అన్వేషించండి

KTR: 'రూ.లక్షల కోట్లు పెట్టుబడులు తెచ్చినందుకు కేసు పెడతారా?' - జైల్లో పెడితే యోగా చేస్తానంటూ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

Telangana News: ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంలో విచారణ క్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. విశ్వనగరాల సరసన హైదరాబాద్‌ను చేర్చాలనే ఉద్దేశంతోనే ఈ రేస్ ఏర్పాటు చేశామన్నారు.

KTR Responds On Formula E Car Race Allegations: 'రాష్ట్రానికి రూ.లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చినందుకే తనపై కేసు పెడతారా.?' అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ప్రశ్నించారు. ఫార్ములా - ఈ కారు రేస్ (Formula E Car Race) వ్యవహారంలో ఒప్పందం కుదరడానికి ముందే నిధులు చెల్లించడం.. నిబంధనలకు విరుద్ధంగా విదేశీ కరెన్సీ రూపంలో ఇవ్వడంపై విచారణ క్రమంలో ఆయన ఈ అంశంపై స్పందించారు. గురువారం తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కలిసి మీడియాతో మాట్లాడారు. ఎన్ని కేసులు పెట్టినా.. కాంగ్రెస్ హామీలపై ప్రశ్నిస్తూనే ఉంటానని అన్నారు. 'రూ.లక్షల కోట్లు పెట్టుబడులు తెచ్చినందుకా?  బెంగళూరు కన్నా ఐటీ ఎగుమతులను పెంచినందుకా? ఇక్కడి యువతకు ఉద్యోగాలు కల్పించినందుకా? ఎందుకు కేసు పెడతావు. నేను జైలుకెళ్లేందుకైనా సిద్ధమే. జైల్లో పెడితే యోగా చేసి పాదయాత్రకు సిద్ధపడతాను. రాజ్‌భవన్‌లో కాంగ్రెస్, బీజేపీ ఒక్కటవుతున్నాయి. నన్ను విచారించేందుకు అనుమతివ్వడం గవర్నర్ విచక్షణపై ఆధారపడి ఉంటుంది. నాపై వచ్చిన ఆరోపణలపై విచారణ చేపడితే ఎదుర్కొంటాను. విశ్వనగరాల సరసన హైదరాబాద్‌ను చేర్చాలనే ఉద్దేశంతోనే ఫార్ములా - ఈ కారు రేసింగ్ ఏర్పాటు చేశాం.' అని పేర్కొన్నారు.

మంచి ఉద్దేశంతోనే..

'మొట్ట మొదటి కారు రేస్ 1894లో పారిస్‌లో జరిగింది. ఫార్ములా వన్ రేస్ మొదటి రేసు 1946లో ఇటలీలో జరిగింది. ఈ రేస్ నిర్వహించేందుకు దేశాలే పోటీ పడతాయి. ఏపీ సీఎం చంద్రబాబు కూడా 2003లో ఎఫ్1 రేసు హైదరాబాద్‌లో నిర్వహించాలని ప్రయత్నం చేశారు. ఎఫ్ 1 రేసు కోసం 2011లోనే దాదాపు రూ.1700 కోట్లు ఖర్చు చేశారు. రాజీవ్ గాంధీ హయాంలో 1984 ఏషియన్ గేమ్స్, అదే విధంగా కామన్వెల్త్ గేమ్స్ కూడా భారత్‌లో జరిగాయి. దీని కోసం యూపీఏ ప్రభుత్వం రూ.70,600 కోట్లు ఖర్చు చేసింది. ఇదే క్రీడల్లో యూపీఏ ప్రభుత్వం మొత్తానికి భారీగా కుంభకోణం చేసింది. ఎఫ్ 1 రేసు కోసం నేను కూడా ఎంతో ప్రయత్నం చేశాను. కానీ ఇండియాకు వచ్చే ఇంట్రెస్ట్ లేదని వాళ్లు చెప్పారు. ఫార్ములా రేసింగ్‌లో కూడా ఎలక్ట్రిక్ వెహికిల్స్‌తో చేసే రేసింగ్‌ను ఫార్ములా ఈ-రేస్ అంటారు. ఇది ప్రపంచంలోని అత్యంత గొప్ప నగరాల్లో జరుగుతోంది. ఆ స్థానంలో హైదరాబాద్ చేర్చాలని మేము ఈ-రేస్ ఇక్కడికి తెచ్చే ప్రయత్నం చేశాం. దీన్ని ఒక రేసింగ్‌గా మాత్రమే చూడలేదు. ఎలక్ట్రిక్ కార్లను ప్రమోట్ చేయాలనుకున్నాం.' అని పేర్కొన్నారు. 

'ఫార్ములా ఈ-రేస్, మొబిలిటీ వీక్ అనే కార్యక్రమం ద్వారా దాదాపు రూ. 2, 500 కోట్లు పెట్టుబడులు తెచ్చాం. నిర్వహణ సంస్థ, హెచ్ఎండీఏ, గ్రీన్ కో అనే మూడు సంస్థలతో ఒప్పందం చేసుకున్నాం. ప్రభుత్వానికి లాభం వచ్చినప్పటికీ గ్రీన్ కో సంస్థ మాత్రం తమకు లాభం రాలేదని పక్కకు తప్పుకొంది. దీంతో ఈ-రేస్ పోకుండా ఉండేందుకు ఆ డబ్బులను మేము ఇద్దామని అర్వింద్ గారికి చెప్పాను. వాళ్లకు స్పాన్సర్లు దొరక్కపోవటంతో ప్రమోటర్ దొరికే వరకు నేనే భరోసా ఉంటానని చెప్పాను. ప్రభుత్వం తరఫున ఆ డబ్బు ఇద్దామని చెప్పాను. హెచ్ఎండీఏకు తెలియకుండా మేము డబ్బులు ఇచ్చామని అంటున్నారు. కానీ హెచ్ఎండీఏకు పూర్తిగా తెలుసు. ఈ-రేస్‌ను మేము ప్రభుత్వం తరఫున కార్యక్రమంగా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచేందుకు రూ. 55 కోట్లు ఖర్చు చేశాం. ఇందులో అర్వింద్ కుమార్ గారి తప్పు ఏం లేదు. నేను ఈ మొత్తానికి బాధ్యత తీసుకుంటాను.' అని స్పష్టం చేశారు.

'సీఎంపైనే కేసు పెట్టాలి'

హైదరాబాద్ ఈ - రేస్‌ను రద్దు చేయటంతో జాగ్వార్, నిస్సాన్ లాంటి సంస్థల వాళ్లు సిగ్గుచేటని కేటీఆర్ అన్నారు. 'రేవంత్ రెడ్డి దిక్కుమాలిన నిర్ణయంతో ప్రపంచం ముందు హైదరాబాద్ ఇజ్జత్ పోయింది. మనకు రూ. 700 కోట్లు లాస్ వచ్చింది. నిజానికి హైదరాబాద్‌లో ఈ-రేస్ రాకుండా మన నగరం ఇమేజ్ దెబ్బ తీసినందుకు ఆయనపైనే కేసు పెట్టాలి. అవినీతి జరిగితే ఏసీబీని వాడాలి. కానీ ఇక్కడ అవినీతి ఏముంది? నాకు వచ్చింది ఏముంది?. నిజానికి కేసు పెట్టాలంటే మేఘా కంపెనీ మీద పెట్టాలి. రూ. 50 లక్షల బ్యాగుతో దొరికిన రేవంత్ రెడ్డిపై 8 ఏళ్లుగా ఎలాంటి చర్యలు లేవు. మేము బ్రాండ్ ఇమేజ్ క్రియేట్ చేస్తే నువ్వు బ్యాడ్ ఇమేజ్ చేస్తున్నావు. విశ్వనగరం ఇమేజ్ లేకుండా చేస్తే పెట్టుబడులు వస్తాయా? నువ్వు ఎన్ని అటెన్షన్ డైవర్షన్లు చేసిన మేము నీ హామీలపై పోరాటం చేస్తూనే ఉంటాం.' అని కేటీఆర్ అన్నారు.

Also Read: 2008 DSC Latest News: డీఎస్సీ-2008 అభ్యర్థులకు గుడ్ న్యూస్- రేపటి లోపు ప్రక్రియ పూర్తి

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Breaking News: ఎండలతో అల్లాడిపోతున్న తెలుగు ప్రజలకు చల్లటి కబురు! ఏపీ, తెలంగామలోని జిల్లాల్లో వర్షాలు!
ఎండలతో అల్లాడిపోతున్న తెలుగు ప్రజలకు చల్లటి కబురు! ఏపీ, తెలంగామలోని జిల్లాల్లో వర్షాలు!
IMD Weather Alert Telugu States 2026:తెలుగు రాష్ట్రాల ప్రజలకు హై అలర్ట్! వచ్చే 48 గంటల్లో అక్క డ భారీ వర్షాలు... ఐఎండీ కీలక ప్రకటన!
తెలుగు రాష్ట్రాల ప్రజలకు హై అలర్ట్! వచ్చే 48 గంటల్లో అక్క డ భారీ వర్షాలు... ఐఎండీ కీలక ప్రకటన!
Regional Sentiment politics: తెలంగాణలో మళ్లీ ప్రాంతీయ మంట - పవన్, చంద్రబాబులే టార్గెట్.. వ్యూహం ఎవరిది? ప్రజా స్పందన ఎలా ఉంది?
తెలంగాణలో మళ్లీ ప్రాంతీయ మంట - పవన్, చంద్రబాబులే టార్గెట్.. వ్యూహం ఎవరిది? ప్రజా స్పందన ఎలా ఉంది?
Revanth Reddy support to TDP cadre Telangana: రేవంత్ ఎన్టీఆర్ జపం - గ్రేటర్ ఎన్నికల లక్ష్యంగా మాస్టర్ ప్లాన్.. టీడీపీ ఓట్ బ్యాంక్‌పై కాంగ్రెస్ గురి!
రేవంత్ ఎన్టీఆర్ జపం - గ్రేటర్ ఎన్నికల లక్ష్యంగా మాస్టర్ ప్లాన్.. టీడీపీ ఓట్ బ్యాంక్‌పై కాంగ్రెస్ గురి!

వీడియోలు

RR vs GT IPL 2026 Preview | RR vs GT ఐపీఎల్ మ్యాచ్ ప్రివ్యూ
Archer Comments on Vaibhav Suryavanshi | వైభవ్ సూర్యవంశీ పై జోఫ్రా ఆర్చర్ కామెంట్స్
Bhuvneshwar Kumar Comments on Virat Kohli | విరాట్ పై భువి ఫన్నీ కామెంట్స్
Ashwin Angry Comments on SRH Defeat | SRH ప్లేయర్స్‌ పై అశ్విన్ తీవ్ర ఆగ్రహం
Ambati Rayudu Comments on Yashasvi Jaiswal | యశస్వి జైస్వాల్‌ కు రాయుడు సలహా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
DK Shivakumar Karnataka CM Challenges:కర్ణాటక సీఎంగా ప్రమాణం చేయనున్న డీకే శివకుమార్‌కు సవాళ్ల స్వాగతం! ట్రబుల్ షూటర్ వాటిని ఎలా పరిష్కరిస్తారు?
కర్ణాటక సీఎంగా ప్రమాణం చేయనున్న డీకే శివకుమార్‌కు సవాళ్ల స్వాగతం! ట్రబుల్ షూటర్ వాటిని ఎలా పరిష్కరిస్తారు?
IMD Weather Alert Telugu States 2026:తెలుగు రాష్ట్రాల ప్రజలకు హై అలర్ట్! వచ్చే 48 గంటల్లో అక్క డ భారీ వర్షాలు... ఐఎండీ కీలక ప్రకటన!
తెలుగు రాష్ట్రాల ప్రజలకు హై అలర్ట్! వచ్చే 48 గంటల్లో అక్క డ భారీ వర్షాలు... ఐఎండీ కీలక ప్రకటన!
DK Shivakumar Swearing In: కర్ణాటక కొత్త సీఎంగా డీకే శివకుమార్ జూన్ 3న ప్రమాణస్వీకారం! రానున్న ఢిల్లీ పెద్దలు!
కర్ణాటక కొత్త సీఎంగా డీకే శివకుమార్ జూన్ 3న ప్రమాణస్వీకారం! రానున్న ఢిల్లీ పెద్దలు!
Ajith Kumar : అజిత్ ఇంట్లో తీవ్ర విషాదం - తల్లి మోహిని కన్నుమూత
అజిత్ ఇంట్లో తీవ్ర విషాదం - తల్లి మోహిని కన్నుమూత
June 1 Rule Changes 2026:బిగ్ అలర్ట్! జూన్ 1 నుంచి మారే కీలక నియమాలు.. మీ జేబుపై నేరుగా ప్రభావం చూపే మార్పులు ఇవే!
బిగ్ అలర్ట్! జూన్ 1 నుంచి మారే కీలక నియమాలు.. మీ జేబుపై నేరుగా ప్రభావం చూపే మార్పులు ఇవే!
Peddi Pre Release Event: విజయవాడలో 'పెద్ది' ప్రీ రిలీజ్ ఈవెంట్... మెయిన్ గెస్ట్ నుంచి డేట్, వెన్యూ వరకు - ఫుల్ డీటెయిల్స్
విజయవాడలో 'పెద్ది' ప్రీ రిలీజ్ ఈవెంట్... మెయిన్ గెస్ట్ నుంచి డేట్, వెన్యూ వరకు - ఫుల్ డీటెయిల్స్
Ram Charan : రామ్ చరణ్‌కు చేతికి సర్జరీ - లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే?
రామ్ చరణ్‌కు చేతికి సర్జరీ - లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే?
Full Case Study: 22 బిలియన్ డాలర్ల కంపెనీ బైజూస్ పతనం వెనుక దిగ్భ్రాంతికర విషయాలు, కుండలిలో 3 వినాశకరమైన యోగాలు!
22 బిలియన్ డాలర్ల కంపెనీ బైజూస్ పతనం వెనుక దిగ్భ్రాంతికర విషయాలు, కుండలిలో 3 వినాశకరమైన యోగాలు!
Embed widget