అన్వేషించండి

Telangana: మేఘా కృష్ణారెడ్డి చుట్టూ తెలంగాణ రాజకీయం - సన్నిహితుడిపైనే బీఆర్ఎస్ తీవ్ర ఆరోపణలు ఎందుకు ?

Telangana: మేఘా కృష్ణారెడ్డి చుట్టూ తెలంగాణ రాజకీయం ఎందుకు తిరుగుతోంది? బీఆర్ఎస్‌కు సన్నిహితుడిగా పేరు పడిన ఆయనపై ఎందుకు కేటీఆర్ ఆరోపణలు చేస్తున్నారు?

Why is Telangana politics revolving around Megha Krishna Reddy: మేఘా కృష్ణారెడ్డి అంటే తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారు ఉండరు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని బడా  బడా కాంట్రాక్టులు ఆయన కంపెనీలే చేస్తూంటాయి. తెలంగాణలో కాళేశ్వరం అయినా.. ఏపీలో పోలవరం అయినా మేఘా ఇంజినీరింగే కాంట్రాక్టర్. ఇవి అతి భారీ ప్రాజెక్టులు. కింది స్థాయి వరకూ కొన్ని వేల కాంట్రాక్టులు ఆయన సంస్థకు దక్కి ఉంటాయి. ఇలా తెలుగు రాష్ట్రాల ఆర్టీసీల్లో తిరిగే ఎలక్ట్రిక్ బస్సులు అన్నీ ఒలెక్ట్రాకు చెందినవి. ఇది మేఘా గ్రూప్ కంపెనీనే. ఇంకా అనేక విభాగాలు ఉన్నాయి. కానీ ఆయన ఎప్పుడూ రాజకీయాల్లో జోక్యం చేసుకోలేదు. కానీ ఎవరు అధికారంలో ఉంటే వారికి ప్రతీపాత్రుడు. 

బీఆర్ఎస్‌కు అత్యంత సన్నిహితునిగా గుర్తింపు !

తెలంగాణలో బీఆర్ఎస్ పదేళ్ల పాటు అధికారంలో ఉంది. మేఘా ఇంజినీరింగ్ కంపెనీ ఎన్నో కాంట్రాక్టులు చేపట్టింది. ఇంకా చెప్పాలంటే ప్రాజెక్టుల రీ డిజైనింగ్ పనులన్నీ మేఘా కంపెనీకే దక్కాయి. కాళేశ్వరం లక్ష కోట్లకుపైగా విలువైన ప్రాజెక్టు. ఇందులో సింహ భాగం మేఘా కంపెనీనే చేసింది. ఇతర ప్రాజెక్టులు కూడా ఆ సంస్థకే దక్కాయి. బాగా పని చేస్తున్నారని ఓ సారి కేసీఆర్ సన్మానం కూడా చేశారు. అందుకే విపక్ష నేతలు చాలా సార్లు మేఘా కంపెనీకి తెలంగాణను దోచి పెడుతున్నారని ఆంధ్రా కాంట్రాక్టర్ కు దాసోహం అయ్యారని ఆరోపించేవారు. మేఘాను ఈస్టిండియా కంపెనీగా పేర్కొనేవారు.    

'త్వరలో ఆటంబాంబ్ పేలబోతోంది' - మరోసారి మంత్రి పొంగులేటి సంచలన వ్యాఖ్యలు

బీఆర్ఎస్‌కు రెండు వందల కోట్లకుపైగా ఎలక్టోరల్ బాండ్స్ ఇచ్చిన మేఘా 

మేఘా కంపెనీ బీఆర్ఎస్‌కు పెద్ద ఎత్తున విరాళాలు ఇచ్చింది. ఇటీవల సుప్రీంకోర్టు ఆదేశాలతో వెలుగులోకి వచ్చిన ఎలక్టోరల్ బాండ్లలో మేఘాతో పాటు అనుబంధ కంపెనీలు అత్యధికంగా విరాళాలు ఇచ్చిన పార్టీల్లో రెండో స్థానంలో ఉంది. మొదటి స్థానంలో బీజేపీ ఉంది. బీజేపీ విషయం పక్కన పెడితే.. ఓ ప్రాంతీయ పార్టీకి.. భారీగా కాంట్రాక్టులు దక్కించుకున్న కంపెనీ రూ. రెండు వందల కోట్ల వరకూ ఎలక్టోరల్ బాండ్ల రూపంలో ఇవ్వడం విమర్శలకు దారితీసేదే. అది బీఆర్ఎస్ పార్టీతో మేఘా ఇంజినీరింగ్ యజమానులకు ఉన్న సాన్నహిత్యం అనుకోవచ్చు. 

Also Read: KTR: 'రూ.లక్షల కోట్లు పెట్టుబడులు తెచ్చినందుకు కేసు పెడతారా?' - జైల్లో పెడితే యోగా చేస్తానంటూ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

తాము అధికారంలో ఉన్నప్పుడు తమకు అత్యంత సన్నిహితంగా వ్యవహరించిన కంపెనీపై ఇప్పుడు బీఆర్ఎస్ నేతలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. దీనికి కారణం ఏమిటో స్పష్టంగా తెలియదు. ముఖ్యమంత్రి నియోజకవర్గం కొడంగల్ లో చేపడుతున్న ఓ ప్రాజెక్టును మేఘా, రాఘవ సంస్థలు కలిసి చేజిక్కిచుకున్నాయి. ఈ రాఘవ సంస్థ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిది. తర్వాత హైదరాబాద్‌కు నీరందరించేలా చేపడుతున్న గోదావరి ఫేజ్ టు, మూసి ప్రాజెక్టులపై ఇంకా టెండర్లు ఖరారు కాలేదు. అసలు టెండర్లే పిలవలేదు. అయినప్పటికీ ఆ సంస్థకే టెండర్లు ఇస్తారని తాము వచ్చాక సంతకాలు చేసిన అధికారుల్ని జైలుకు పంపుతామని కేటీఆర్ హెచ్చరిస్తున్నారు. అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి మేఘా కృష్ణారెడ్డి కూడా ఆ పార్టీతో సన్నిహితంగా ఉంటున్నారు.  ఒక వేళ బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి ఉంటే ఆయన హవా కొనసాగేది. బీఆర్ఎస్ నేతలు విమర్శలు చేసేవారు కాదు. మొత్తంగా చూస్తే మేఘా కృష్ణారెడ్డి ఎవరు అధికారంలో ఉంటే వారికి సన్నిహితమయ్యే ట్రిక్స్ అన్ని బాగా వంటబట్టించుకున్నారన్న సెటైర్లు రాజకీయవర్గాల్లో వినిపిస్తున్నాయి. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Telangana Congress: గులాబీ కోటలపై కాంగ్రెస్ పంజా.. రేవంత్ రెడ్డి వ్యూహం ఫలించేనా?
గులాబీ కోటలపై కాంగ్రెస్ పంజా.. రేవంత్ రెడ్డి వ్యూహం ఫలించేనా?
Tamil Nadu Assembly Elections: తమిళనాడు కూటముల్లో సీట్ల కేటాయింపు సర్కస్ - డీఎంకే, అన్నాడీఎంకే అసంతృప్తులంతా విజయ్ గూటికే !
తమిళనాడు కూటముల్లో సీట్ల కేటాయింపు సర్కస్ - డీఎంకే, అన్నాడీఎంకే అసంతృప్తులంతా విజయ్ గూటికే !
Revanth Master Plan: ప్రత్యర్థులను బాధితులను చేయని రేవంత్ రాజకీయం - అరెస్టులు లేకపోవడం వెనుక వ్యూహం ఇదే!
ప్రత్యర్థులను బాధితులను చేయని రేవంత్ రాజకీయం - అరెస్టులు లేకపోవడం వెనుక వ్యూహం ఇదే!
Bihar CM: బిహార్ కొత్త సీఎంగా తెరపైకి నిశాంత్ కుమార్! నితీష్ కుమార్ సోదరుడి డిమాండ్.. ఇంతకీ ఎవరతను
బిహార్ కొత్త సీఎంగా తెరపైకి నిశాంత్ కుమార్! నితీష్ కుమార్ సోదరుడి డిమాండ్.. ఇంతకీ ఎవరతను

వీడియోలు

5 key Reasons behind Trump's decision to halt war | ఇరాన్ పై 5 రోజులపాటు దాడులకు విరామం ప్రకటించిన ట్రంప్. ఆయన నిర్ణయం వెనుక 5 ప్రధాన కారణాలపై విశ్లేషణ
MS Dhoni about IPL Retirement | రిటైర్మెంట్ పై క్లారిటీ ఇచ్చిన తల ధోని | ABP Desam
Virat Kohli Reacts on Fake News | ఫేక్ వార్తలపై విరాట్ ఫన్నీ రియాక్షన్ | ABP Desam
Abhishek Sharma Shouts 'Jai Babu' | జై బాబు అంటూ అభిషేక్ శర్మ రచ్చ | ABP Desam
Aakash Chopra comments on SRH | SRH బౌలింగ్‌పై ఆకాశ్ చోప్రా ఘాటు వ్యాఖ్యలు | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Foundation stone laid for steel plant: చంద్రబాబు చొరవతోనే ఏపీలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు - స్టీల్ ప్లాంట్ శంకుస్థాపనలో మిట్టల్ ప్రశంసలు
చంద్రబాబు చొరవతోనే ఏపీలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు - స్టీల్ ప్లాంట్ శంకుస్థాపనలో మిట్టల్ ప్రశంసలు
Hyderabad Latest News: హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేలా ఎలివేటెడ్ కారిడార్లు, మెట్రో విస్తరణ! సీఎం రేవంత్ రెడ్డి భారీ రోడ్డు మ్యాప్!
హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేలా ఎలివేటెడ్ కారిడార్లు, మెట్రో విస్తరణ! సీఎం రేవంత్ రెడ్డి భారీ రోడ్డు మ్యాప్!
YS Sharmila On Jagan: నాది ఆస్తుల పోరాటం కాదు.. వివేకా హత్యపై నిజాల వేట - జగన్‌పై వైఎస్ షర్మిల ఘాటు వ్యాఖ్యలు
నాది ఆస్తుల పోరాటం కాదు.. వివేకా హత్యపై నిజాల వేట - జగన్‌పై వైఎస్ షర్మిల ఘాటు వ్యాఖ్యలు
Pawan Kalyan : పొలిటికల్ థ్రిల్లర్‌కు పవన్ కల్యాణ్ గ్రీన్ సిగ్నల్? - డైరెక్టర్ ఎవరో తెలుసా!
పొలిటికల్ థ్రిల్లర్‌కు పవన్ కల్యాణ్ గ్రీన్ సిగ్నల్? - డైరెక్టర్ ఎవరో తెలుసా!
Gold and Silver Price: పసిడి, వెండి మార్కెట్‌లో పెను ప్రకంపనలు; మూడు గంటల్లోనే 165 లక్షల కోట్లు మాయం- ఇరాన్ యుద్ధం వేళ షాకింగ్ పరిణామం!
పసిడి, వెండి మార్కెట్‌లో పెను ప్రకంపనలు; మూడు గంటల్లోనే 165 లక్షల కోట్లు మాయం- ఇరాన్ యుద్ధం వేళ షాకింగ్ పరిణామం!
Stock Market 23 March: కుప్పకూలిన స్టాక్ మార్కెట్‌— Sensex 1900 పాయింట్లు, Nifty 600 పాయింట్లు పతనం.. అందుకు కారణాలివే
కుప్పకూలిన స్టాక్ మార్కెట్‌— Sensex 1900 పాయింట్లు, Nifty 600 పాయింట్లు పతనం.. అందుకు కారణాలివే
Harish Rao: ఫిలిప్పీన్స్‌కు బియ్యం ఎగుమతిలో భారీ స్కాం.. కాకినాడ పోర్టులో బియ్యం ముక్కిపోయింది: హరీష్ రావు
ఫిలిప్పీన్స్‌కు బియ్యం ఎగుమతిలో భారీ స్కాం.. కాకినాడ పోర్టులో బియ్యం ముక్కిపోయింది: హరీష్ రావు
National Highways: జాతీయ రహదార్లపై ఏఐ నిఘా!లోపాలు గుర్తించే సరికొత్త డ్యాష్‌ క్యామ్‌ టెక్నాలజీ!
జాతీయ రహదార్లపై ఏఐ నిఘా!లోపాలు గుర్తించే సరికొత్త డ్యాష్‌ క్యామ్‌ టెక్నాలజీ!
Embed widget