అన్వేషించండి

TRS Harish Kavita : ప్లీనరీలో కనిపించని హరీష్‌రావు, కవిత ! టీఆర్ఎస్‌లో ఏదో జరుగుతోందా ?

టీఆర్ఎస్ ప్లీనరీలో హరీష్ రావు, కవిత ఎక్కడా కనిపించలేదు. హరీష్ హుజురాబాద్ ప్రచారంలోనే ఉండగా కవిత హైదరాబాద్‌లోనే ఉన్నప్పటికీ హాజరు కాలేదు.


తెలంగాణ రాష్ట్ర సమితి 2 దశాబ్దాల వేడుక ప్లీనరీ ముగిసింది. కొన్ని అంశాలు టీఆర్ఎస్ నేతలకూ మింగుడు పడటం లేదు. వాటిలో ముఖ్యమైనవి హరీష్ రావు, కవిత హాజరు కాకపోవడం. హరీష్ రావు హుజురాబాద్ ఎన్నికల ఇంచార్జ్‌గా ఉన్నారు. ఆయనతో పాటు వివిధ మండలాలకు ఇంచార్జ్‌లుగా ఉన్న నేతలు ఎవరూ రావొద్దని టీఆర్ఎస్ హైకమాండ్ ముందుగానే చెప్పింది . దీంతో టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి కీలక పాత్ర పోషిస్తున్న హరీష్ రావుకు ద్విశతాబ్ది ఉత్సవాల్లో పాలు పంచుకోలేకపోయారు. మామూలుగానే ఆయనకు పార్టీలో ప్రాధాన్యం తగ్గుతోందన్న అభిప్రాయం ఉంది. దానికి తగ్గట్లుగానే హరీశ్ రావు ప్రస్తావన కానీ.. ఫ్లెక్సీల్లో ఫోటోలు కానీ ఎక్కడా లేవు. 

Also Read : ఇప్పుడు ఏపీలో చీకట్లు.. తెలంగాణలో వెలుగులు ! తెలంగాణ దేశంకన్నా ముందు ఉందన్న కేసీఆర్ !

అలాగే ఎమ్మెల్సీ, కేసీఆర్ కుమార్తె కవిత కూడా హాజరు కాకపోవడం టీఆర్ఎస్ వర్గాలను సైతం ఆశ్చర్య పరిచింది. కవిత నిజామాబాద్ నుంచి ఎమ్మెల్సీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు.  ఆ జిల్లాకు చెందిన ప్రజా ప్రతినిధులంతా హాజరయ్యారు. కానీ కవిత మాత్రం హాజరు కాలేదు.ఆమె కూడా హైదరాబాద్‌లోనే ఉన్నారు. దుబాయ్‌లో బుర్జ్ ఖలీఫాపై బతుకమ్మ సంబరాలను నిర్వహించి తిరిగి వచ్చారు.  అయినా ఎందుకు రాలేదన్న అంశంపై మాత్రం భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కవితకు జ్వరంగా ఉండటం వల్ల హాజరు కాలేదని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి.  

Also Read : హుజూరాబాద్ లో జోరుగా ప్రచారం... సానుభూతి వర్సెస్ అభివృద్ధి.. గెలుపుకోసం ఎత్తుకుపై ఎత్తులు...!

అయితే కల్వకుంట్ల కవిత, కేటీఆర్ మధ్య విభేదాలు ఉన్నాయని కొంత కాలంగా ప్రచారం జరుగుతోంది. కొన్ని అంశాల్లో ఇద్దరికీ సరిపడటం లేదని చెబుతున్నారు. అందుకే టీఆర్ఎస్ కార్యక్రమాల్లో కవిత పాల్గొన్నా పెద్దగా ప్రచారం లభించడం లేదని అంటున్నారు. ఇటీవలి కాలంలో కేటీఆర్, కవిత కలసి పాల్గొన్న కార్యక్రమాలు కూడా లేవు. ఇలాంటి వాటి వల్ల ఇరువురి మధ్య విభేదాలున్నాయన్న ప్రచారానికి బలం చేకూరుతోంది.  ప్లీనరీ మొత్తం కేటీఆర్ కనుసన్నల్లో జరగడంతో కవిత దూరంగా ఉన్నారని అంటున్నారు. 

Also Read: బీజేపీ -కాంగ్రెస్ ఉమ్మడి అభ్యర్థి ఈటల అంటూ కేటీఆర్ ప్రచారం ! టీఆర్ఎస్‌కి ప్లస్సా ? మైనస్సా ?

టీఆర్ఎస్ అంతర్గత రాజకీయాలు ఎప్పుడూ గుంభనంగానే ఉంటాయి. బయటకు రావు. ప్రస్తుతం టీఆర్ఎస్‌లో కూడా ఇలాంటి అంతర్గత రాజకీయాలు ఉన్నాయని.. బయటకు కనిపించడం లేదని చెబుతున్నారు. ఈ పరిస్థఇతుల్ని ఆసరా చేసుకుని విపక్ష పార్టీల నేతలు టీఆర్ఎస్‌లో ముసలం వస్తుందని ప్రచారం చేస్తున్నారు. హుజురాబాద్ ఉపఎన్నికల తర్వాత టీఆర్ఎస్‌లో పరిస్థితులు దారుణంగా ఉంటాయని రేవంత్ రెడ్డి పదే పదే వ్యాఖ్యానిస్తున్నారు.

Also Read : దగ్గరపడుతున్న హుజురాబాద్ ఉపఎన్నికల పోలింగ్ ! ప్రస్తుతానికి ఇవీ అభ్యర్థుల బలాలు.. బలహీనతలు !

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

టాప్ హెడ్ లైన్స్

Shabad Mass Murder Case: షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
Breaking News: షాబాద్ 6 హత్యల నిందితుడు రాజ్ కుమార్ ఆత్మహత్యపై కేసు నమోదు
షాబాద్ 6 హత్యల నిందితుడు రాజ్ కుమార్ ఆత్మహత్యపై కేసు నమోదు
Rains In AP And Telangana: అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీలో ఈ జిల్లాల్లో మోస్తరు వర్షాలు.. తెలంగాణలో పలుచోట్ల తేలికపాటి జల్లులు
అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీలో ఈ జిల్లాల్లో మోస్తరు వర్షాలు.. తెలంగాణలో పలుచోట్ల తేలికపాటి జల్లులు
Asifabad Forest Officials Attack Case: సార్సాల అటవీ అధికారులపై దాడి కేసు.. మాజీ జెడ్పీ వైస్ చైర్మన్‌ సహా 8 మందికి జైలు శిక్ష
సార్సాల అటవీ అధికారులపై దాడి కేసు.. మాజీ జెడ్పీ వైస్ చైర్మన్‌ సహా 8 మందికి జైలు శిక్ష

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Shabad Mass Murder Case: షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
1st Hydrogen Train: భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్
US Airstrikes On Iran: ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
AP Corona Deaths: ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
Telangana Congress Crisis: తెలంగాణ కాంగ్రెస్‌లో ముదురుతున్న సమన్వయ లోపం - వరుసగా వివాదాలు.. పీసీసీ మార్పు తప్పదా?
తెలంగాణ కాంగ్రెస్‌లో ముదురుతున్న సమన్వయ లోపం - వరుసగా వివాదాలు.. పీసీసీ మార్పు తప్పదా?
Breaking News: షాబాద్ 6 హత్యల నిందితుడు రాజ్ కుమార్ ఆత్మహత్యపై కేసు నమోదు
షాబాద్ 6 హత్యల నిందితుడు రాజ్ కుమార్ ఆత్మహత్యపై కేసు నమోదు
భారత్‌లోకి సింగపూర్ ప్రముఖ లైఫ్‌స్టైల్ మ్యాగజైన్లు.. ఎస్‌పీహెచ్ మీడియాతో ఆశ్రయు మీడియా భాగస్వామ్యం
భారత్‌లోకి సింగపూర్ ప్రముఖ లైఫ్‌స్టైల్ మ్యాగజైన్లు.. ఎస్‌పీహెచ్ మీడియాతో ఆశ్రయు మీడియా భాగస్వామ్యం
Embed widget