అన్వేషించండి

Huzurabad Campaign : హుజురాబాద్‌లో హోరెత్తిన ప్రచారం ! "ఫేక్" ప్రచారాలనే నమ్ముకున్న పార్టీలు !

హుజురాబాద్‌ ఉపఎన్నికల ప్రచారంలో అన్ని రాజకీయ పార్టీలు శక్తివంచన లేకుండా ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశాయి. అయితే ఎప్పటికప్పుడు వెలుగు చూసిన ఫేక్ లెటర్లు, ఫేక్ పోస్టులే ప్రచారాన్ని డామినేట్ చేశాయి.


తెలంగాణలోనే కాదు తెలుగు రాష్ట్రాల్లోనూ అత్యంత ఆసక్తి రేపుతున్న హుజురాబాద్‌ బై ఎలక్షన్‌ కోసం హైవోల్టేజ్ ప్రచారం చేశారు. ఈ సారి కరోనా నిబంధనల కారణంగా 72 గంటల ముందే ప్రచారం ముగించాలని ఎన్నికల సంఘం నిబంధనలు పెట్టింది. ఈ కారణంగా 30వ తారీఖున పోలింగ్ అయినప్పటికీ 27వ తేదీనే ప్రచారం ముగిసింది. అన్ని పార్టీలు హోరాహోరీగా ప్రచారం చేశాయి. అభ్యర్థిని లేటుగా ప్రకటించి కాంగ్రెస్ కాస్త వెనుకబడినట్లుగా ఉన్నా.. చివరికి వచ్చే సరికి అన్ని పార్టీలు తమ శక్తి మేర ప్రచారం చేశాయి. ఈ సారి ప్రచారంలో ఎక్కువగా వినిపించిన మాట" ఫేక్ ".
Huzurabad Campaign  :  హుజురాబాద్‌లో హోరెత్తిన ప్రచారం !

ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసినప్పటి నుండే ఈటల ప్రచారం !

జూన్ 12వ తేదీన ఈటల రాజేందర్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఆ వెంటనే ఢిల్లీకి వెళ్లి బీజేపీలో చేరి.. వెంటనే హుజురాబాద్ వచ్చారు. అప్పట్నుంచి తన కార్యక్షేత్రం హుజురాబాద్‌గానే ప్రకటించుకున్నారు. దాదాపుగా ఐదు నెలల పాటు ఈటల ప్రచారం సాగిందని అనుకోవాలి. వెంటనే ఎన్నికలు వస్తాయని అందరూ అనుకున్నారు. కానీ ఆలస్యం అయింది. అయినా ఈటల రాజేందర్ ఎక్కడా విశ్రమించలేదు.  మధ్యలో ఆయన పాదయాత్ర కూడా చేశారు. కానీ మోకాలి గాయంతో  ఆస్పత్రి పాలవడంతో పాదయాత్రకు విరామం ప్రకటించారు.. బీజేపీ అగ్రనేతలు ఎవరూ రకపోయినా కలసి వచ్చిన నేతలతోనే తన ప్రచారాన్ని చేసుకున్నారు. ఎన్నికల షెడ్యూల్ వచ్చి ప్రచార గడువు ముగిసే వరకూ.. దాదాపుగా ప్రతి గ్రామాన్ని చుట్టబెట్టారు. ఓటర్లనూ పేరు పేరున ఓట్లడిగారు.
Huzurabad Campaign  :  హుజురాబాద్‌లో హోరెత్తిన ప్రచారం !

Also Read : ఆ విషయం తెలిసి కేసీఆర్ హైబత్ తిన్నడు.. ఓటుకు 20 వేలు పంచుతున్నడు

ఒంటి చేత్తో హుజురాబాద్ యుద్ధాన్ని చేస్తున్న హరీష్ రావు !

తెలంగాణ రాష్ట్ర సమితి తరపున మొత్తం బాధ్యతల్ని హరీష్ రావు చూస్తున్నారు. మొదట మంత్రి గంగుల కమలాకర్‌కు బాధ్యతలు ఇచ్చారు. కానీ తర్వాత హరీష్ ను రంగంలోకి దింపారు. హరీష్ తన ట్రేడ్ మార్క్ ట్రబుల్ షూటర్ వ్యూహాలతో ఈటలను బలాలను నిర్వీర్యం చేయడం ప్రారంభించారు.  ఆయన ప్రధాన అనుచరుల్ని టీఆర్ఎస్‌లోనే ఉంచగలిగారు. సామాజికవర్గాల వారీగా సమావేశాలు పెట్టి తాయిలాలు ప్రకటించారు. హరీష్ కూడా వ్యూహాత్మకంగా ధరల పెరుగుదల అంశాన్నే హైలెట్ చేశారు. గ్యాస్, పెట్రోల్ రేట్ల పెంపునను చూస్తూ  బీజేపీకి ఎలా ఓటేస్తామని అందర్నీ ఆలోచనలో పడేశారు. కేసీఆర్, కేటీఆర్ రాకపోయినప్పటికీ ఇతర ముఖ్య నేతలందరూ తలా కొంత సాయం చేయడంతో రెండు దశాబ్దాలుగా పాతుకుపోయిన ఈటలను ఓడించడానికి హరీష్ శక్తివంచన లేకుండా ప్రయత్నించారు.
Huzurabad Campaign  :  హుజురాబాద్‌లో హోరెత్తిన ప్రచారం !

Also Read: Huzurabad By Election: హుజూరాబాద్ లో లెటర్ల లొల్లి.. దళిత బంధు ఆపింది ఈటలే అంటున్న టీఆర్‌ఎస్‌.. కాదు.. కాదంటున్న బీజేపీ

ఇంటికి ఒక్క ఓటు నినాదంతో కాంగ్రెస్ !

టీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులు ముందుగానే ఖరారైనప్పటికీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మాత్రం నోటిఫికేషన్ వచ్చిన తర్వాతే ఫైనల్ అయ్యారు. విద్యార్థి నాయకుడిగా ఉన్న బలమూరి వెంకట్‌ను నిలబెట్టారు. ఆయన కోసం రేవంత్ రెడ్డి కూడా ప్రచారం చేశారు. ఇంటికి ఒక్క ఓటు నినాదంతో రేవంత్ రెడ్డి ప్రచారం చేశారు. గెలుపు అవకాశాల కన్నా ముఖ్యంగా తమ ఓటు బ్యాంక్‌ను కాపాడుకోవడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగా ప్రచారంచేసుకుంది.
Huzurabad Campaign  :  హుజురాబాద్‌లో హోరెత్తిన ప్రచారం !

Also Read : రైల్వేస్టేషన్ల అభివృద్ధి.. రైతులకు పెన్షన్లు.. హుజురాబాద్ కోసం బీజేపీ మేనిఫెస్టో !

ఫేక్ లెటర్లు, పోస్టులతో హోరెత్తిన ప్రచారం ! 

హుజురాబాద్‌లో అత్యంత సుదీర్ఘంగా సాగిన ప్రచారంలో ఫేక్ ప్రచారానిది కీలక పాత్ర. ఈటల రాజీనామా చేసి బీజేపీలో చేరిన వెంటనే... ఈటల రాజేందర్ కేసీఆర్ ను క్షమాపణ కోరినట్లుగా ఓ లేఖ వెలుగులోకి వచ్చింది. అది ఫేక్ అని ఈటల మండిపడ్డారు. ఆయన అలా ఫేక్ అని చెప్పుకోవడం ప్రారంభించి.. ప్రచారం ముగిసే వరకూ చెప్పుకుంటూనే ఉన్నారు. అన్ని  విధాలుగా ఈటలను ఇబ్బంది పెట్టే ఫేక్ పోస్టులు వెలుగులోకి వచ్చాయి. రెండు రోజుల ముందు కూడా 0టల రాజేందర్ ఫిర్యాదు చేసినందునే దళిత బంధును నిలిపివేశామని ఎన్నికల సంఘం చెప్పిందంటూ ఓ లేఖ హఠాత్తుగా వైరల్ అయింది. అది ఫేక్ అని తేల్చారు. కానీ చర్చ నుంచి రచ్చ అయింది. కొద్ది రోజుల కిందటే నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ముస్లింలపై దారుణమైన వ్యాఖ్యలు చేశారంటూ ఓ పోస్ట్ వైరల్ అయింది. దానిపై ఖండనలు ఇచ్చుకోవాల్సిన పరిస్థితి బీజేపీ నేతలకు ఏర్పడింది. అంతకు ముందే  ఓ సామాజికవర్గాన్ని ఈటల బావమరది అవమానించిటన్లుగా వాట్సాప్ స్టేటస్‌లు .. ఆడియో టేపులు ఇలా రకరకాలుగా బయటకు వచ్చాయి.  ఇలా ఫేక్ పోస్టులతో హుజురాబాద్‌లో కావాల్సినంత రచ్చ కూడా అయింది. 

Also Read: ప్లీనరీలో కనిపించని హరీష్‌రావు, కవిత ! టీఆర్ఎస్‌లో ఏదో జరుగుతోందా ?

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

 

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Minister Ramanaidu:  మత్స్యకారులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. వారి ఖాతాల్లో రూ.20వేలు
మత్స్యకారులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. వారి ఖాతాల్లో రూ.20వేలు
Revanth Reddy:  ఏసీ గదులు వీడడం లేదు.. అధికారుల పనితీరుపై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
ఏసీ గదులు వీడడం లేదు.. అధికారుల పనితీరుపై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
Priyanka Chopra: హైదరాబాద్ చేరుకున్న ప్రియాంకచోప్రా - మళ్లీ రాజమౌళి, మహేశ్ బాబు 'SSMB29' షూట్‌లోకి.. జక్కన్న కొత్త రూల్ ఏంటో తెలుసా?
హైదరాబాద్ చేరుకున్న ప్రియాంకచోప్రా - మళ్లీ రాజమౌళి, మహేశ్ బాబు 'SSMB29' షూట్‌లోకి.. జక్కన్న కొత్త రూల్ ఏంటో తెలుసా?
IPL Schedule 2025: ఐపీఎల్ షెడ్యూల్ వచ్చేసింది.. వచ్చేనెల 22 నుంచి స్టార్ట్.. ఉప్పల్ స్టేడియంలో 9 మ్యాచ్ లు
ఐపీఎల్ షెడ్యూల్ వచ్చేసింది.. వచ్చేనెల 22 నుంచి స్టార్ట్.. ఉప్పల్ స్టేడియంలో 9 మ్యాచ్ లు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ICC Champions Trophy 2025 Team India | అగార్కర్ తో డ్రెస్సింగ్ రూమ్ లో Gambhir డిష్యూం డిష్యూం | ABP DesamChhatrapati Sambhaji Maharaj 'Sambar' | సాంబార్ చరిత్ర తెలిస్తే షాక్ అవుతారు | ABP DesamVicky Kaushal Bollywood Super Star | Chhava తో కొత్త సూపర్ స్టార్ పుట్టాడా.? | ABP DesamMLC Candidate Aviash Jadhav Interview | పదిహేను నా లక్కీ నెంబర్ ఎందుకంటే | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Minister Ramanaidu:  మత్స్యకారులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. వారి ఖాతాల్లో రూ.20వేలు
మత్స్యకారులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. వారి ఖాతాల్లో రూ.20వేలు
Revanth Reddy:  ఏసీ గదులు వీడడం లేదు.. అధికారుల పనితీరుపై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
ఏసీ గదులు వీడడం లేదు.. అధికారుల పనితీరుపై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
Priyanka Chopra: హైదరాబాద్ చేరుకున్న ప్రియాంకచోప్రా - మళ్లీ రాజమౌళి, మహేశ్ బాబు 'SSMB29' షూట్‌లోకి.. జక్కన్న కొత్త రూల్ ఏంటో తెలుసా?
హైదరాబాద్ చేరుకున్న ప్రియాంకచోప్రా - మళ్లీ రాజమౌళి, మహేశ్ బాబు 'SSMB29' షూట్‌లోకి.. జక్కన్న కొత్త రూల్ ఏంటో తెలుసా?
IPL Schedule 2025: ఐపీఎల్ షెడ్యూల్ వచ్చేసింది.. వచ్చేనెల 22 నుంచి స్టార్ట్.. ఉప్పల్ స్టేడియంలో 9 మ్యాచ్ లు
ఐపీఎల్ షెడ్యూల్ వచ్చేసింది.. వచ్చేనెల 22 నుంచి స్టార్ట్.. ఉప్పల్ స్టేడియంలో 9 మ్యాచ్ లు
Hyderabad Crime News మేడ్చల్‌లో యువకుడి దారుణహత్య, నడిరోడ్డుపై కత్తులతో దాడి కేసులో ఊహించని ట్విస్ట్
మేడ్చల్‌లో యువకుడి దారుణహత్య, నడిరోడ్డుపై కత్తులతో దాడి కేసులో ఊహించని ట్విస్ట్
First GBS Death in AP: ఏపీలో తొలి జీబీఎస్ పేషెంట్ మృతి, నిర్ధారించిన గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్
ఏపీలో తొలి జీబీఎస్ పేషెంట్ మృతి, నిర్ధారించిన గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్
WPL Result Update: గార్డెనర్ కెప్టెన్ ఇన్నింగ్స్.. డబ్ల్యూపీఎల్ లో గుజరాత్ బోణీ, 6 వికెట్లతో యూపీ చిత్తు
గార్డెనర్ కెప్టెన్ ఇన్నింగ్స్.. డబ్ల్యూపీఎల్ లో గుజరాత్ బోణీ, 6 వికెట్లతో యూపీ చిత్తు
Who Is Mastan Sai: ఐఐటీలో బీటెక్ నుంచి డ్రగ్స్ పెడ్లర్, బ్లాక్ మెయిలర్ వరకు.. ఎవరీ మస్తాన్ సాయి, అతడి బ్యాక్‌గ్రౌండ్ ఏంటీ?
ఐఐటీలో బీటెక్ నుంచి డ్రగ్స్ పెడ్లర్, బ్లాక్ మెయిలర్ వరకు.. ఎవరీ మస్తాన్ సాయి, అతడి బ్యాక్‌గ్రౌండ్ ఏంటీ?
Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.