అన్వేషించండి

Huzurabad And Badvel By Election: ముగిసిన హుజూరాబాద్, బద్వేల్ ఉప ఎన్నికల ప్రచారం.. మూగబోయిన మైకులు..

ఈ నెల 30న తెలంగాణలో హుజూరాబాద్, ఏపీలోని కడప జిల్లాలో బద్వేల్‌లో పోలింగ్ జరగనుండగా.. బుధవారం రాత్రి 7 గంటలకు ఉప ఎన్నికల ప్రచారం ముగిసింది. స్థానికేతరులు బయటకు వెళ్లాలని ఈసీ ఆదేశించింది.

Huzurabad And Badvel By Election: హజూరాబాద్, బద్వేల్ ఉప ఎన్నికల ప్రచారం బుధవారం రాత్రి 7 గంటలకు ముగిసింది. దాంతో మైకులు మూగబోయాయి. ప్రధాన పార్టీల ప్రచారం హోరాహోరీగా సాగింది. హుజూరాబాద్‌లో మొత్తం 30 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉండగా, రెండు ఈవీఎంలు ఉపయోగిస్తున్నారు. ఒక దాంట్లో 16, మరో దాంట్లో 16 మంది అభ్యర్థులకు ఓటు వేయవచ్చు.

#హుజురాబాద్_ఉపఎన్నిక హుజురాబాద్ ఉప-ఎన్నికల్లో గెలుపు కోసం అన్ని పార్టీలూ తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ప్రచారం మూడు రోజుల ముందే ముగియడంతో ప్రలోభాలు కొనసాగుతున్నాయి. ఓటర్లకు డబ్బులను భారీగా ముట్టజెప్పుతున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి హరీశ్ రావుపై ఓ మహిళ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘ఓటుకు ఆరు వేలు ఇస్తారుకావచ్చు.. మీటింగ్‌కు పోతే రూ.200 వస్తాయని వస్తే నలుగురు ప్రాణాలు కోల్పోయారు.’



- Lakshmi (@లక్ష్మి77) 30 Oct 2021

ఈ నెల 30న తెలంగాణలో హుజూరాబాద్, ఏపీలోని కడప జిల్లాలో బద్వేల్‌లో పోలింగ్ జరగనుండగా.. నవంబర్ 2న ఫలితాలు ప్రకటిస్తారు. బద్వేల్ ఎన్నికల బరిలో 15 మంది అభ్యర్థులు ఉన్నారు. ప్రచారం ముగియడంతో స్థానికేతర నేతలు, ప్రజా ప్రతినిధులు నియోజకవర్గాల నుంచి బయటకు వెళ్లాలని ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. 

Also Read: చివరి నిముషంలో కుట్రలు జరుగుతాయి.. ఓటర్లకు అన్నీ తెలుసు.. మంత్రి హరీష్ రావు కీలక వ్యాఖ్యలు

ఏ రకమైన ప్రచారానికైనా అనుమతి లేదు...
హుజూరాబాద్ నియోజకవర్గంలో ఎలాంటి ఎన్నికల ప్రచారానికైనా అనుమతి లేదు ఈసీ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై ఎలక్షన్ కమిషన్ నిబంధనలు అనుసరించి చర్యలు తీసుకుంటామని ఎన్నికల అధికారి రవీందర్ రెడ్డి తెలిపారు. నిషేధఆజ్ఞలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. షెడ్యూల్ ప్రకారం 72 గంటల ముందే అంటే బుధవారం రాత్రి 7 గంటలతో ప్రచారం ముగిసింది. ఇప్పటి నుంచి 72 గంటల పాటు నిషేధాజ్ఞలు అమల్లో ఉంటాయి. ర్యాలీలు, గుంపులు గుంపులుగా కనిపించడం గాని ఇతర ప్రచార కార్యక్రమాలు నిర్వహించడం గానీ, సోషల్ మీడియాలో ప్రచారం చేసినా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 

Also Read: హుజురాబాద్‌లో హోరెత్తిన ప్రచారం ! "ఫేక్" ప్రచారాలనే నమ్ముకున్న పార్టీలు !

ముగిసిన బద్వేలు ఉపఎన్నిక ప్రచారం..
కడప జిల్లా బద్వేలు ఉపఎన్నిక ప్రచారం బుధవారం రాత్రి 7 గంటలకు ముగిసింది. అక్టోబర్ 30న ఉదయం 7 నుంచి రాత్రి 7 వరకు పోలింగ్‌ జరగనుంది. ఈవీఎంల ద్వారా పోలింగ్‌ నిర్వహించనున్న అధికారులు. నవంబర్‌ 2న బద్వేలు ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు, ఫలితాలు ప్రకటిస్తారు. బద్వేలు ఉపఎన్నికకు 281 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేయగా, బద్వేలు ఉపఎన్నిక రిటర్నింగ్‌ అధికారిగా కేతన్‌ గార్గ్‌ ఉన్నారు. మొత్తం 15 మంది బద్వేలు ఉపఎన్నిక బరిలో నిలిచారు. వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా డా.సుధ, బీజేపీ అభ్యర్థి సురేష్, కాంగ్రెస్ అభ్యర్థి కమలమ్మ బరిలో ఉన్నారు.

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Ind vs Nz 3rd odi highlights: కోహ్లీ సెంచరీ చేసినా దక్కని విజయం.. వన్డే చరిత్రలో భారత్‌లో తొలి సిరీస్ నెగ్గిన న్యూజిలాండ్
కోహ్లీ సెంచరీ చేసినా దక్కని విజయం.. వన్డే చరిత్రలో భారత్‌లో తొలి సిరీస్ నెగ్గిన న్యూజిలాండ్
Bhatti Vikramarka: కట్టు కథలకు భయపడను, సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదు: బొగ్గు ఆరోపణలపై భట్టి విక్రమార్క
కట్టు కథలకు భయపడను, సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదు: బొగ్గు ఆరోపణలపై భట్టి విక్రమార్క
AR Rahman: భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్
భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్
Medaram Jatara 2026 : మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!
మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!

వీడియోలు

Medaram Jatara Kumkum Bharani Speciality | కుంకుమ భరిణెలను ఎందుకు కొలుస్తారు?
Bamboo Sticks are Idols in Medaram Jatara | వెదురు కర్రలే ఉత్సవ మూర్తులుగా ఎందుకు ?
Vaibhav Suryavanshi broke Virat Record | కోహ్లీ రికార్డ్ బ్రేక్ చేసిన వైభవ్
India vs Bangladesh Under-19 World Cup | బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన టీమిండియా
Nara Lokesh Tribute to NTR on Death Anniversary | ఎన్టీఆర్ కు నివాళి అర్పించిన లోకేష్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ind vs Nz 3rd odi highlights: కోహ్లీ సెంచరీ చేసినా దక్కని విజయం.. వన్డే చరిత్రలో భారత్‌లో తొలి సిరీస్ నెగ్గిన న్యూజిలాండ్
కోహ్లీ సెంచరీ చేసినా దక్కని విజయం.. వన్డే చరిత్రలో భారత్‌లో తొలి సిరీస్ నెగ్గిన న్యూజిలాండ్
Bhatti Vikramarka: కట్టు కథలకు భయపడను, సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదు: బొగ్గు ఆరోపణలపై భట్టి విక్రమార్క
కట్టు కథలకు భయపడను, సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదు: బొగ్గు ఆరోపణలపై భట్టి విక్రమార్క
AR Rahman: భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్
భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్
Medaram Jatara 2026 : మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!
మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!
Virat Kohli Century: మూడో వన్డేలో విరాట్ కోహ్లీ సెంచరీ.. 54వ శతకంతో ఈ ఫీట్ సాధించిన తొలి బ్యాటర్‌గా రికార్డ్
మూడో వన్డేలో విరాట్ కోహ్లీ సెంచరీ.. 54వ శతకంతో ఈ ఫీట్ సాధించిన తొలి బ్యాటర్‌గా రికార్డ్
Harish Rao: రేవంత్ రెడ్డి దాడులను ప్రోత్సహిస్తుంటే డీజీపీ ఎందుకు మౌనం వహించారు: హరీష్ రావు ప్రశ్నలు
రేవంత్ రెడ్డి దాడులను ప్రోత్సహిస్తుంటే డీజీపీ ఎందుకు మౌనం వహించారు: హరీష్ రావు ప్రశ్నలు
NTR Vardhanti: ఎన్టీఆర్ 30వ వర్థంతి.. ఎన్టీఆర్ ఘాట్ వద్ద మంత్రి లోకేష్, కల్యాణ్ రామ్ నివాళులు
ఎన్టీఆర్ 30వ వర్థంతి.. ఎన్టీఆర్ ఘాట్ వద్ద మంత్రి లోకేష్, కల్యాణ్ రామ్ నివాళులు
Hyderabad Crime News: హైదరాబాద్‌లో సైబర్ మోసం.. 5 వేలు లాభం చూపించి, ఐటీ ఉద్యోగికి రూ. 2.9 కోట్లు ఎగనామం
హైదరాబాద్‌లో సైబర్ మోసం.. 5 వేలు లాభం చూపించి, ఐటీ ఉద్యోగికి రూ. 2.9 కోట్లు ఎగనామం
Embed widget