అన్వేషించండి

Huzurabad Bypoll: చివరి నిముషంలో కుట్రలు జరుగుతాయి.. ఓటర్లకు అన్నీ తెలుసు.. మంత్రి హరీష్ రావు కీలక వ్యాఖ్యలు

హుజూరాబాద్ ఉప ఎన్నికలపై అన్ని సర్వేల్లో టీఆర్ఎస్ గెలుపు  తథ్యమని వచ్చింది. బీజేపీ సర్వేల్లోను విజయం టీఆర్ఎస్ ను వరిస్తుందని వచ్చిందని మంత్రి హరీష్ రావు అన్నారు.

హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఎన్నికల కమిషన్  ఒత్తిడికి గురయినా నిష్పక్షపాతంగా వ్యవహరించారని.. తాము ఉన్న ప్రాంతాలను తనిఖీ చేశారని మంత్రి హరీష్ రావు అన్నారు. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ సభ పెట్టినప్పుడు అనుమతి ఇచ్చారు. కానీ తెలంగాణ సీఎం కేసీఆర్ సభ పెట్టకుండా కోడ్ వర్తింపచేసేలా ఉత్తర్వులు ఇచ్చారని గుర్తుచేశారు. 2001లో మొదలుపెట్టిన సింహగర్జన నాటి నుండి ఇక్కడి ప్రజలు టీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తూ వచ్చారని... ఇప్పుడే అదే సీన్ రిపీట్ అవుతుందన్నారు. చివరి నిమిషంలో కుట్రలు జరిగే అవకాశం ఉందని, ఓటర్లకు అన్ని విషయాలు తెలుసన్నారు.

టీఆర్ఎస్ గెలిస్తే ఏం చేస్తుంది...
‘హుజూరాబాద్ ఉప ఎన్నికలపై అన్ని సర్వేల్లో టీఆర్ఎస్ గెలుపు  తథ్యమని వచ్చింది. బీజేపీ సర్వేల్లోను విజయం టీఆర్ఎస్ ను వరిస్తుందని వచ్చింది. పాపం కొద్ది మంది ఫోన్లు పగులగొట్టారట. టీఆర్ఎస్ గెలిస్తే ఏం చేస్తామో చెప్పాం. కాని బీజేపీ ఒక్క ముక్క చెప్పలేదు. ప్రచారం మొదలైన నాటి నుంచి నేటి వరకు నేను విసిరిన ఒక్క సవాల్ కూడా బీజేపీ నేతలు స్వీకరించలేదు. పెట్రోల్, డీజిల్ రేట్లు కేంద్ర ప్రభుత్వం పెంచుకుంటూ పోతుంటే రాష్ట్ర బీజేపీ నేతలు మాత్రం తెలంగాణ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. బీజేపీ నేతలు, కేంద్ర మంత్రులు, కిషన్ రెడ్డి వంటి వాళ్లు కూడా రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టించారని హరీష్ రావు మండిపడ్డారు.

Also Read: హుజురాబాద్‌లో హోరెత్తిన ప్రచారం ! "ఫేక్" ప్రచారాలనే నమ్ముకున్న పార్టీలు !

ఎటుచూసినా దుష్ప్రచారమే..
టీఆర్ఎస్ పార్టీ ఓటుకు 20 వేలు ఇస్తున్నారని దుష్ప్రచారం చేశారు. మీరు డబ్బులు, మద్యం, మాంసం నమ్ముకున్నారు. టీఆర్ఎస్ మాత్రం కళ్యాణ లక్ష్మి, ఆసరా పెన్షన్, రైతు బంధు, రైతు బీమా, ఉచిత కరెంటు లాంటి పథకాలను నమ్ముకుంది. ఏడేళ్లలో ఏం చేశాం. మా మ్యానిఫెస్టోను ఎలా అమలుచేశాం చెప్పాం. కానీ బీజేపీ ఈ ఏడేళ్లలో తెలంగాణ ప్రజలకు ఏం చేసిందో ఒక్క ముక్క కూడా చెప్పలేదు. మీకు విషయం లేకనే మాపై దుష్ప్రచారం చేశారు. నలుగురు కేంద్ర మంత్రులు, బండి సంజయ్, వివేక్, జితేందర్ రెడ్డి, విజయశాంతి  ఇంకా బీజేపీ డజను మంది మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, గత నెలరోజులుగా హుజూరాబాద్ గల్లీ గల్లీ తిరిగి ప్రచారం చేశారు. కానీ ఒక్క విషయంపై చర్చకు రాలేదన్నారు.

Also Read: Huzurabad By Election: హుజూరాబాద్ లో లెటర్ల లొల్లి.. దళిత బంధు ఆపింది ఈటలే అంటున్న టీఆర్‌ఎస్‌.. కాదు.. కాదంటున్న బీజేపీ

పెట్రోల్, డీజీల్, మంచినూనె ధర, గ్యాస్ ధరల పట్ల ప్రజల ఆక్రోశం కనబడుతోంది. గ్యాస్ బండకు దండం పెట్టు, బీజేపీని బొంద పెట్టు అనే నినాదంపై ప్రజల్లో మంచి స్పందన వచ్చింది. ఉజ్వల గ్యాస్ పై బండి సంజయ్ దుష్ప్రచారం చేశారు. దళిత బంధుపై లేఖ రాసి పథకం రాకుండా అడ్డుకున్న ఘనత బీజేకి సొంతం. చివరి నిమిషంలో కుట్రలు జరుగుతాయి. కానీ ఓటర్లు అన్ని గమనిస్తున్నారు. కనుక హుజూరాబాద్ లో టీఆర్ఎస్ విజయం సాధిస్తుందని నమ్ముతున్నామని హరీష్ రావు అన్నారు. 

రైతుకు ఓ సంఘం ఉందా.. రైతు బంధు సమితులు పెట్టాం, రైతు వేదికలు ఏర్పాటు చేశాం. బీజేపీకి రైతుల గురించి, దళితుల కోసం మాట్లాడే అర్హత లేదు. మా నినాదం నీళ్లు, నిధులు, నియామకాలు. ఎన్ని చెక్క డ్యాంలు కట్టాం. చెరువులు పూడిక తీసాం, కాళేశ్వరం నీరు  ఇచ్చింది టీఆర్ఎస్ విజయం కాదా.. పసుపు బోర్డు తెస్తా అని చెప్పిన ఒకతను చివరికి ప్రజలను మోసం చేశాడు. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, మురళీధరన్ కు ఇక్కడ ఏం పని అని మంత్రి ప్రశ్నించారు. ఇంటింటికి నీళ్లు అని బీజేపీ చెప్పడం పెద్ద జోక్ అనిపిస్తుంది, నాలుగేళ్ల కిందటే టీఆర్ఎస్ ఆ పని చేసిందన్నారు.

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Venkateswara Swamy Temple : అమరావతిలోని వేంకటేశ్వరస్వామి ఆలయ విస్తరణకు శంకుస్థాపన- రెండేళ్లలో పూర్తి చేస్తామని హామీ 
అమరావతిలోని వేంకటేశ్వరస్వామి ఆలయ విస్తరణకు శంకుస్థాపన- రెండేళ్లలో పూర్తి చేస్తామని హామీ 
తెలంగాణ పంచాయతీ ఎన్నికల సమరం: కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ప్రత్యేక వ్యూహాలు..గ్రామాల్లో విజయం ఎవరిదో?
తెలంగాణ పంచాయతీ ఎన్నికల సమరం: కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ప్రత్యేక వ్యూహాలు..గ్రామాల్లో విజయం ఎవరిదో?
Vaikunta Dwara Darshan Tokens Registration: తిరుమలేశుడి భక్తులకు గుడ్ న్యూస్- వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల రిజిస్ట్రేషన్ ప్రారంభం 
తిరుమలేశుడి భక్తులకు గుడ్ న్యూస్- వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల రిజిస్ట్రేషన్ ప్రారంభం 
US Shooting: వైట్ హౌస్ దగ్గర ఆప్ఘన్‌ యువకుడి కాల్పులు! ఇద్దరు నేషనల్ గార్డ్ సైనికులకు గాయాలు!
వైట్ హౌస్ దగ్గర ఆప్ఘన్‌ యువకుడి కాల్పులు! ఇద్దరు నేషనల్ గార్డ్ సైనికులకు గాయాలు!
Advertisement

వీడియోలు

Gambhir Comments on Head Coach Position | గంభీర్ సెన్సేషనల్ స్టేట్‌మెంట్
World Test Championship Points Table | టెస్టు ఛాంపియన్‌షిప్ లో భారత్ స్థానం ఇదే
Reason for Team India Failure | భారత్ ఓటమికి కారణాలు ఇవే !
Rohit Sharma First Place in ICC ODI Rankings | అగ్రస్థానంలో
South Africa whitewashed India | రెండో టెస్ట్ ఓడిపోయిన టీమ్ ఇండియా
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Venkateswara Swamy Temple : అమరావతిలోని వేంకటేశ్వరస్వామి ఆలయ విస్తరణకు శంకుస్థాపన- రెండేళ్లలో పూర్తి చేస్తామని హామీ 
అమరావతిలోని వేంకటేశ్వరస్వామి ఆలయ విస్తరణకు శంకుస్థాపన- రెండేళ్లలో పూర్తి చేస్తామని హామీ 
తెలంగాణ పంచాయతీ ఎన్నికల సమరం: కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ప్రత్యేక వ్యూహాలు..గ్రామాల్లో విజయం ఎవరిదో?
తెలంగాణ పంచాయతీ ఎన్నికల సమరం: కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ప్రత్యేక వ్యూహాలు..గ్రామాల్లో విజయం ఎవరిదో?
Vaikunta Dwara Darshan Tokens Registration: తిరుమలేశుడి భక్తులకు గుడ్ న్యూస్- వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల రిజిస్ట్రేషన్ ప్రారంభం 
తిరుమలేశుడి భక్తులకు గుడ్ న్యూస్- వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల రిజిస్ట్రేషన్ ప్రారంభం 
US Shooting: వైట్ హౌస్ దగ్గర ఆప్ఘన్‌ యువకుడి కాల్పులు! ఇద్దరు నేషనల్ గార్డ్ సైనికులకు గాయాలు!
వైట్ హౌస్ దగ్గర ఆప్ఘన్‌ యువకుడి కాల్పులు! ఇద్దరు నేషనల్ గార్డ్ సైనికులకు గాయాలు!
Andhra King Taluka OTT : రామ్ 'ఆంధ్ర కింగ్ తాలూకా' ఓటీటీ పార్ట్‌నర్ ఫిక్స్ - ఎందులో చూడొచ్చంటే?
రామ్ 'ఆంధ్ర కింగ్ తాలూకా' ఓటీటీ పార్ట్‌నర్ ఫిక్స్ - ఎందులో చూడొచ్చంటే?
Smriti Mandhana–Palash Muchhal Wedding Row: స్మృతి మంధాన పెళ్లిపై మేరీ డి'కోస్టా సంచలన పోస్టు! పలాష్ ముచ్చల్‌తో సంబంధంపై క్లారిటీ!
స్మృతి మంధాన పెళ్లిపై మేరీ డి'కోస్టా సంచలన పోస్టు! పలాష్ ముచ్చల్‌తో సంబంధంపై క్లారిటీ!
South Central Railway : ఇంటి నుంచే దేశం నలుమూలలకు పార్శిల్ పంపేయొచ్చు- కొత్త సర్వీస్ ప్రారంభించనున్న దక్షిణ మధ్య రైల్వే
ఇంటి నుంచే దేశం నలుమూలలకు పార్శిల్ పంపేయొచ్చు- కొత్త సర్వీస్ ప్రారంభించనున్న దక్షిణ మధ్య రైల్వే
India Wedding Season: 44 రోజుల్లో 46 లక్షల వివాహాలు... ఎక్కువ పెళ్లిళ్లు ఏ రాష్ట్రంలో జరుగుతున్నాయో తెలుసా?
44 రోజుల్లో 46 లక్షల వివాహాలు... ఎక్కువ పెళ్లిళ్లు ఏ రాష్ట్రంలో జరుగుతున్నాయో తెలుసా?
Embed widget