు ఉక్కు, బొగ్గు, రైల్వే, విమానయానం, ఆయిల్ కంపెనీలు, నౌకాశ్రయాలు ఆఖరికి రక్షణ రంగంతో సహా అన్ని రంగాలను ప్రైవేటీకరణ చేసేలా చట్టాలు అమలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

రాష్ట్ర ప్రజలంతా మోడీ హైదరాబాద్ పర్యటనను వ్యతిరేకించాలి..!

మోసపూరిత కార్పొరేట్ సంస్థలకు దేశాన్ని అమ్మివేస్తూ.. తిరిగి కార్పొరేట్లపై ఆధారపడి సార్వ భౌమత్వాన్ని కోల్పోయే విధంగా మోడీ వ్యవహరిస్తున్నారని విమర్శించారు. తెలంగాణ కొంగు బంగారమైన సింగరేణి, బొగ్గు బావుల ప్రైవేటీకరణ చేయడం మూలంగా కార్మికులు కొట్లాడి తెచ్చుకున్న హక్కులను నేడు నరేంద్ర మోడీ ప్రభుత్వం కాల రాస్తుందని అన్నారు. ఈ తరుణంలోనే  మోడీ గో బ్యాక్ అనే కార్యక్రమం నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఎం మండల కమిటీ నాయకులు సత్యం, అంజయ్య దేవదానం, మల్లారెడ్డి, సునీల్ సీపీఐ మండల నాయకులు రాములు, హరినాథ్, స్వామి శ్రీనివాస్, అశోక్ రెడ్డి, రాము పాల్గొన్నారు.

ఈ నిరసన సందర్భంగా ఉస్మానియా యూనివర్శిటీలో విద్యార్థులను ముందస్తు అరెస్టు చేశారు.    

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Telangana Voter List: తెలంగాణలో 50 లక్షల ఓట్లు తొలగింపు..! ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌తో ఏప్రిల్‌లో ఈసీ SIR ! వారి ఓట్లు గల్లంతే
తెలంగాణలో 50 లక్షల ఓట్లు తొలగింపు..! ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌తో ఏప్రిల్‌లో ఈసీ SIR !
Delhi Liquor Scam Case: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం.. కవితకు మళ్లీ నోటీసులు!
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం.. కవితకు మళ్లీ నోటీసులు!
CM Revanth Reddy: మహిళల్ని రాష్ట్రపతి, ప్రధాని, సీఎంలు చేసి గౌరవించిన పార్టీ కాంగ్రెస్: సీఎం రేవంత్ రెడ్డి
మహిళల్ని రాష్ట్రపతి, ప్రధాని, సీఎంలు చేసి గౌరవించిన పార్టీ కాంగ్రెస్: సీఎం రేవంత్ రెడ్డి
Secunderabad Railway Stations: సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో ఎయిర్‌పోర్ట్ తరహా రూల్స్‌! టికెట్ ఉన్న వాళ్లకు మాత్రమే ఎంట్రీ!
సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో ఎయిర్‌పోర్ట్ తరహా రూల్స్‌! టికెట్ ఉన్న వాళ్లకు మాత్రమే ఎంట్రీ!

వీడియోలు

Santosh Nagar Steel Bridge | హైదరాబాద్ లో వివాదాస్పద స్టీల్ బ్రిడ్జి వద్ద పనులు ఎందుకు నిలిచిపోయాయి?
Sanju Samson on Recent Performance | అదృష్టం తన జీవితంలోనూ ఉందన్న సంజూ శాంసన్ | ABP Desam
Fans worrying Ahmedabad Pitch | పీడకల మిగిల్చిన అహ్మదాబాద్ పిచ్ పైనే మళ్లీ ఫైనల్ | ABP Desam
Axar patel on Golden Catches vs Eng | T20 World cup 2026 లో జడ్డూ లేని లోటును తీరుస్తున్న అక్షర్ | ABP Desam
Abhishek Sharma Poor Form | T20 World Cup 2026 ఫైనల్లో అభిషేక్ ప్లేస్ పై డౌట్స్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Velugumatla Issue: వెలుగుమట్ల బాధితుల కోసం రోడ్డెక్కిన కవిత పోరాటం - ఖమ్మంలో ఉద్రిక్తత
వెలుగుమట్ల బాధితుల కోసం రోడ్డెక్కిన కవిత పోరాటం - ఖమ్మంలో ఉద్రిక్తత
Nara Lokesh: మంగళగిరిలో మరో ఎన్నికల హామీ నిలబెట్టుకున్న మంత్రి నారా లోకేష్, రూ.294.20 కోట్లతో పనులు
మంగళగిరిలో మరో ఎన్నికల హామీ నిలబెట్టుకున్న మంత్రి నారా లోకేష్, రూ.294.20 కోట్లతో పనులు
Budget Session 2026: ఇరాన్ యుద్ధంపై రాజ్యసభలో జైశంకర్ కీలక ప్రకటన.. గల్ఫ్‌లో భారత పౌరుల భద్రతకు హామీ!
ఇరాన్ యుద్ధంపై రాజ్యసభలో జైశంకర్ కీలక ప్రకటన.. గల్ఫ్‌లో భారత పౌరుల భద్రతకు హామీ!
Telangana Voter List: తెలంగాణలో 50 లక్షల ఓట్లు తొలగింపు..! ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌తో ఏప్రిల్‌లో ఈసీ SIR ! వారి ఓట్లు గల్లంతే
తెలంగాణలో 50 లక్షల ఓట్లు తొలగింపు..! ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌తో ఏప్రిల్‌లో ఈసీ SIR !
గూగుల్‌ నోట్ బుక్‌ ఎల్‌ఎమ్‌లో అద్భుతమైన ఫీచర‌-గంటల పని నిమిషాల్లోనే పూర్తి!
గూగుల్‌ నోట్ బుక్‌ ఎల్‌ఎమ్‌లో అద్భుతమైన ఫీచర‌-గంటల పని నిమిషాల్లోనే పూర్తి!
Pawan Kalyan CM: ఏపీ రాజకీయాల్లో ఢిల్లీ మలుపు - చంద్రబాబు వ్యూహం..లోకేష్ vs పవన్ రేస్?
ఏపీ రాజకీయాల్లో ఢిల్లీ మలుపు - చంద్రబాబు వ్యూహం..లోకేష్ vs పవన్ రేస్?
Jana Nayagan : జన నాయగన్‌కు మళ్లీ షాక్ - విజయ్ లాస్ట్ మూవీ రిలీజ్ అయ్యేది ఎప్పుడు?
జన నాయగన్‌కు మళ్లీ షాక్ - విజయ్ లాస్ట్ మూవీ రిలీజ్ అయ్యేది ఎప్పుడు?
Stock Market 9 March: మిడిల్ ఈస్ట్ ఉద్రిక్తతలతో భారత స్టాక్ మార్కెట్లో బ్లడ్ బాత్.. సెన్సెక్స్ 2400, నిఫ్టీ సైతం 650 పాయింట్లు పతనం
భారత స్టాక్ మార్కెట్లో బ్లడ్ బాత్.. సెన్సెక్స్ 2400, నిఫ్టీ సైతం 650 పాయింట్లు పతనం
Embed widget