By: ABP Desam | Updated at : 09 Aug 2022 05:12 PM (IST)
Edited By: Satyaprasad Bandaru
సినీ నటి జయసుధ(Image Source : Jayasudha Twitter)
Jayasudha Joins Bjp : ప్రముఖ సినీనటి జయసుధ బీజేపీలో చేరనున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. గత కొద్దిరోజులుగా ఈ ఊహాగానాలు మరింత పెరిగాయి. బీజేపీలో చేరడంపై తెలంగాణకు చెందిన కొంతమంది నేతలు ఆమెతో చర్చించినట్లు సమాచారం. ఈనెల 21న మునుగోడులో జరిగే బీజేపీ సభలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సమక్షంలో జయసుధ ఆ పార్టీలో చేరుతారని ప్రచారం సాగుతోంది. ఈ విషయంపై స్పందించిన జయసుధ.. మళ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలనే ఆలోచన తనకు లేదని స్పష్టం చేశారు. ఈ నెల 21న బీజేపీలో చేరడం లేదన్నారు. బీజేపీ నేతల ముందు ఆమె కొన్ని ప్రతిపాదనలు ఉంచినట్లు తెలుస్తోంది. తన ప్రతిపాదనలు అంగీకరిస్తే బీజేపీలో చేరేందుకు సిద్ధమని జయసుధ చెప్పినట్లు సమాచారం. బీజేపీ జాతీయ నాయకత్వంతో మాట్లాడి హామీ ఇస్తేనే పార్టీలో చేరుతానని చెప్తానని జయసుధ చెప్పినట్లు తెలుస్తోంది.
సినీ నటులను ఆహ్వానిస్తోన్న బీజేపీ
ఇంతకు ముందు కాంగ్రెస్లో కొనసాగిన జయసుధ 2009లో సికింద్రాబాద్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2014 తర్వాత రాజకీయాలకు దూరంగా ఉన్నారు. వైఎస్ఆర్ టైంలో కాంగ్రెస్ పార్టీలో జయసుధ కీలకంగా వ్యవహరించారు. తాజాగా జయసుధను బీజేపీ చేరికల కమిటీ ఆ పార్టీలోకి ఆహ్వానించింది. సినీ గ్లామర్ అనేది పార్టీకి కలిసొస్తుందని బీజేపీ నమ్ముతోంది. ఈ క్రమంలోనే ప్రముఖ సినీ నటులను బీజేపీలోకి ఆహ్వానిస్తోంది. తెలంగాణలో విజయశాంతి, తమిళనాడులో కుష్బూ ఇలా ప్రతి రాష్ట్రంలోనూ సినీ ప్రముఖులను తమ పార్టీలో జాయిన్ చేసుకుంటుంది. ఈ క్రమంలోనే సినీనటి జయసుధతో చర్చలు జరుపుతోంది.
సికింద్రాబాద్ ఎమ్మెల్యేగా విజయం
కాంగ్రెస్ పార్టీలో కీలకంగా వ్యవహరించిన జయసుధకు 2009 ఎన్నికలలో సికింద్రాబాద్ ఎమ్మెల్యేగా సీటు ఇచ్చారు. ఈ ఎన్నికల్లో ఆమె విజయం సాధించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం అనంతరం ఆమె కాంగ్రెస్ పార్టీలో ఇన్ యాక్టివ్ అయ్యారు. ఆ తర్వాత 2016లో టీడీపీలో చేరిన జయసుధ.. ఆ తరువాత టీడీపీకి గుడ్ బై చెప్పారు. తర్వాత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. తనకు రాజకీయ జీవితం ఇచ్చిన దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయుడు పెట్టిన పార్టీ కాబట్టి వైసీపీలో చేరారని అప్పట్లో ఆమె చెప్పారు. అయితే వైసీపీలో సైలెంట్ అయిన ఆమె ఇప్పుడు బీజేపీ ఇచ్చిన ఆఫర్కు గ్రీన్ సిగ్నల్ ఇస్తారో లేదో చూడాలి.
బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్
తెలంగాణలో బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ వేగవంతం చేసింది. కాంగ్రెస్ పార్టీలో కీలక నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. దాసోజు శ్రవణ్ కూడా కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పి బీజేపీలో చేరారు. తెలంగాణలో పార్టీని బలోపేతం చేసే దిశగా వివిధ పార్టీల నేతలపై బీజేపీ ఫోకస్ పెట్టింది. తాజాగా జయసుధ కూడా బీజేపీలో చేరుతున్నట్లు సమాచారం. ఈ విషయంగా బీజేపీ నేతలు లీక్ లు ఇస్తున్నారు. జయసుధతో చర్చిస్తున్నట్లు ఆ పార్టీ నేతలు అంటున్నారు. ఇప్పటికే ఆ పార్టీ కీలక నేత ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ టీఆర్ఎస్ తో సహా ఇతర పార్టీల నేతలు టచ్ లో ఉన్నారన్నారు. త్వరలో ఆ నేతలంతా బీజేపీలో చేరుతున్నట్లు స్పష్టం చేశారు.
Also Read : Munugodu ByElections : చలో మునుగోడు ! తెలంగాణ రాజకీయం అంతా ఇక అక్కడే
Also Read : Gutha Sukender Reddy: కుటుంబ పాలనపై రాజగోపాల్ రెడ్డి మాట్లాడడం హాస్యాస్పదం - గుత్తా సుఖేందర్ రెడ్డి
Bhadrachalam MLA: బీఆర్ఎస్ నుంచి ఫస్ట్ వికెట్, కాంగ్రెస్ లో చేరనున్న భద్రాచలం ఎమ్మెల్యే! టచ్ లోకి మరో నలుగురు!
Telangana constituency wise results: తెలంగాణ తీర్పు: ఏయే నియోజకవర్గంలో ఎవరు గెలిచారు? ఎవరు ఓడారు?
Telangana Next CM: సీఎం ఎవరో సోమవారం సీఎల్పీ భేటీలో డిసైడ్ అవుతుంది: డీకే శివకుమార్
బీజేపీ పోరాడితే కాంగ్రెస్ పార్టీ లాభపడింది - బండి సంజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు
Barrelakka News: కొల్లాపూర్లో బర్రెలక్క స్థానం ఏంటీ? ప్రచారం ఎక్కువ ప్రభావం తక్కువైందా?
Dil Raju : 'యానిమల్' లాంటి సినిమాల్ని మేమూ తీస్తాం - ‘గేమ్ ఛేంజర్’ 90 శాతం పూర్తయింది : దిల్ రాజు
Best Browser: మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ వర్సెస్ గూగుల్ క్రోమ్ - ఈ మూడు విషయాల్లో ‘ఎడ్జ్’నే బెస్ట్!
Yash 19: కొత్త సినిమాపై హింట్ ఇచ్చిన రాకీ భాయ్ - ఫ్యాన్స్కు పూనకాలే
Rajasthan Election Result 2023: రాజస్థాన్లో కాంగ్రెస్ ఓటమికి కారణాలేంటి? గహ్లోట్ జాదూ ఎందుకు పని చేయలేదు?
/body>