అన్వేషించండి

YSRCP : వైఎస్ఆర్‌సీపీకి నాయకుల సమస్య - పార్టీ బాధ్యతలకునో ! తప్పెక్కడ జరిగింది ?

Andhra Pradesh : వైసీపీ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత నేతలు బయటకు రావడం లేదు. పార్టీ బాధ్యతలు తీసుకోవాలని సీనియర్లను జగన్ బతిమాలుకోవాల్సి వస్తోంది.

Leaders are not coming forward to take responsibility of YCP : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధులుగా భూమన కరుణాకర్ రెడ్డి, రోజాలతో పాటు యాంకర్ శ్యామలను నియమించారు. ఈ నియామకాలు చూసి వైసీపీ నేతల్లో చాలా మంది ఆశ్చర్యం వేసింది. పెద్ద నోరున్న కొడాలి నాని, అంబటి రాంబాబు, గుడివాడ అమర్నాథ్ సహా ఎంతో మంది నేతల్ని కాదని రాజకీయాల నుంచి విరమించుకుంటానని చెప్పి కుమారుడికి టిక్కెట్ ఇప్పించుకున్న భూమన కరుణాకర్ రెడ్డికి చాన్సివ్వడం వెనుక ఏ కారణాలు ఉన్నాయో చాలా మందికి అర్థం కాలేదు. ఇక యాంకర్ శ్యామల పార్టీ తరపున మాట్లాడితే సీరియస్ గా తీసుకునేవాళ్లు ఎవరు ఉంటారని.. ఆమెకు మరో బాధ్యత ఇచ్చినా బాగుండేదన్న వాదన కూడా ఉంది. ఇక రోజాను ఒప్పించడానికి నగరిలో ఆమె చెప్పిన వారందర్నీ పార్టీ నుంచి తొలగించాల్సి వచ్చింది. అంటే వీళ్లను ఒప్పించడానికి కూడా వైసీపీ హైకమాండ్ ఎంతో కష్టపడిందన్న మాట. 

ఉమ్మడి జిల్లాలకు అధ్యక్షులు నియమించే యోచన

ఇరవై ఆరు జిల్లాలకు అధ్యక్షులు ఉన్నారో లేరో తెలియని పరిస్థితి ఉంది. పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత జిల్లాలు, నియోజకవర్గాల్లో కనిపస్తున్న నేతలే కరవయ్యారు. దీంతో  మందు జిల్లాల పార్టీ సారధుల్ని మార్చుకుని.. ఉన్న వారిని యాక్టివ్ చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. చివరికి ఉమ్మడి చిత్తూరు జిల్లాకు  పెద్దిరెడ్డి ని ఖరారు చేశారు. ఆయన ఎప్పుడో మూడు దశాబ్దాల క్రితమేకాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా చేశారు. మళ్లీ ఇప్పుడు అదే పదవి అంటే ఆయన ఎంత ఉత్సాహంగా పనిచేస్తారో తెలియదు కానీ.. ఆయనను ఒప్పించడానికి కూడా తంటాలు పడాల్సి వచ్చిందని అంటున్నారు. ఇక నెల్లూరు .. కర్నూలు.. అనంతపురంసహా అన్నిజిల్లాల్లోనూ నాయకత్వ సమస్య ఉంది. కాస్త ప్రజల్లో పలుకుబడి ఉన్నవాళ్లను నియమించాలని జగన్ అనుకుంటున్నారు. 

హీరోయిన్ జెత్వానీ కేసులో అలా ఇర్కుకున్న ఐపీఎస్‌లు - సీరియస్ కేసులు తప్పవా ?

నియోజకవర్గాలకు కూడా రాని నేతలు

వైసీపీ తరపున పోటీ చేసి ఓడిపోయిన వారిలో సగంమందికిపైగా నియోజకవర్గాలకు వెళ్లడం లేదు. నియోజకవర్గాలు మారిన వారు.. తమకు  పాత నియోజకవర్గాలలే కావాలని అంటున్నారు. పోటీ చేసిన నియోజకవర్గాల్లో పని చేయడం లేదు. ఆ విషయంలో జగన్ ఎలాంటి స్పష్టత ఇవ్వడంలేదు. ఒక్క జోగి రమేష్ కు మాత్రం మళ్లీ మైలవరం బాధ్యతలు ఇచ్చారు. మిగతా వారు తమ విషయంలో మళ్లీ నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నారు. ఏమీ సమాధానం రాకపోవడంతో పని చేసుకునేవారు కూడా కరవయ్యారు. అంతే కాదు.. అనేక మంది నేతలు ఆజ్ఞాతంలోకి వెళ్లారు. అధికారంలో ఉన్నప్పుడు ఇష్టం వచ్చినట్లు గా  మాట్లాడిన వాళ్లు, తిట్లు తిట్టిన వారు భయంతో  దూరంగా ఉంటున్నారు.

వేణు స్వామిపై కేసు నమోదుకు కోర్టు - పట్టువదలని జర్నలిస్ట్ మూర్తి వల్లే !

ద్వితీయ శ్రేణి క్యాడర్ ఇంతా ఇతర పార్టీల వైపు 

మరోవైపు వైసీపీ ద్వితీయ శ్రేణి క్యాడర్ అంతా ఇతర పార్టీల వైపు వెళ్తోంది. జగన్ పిఠాపురం పర్యటనకు వెళ్తే పట్టు మని రెండు వందల మందిని కూడా జన సమీకరణ చేయలేకపోయారని అంటున్నారు. శ్రీకాకుళం నుంచి నెల్లూరు జిల్లా వరకు వైసీపీ క్యాడర్ అంతా కూటమి పార్టీల్లో ఎక్కడ చోటు దొరికితే అక్కడ చేరిపోదామనుకుంటున్నారు. అధికారంలో ఉన్నప్పుుడు వ్యవహరించిన విధానంతో తాము ఎక్కడ ఇప్పుడు అధికార పార్టీకి టార్గెట్ అవుతామో అన్న భయంతోనే ఎక్కువ మంది పార్టీకి  దూరమవుతున్నారు. అందుకే పార్టీని గాడిలో పెట్టుకోవాలంటే జగన్ చాలా కష్టపడాల్సి ఉంటుందన్న అభిప్రాయం వినిపిస్తోంది.   

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Chandrayaan 4 Mission: చందమామ మళ్లీ పిలుస్తున్నాడు, చంద్రయాన్ 4కి కేంద్ర కేబినెట్ ఆమోదం - మరిన్ని కీలక నిర్ణయాలు ఇవే
చందమామ మళ్లీ పిలుస్తున్నాడు, చంద్రయాన్ 4కి కేంద్ర కేబినెట్ ఆమోదం - మరిన్ని కీలక నిర్ణయాలు ఇవే
TPCC News: తెలంగాణ పీసీసీ చీఫ్ కీలక నిర్ణయం - సీఎం, మంత్రులకు కొత్త రూల్!
తెలంగాణ పీసీసీ చీఫ్ కీలక నిర్ణయం - సీఎం, మంత్రులకు కొత్త రూల్!
Free Gas Scheme: మహిళలకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్ - ఉచిత గ్యాస్ సిలిండర్లపై కీలక ప్రకటన
మహిళలకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్ - ఉచిత గ్యాస్ సిలిండర్లపై కీలక ప్రకటన
Kumari Aunty: సీఎం సహాయ నిధికి కుమారీ ఆంటీ విరాళం - ఎంత ఇచ్చారంటే?
సీఎం సహాయ నిధికి కుమారీ ఆంటీ విరాళం - ఎంత ఇచ్చారంటే?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

మోదీని త్వరలోనే కలుస్తా, అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలుఏపీలో బడి పంతులమ్మ, ఇప్పుడు ఢిల్లీ సీఎం - అతిషి గురించి ఈ ఆసక్తికర విషయాలు తెలుసా?రాహుల్‌ ఓ టెర్రరిస్ట్ అంటూ కేంద్రమంత్రి సంచలన వ్యాఖ్యలు, కాంగ్రెస్ ఆందోళనలుదేవర చెన్నై ప్రెస్ మీట్లో జాన్వీ కపూర్ స్పీచ్!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrayaan 4 Mission: చందమామ మళ్లీ పిలుస్తున్నాడు, చంద్రయాన్ 4కి కేంద్ర కేబినెట్ ఆమోదం - మరిన్ని కీలక నిర్ణయాలు ఇవే
చందమామ మళ్లీ పిలుస్తున్నాడు, చంద్రయాన్ 4కి కేంద్ర కేబినెట్ ఆమోదం - మరిన్ని కీలక నిర్ణయాలు ఇవే
TPCC News: తెలంగాణ పీసీసీ చీఫ్ కీలక నిర్ణయం - సీఎం, మంత్రులకు కొత్త రూల్!
తెలంగాణ పీసీసీ చీఫ్ కీలక నిర్ణయం - సీఎం, మంత్రులకు కొత్త రూల్!
Free Gas Scheme: మహిళలకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్ - ఉచిత గ్యాస్ సిలిండర్లపై కీలక ప్రకటన
మహిళలకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్ - ఉచిత గ్యాస్ సిలిండర్లపై కీలక ప్రకటన
Kumari Aunty: సీఎం సహాయ నిధికి కుమారీ ఆంటీ విరాళం - ఎంత ఇచ్చారంటే?
సీఎం సహాయ నిధికి కుమారీ ఆంటీ విరాళం - ఎంత ఇచ్చారంటే?
CM Revanth Reddy: 'ప్రతి ఒక్కరికీ ఉపాధి కల్పించడమే లక్ష్యం' - ఎంఎస్ఎంఈ నూతన పాలసీ విడుదల చేసిన సీఎం
'ప్రతి ఒక్కరికీ ఉపాధి కల్పించడమే లక్ష్యం' - ఎంఎస్ఎంఈ నూతన పాలసీ విడుదల చేసిన సీఎం
Telangana High Court: 15 రోజుల్లో బీఆర్‌ఎస్ ఆఫీస్ కూల్చేయండి- అధికారులకు హైకోర్టు ఆదేశం
15 రోజుల్లో బీఆర్‌ఎస్ ఆఫీస్ కూల్చేయండి- అధికారులకు హైకోర్టు ఆదేశం
One Nation One Election : జమిలీ ఎన్నికల దిశగా కేంద్రం మరో అడుగు - రామ్‌నాథ్ కోవింద్ కమిటీ నివేదికకు ఆమోదం - ఇక ఒక్క అడుగే
జమిలీ ఎన్నికల దిశగా కేంద్రం మరో అడుగు - రామ్‌నాథ్ కోవింద్ కమిటీ నివేదికకు ఆమోదం - ఇక ఒక్క అడుగే
Waqf Amendment Bill: వక్ఫ్‌ ఆస్తులపై వివాదం ఎందుకు, వక్ఫ్‌ అమెండ్‌మెంట్‌ -2024 లక్ష్యాలేంటి ?
వక్ఫ్‌ ఆస్తులపై వివాదం ఎందుకు, వక్ఫ్‌ అమెండ్‌మెంట్‌ -2024 లక్ష్యాలేంటి ?
Embed widget