అన్వేషించండి

Etela Rajender : రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్పి నాలుగేండ్లు అయింది, ఇంకెప్పుడు - సీఎం కేసీఆర్ కు ఈటల సూటిప్రశ్న

Etela Rajender : నీటి కోసం కొట్లాడిన కేసీఆర్ బీఆర్ఎస్ ఏర్పాటు చేసిన ఎస్సారెస్పీ నుంచి.. ఆ పైనుంచి నది నుంచి నీటిని ఎత్తిపోసుకునే వెసులుబాటు కనిపిస్తామని చెప్తున్నారని ఎమ్మెల్యే ఈటల రాజేందర్ విమర్శించారు.

Etela Rajender : ముఖ్యమంత్రి కేసీఆర్ సభలో ఉన్నారు కాబట్టి లెక్కలు అన్ని పక్కన పెట్టి తెలంగాణ ప్రజల సమస్యలను ఆయన దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తానని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. ద్రవ్య వినిమయ బిల్లులపై చర్చలో ఈటల రాజేందర్ మాట్లాడుతూ... చాలామంది మా దృష్టికి అనేక సమస్యలు తీసుకువస్తున్నారని వాటికి పరిష్కారం అందించాలని సీఎం కేసీఆర్ ను కోరుతున్నానన్నారు. సీఎం కేసీఆర్ కేంద్రమంత్రిగా కూడా పనిచేశారు కాబట్టి ఆయనకు అపారమైన అనుభవం ఉందన్నారు. ఒక్కటి సత్యం కేంద్ర ప్రభుత్వం ఒకసారి బడ్జెట్ పెట్టిన తర్వాత ఒక రూపాయి కూడా అటు ఇటు ఉండే ఆస్కారం లేదన్నారు. ఐదు సంవత్సరాల పాటు ఆర్థికమంత్రిగా కేంద్రం దగ్గరికి అనేక దరఖాస్తులు పట్టుకొనిపోయానన్నారు. ఎక్కడ కూడా రూ.100 కోట్లు కూడా ఇచ్చే ఆస్కారం లేదన్నారు. మనం బడ్జెట్లో పెట్టుకున్నట్టు కేంద్ర ప్రభుత్వం నుంచి మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ కోసం మనకు ఒక్క రూపాయి కూడా వచ్చే అవకాశం లేదన్నారు. కేంద్రమంత్రిగా కేసీఆర్ పనిచేసిన అనుభవజ్ఞులు కాబట్టి ఈ విషయం చెప్తున్నానన్నారు.

ఎస్సారెస్పీపై క్లారిటీ ఇవ్వాలి 

"ఉమ్మడి రాష్ట్రంలో 45 రోజులు బడ్జెట్ సమావేశాలు జరిగేవి. ముఖ్యమంత్రి కూడా ఎన్ని రోజులైనా సభ జరపండి. ప్రజాసమస్యల పరిష్కారానికి మంచి వేదిక అసెంబ్లీ. మనం ఇక్కడ మాట్లాడుతున్న సందర్భంలో ప్రజలు న్యాయ నిర్ణేతలుగా ఉంటారని ఆయనే చెప్పారు కాబట్టి. ఇంకా కొద్దిరోజులు పొడిగించి చర్చలు జరిగితే బాగుంటుంది భావిస్తున్నాను. ముఖ్యమంత్రి నా బతుకంతా తెలంగాణది అని 25 సంవత్సరాల పాటు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు. తెలంగాణ ప్రయోజనం కోసం ఇతర రాష్ట్రాలు ఏం మాట్లాడినా ఉపేక్షించేవారు కాదు. కానీ బీఆర్ఎస్ ఏర్పాటు చేసిన తర్వాత అవసరమైతే ఎస్సారెస్పీ నుంచి.. ఆ పైనుంచి నది నుంచి నీటిని ఎత్తిపోసుకునే వెసులుబాటు కనిపిస్తామని చెప్తున్నారు. దాని వల్ల ఉత్తర తెలంగాణలో రైతాంగం ఆందోళన పడుతున్నారు. కాబట్టి ఆయన చెప్పినదేంటి? పత్రికలు రాసింది ఏంటి? కేసీఆర్  క్లారిఫై చేస్తారని భావిస్తున్నాను. ఒకనాడు బాబ్లీ మీద అనేక గొడవలు జరిగాయి.  బాబ్లీ నుంచి మనవరకు 12 ప్రాజెక్టులకు పెడితే ఎన్ని గొడవలు పెట్టామో మనకు తెలుసు.  గోదావరి నుంచి సంపూర్ణ నీళ్లు రాకపోతే కాళేశ్వరం నుంచి రివర్స్ పంపిన ద్వారా జగిత్యాల మెట్పల్లి వరకు నీళ్లను ఇచ్చుకునే అవకాశం  కోల్పోతాం. రెండు లిఫ్టులు కూడా  పెట్టుకున్నాం దయచేసి దానిమీద క్లారిటీ ఇవ్వాలని కోరుతున్నాను."  - ఈటల రాజేందర్

కోతకు గురవుతున్న భూములు 

కాళేశ్వరం ప్రాజెక్టు కట్టేటప్పుడు అనేక భూములు సేకరణ చేసుకున్నామని, గోదావరికి వచ్చిన వరదల వల్ల కనీవిని ఎరుగని రీతిలో భూములు కోతకు గురయ్యాయని ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. వీణవంకలో.. మానేరు వాగులో భూములు కొట్టుకుపోయాయన్నారు. ఆ విధంగా కొట్టుకుపోయిన భూములను సర్వే చేయించి వారికి పరిహారం అందించాలని కోరారు. కట్టలు వేసినప్పటికీ మూడు ప్రాజెక్టుల వల్ల ఊటకు గురై వందల ఎకరాల భూములు మునుగుతున్నాయన్నారు. కాబట్టి వారికి  శాశ్వతంగా అక్వైర్ చేసుకోవాలన్నారు. బాల్కసుమన్ చెప్పినట్లుగా వరదలు వచ్చినప్పుడు మునిగే పంట పొలాలు వేల ఎకరాలు ఉండవచ్చని, కానీ మామూలు వరద వచ్చినప్పుడు కూడా కొన్ని భూములు మునుగుతున్నాయన్నారు. ఆ ప్రాజెక్టులో పని చేసే ఇంజినీర్లు కొంత భూమిని మార్కింగ్ చేశారు కాబట్టి..  ప్రాజెక్ట్ రెండు వైపులా పేదవారు ఉన్నారని, వారికి  పరిహారం అందించాలని కోరారు. 

రైతు రుణమాఫీ ఇంకెప్పుడు?

 "మహిళా సంఘాలలో 70 లక్షల మంది సభ్యులుగా ఉన్నారు. 2018లో వడ్డీ లేని రుణాలు కింద డబ్బులు పే చేశాం. అప్పటి నుంచి వారికి వడ్డీ లేని రుణాలు ఇవ్వలేదు.  ఏ మహిళలైతే లక్షాధికారులు కావాలని కోరుకున్నాం.. వారికి రావాల్సిన వడ్డీ లేని రుణాల బకాయిలు చెల్లించాలని విజ్ఞప్తి చేస్తున్నాను. వీవోఏలకు 3900 రూపాయలు మాత్రమే ఇస్తున్నారు. పక్క రాష్ట్రంలో కూడా  పదివేల రూపాయలు ఇస్తున్నారు.  కాబట్టి మనం కూడా మానవతా దృక్పథంతో వీవోఏలకు జీతభత్యాలు పెంచాలని విజ్ఞప్తి చేస్తున్నాను. కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని జీతభత్యాలు పెంచాలి.  కాలేజీల్లో, స్కూళ్లలో గెస్ట్ లెక్చరర్ గా పనిచేస్తున్న వారికి ఆగస్టు, సెప్టెంబర్లో రెన్యువల్ చేయటం వల్ల సంవత్సరానికి 8 నెలల జీతం మాత్రమే వస్తుంది. కాబట్టి 12 నెలల జీతం వచ్చే విధంగా ఆటో రెన్యువల్ చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను. సింగరేణి గురించి సీఎం క్లారిఫై చెయ్యాలని కోరుతున్నాను. సింగరేణి ప్రైవేట్ పరం కావాలని ఎవరు కోరుకోరు.  51 శాతం మన మాటనే ఉంటుంది. నాకు తెలిసిన చరిత్రలో కేంద్రం ఇన్వాల్వ్ అయి చేసేది లేదు. మొత్తంగా పాలసీలు, వాటాలు ఇవ్వడంలో రాష్ట్ర ప్రభుత్వమే నిర్ణయాలు తీసుకుంటుంది. కాబట్టి కార్మిక వర్గానికి అపోహలు తీర్చాలని కోరుతున్నాను.  రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్పి నాలుగేండ్లు అవుతుంది. 25 నుంచి 50 వేల రూపాయల వరకు ఇచ్చారు. మిగతా వారికి కూడా చెయ్యాలని కోరుతున్నాను." - ఈటల రాజేందర్ 

టాప్ హెడ్ లైన్స్

Breaking News: గచ్చిబౌలిలో ట్రిపుల్‌ ఐటీ విద్యార్థి ఆత్మహత్య.. ఆరో అంతస్తు నుంచి దూకడంతో విషాదం
గచ్చిబౌలిలో ట్రిపుల్‌ ఐటీ విద్యార్థి ఆత్మహత్య.. ఆరో అంతస్తు నుంచి దూకడంతో విషాదం
Bandla Ganesh : అన్యాయం జరిగింది... సుప్రీంకోర్టుకు వెళ్తా - ఆస్తి వివాదంపై బండ్ల గణేష్ ట్వీట్... అసలేం జరిగిందంటే?
అన్యాయం జరిగింది... సుప్రీంకోర్టుకు వెళ్తా - ఆస్తి వివాదంపై బండ్ల గణేష్ ట్వీట్... అసలేం జరిగిందంటే?
TRS Chief Kavitha Reaction : కొత్త పేరు ఇచ్చేది లేదు, న్యాయపోరాటం చేస్తా: ఈసీ అభ్యంతరాలపై కవిత తొలి రియాక్షన్!
కొత్త పేరు ఇచ్చేది లేదు, న్యాయపోరాటం చేస్తా: ఈసీ అభ్యంతరాలపై కవిత తొలి రియాక్షన్!
TRS Chief Kavitha: టీఆర్‌ఎస్‌ చీఫ్‌ కవితకు షాక్‌! 15 రోజు సమయం ఇచ్చిన ఈసీ!
టీఆర్‌ఎస్‌ చీఫ్‌ కవితకు షాక్‌! 15 రోజు సమయం ఇచ్చిన ఈసీ!

వీడియోలు

IND W vs AUS W World Cup | టీ20 వరల్డ్ కప్ లో ముగిసిన భారత్ పోరాటం
IND vs IRE 2nd T20 Highlights | ఐర్లాండ్ చేతిలో భారత్ క్లీన్ స్వీప్
Vaibhav Debut in England Series | ఇంగ్లాండ్ సిరీస్ లో వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ?
Ricky Ponting To Replace Gautam Gambhir ? | త్వరలోనే టీమిండియాకు కొత్త హెడ్ కోచ్ ?
IND vs AUS Women's T20 World Cup 2026 | ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్ వెళ్తామా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Parliament Monsoon Session 2026: జూలై 20 నుండి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు.. చట్టసభల ముందుకు రాజ్యాంగ సవరణ బిల్లులు!
జూలై 20 నుండి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు.. చట్టసభల ముందుకు రాజ్యాంగ సవరణ బిల్లులు!
Notice To Telegram: పైరసీ సినిమాలపై టెలిగ్రామ్‌కు కేంద్రం నోటీసులు! 15 రోజులే గడువు!  
పైరసీ సినిమాలపై టెలిగ్రామ్‌కు కేంద్రం నోటీసులు! 15 రోజులే గడువు!  
TRS Chief Kavitha: టీఆర్‌ఎస్‌ చీఫ్‌ కవితకు షాక్‌! 15 రోజు సమయం ఇచ్చిన ఈసీ!
టీఆర్‌ఎస్‌ చీఫ్‌ కవితకు షాక్‌! 15 రోజు సమయం ఇచ్చిన ఈసీ!
Hindu Dharma: హిందూ ధర్మం -
హిందూ ధర్మం - "దుస్తులకు సంబంధించిందా , గుణానికి సంబంధించిందా?
Vijayawada Sai Krishna Case: సాయికృష్ణ లాకప్ డెత్.. విచారణకు హాజరైన వైసీపీ నేతలు, బాధిత కుటుంబసభ్యులు.. సీబీఐ విచారణకు వినతి
సాయికృష్ణ లాకప్ డెత్.. విచారణకు హాజరైన వైసీపీ నేతలు, బాధిత కుటుంబసభ్యులు.. సీబీఐ విచారణకు వినతి
Rayalaseema Manufacturing Hub: పారిశ్రామిక చదరంగంలో ‘రాయల్’ సీమ.. తయారీ రంగ కేంద్రంగా మార్చేందుకు కూటమి సర్కార్ పక్కా స్కెచ్!
పారిశ్రామిక చదరంగంలో ‘రాయల్’ సీమ.. తయారీ రంగ కేంద్రంగా మార్చేందుకు కూటమి సర్కార్ పక్కా స్కెచ్!
Telangana Police Recruitment 2026: తెలంగాణ పోలీస్‌ శాఖలో భారీ కొలువులు జాతర! ఐదు వేల ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్!
తెలంగాణ పోలీస్‌ శాఖలో భారీ కొలువులు జాతర! ఐదు వేల ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్!
200 Rupee News: 200 రూపాయల నోటు అసలైనదో, నకిలీదో ఎలా గుర్తించాలి? ఆర్‌బిఐ చెప్పిన ట్రిక్స్‌ ఇవే!
200 రూపాయల నోటు అసలైనదో, నకిలీదో ఎలా గుర్తించాలి? ఆర్‌బిఐ చెప్పిన ట్రిక్స్‌ ఇవే!
Embed widget