అన్వేషించండి

Minister Ponguleti: 'త్వరలో ఆటంబాంబ్ పేలబోతోంది' - మరోసారి మంత్రి పొంగులేటి సంచలన వ్యాఖ్యలు

Telangana News: మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తప్పు చేసిన వాళ్లకు ఆటంబాంబు పేలబోతోందంటూ వ్యాఖ్యానించారు.

Minister Ponguleti Srinivasreddy Comments: రాష్ట్రంలోనే త్వరలోనే ఆటంబాంబ్ పేలుతుందంటూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి (Ponguleti Srinivas Reddy) మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వరంగల్ జిల్లాలో గురువారం పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వర్ధన్నపేటలో ఆయన మాట్లాడారు. 'తప్పు చేసిన వాళ్లకు నాటుబాంబు కాదు.. లక్ష్మీబాంబు కాదు.. ఆటమ్‌బాంబు పేలబోతోంది. జనం సొమ్మును అక్రమమార్గంలో విదేశాలకు పంపారు. ఎంత పెద్దవాళ్లకైనా చట్టం చుట్టం కాదు. రూ.55 కోట్లు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్లాయో తేలుస్తాం. తప్పు చేయని వాళ్లు ఉలిక్కి పడాల్సిన అవసరం లేదు.' అని పేర్కొన్నారు. అటు, అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లలా ప్రభుత్వం పని చేస్తోందని మంత్రి అన్నారు. రాష్ట్రానికి రూ.7 లక్షల కోట్లకు పైగా అప్పులున్నా.. సంక్షేమ పథకాలను ఎక్కడా ఆపడం లేదని నిర్విరామంగా అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు. తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యానికి 11 నెలలు నిండాయని అన్నారు.

దీపావళి బాంబుల వ్యాఖ్యలు వైరల్

కాగా, ఇటీవల సియోల్ పర్యటనలో ఉన్నప్పుడు మంత్రి పొంగులేటి అక్కడికి తీసుకెళ్లిన మీడియా ప్రతినిధులకు ఇంటర్వ్యూ ఇచ్చి మరీ దీపావళికి బీఆర్ఎస్‌పై బాంబులు పేలుస్తామని అన్నారు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ అగ్రనేతల అరెస్టులు ఉంటాయని అంతా భావించారు. ముఖ్యంగా జన్వాడ ఫాంహౌస్ కేసు, ఫార్ములా ఈ కార్ రేస్ ఆరోపణల విషయంలో ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందనే అంతా భావించారు. అయితే, అలాంటిదేమీ జరగలేదు. అనంతరం సచివాలయంలో ఇటీవల చిట్ చాట్ సందర్భంగా మీడియా ప్రతినిధులు ఇదే అంశాన్ని ఆయన వద్ద ప్రస్తావించారు. 'దీపావళి అయిపోయింది. అయినా బాంబులు పేలలేదేంటి సార్' అంటూ ప్రశ్నించారు.

ఈ క్రమంలోనే 'నన్ను ర్యాగింగ్ చేస్తున్నారా?' అంటూ జర్నలిస్టులపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అంశంపై పొడిపొడిగా స్పందించిన ఆయన ఒక్కొక్కటి ఒక్కొక్కసారి పేలుతాయని పొంతన లేని సమాధానం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇంకొంత స్పష్టంగా సమాధానం రాబట్టేందుకు ప్రయత్నించగా.. ఆయన రిపోర్టర్లపై అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. తాజాగా ఆయన మళ్లీ ఆటంబాంబ్ వ్యాఖ్యలు చేశారు. మరి అవి ఎలాంటివో అంటూ అటు ప్రజలు, ఇటు ప్రతిపక్ష నేతల్లోనూ ఆసక్తి నెలకొంది.

మరోవైపు, మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలో వ్యవసాయ మార్కెట్ నూతన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవంలో మంత్రి పొంగులేటి గురువారం పాల్గొన్నారు. 'రాష్ట్ర ప్రజలు మార్పు కావాలని ఇందిరమ్మ రాజ్యం తీసుకొచ్చారు. ప్రత్యక్షంగా రైతుల కోసం రూ.18 వేల కోట్లు రుణమాఫీ చేశాం. మిగతా రూ.12 వేల కోట్ల రుణమాఫీ చేస్తాం. తాము ఇచ్చే స్మార్ట్ కార్డు ప్రభుత్వం ఇచ్చే ప్రతి పథకానికి వర్తిస్తుంది. ధరణిలో విదేశాల సంస్థలకు ఇచ్చిన భూమిని మళ్లీ తీసుకొస్తున్నాం. దేశంలో ఎక్కడా లేని విధంగా కొత్త రెవెన్యూ చట్టాన్ని తీసుకొస్తున్నాం. పేదవాడికి కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుంది. గుమ్మడికాయ దొంగ అంటే కేటీఆర్ ఎందుకు భయపడుతున్నారో చెప్పాలి.' అని అన్నారు.

Also Read: KTR: 'రూ.లక్షల కోట్లు పెట్టుబడులు తెచ్చినందుకు కేసు పెడతారా?' - జైల్లో పెడితే యోగా చేస్తానంటూ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Amaravati Latest News: అమరావతిలో చనిపోయిన రైతు కుటుంబానికి 50 లక్షల పరిహారం ఇవ్వాలి! CRDA ముందు సిపిఎం ధర్నా
అమరావతిలో చనిపోయిన రైతు కుటుంబానికి 50 లక్షల పరిహారం ఇవ్వాలి! CRDA ముందు సిపిఎం ధర్నా
Silver Price : గంటలో 21వేలు పడిపోయిన వెండి రేటు - ముందు ముందు అలాగే ఉంటుందా?
గంటలో 21వేలు పడిపోయిన వెండి రేటు - ముందు ముందు అలాగే ఉంటుందా?
iBOMMA Ravi : 'నా పేరు రవి... ఐ బొమ్మ రవి కాదు' - ఏదైనా కోర్టులో తేల్చుకుంటా... iBOMMA రవి రియాక్షన్
'నా పేరు రవి... ఐ బొమ్మ రవి కాదు' - ఏదైనా కోర్టులో తేల్చుకుంటా... iBOMMA రవి రియాక్షన్
Bandi Sanjay: ప్రతి హిందువు, భారతీయుడు తప్పక చూడాల్సిన సినిమా అఖండ తాండవం - బండి సంజయ్ ప్రశంస
ప్రతి హిందువు, భారతీయుడు తప్పక చూడాల్సిన సినిమా అఖండ తాండవం - బండి సంజయ్ ప్రశంస

వీడియోలు

KTR No Respect to CM Revanth Reddy | సభానాయకుడు వచ్చినా KTR నిలబడకపోవటంపై సోషల్ మీడియాలో చర్చ | ABP Desam
BCCI Clarity about Team India Test Coach | టెస్ట్ కోచ్ పై బీసీసీఐ క్లారిటీ
India Women Record in T20 | శ్రీలంకపై భారత్ విజయం
Rishabh Pant out Of India vs New Zealand | రిషబ్ పంత్ కు షాక్
Yashasvi Jaiswal about Rohit Sharma | జైస్వాల్‌ డెబ్యూపై రోహిత్ మాస్టర్ ప్లాన్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Amaravati Latest News: అమరావతిలో చనిపోయిన రైతు కుటుంబానికి 50 లక్షల పరిహారం ఇవ్వాలి! CRDA ముందు సిపిఎం ధర్నా
అమరావతిలో చనిపోయిన రైతు కుటుంబానికి 50 లక్షల పరిహారం ఇవ్వాలి! CRDA ముందు సిపిఎం ధర్నా
Silver Price : గంటలో 21వేలు పడిపోయిన వెండి రేటు - ముందు ముందు అలాగే ఉంటుందా?
గంటలో 21వేలు పడిపోయిన వెండి రేటు - ముందు ముందు అలాగే ఉంటుందా?
iBOMMA Ravi : 'నా పేరు రవి... ఐ బొమ్మ రవి కాదు' - ఏదైనా కోర్టులో తేల్చుకుంటా... iBOMMA రవి రియాక్షన్
'నా పేరు రవి... ఐ బొమ్మ రవి కాదు' - ఏదైనా కోర్టులో తేల్చుకుంటా... iBOMMA రవి రియాక్షన్
Bandi Sanjay: ప్రతి హిందువు, భారతీయుడు తప్పక చూడాల్సిన సినిమా అఖండ తాండవం - బండి సంజయ్ ప్రశంస
ప్రతి హిందువు, భారతీయుడు తప్పక చూడాల్సిన సినిమా అఖండ తాండవం - బండి సంజయ్ ప్రశంస
Peddi Movie : రామ్ చరణ్ 'పెద్ది'లో సర్ప్రైజ్ - ఈ లుక్ చూస్తే అస్సలు గుర్తు పట్టలేం... ఎవరో తెలుసా?
రామ్ చరణ్ 'పెద్ది'లో సర్ప్రైజ్ - ఈ లుక్ చూస్తే అస్సలు గుర్తు పట్టలేం... ఎవరో తెలుసా?
The Raja Saab Release Trailer : ప్రభాస్ 'ది రాజా సాబ్' రిలీజ్ ట్రైలర్ వచ్చేసింది - టైం స్టార్ట్ అయ్యింది డార్లింగ్స్
ప్రభాస్ 'ది రాజా సాబ్' రిలీజ్ ట్రైలర్ వచ్చేసింది - టైం స్టార్ట్ అయ్యింది డార్లింగ్స్
JEE Advanced 2026: జేఈఈ అడ్వాన్స్‌డ్ 2026 షెడ్యూల్ విడుదల! మీరు ఎప్పుడు రిజిస్టర్ చేసుకోవాలో తెలుసుకోండి!
జేఈఈ అడ్వాన్స్‌డ్ 2026 షెడ్యూల్ విడుదల! మీరు ఎప్పుడు రిజిస్టర్ చేసుకోవాలో తెలుసుకోండి!
Padi Kaushik Reddy: తెలంగాణ అసెంబ్లీలో బాంబు ప్రకంపనలు - ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఫైర్
తెలంగాణ అసెంబ్లీలో బాంబు ప్రకంపనలు - ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఫైర్
Embed widget