అన్వేషించండి

Iran Crisis : ఒక్క డాలర్‌కు 14 లక్షల రియాల్స్ - ఇరాన్‌లో రోడ్డెక్కిన ప్రజలు - ఆయిల్ రిచ్ కంట్రీలో ఏం జరుగుతోంది?

Iran Problemes: గల్ఫ్ లో ఇరాన్ రిచ్ కంట్రీ అనుకుంటారు. కానీ ఇప్పుడా దేశంలో ప్రజలో ఆఫ్రికాలోలా ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వంపై ఆగ్రహంతో ప్రజలు రోడ్డెక్కుతున్నారు.

Iran economic situation deteriorates: ఆయిల్ నిక్షేపాలు పుష్కలంగా ఉన్న దేశమైనప్పటికీ, ఇరాన్ ప్రస్తుతం తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. డిసెంబర్ 2025 చివరి వారం నుండి టెహ్రాన్ సహా ప్రధాన నగరాల్లో ప్రజలు రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలుపుతున్నారు.    ఇరాన్ నేడు అత్యంత దారుణమైన కరెన్సీ సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. అమెరికన్ డాలర్‌తో పోలిస్తే ఇరాన్ కరెన్సీ  రియాల్ విలువ రికార్డు స్థాయిలో పడిపోయిందియ ఒక డాలర్‌కు సుమారు 14.2 లక్షల రియాల్స్‌కు పైగా చెల్లించాల్సి వస్తోంది.  ఈ కరెన్సీ పతనం కారణంగా ద్రవ్యోల్బణం 42 శాతానికి పైగా పెరిగింది. దీని ప్రభావంతో నిత్యావసర వస్తువులు, ఆహారం, మందుల ధరలు సామాన్యుడికి అందనంత ఎత్తుకు చేరాయి. పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే, గత ఏడాదితో పోలిస్తే ఆహార పదార్థాల ధరలు 70 శాతానికి పైగా పెరగడం ప్రజలను ఆగ్రహానికి గురిచేసింది.

పెరిగిన ధరలు , వ్యాపారం చేయడం అసాధ్యంగా మారడంతో టెహ్రాన్‌లోని చారిత్రాత్మక  గ్రాండ్ బజార్  వ్యాపారులు తమ షాపులను మూసివేసి నిరసన బాట పట్టారు. తొలుత మొబైల్ మార్కెట్లు, చిన్న వ్యాపారులతో మొదలైన ఈ ఆందోళనలు, క్రమంగా విద్యార్థులు, కార్మికులు , సాధారణ పౌరులకు విస్తరించాయి. టెహ్రాన్ వీధుల్లో ప్రజలు భారీ ర్యాలీలు నిర్వహిస్తూ ప్రభుత్వ వైఖరిని ఎండగడుతున్నారు. ఇజ్రాయెల్‌తో ఇటీవలి యుద్ధ పరిస్థితులు, అంతర్జాతీయ ఆంక్షల  వల్ల పరిస్థితి మరింత విషమించింది.
 
పెట్రోలియం ఎగుమతుల్లో అగ్రగామిగా ఉన్నప్పటికీ ఇరాన్ ఈ స్థితికి చేరడానికి ప్రధానంగా రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి, అమెరికా , ఇతర పశ్చిమ దేశాలు ఇరాన్ అణు కార్యక్రమాలపై విధిస్తున్న కఠినమైన ఆర్థిక ఆంక్షలు. దీనివల్ల ఇరాన్ అంతర్జాతీయ మార్కెట్లో స్వేచ్ఛగా చమురు అమ్ముకోలేకపోతోంది. రెండు, దేశీయ వనరుల నిర్వహణలో వైఫల్యం,  హమాస్, హిజ్బుల్లా వంటి విదేశీ గ్రూపులకు ఇచ్చే భారీ ఆర్థిక మద్దతు వల్ల ఇరాన్ పరిస్థితి మరింత దిగజారింది.  మాకు గాజా వద్దు.. లెబనాన్ వద్దు.. మా దేశాన్ని కాపాడండి అంటూ నిరసనకారులు చేస్తున్న నినాదాలు ప్రజల అసంతృప్తికి అద్దం పడుతున్నాయి.     

 
నిరసనలు ఉధృతం కావడంతో ఇరాన్ ప్రభుత్వం అప్రమత్తమైంది. అల్లర్లు సృష్టించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తూనే, మరోవైపు సెంట్రల్ బ్యాంక్ గవర్నర్‌ను మార్చడం వంటి చర్యలతో మార్కెట్లను శాంతింపజేసే ప్రయత్నం చేస్తోంది. అయితే, ఇంధన , నీటి కొరత కూడా తోడవడంతో ప్రజల ఆగ్రహం తగ్గడం లేదు. ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకుని ధరలను అదుపు చేయకపోతే, ఈ నిరసనలు మరింత తీవ్రమై రాజకీయ అస్థిరతకు దారితీసే ప్రమాదం కనిపిస్తోంది.                 


 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

World Happiness Report : ఇండియాలో జనాలు సంతోషంగా లేరట.. తాజా రిపోర్ట్​లో ఇంట్రెస్టింగ్ విషయాలు, టాప్​లో ఉన్న దేశమిదే
ఇండియాలో జనాలు సంతోషంగా లేరట.. తాజా రిపోర్ట్​లో ఇంట్రెస్టింగ్ విషయాలు, టాప్​లో ఉన్న దేశమిదే
Iran US War: మారుతున్న యుద్ధ సమీకరణాలు.. ఇరాన్‌ను నడిపిస్తున్నది ఎవరు! US- ఇజ్రాయెల్‌కు పెరుగుతున్న సపోర్ట్
మారుతున్న యుద్ధ సమీకరణాలు.. ఇరాన్‌ను నడిపిస్తున్నది ఎవరు! US- ఇజ్రాయెల్‌కు పెరుగుతున్న సపోర్ట్
US Iran War: 48 గంటల్లోగా హర్మూజ్ తెరుచుకోకపోతే ఊహించని విధ్వంసం... ఇరాన్‌కు ట్రంప్ వార్నింగ్
48 గంటల్లోగా హర్మూజ్ తెరుచుకోకపోతే ఊహించని విధ్వంసం... ఇరాన్‌కు ట్రంప్ వార్నింగ్
Iran War Updates: అగ్రనేతలంతా మరణించినా ఇరాన్ ఎందుకు లొంగడం లేదు? - వాళ్ల బలం ఇదేనా?
అగ్రనేతలంతా మరణించినా ఇరాన్ ఎందుకు లొంగడం లేదు? - వాళ్ల బలం ఇదేనా?
Advertisement

వీడియోలు

Madhu Park Ridge Issue Updates | బండ్లగూడ కూల్చివేతలు గాంధీ సరోవర్ కోసం కాదు.!
Ashwin Predicts RCB to Win IPL 2026 | ఆర్‌సీబీపై అశ్విన్ ఆసక్తికర విశ్లేషణ
Tilak Varma about Mega Family | మెగాస్టార్ పై తిలక్ వర్మ ఎమోషనల్ కామెంట్స్
Mohammad Kaif Warns Gujarat Titans | గుజరాత్ టైటాన్స్‌కు మహమ్మద్ కైఫ్ వార్నింగ్
Ishan Kishan SRH Practice Match | ఇషాన్ కిషన్‌పై యువ బౌలర్ ఫైర్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ArcelorMittal Nippon Steel Plant: రేపే అనకాపల్లి స్టీల్ ప్లాంట్‌కి శంకుస్థాపన.. రూ.1.5 లక్షల కోట్లతో AM/NS ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్
రేపే అనకాపల్లి స్టీల్ ప్లాంట్‌కి శంకుస్థాపన.. 1.5 లక్షల కోట్లతో AM/NS ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్
Moinabad Farmhouse Case: మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో కీలక పరిణామం.. వీకెండ్ పార్టీలకు 20 సార్లు డ్రగ్స్ సరఫరా!
మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో కీలక పరిణామం.. వీకెండ్ పార్టీలకు 20 సార్లు డ్రగ్స్ సరఫరా!
Simhadri Express Train: సింహాద్రి ఎక్స్ ప్రెస్ ప్రయాణికులకు ఊరట.. ట్రైన్ లో మార్పులు చేసిన రైల్వే
సింహాద్రి ఎక్స్ ప్రెస్ ప్రయాణికులకు ఊరట.. ట్రైన్ లో మార్పులు చేసిన రైల్వే
World Happiness Report : ఇండియాలో జనాలు సంతోషంగా లేరట.. తాజా రిపోర్ట్​లో ఇంట్రెస్టింగ్ విషయాలు, టాప్​లో ఉన్న దేశమిదే
ఇండియాలో జనాలు సంతోషంగా లేరట.. తాజా రిపోర్ట్​లో ఇంట్రెస్టింగ్ విషయాలు, టాప్​లో ఉన్న దేశమిదే
CM Revanth Reddy: సిద్దిపేట జిల్లాలో ఆయిల్ పాం ఫ్యాక్టరీ ప్రారంభం సహా 775 కోట్ల పనులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం
సిద్దిపేట జిల్లాలో ఆయిల్ పాం ఫ్యాక్టరీ ప్రారంభం సహా 775 కోట్ల పనులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం
PM Modi Telangana Tour: ఏప్రిల్‌లో తెలంగాణకు రానున్న ప్రధాని మోదీ.. పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు
ఏప్రిల్‌లో తెలంగాణకు రానున్న ప్రధాని మోదీ.. పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు
Dhurandhar 2 : ఆరేళ్ల పిల్లాడు RGV శివ చూసి ఇన్‌స్పైర్ అయ్యాడు - కట్ చేస్తే నేషనల్ అవార్డ్ డైరెక్టర్
ఆరేళ్ల పిల్లాడు RGV శివ చూసి ఇన్‌స్పైర్ అయ్యాడు - కట్ చేస్తే నేషనల్ అవార్డ్ డైరెక్టర్
AP Nandi Awards: నంది అవార్డులపై చిరు ఆవేదన.. సినీ రంగానికి గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి కందుల దుర్గేష్
నంది అవార్డులపై చిరు ఆవేదన.. సినీ రంగానికి గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి కందుల దుర్గేష్
Embed widget