అన్వేషించండి

తెలంగాణ పంచాయతీ ఎన్నికల సమరం: కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ప్రత్యేక వ్యూహాలు..గ్రామాల్లో విజయం ఎవరిదో?

తెలంగాణలో పంచాయతీ ఎన్నికల నగరా మోగింది. 12,760 పంచాయతీలకు సర్పంచ్‌లు, 1,12,534 వార్డులకు వార్డు మెంబర్ల ఎన్నికలు జరగనున్నాయి. మూడు విడతల్లో ఈ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తోంది.

Telangana Local Body Elections: తెలంగాణ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నగరా మోగింది. 12,760 పంచాయతీలకు సర్పంచ్‌లు, 1,12,534 వార్డులకు వార్డు మెంబర్ల ఎన్నికలు జరగనున్నాయి. మూడు విడతల్లో ఈ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తోంది. తొలి విడత ఎన్నిక డిసెంబర్ 11వ తేదీన జరగనుండగా, రెండో విడతను డిసెంబర్ 14వ తేదీన, మూడో విడత ఎన్నిక డిసెంబర్ 17వ తేదీన నిర్వహించనుంది. అయితే, పార్టీలకు అతీతంగా ఈ ఎన్నికలు జరగనున్నప్పటికీ, అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష పార్టీలైన బీఆర్ఎస్, బీజేపీలు ఈ ఎన్నికల్లో తాము బలపర్చే అభ్యర్థుల ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. తాము బలపర్చే అభ్యర్థుల గెలుపుకు వ్యూహాలు రచిస్తున్నాయి.

ప్రజల విశ్వాసాన్ని మరోసారి నిరూపించుకోవాలన్న లక్ష్యంతో కాంగ్రెస్

సాధారణ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన అధికార కాంగ్రెస్, తమ పాలన పట్ల రెండేళ్ల తర్వాత కూడా ప్రజల్లో పూర్తి విశ్వాసం ఉందని రుజువు చేసుకోవడమే లక్ష్యంగా పంచాయతీ ఎన్నికల బరిలో హస్తం పార్టీ నేతలు దిగుతున్నారు. సాధారణ ఎన్నికల్లో ప్రకటించిన ఆరు గ్యారంటీలను గ్రామ స్థాయిలో ప్రచారం చేసేందుకు కాంగ్రెస్ వర్గాలు సిద్ధం అవుతున్నాయి. తమ పథకాల లబ్ధిదారులను తమ ఓటు బ్యాంకుగా మలుచుకోవాలనే ప్రధాన వ్యూహంతో కాంగ్రెస్ ఉంది. గ్రాస్ రూట్ (Grass Root) లెవల్లో పార్టీ పటిష్టం కావాలంటే ఈ ఎన్నికల్లో తమ పట్టును నిరూపించుకోవడమే ప్రధాన లక్ష్యంగా పార్టీ నేతలు చెబుతున్నారు. ఇందు కోసం ఇప్పటికే మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలకు స్థానిక నాయకులను ఏకతాటిపై తీసుకురావడం, నాయకుల మధ్య విభేదాలు ఉంటే పరిష్కరించడం, గ్రామాలను ప్రభావితం చేసే నేతలను తమ గుప్పిట్లో పెట్టుకునే ప్రయత్నాలు ప్రారంభించారు. ఇతర పార్టీలకు చెందిన గ్రామ స్థాయి నేతల్లో కీలకమైన వారిని తమ వైపు తిప్పుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి. పారదర్శక పాలనే నినాదంగా ముందుకు సాగేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. గత ప్రభుత్వ పాలనలో అవినీతి ఆరోపణలను ప్రజల ముందు ఉంచి, తమకు ఓటు వేస్తే గ్రామాల్లో పారదర్శక పాలన అందిస్తామనే ప్రచారం చేయాలన్న ఆలోచనలో కాంగ్రెస్ నేతలు ఉన్నారు.

గ్రామాల్లో పట్టు నిరూపించుకోవాలన్న పట్టుదలలో గులాబీ పార్టీ

అధికారం కోల్పోయిన తర్వాత బీఆర్ఎస్ ఎంపీ ఎన్నికల్లోనూ, రెండు ఉప ఎన్నికల్లోనూ చతికిలపడింది. రెండేళ్ల తర్వాత బీఆర్ఎస్‌కు పట్టున్న గ్రామీణ ప్రాంతాల్లో ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే, తమ బలం తగ్గిపోలేదని, ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగిందని ఈ పంచాయతీ ఎన్నికల్లో నిరూపించాలని పట్టుదలతో బీఆర్ఎస్ నేతలు ఉన్నారు. ఉద్యమ కాలంలో తమను ఆదరించిన గ్రామాల్లో తిరిగి నాటి ఉద్యమ స్ఫూర్తి నింపి ఈ ఎన్నికల్లో గెలుపుబాట పట్టాలనేది గులాబీ పార్టీ నేతల వ్యూహం. తమ ప్రభుత్వ హయాంలో రైతులకు అందించిన 'రైతు బంధు' వంటి పథకాలు, ఇంటింటికి నీటిని అందించిన 'మిషన్ భగీరథ' వంటి పథకాలు, ఇంట్లో పెళ్లికి లక్ష రూపాయలు అందించిన 'కల్యాణ లక్ష్మి' వంటి పథకాల విజయాలు ప్రజల ముందు ఉంచి ఈ ఎన్నికల్లో విజయం సాధించాలని బీఆర్ఎస్ నేతలు వ్యూహాలు రచిస్తున్నారు. వీటితో పాటు, కాంగ్రెస్ రెండేళ్ల పాలనలోని వైఫల్యాల చిట్టాను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలన్న ఆలోచనలో గులాబీ నేతలు ఉన్నారు. మాజీ మంత్రులు, గెలిచిన పార్టీ ఎమ్మెల్యేలు, గత ఎన్నికల్లో ఓడిన ఎమ్మెల్యే అభ్యర్థులు, ఇతర స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులకు ఈ పంచాయతీ ఎన్నికల బాధ్యతలను అప్పగించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. గ్రామాల్లో క్రియాశీలకంగా లేని నేతలను కలుస్తున్నారు. ఏది ఏమైనా, మెజారిటీ పంచాయతీలను గెలుచుకుని గ్రామాల్లో తాము పట్టు కోల్పోలేదని రుజువు చేసే పట్టుదలతో బీఆర్ఎస్ పార్టీ ఉంది.

ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగే యోచనలో బీజేపీ

గత సాధారణ ఎన్నికల్లో, ఎంపీ ఎన్నికల్లో ఓ మోస్తరు విజయం సాధించిన బీజేపీ ఇక తన స్పీడ్ పెంచాలన్న ఆలోచనలో ఉంది. అందుకు పంచాయతీ ఎన్నికలను వేదికగా ఉపయోగించుకోవాలని కమలం పార్టీ నేతలు వ్యూహాలు రచిస్తున్నారు. గ్రామాల్లో తమ బలం పెంచుకోవడానికి ఈ ఎన్నికలు దోహదపడతాయని వారు భావిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రచారం చేసే వ్యూహంతో కమలం నేతలు ఉన్నారు. 'పీఎం కిసాన్ సమ్మాన్ నిధి', 'ప్రధాన మంత్రి ఆవాస్ యోజన', రేషన్ బియ్యం పంపిణీ వంటి అభివృద్ధి కార్యక్రమాలను గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం చేసే ఆలోచనలో బీజేపీ నేతలు ఉన్నారు. దీంతో పాటు, గ్రామాల్లోని స్థానిక సమస్యలను ప్రస్తావిస్తూ, ఇందుకు బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాలే కారణమని ప్రజల ముందు ఎత్తిచూపాలన్న ఆలోచనలో కమలం నేతలు ఉన్నారు. అంతే కాకుండా, రామ మందిర నిర్మాణం, 'ఆపరేషన్ సింధు' వంటి అంశాలను కూడా గ్రామాల్లోకి విస్తృతంగా తీసుకెళ్తామని, ఈ జాతీయ అంశాలు సైతం గ్రామాల్లో యువతను తమ వైపు తిప్పుకోవడానికి ఉపయోగపడతాయని చెబుతున్నారు. గ్రామ, మండల స్థాయిలో కార్యకర్తలను క్రియాశీలకంగా పని చేయించడం, రాష్ట్ర నేతలకు మండల, గ్రామ స్థాయి నాయకులను సమన్వయం చేసి ఈ ఎన్నికల్లో అద్భుత ఫలితాలు సాధించాలనే యోచనలో బీజేపీ అగ్ర నాయకత్వం ఉంది.

అయితే, గ్రామీణ ఓటరు ఆలోచన ఎలా ఉన్నా, స్థానిక సమస్యలే అధిక స్థాయిలో ఈ పంచాయతీ ఎన్నికలను ప్రభావం చేయనున్నప్పటికీ, అందుకు అనుగుణంగా వ్యూహాలు రచించే యోచనలో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలు ఉన్నాయి. స్థానిక పరిస్థితులను బట్టే సర్పంచ్, వార్డు మెంబర్ అభ్యర్థుల ఎంపిక ఉండాలని పార్టీలు ఇప్పటికే కింది క్యాడర్‌కు సంకేతాలు పంపాయి. ఈ దిశగా అన్ని పార్టీలు గెలుపు గుర్రాల కోసం వెతుకులాట ప్రారంభించాయి. దీంతో గ్రామాల్లో సందడి వాతావరణం నెలకొంది.

About the author Yedla Sudhakar Rao

జర్నలిజంలో 25 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. గత పాతికేళ్లుగా పలు ప్రముఖ తెలుగు  ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సంస్థలలో ఆయన పనిచేశారు.

గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత జర్నలిజం కోర్సు చేసి, అదే వృత్తిని కెరీర్‌గా ఎంచుకున్నారు. వివిధ తెలుగు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా సంస్థల్లో సీనియర్ రిపోర్టర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు, ఆ తర్వాత ఇన్‌పుట్ ఎడిటర్‌గా కూడా సేవలందించారు. తెలంగాణ ప్రభుత్వ ఇరిగేషన్, ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్‌లకు PUBLIC RELATION OFFICER గా  ఐదేళ్లపాటు పనిచేశారు.

ఆయనకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సమకాలీన అంశాలపై మంచి పట్టు ఉంది. పరిశోధనాత్మక కథనాలు రాయడంలో ఆయనకు నైపుణ్యం ఉంది. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్‌బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన ఏబీపీ దేశం డిజిటల్ మీడియాలో కొన్నేళ్లుగా అసిస్టెంట్ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు.

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Lok Bhavan: రాజ్ భవన్ కాదు లోక్ భవన్.. పీఎంవో కాదు ఇక సేవా తీర్థ్ - పేర్లు మార్చిన కేంద్రం
రాజ్ భవన్ కాదు లోక్ భవన్.. పీఎంవో కాదు ఇక సేవా తీర్థ్ - పేర్లు మార్చిన కేంద్రం
HILTP Land Scam: హిల్ట్‌ భూములపై బీఆర్ఎస్ పోరాటం.. 2 రోజులపాటు క్షేత్రస్థాయి పరిశీలనకు నేతలు
హిల్ట్‌ భూములపై బీఆర్ఎస్ పోరాటం.. 2 రోజులపాటు క్షేత్రస్థాయి పరిశీలనకు నేతలు
8th Pay Commission: 8వ పే కమిషన్‌ అమలుకు ముందే DA, DR విలీనంపై కేంద్ర కీలక ప్రకటన..
8వ పే కమిషన్‌ అమలుకు ముందే DA, DR విలీనంపై కేంద్ర కీలక ప్రకటన..
Kantara Chapter 1 Review : 'కాంతార'పై కామెడీ కామెంట్స్ - ఎట్టకేలకు సారీ చెప్పిన బాలీవుడ్ హీరో రణవీర్
'కాంతార'పై కామెడీ కామెంట్స్ - ఎట్టకేలకు సారీ చెప్పిన బాలీవుడ్ హీరో రణవీర్
Advertisement

వీడియోలు

Virendra Sehwag Comments on Virat Kohli | వైరల్ అవుతున్న సెహ్వాగ్ కామెంట్స్
Hardik Pandya in Ind vs SA T20 | టీ20 సిరీస్‌ లో హార్దిక్ పాండ్య ?
Gambhir vs Seniors in Team India | టీమ్‌ఇండియాలో ఏం జరుగుతోంది?
Ashwin Comments on Team India Selection | మేనేజ్‌మెంట్ పై అశ్విన్ ఫైర్
India vs South Africa First ODI in Ranchi | సౌతాఫ్రికా సూపర్ ఫైట్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Lok Bhavan: రాజ్ భవన్ కాదు లోక్ భవన్.. పీఎంవో కాదు ఇక సేవా తీర్థ్ - పేర్లు మార్చిన కేంద్రం
రాజ్ భవన్ కాదు లోక్ భవన్.. పీఎంవో కాదు ఇక సేవా తీర్థ్ - పేర్లు మార్చిన కేంద్రం
HILTP Land Scam: హిల్ట్‌ భూములపై బీఆర్ఎస్ పోరాటం.. 2 రోజులపాటు క్షేత్రస్థాయి పరిశీలనకు నేతలు
హిల్ట్‌ భూములపై బీఆర్ఎస్ పోరాటం.. 2 రోజులపాటు క్షేత్రస్థాయి పరిశీలనకు నేతలు
8th Pay Commission: 8వ పే కమిషన్‌ అమలుకు ముందే DA, DR విలీనంపై కేంద్ర కీలక ప్రకటన..
8వ పే కమిషన్‌ అమలుకు ముందే DA, DR విలీనంపై కేంద్ర కీలక ప్రకటన..
Kantara Chapter 1 Review : 'కాంతార'పై కామెడీ కామెంట్స్ - ఎట్టకేలకు సారీ చెప్పిన బాలీవుడ్ హీరో రణవీర్
'కాంతార'పై కామెడీ కామెంట్స్ - ఎట్టకేలకు సారీ చెప్పిన బాలీవుడ్ హీరో రణవీర్
Ravi Teja: రవితేజ సినిమాలో హీరోయిన్స్ గోల... క్లారిటీ ఇచ్చిన మాస్‌ మహారాజా టీమ్
రవితేజ సినిమాలో హీరోయిన్స్ గోల... క్లారిటీ ఇచ్చిన మాస్‌ మహారాజా టీమ్
Eluru Railway Station: ఫొటో చూసి గుడి అనుకున్నారా.. ఇది ఏలూరు రైల్వే స్టేషన్, వినూత్న డిజైన్‌తో నిర్మాణం
ఫొటో చూసి గుడి అనుకున్నారా.. ఇది ఏలూరు రైల్వే స్టేషన్, వినూత్న డిజైన్‌తో నిర్మాణం
Quantum Valley Building Designs: అమరావతిలో క్వాంటం వ్యాలీ బిల్డింగ్ డిజైన్స్ ఇవే.. రాజధానిలో 50 ఎకరాలు కేటాయింపు
అమరావతిలో క్వాంటం వ్యాలీ బిల్డింగ్ డిజైన్స్ ఇవే.. రాజధానిలో 50 ఎకరాలు కేటాయింపు
IPL 2026 Auction: ఐపీఎల్ 2026 మినీ వేలం కోసం 1355 మంది ప్లేయర్లు.. వారి కోసం హోరాహోరీ తప్పదా!
ఐపీఎల్ 2026 మినీ వేలం కోసం 1355 మంది ప్లేయర్లు.. వారి కోసం హోరాహోరీ తప్పదా!
Embed widget