అన్వేషించండి

DS Meets Sonia : సోనియాతో డీఎస్ భేటీ.. త్వరలో కాంగ్రెస్‌లో చేరే అవకాశం !

రాజ్యసభ సభ్యుడు డీఎస్ త్వరలో కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం కనిపిస్తోంది. ఆయన సోనియాతో 45 నిమిషాల పాటు చర్చలు జరిపారు.


తెలంగాణ రాష్ట్రసమితి తరపున రాజ్యసభ సభ్యునిగా ఉన్న ధర్మపురి శ్రీనివాస్ ( డీఎస్ ) కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీని కలిశారు. ఢిల్లీలో  సోనియా నివాసంలో దాదాపుగా నలభై ఐదు నిమిషాల సేపు సమావేశమయ్యారు.  తెలంగాణ రాజకీయ పరిస్థితులు.. కాంగ్రెస్ పార్టీ బలోపేతంపై చర్చించినట్లుగా తెలుస్తోంది. డీఎస్‌ను టీఆర్ఎస్ చాలా కాలంగా దూరం పెట్టింది. అయితే ఆయనను సస్పెండ్ చేయలేదు. నిజామాబాద్ టీఆర్ఎస్ నేతలంతా ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని తీర్మానం చేసి హైకమాండ్‌కు ఇచ్చారు. కానీ కేసీఆర్ మాత్రం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అప్పట్నుంచి డీఎస్ సాంకేతికంగా మాత్రమే టీఆర్ఎస్ సభ్యునిగా ఉన్నారు.

Also Read: శిల్పా చౌదరికి బెయిల్ మంజూరు... పక్కా స్కెచ్ తో రూ.కోట్లు కొట్టేసిందా?... శిల్ప కాల్ డేటా విశ్లేషిస్తోన్న పోలీసులు

డీఎస్ చాలా రోజులుగా కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నట్లుగా చెబుతున్నారు. అయితే ఆయన పార్టీలో చేరితే ఆయన పదవిపై అనర్హతా వేటు పడే అవకాశం ఉంది. ఈ కారణంగా గతంలో కూడా సోనియాతో భేటీ అయినప్పటికీ కాంగ్రెస్‌లో చేరలేదు. డీఎస్ రాజ్యసభ సభ్యత్వం వచ్చే ఏడాది ముగిసిపోనుంది. ఆ తర్వాత ఆయన ఫ్రీగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అందుకే తన రాజకీయ జీవితంలో అత్యధిక కాలం ఉన్న కాంగ్రెస్ పార్టీలోనే మళ్లీ చేరాలని ఆయన నిర్ణయించుకున్నట్లుగా  చెబుతున్నారు. 

Also Read: ఎమ్మెల్సీ కవిత ప్రత్యేక చొరవ.. అభివృద్ధి పనులకు నిధులు మంజూరు

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీలో డీఎస్ చాలా కీలకమైన నేతగా ఉన్నారు. రెండు సార్లు పీసీసీ  చీఫ్‌గా చేశారు. ఆయన పీసీసీ చీఫ్‌గా ఉన్న సమయంలోనే పార్టీ రెండు సార్లూ అధికారంలోకి వచ్చింది. మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. అయితే తెలంగాణ ఏర్పాటు తర్వాత ఆయన కేసీఆర్ పిలుపుమేరకు టీఆర్ఎస్‌లో చేరి రాజ్యసభ సభ్యుడయ్యారు. కానీ కొద్ది రోజులకే ఆయన అక్కడ ఇమడలేకపోయారు. ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్దమయ్యారు. 

Also Read: Pushpa Movie: 'పుష్ప'కు కెసిఆర్ ప్రభుత్వం చేస్తున్నది పెద్ద సాయమే...

ఇటీవల టీ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కూడా డీఎస్‌తో సమావేశమయ్యారు. ఆయన కుమారుడు, నిజామాబాద్ మాజీ మేయర్ సంజయ్ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరుతామని ప్రకటించారు. అయితే డీఎస్ రెండో కుమారుడు ధర్మపురి అర్వింద్ బీజేపీ ఎంపీగా ఉన్నారు. నిజామాబాద్ నుంచి ఆయన ఎంపీగా గెలిచారు. అయినప్పటికీ తనకు రాజకీయంగా గుర్తింపు ఇచ్చిన కాంగ్రెస్‌లోనే డీఎస్ చేరాలని అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది.  

Also Read: Kamareddy: ఈ ఊర్లో లిక్కర్ అమ్మితే రూ.లక్ష, కొనాలంటే రూ.50 వేలు.. నాలుగేళ్ల నుంచి ఇంతే..

 

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి  

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Amaravati: జగన్‌ది మిడిమిడి జ్ఞానం -ఫస్ట్ తెలుసుకోవాలి - మంత్రి నారాయణ కౌంటర్
జగన్‌ది మిడిమిడి జ్ఞానం -ఫస్ట్ తెలుసుకోవాలి - మంత్రి నారాయణ కౌంటర్
Seethakka Surekha meets KCR: ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో కేసీఆర్‌తో మంత్రులు సురేఖ, సీతక్క సమావేశం - మేడారం జాతరకు ఆహ్వానం
ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో కేసీఆర్‌తో మంత్రులు సురేఖ, సీతక్క సమావేశం - మేడారం జాతరకు ఆహ్వానం
Jagan: రెండో దశ భూసమీకరణకు వ్యతిరేకం - 2 లక్షల కోట్లతో రాజధాని సాధ్యమా? - అమరావతిపై జగన్ వ్యాఖ్యలు
రెండో దశ భూసమీకరణకు వ్యతిరేకం - 2 లక్షల కోట్లతో రాజధాని సాధ్యమా? - అమరావతిపై జగన్ వ్యాఖ్యలు
Geetu Mohandas: ఎవరీ గీతూ మోహన్‌దాస్? 'టాక్సిక్' టీజర్‌తో హాట్ టాపిక్‌... డైరెక్టరే కాదు, నటిగా అవార్డు విన్నర్
ఎవరీ గీతూ మోహన్‌దాస్? 'టాక్సిక్' టీజర్‌తో హాట్ టాపిక్‌... ఫిమేల్ డైరెక్టరే కాదు, నటిగా అవార్డు విన్నర్!

వీడియోలు

India vs South Africa Vaibhav Suryavanshi | మూడో వన్డేలో 233 పరుగుల తేడాతో విజయం
Shreyas Iyer Fitness Update Ind vs NZ | టీమ్ ఇండియాకు గుడ్‌న్యూస్!
Robin Uthappa about Team India | ఉత‌ప్ప సంచ‌ల‌న వ్యాఖ్య‌లు
Keslapur Nagoba Mesram Padayatra | హస్తలమడుగులో గంగమ్మకు మెస్రం వంశీయుల పూజలు | ABP Desam
Harbhajan Singh Warning To BCCI | బీసీసీఐకు హర్భజన్ వార్నింగ్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Amaravati: జగన్‌ది మిడిమిడి జ్ఞానం -ఫస్ట్ తెలుసుకోవాలి - మంత్రి నారాయణ కౌంటర్
జగన్‌ది మిడిమిడి జ్ఞానం -ఫస్ట్ తెలుసుకోవాలి - మంత్రి నారాయణ కౌంటర్
Seethakka Surekha meets KCR: ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో కేసీఆర్‌తో మంత్రులు సురేఖ, సీతక్క సమావేశం - మేడారం జాతరకు ఆహ్వానం
ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో కేసీఆర్‌తో మంత్రులు సురేఖ, సీతక్క సమావేశం - మేడారం జాతరకు ఆహ్వానం
Jagan: రెండో దశ భూసమీకరణకు వ్యతిరేకం - 2 లక్షల కోట్లతో రాజధాని సాధ్యమా? - అమరావతిపై జగన్ వ్యాఖ్యలు
రెండో దశ భూసమీకరణకు వ్యతిరేకం - 2 లక్షల కోట్లతో రాజధాని సాధ్యమా? - అమరావతిపై జగన్ వ్యాఖ్యలు
Geetu Mohandas: ఎవరీ గీతూ మోహన్‌దాస్? 'టాక్సిక్' టీజర్‌తో హాట్ టాపిక్‌... డైరెక్టరే కాదు, నటిగా అవార్డు విన్నర్
ఎవరీ గీతూ మోహన్‌దాస్? 'టాక్సిక్' టీజర్‌తో హాట్ టాపిక్‌... ఫిమేల్ డైరెక్టరే కాదు, నటిగా అవార్డు విన్నర్!
Cheekatilo OTT Release Date: ఓటీటీలోకి అక్కినేని కోడలు శోభిత సినిమా... ప్రైమ్ వీడియోలో క్రైమ్ & సస్పెన్స్ డ్రామా స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీలోకి అక్కినేని కోడలు శోభిత సినిమా... ప్రైమ్ వీడియోలో క్రైమ్ & సస్పెన్స్ డ్రామా స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Revanth Reddy comments: కార్పొరేట్ కంపెనీల కోసమే ఉపాధి హామీ పథకంలో మార్పులు- మోదీ ప్రభుత్వంపై రేవంత్ సంచలన ఆరోపణలు
కార్పొరేట్ కంపెనీల కోసమే ఉపాధి హామీ పథకంలో మార్పులు- మోదీ ప్రభుత్వంపై రేవంత్ సంచలన ఆరోపణలు
YS Jagan on Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు భూ సేకరణ చేసింది మేమే, కేసులు వాదించింది మేమే, అనుమతులు తెచ్చింది మేమే- మొదటి ఫ్లైట్‌ ఎప్పుడు ఎగురుతుందో చెప్పింది మేమే: జగన్
భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు భూ సేకరణ చేసింది మేమే, కేసులు వాదించింది మేమే, అనుమతులు తెచ్చింది మేమే- మొదటి ఫ్లైట్‌ ఎప్పుడు ఎగురుతుందో చెప్పింది మేమే: జగన్
Hyderabad Crime News: సంక్రాంతి వేళ హైదరాబాద్‌లో చైనా మాంజాపై ఉక్కుపాదం; ఆ దారంతో పతంగులు ఎగరేసిన వారిపై కేసులు! పోలీసుల సంచలన నిర్ణయం
సంక్రాంతి వేళ హైదరాబాద్‌లో చైనా మాంజాపై ఉక్కుపాదం; ఆ దారంతో పతంగులు ఎగరేసిన వారిపై కేసులు! పోలీసుల సంచలన నిర్ణయం
Embed widget