అన్వేషించండి

Telangana Good News: డబుల్‌ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీపై తెలంగాణ ప్రభుత్వం శుభవార్త, తొలి విడతకు డెడ్ లైన్ ఫిక్స్

Indiramma Housing Scheme : తెలంగాణ ప్రభుత్వం దీపావళి నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 3,500 నుంచి 4,000 వరకు డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్ల పంపిణీ చేయనుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు.

Double Bed Room house in Telangana | హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ఇండ్లు లేని పేదలకు శుభవార్త చెప్పింది. తొలివిడతలో ప్రతి నియోజకవర్గానికి 4 వేల ఇళ్లు ఇస్తామని ఇటీవల తెలంగాణ గృహ నిర్మాణ, రెవెన్యూ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇటీవల చెప్పారు. తాజాగా మరోసారి మాట్లాడుతూ ఈ నెలాఖరుకే ఇందిరమ్మ ఇండ్ల పంపిణీ చేపడతామని శుభవార్త అందించారు. ఈ దీపావళి నాటికి రాష్ట్ర వ్యా్ప్తంగా 3,500-4,000 డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్లు అర్హులైన పేదలకు పంపిణీ చేస్తామని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు.

వచ్చే నాలుగేళ్లలో పేదలకు 20 లక్షల ఇండ్లు

హైదరాబాద్‌లోని గోషామహల్‌ నియోజకవర్గానికి కేటాయించిన 144 మంది డబుల్ బెడ్రూమ్ ఇళ్ల లబ్ధిదారులకు పట్టాల పంపిణీ కార్యక్రమం హైదరాబాద్‌ జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించారు. నియోజకవర్గానికి సంబంధించిన వారికి రాంపల్లిలో కాంగ్రెస్ ప్రభుత్వం డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు (Indiramma Houses) కేటాయించినట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తెలిపారు. ఏ పార్టీ అనేది చూడకుండా, కులం, మతం పట్టించుకోకుండా అర్హులైన ప్రతి పేదవాడికి తమ ప్రభుత్వం ఇల్లు కట్టించి ఇస్తుందన్నారు. కాంగ్రెస్ వచ్చే నాలుగేళ్లలో రాష్ట్ర వ్యాప్తంగా 20 లక్షల డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టించి పేదలకు ఇవ్వనున్నట్లు ఈ సందర్భంగా పొంగులేటి ప్రకటించారు. 

పేదల కన్నీళ్లు తుడిచేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. కానీ ప్రతిపక్ష బీఆర్ఎస్ మాత్రం సర్కార్ కాళ్లలో కట్టెలు పెట్టి అడ్డం పడుతోందని, ఇది వారికి సరికాదన్నారు. ఎప్పుడో చేప్టటాల్సిన మూసీ నది ప్రక్షాళనకు సర్కారు కృషి చేస్తుంటే, అభివృద్ధికి సహకరించాల్సిన ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ మాత్రం విష ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. పేద ప్రజలకు మంచి జీవితాలు అందించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఆ మేరకు తాము అడుగులు వేస్తోంటే బీఆర్ఎస్ నేతలు అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. 

Also Read: CM Revanth Reddy: 'నిరుద్యోగులూ వారి మాట విని మోసపోవద్దు' - గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షల నిర్వహణపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు

గోషామహల్ లో పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న హైదరాబాద్ జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్‌ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఏ కార్యక్రమం చేపట్టినా ఇబ్బంది పెట్టి, ప్రతి పనిని అడ్డుకునే కుట్ర జరుగుతోందన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చుతామని, ఆరు గ్యారంటీలను ఒక్కొక్కటిగా అన్నీ అమలు చేస్తున్న తమ ప్రభుత్వానిది అన్నారు. తన నియోజకవర్గ ప్రజలు రాంపల్లికి వెళ్తుంటే బాధగా ఉందన్నారు బీజేపీ నేత, గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌. అయితే వారి సొంతిళ్ల కల సాకారం అవుతున్నందుకు సంతోషంగా ఉందన్నారు. 

ర్యాండమైజేషన్‌ ప్రక్రియ ద్వారా ఇళ్ల కేటాయింపులు

గోషామహల్ నియోజకవర్గం నుంచి 144 మంది ఇల్లు లేని అర్హులైన పేదలకు ఎవరి ప్రమేయం లేకుండా ర్యాండమైజేషన్‌ ప్రక్రియ ద్వారా ఇళ్లను కేటాయించామని కలెక్టర్‌ అనుదీప్‌ దురిశెట్టి చెప్పారు. గతంలో లాటరీ పద్ధతిలో లబ్ధిదారుల ఇళ్ల కేటాయింపులు జరిగేవి. దాంతో తమకు అన్యాయం జరిగిందని, ఎవరికి ఇవ్వాలని భావించారో వారికి మాత్రమే ఇండ్లు ఇచ్చారని అనుమానులు వ్యక్తం చేసేవారు. కానీ వాటిని అధిగమించేందుకు కొత్త సాఫ్ట్‌వేర్‌ను రూపొందించి లబ్దిదారులకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కేటాయించి, ఇండ్ల పట్టాలు పంపిణీ చేసినట్లు కలెక్టర్ అనుదీప్ వివరించారు. లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన ఈ కార్యక్రమంలో కార్యక్రమంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీ గణేశ్, ఎమ్మెల్సీలు బల్మూరి వెంకట్, రహమత్‌ బేగ్‌ తదితరులు పాల్గొన్నారు. 

 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Kuppam Chandrababu: కుప్పానికి పారిశ్రామిక కళ - ఐఫోన్ విడిభాగాల ఫ్యాక్టరీ సహా  ఏడు పరిశ్రమలకు శంకుస్థాపన చేసిన చంద్రబాబు
కుప్పానికి పారిశ్రామిక కళ - ఐఫోన్ విడిభాగాల ఫ్యాక్టరీ సహా ఏడు పరిశ్రమలకు శంకుస్థాపన చేసిన చంద్రబాబు
Jubilee Hills By Election: జూబ్లీహిల్స్‌ ప్రజలకు అలర్ట్.. ఆంక్షలపై హైదరాబాద్‌ సీపీ సజ్జనార్‌ కీలక ఆదేశాలు
జూబ్లీహిల్స్‌ ప్రజలకు అలర్ట్.. ఆంక్షలపై హైదరాబాద్‌ సీపీ సజ్జనార్‌ కీలక ఆదేశాలు
Abhishek Sharma Records: అభి‘షేక్’ ఆడించాడు.. టీ20లలో ఫాస్టెస్ట్ బ్యాటర్‌గా ఘనత.. కోహ్లీ, సూర్య రికార్డ్ బ్రేక్
అభి‘షేక్’ ఆడించాడు.. టీ20లలో ఫాస్టెస్ట్ బ్యాటర్‌గా ఘనత.. కోహ్లీ, సూర్య రికార్డ్ బ్రేక్
Chikiri Chikiri Song: 'గేమ్ ఛేంజర్' ఫ్లాప్ మర్చిపోయేలా చేసిన చికిరి చికిరి
'గేమ్ ఛేంజర్' ఫ్లాప్ మర్చిపోయేలా చేసిన చికిరి చికిరి
Advertisement

వీడియోలు

Artificial Rain Failure in Delhi | Cloud Seeding | క్లౌడ్ సీడింగ్ ఫెయిల్యూర్ కి కారణాలు ఇవే ! | ABP Desam
సిరీస్ భారత్‌దే.. వన్డేల పగ టీ20లతో తీర్చుకున్న టీమిండియా
Sanju Samson in IPL 2026 | క్లాసెన్‌ ను విడుదుల చేయనున్న SRH ?
Sachin Advt in Sujeeth Direction | యాడ్స్‌కి దర్శకత్వం వహించిన సుజిత్
India vs Australia T20 Match | నేడు ఆస్ట్రేలియాతో భారత్‌ ఐదవ టీ20
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kuppam Chandrababu: కుప్పానికి పారిశ్రామిక కళ - ఐఫోన్ విడిభాగాల ఫ్యాక్టరీ సహా  ఏడు పరిశ్రమలకు శంకుస్థాపన చేసిన చంద్రబాబు
కుప్పానికి పారిశ్రామిక కళ - ఐఫోన్ విడిభాగాల ఫ్యాక్టరీ సహా ఏడు పరిశ్రమలకు శంకుస్థాపన చేసిన చంద్రబాబు
Jubilee Hills By Election: జూబ్లీహిల్స్‌ ప్రజలకు అలర్ట్.. ఆంక్షలపై హైదరాబాద్‌ సీపీ సజ్జనార్‌ కీలక ఆదేశాలు
జూబ్లీహిల్స్‌ ప్రజలకు అలర్ట్.. ఆంక్షలపై హైదరాబాద్‌ సీపీ సజ్జనార్‌ కీలక ఆదేశాలు
Abhishek Sharma Records: అభి‘షేక్’ ఆడించాడు.. టీ20లలో ఫాస్టెస్ట్ బ్యాటర్‌గా ఘనత.. కోహ్లీ, సూర్య రికార్డ్ బ్రేక్
అభి‘షేక్’ ఆడించాడు.. టీ20లలో ఫాస్టెస్ట్ బ్యాటర్‌గా ఘనత.. కోహ్లీ, సూర్య రికార్డ్ బ్రేక్
Chikiri Chikiri Song: 'గేమ్ ఛేంజర్' ఫ్లాప్ మర్చిపోయేలా చేసిన చికిరి చికిరి
'గేమ్ ఛేంజర్' ఫ్లాప్ మర్చిపోయేలా చేసిన చికిరి చికిరి
Pawan Kalyan Warning: ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తే తాటతీస్తా.. త్వరలో ఆ నలుగురు అరెస్ట్: పవన్ కళ్యాణ్
ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తే తాటతీస్తా.. త్వరలో ఆ నలుగురు అరెస్ట్: పవన్ కళ్యాణ్
Congress Politics: బీజేపీ కుట్రలు కాంగ్రెస్ బయటపెట్టినా ఈసీ ఏకపక్షంగా వ్యవహరిస్తోంది: మహేష్ కుమార్ గౌడ్
బీజేపీ కుట్రలు కాంగ్రెస్ బయటపెట్టినా ఈసీ ఏకపక్షంగా వ్యవహరిస్తోంది: మహేష్ కుమార్ గౌడ్
Telugu TV Movies Today: ఈ ఆదివారం (నవంబర్ 09) స్మాల్ స్క్రీన్‌లో సందడి చేసే సినిమాలివే... ఆలస్యమెందుకు, లిస్ట్ చూసేయండి
ఈ ఆదివారం (నవంబర్ 09) స్మాల్ స్క్రీన్‌లో సందడి చేసే సినిమాలివే... ఆలస్యమెందుకు, లిస్ట్ చూసేయండి
Gouri Kishan : హీరోను అలాంటి క్వశ్చన్స్ అడుగుతారా? - బాడీ షేమింగ్‌పై తమిళ హీరోయిన్ రియాక్షన్
హీరోను అలాంటి క్వశ్చన్స్ అడుగుతారా? - బాడీ షేమింగ్‌పై తమిళ హీరోయిన్ రియాక్షన్
Embed widget