అన్వేషించండి

చిత్తూరు జిల్లా వ్యాప్తంగా హైటెన్షన్- పోలీసులను పరామర్శించిన మంత్రి, శ్రీకాళహస్తిలో చంద్రబాబు టూర్

చిత్తూరు జిల్లా వ్యాప్తంగా హైటెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. ఇవాళ శ్రీకాళహస్తిలో చంద్రబాబు టూర్‌ ఉన్నందున అక్కడ అధికారులు, టీడీపీ నేతల మధ్య ఫ్లెక్సీల వార్‌ మొదలైంది.

పుంగనూరులో మొదలైన కాక చిత్తూరు జిల్లా మొత్తం వ్యాపించే కనిపిస్తోంది. జిల్లా వ్యాప్తంగా చాలా టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. శుక్రవారం జరిగిన ఘర్షణకు నిరసనగా వైసీపీ బంద్‌కు పిలుపునివ్వడంతో భారీగా భద్రతా ఏర్పాట్లు చేశారు పోలీసులు. 

చిత్తూరు బంద్‌కు పిలుపునిచ్చి వైసీపీ ఎక్కడికక్కడ చంద్రబాబు దిష్టిబొమ్మలు దహనం చేస్తోంది. టీడీపీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు నేతలు. ఉదయానికల్లా రోడ్లపైకి వచ్చిన వైసీపీ శ్రేణులు భారీగా ర్యాలీలు తీస్తూ టీడీపీ లీడర్లను హెచ్చరిస్తున్నారు. 

శ్రీకాళహస్తిలో ఇవాళ టీడీపీ అధినేత పర్యటన ఉన్నందున అక్కడ కూడా ఉద్రిక్తత పరిస్థితులు కనిపిస్తున్నాయి. టీడీపీ నేతలు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు అధికారులు తొలగించడంతో ఘర్షణ వాతావరణం ఏర్పడింది. అధికారులతో టీడీపీ లీడర్లు వాగ్వాదాననికి దిగారు. 

మరోవైపు శుక్రవారం నాటి ఘర్షణల్లో గాయపడిన పోలీసులను మంత్రి పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి పరామర్శించారు. ఆయనతోపాటు కలెక్టర్‌, ఎస్పీ కూడా ఈ విజిట్‌లో ఉన్నారు. కుప్పంలో ఓడిపోతున్నానే భయంతోనే చంద్రబాబు ఈ దాడులు చేయించారని ఆరోపించారు పెద్ది రెడ్డి. 

పుంగనూరు ఘటనపై స్పందించిన రాయలసీమ రేంజ్ ‌డిఐజీ అమ్మిరెడ్డి.. ఇది కచ్చితంగా అల్లరి మూకలు కావాలని చేసిందని ఆరోపించారు. మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటనలో పోలీసులపై జరిగిన దాడి చాలా బాధాకరం అన్నారు. 

పోలీసులపై దాడులకు పాల్పడిన వారు ఎంతటి వారైన ఉపేక్షించేది లేదని అమ్మిరెడ్డి హెచ్చరించారు. వారిపై చట్ట పరమైన చర్యలు తీసుకుంటామన్నారు. చంద్రబాబు ముందు ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం పుంగనూరులోనికి వచ్చే ఆలోచన లేదని అనుమతి కూడా లేదన్నారు. వారు ముందుగా ఇచ్చిన ప్లాన్ ప్రకారమే తాము 400 మంది సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేసామని తెలిపారు. 

ముందు చెప్పిన దాని ప్రకారం చంద్రబాబు పుంగనూరులోనికి రాకుండా హైవే పై చిత్తూరుకు వెళ్ళవలసి ఉందన్నారు అమ్మిరెడ్డి. శాంతి భద్రతలను దృష్టిలో ఉంచుకొని తగిన పోలీసు బందోబస్తుతో బ్యారికేడ్లు ఉంచామని తెలిపారు. కొంతమంది అల్లరి మూకలు దౌర్జన్యంగా పుంగనూరులోకి ప్రవేశించాలని ప్రయత్నించారని అందుకే గొడవ మొదలైందని వివరించారు. వారిని పోలీసులు ఆపడానికి ప్రయత్నించారు. కొంతమంది అల్లరిమూకలు ముందుగానే తెచ్చుకున్న బీర్ బాటిల్స్, కర్రలు, రాళ్ళతో పోలీసులపై దాడికి పాల్పడ్డారని తెలిపారు. 

సుమారు 2000 మంది అల్లరి మూకలు చాలా అమానవీయంగా దాడి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు అమ్మిరెడ్డి. ముందస్తు ప్రణాళికలో భాగంగానే పోలీసులపై దాడులు జరిగాయని ఆరోపించారు. వారిని అడ్డుకునే క్రమంలో మొదటగా బాష్ప వాయువు ప్రయోగించి లాఠీ ఛార్జ్ చేసినట్ట వివరించారు. లాఠీ ఛార్జ్ చేసినప్పటికీ అల్లరి మూకలు ఏ మాత్రం తగ్గకుండా పోలీసులపై ఇష్టమొచ్చినట్టు విచక్షణారహితంగా కర్రలు, రాళ్ళతో దాడి చేసి గాయపరిచారన్నారు. 

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు రోడ్ షోను పుంగనూరు పట్టణంలోకి రావద్దని తాము ఎక్కడ ఆదేశించలేదన్నారు అమ్మిరెడ్డి. వారిచ్చిన షెడ్యూలు ప్రకారమే చర్యలు తీసుకున్నామన్నారు. 50 మంది పోలీసులు రాళ్ల దాడిలో గాయపడ్డారని ప్రకటించారు. 13 మంది పోలీసు వారికి తీవ్ర గాయాలయ్యాయన్నారు. 2 పోలీసు వాహనాలను ధ్వంస చేసి వాటికి నిప్పు పెట్టారని వివరించారు. ఓ కానిస్టేబుల్ కన్ను పూర్తిగా దెబ్బతిందని ఆయన్ని ఎవరు బాగు చేస్తారని ప్రశ్నించారు. 

Also Read:పుంగనూరుకు ఎవరూ వెళ్లకూడదా ? ఏపీలో అదే అత్యంత సమస్యాత్మక నియోజకవర్గమా ?

Also Read: చంద్రబాబు పర్యటనలో విధ్వంసం- నేడు చిత్తూరు జిల్లా బంద్ కు వైసీపీ పిలుపు

Also Read:గూండాలతో, గన్‌లతో పుంగనూరుకి చంద్రబాబు! కేసు నమోదు చేయాలన్న మంత్రి పెద్దిరెడ్డి

Also Read:పుంగనూరులో ప్రీప్లాన్డ్ దాడులు - ఎంత పెద్ద వాళ్లున్నా వదిలి పెట్టబోమన్న ఎస్పీ రిషాంత్ రెడ్డి !

Also Read: పుంగనూరులో అరాచకం - చంద్రబాబుపై రాళ్ల దాడి ! పలు వాహనాలకు నిప్పు

Also Read: పుంగనూరులో చంద్రబాబు పర్యటనకు ముందు తీవ్ర ఉద్రిక్తత - టీడీపీ, వైసీపీ పరస్పర దాడులు! పోలీసుల లాఠీచార్జ్

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

MAVIGUN: అమరావతి కాదు.. MAVIGUN...! రాజధానిపై మా విజన్ ఇదే..  --జగన్
అమరావతి కాదు.. MAVIGUN...! రాజధానిపై మా విజన్ ఇదే.. !  
Tamil Nadu Assembly Elections 2026: స్టాలిన్ కన్నా ఉదయనిధి షో ఎక్కువ - ఈ ఎన్నికలతోనే డీఎంకే తదుపరి వారసత్వం ఖరారవుతుందా?
స్టాలిన్ కన్నా ఉదయనిధి షో ఎక్కువ - ఈ ఎన్నికలతోనే డీఎంకే తదుపరి వారసత్వం ఖరారవుతుందా?
Karimnagar Jeevan Reddy: బీఆర్ఎస్‌లో కేకే పదవి జీవన్ రెడ్డికి - కోడలికి టిక్కెట్ కూడా - సీనియర్‌కు తగ్గ డీలేనా?
బీఆర్ఎస్‌లో కేకే పదవి జీవన్ రెడ్డికి - కోడలికి టిక్కెట్ కూడా - సీనియర్‌కు తగ్గ డీలేనా?
Ippasara Anirudh Reddy: ఇప్పసారా రాజకీయం - అనిరుధ్ రెడ్డి హెల్తీ ప్రచారం వెనుక అసలు వ్యూహమేంటి?
ఇప్పసారా రాజకీయం - అనిరుధ్ రెడ్డి హెల్తీ ప్రచారం వెనుక అసలు వ్యూహమేంటి?

వీడియోలు

CSK Plays Without Dhoni in 17 Years IPL 2026 | ధోనీ, రైనా, జడేజా లేకుండా CSK మ్యాచ్ | ABP Desam
Jadeja Destroys CSK vs RR IPL 2026 | ఒకే ఓవర్‌లో రెండు వికెట్లు తీసిన జడేజా | ABP Desam
IPL 2026 RR VS CSK Highlights | చెన్నైపై రాజ‌స్థాన్ ఈజీ విక్ట‌రీ | ABP Desam
Vaibhav Suryavanshi RR vs CSK IPL 2026 | వైభవ్ కు సలహా ఇచ్చిన జైస్వాల్ | ABP Desam
Rohit Suggestions to Hardik IPL 2026 | హిట్ మ్యాన్ వ్యూహంతో ముంబై విజయం | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Anirudh Reddy Controversies: కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్‌ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యల మోటో ఏంటీ?
కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్‌ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యల మోటో ఏంటీ?
Fuel Price Hike:భారత్‌లో రెండు నెలలకు సరిపడా చమురు నిల్వలు!సామాన్యులపై భారం వేసే ఆలోచన లేదు!కేంద్రం కీలక ప్రకటన 
భారత్‌లో రెండు నెలలకు సరిపడా చమురు నిల్వలు!సామాన్యులపై భారం వేసే ఆలోచన లేదు!కేంద్రం కీలక ప్రకటన 
Spain vs USA: అమెరికాపై స్పెయిన్ ఆగ్రహం! రెండోసారి మోసం చేయలేరని కామెంట్! గగనతలాన్ని వాడుకోవద్దని సూచన!
అమెరికాపై స్పెయిన్ ఆగ్రహం! రెండోసారి మోసం చేయలేరని కామెంట్! గగనతలాన్ని వాడుకోవద్దని సూచన!
AP Capital Amaravati: ఏపీకి శాశ్వత రాజధానిగా అమరావతి.. లోక్‌సభలో పెమ్మసాని, పురంధేశ్వరి
ఏపీకి శాశ్వత రాజధానిగా అమరావతి.. లోక్‌సభలో పెమ్మసాని, పురంధేశ్వరి
Oracle Layoffs: భారీ లాభాలు వచ్చినా 30వేల మందిని ఒక్క రోజే తీసేసిన ఒరాకిల్ -సాఫ్ట్‌వేర్ రంగంలో గగ్గోలు!
భారీ లాభాలు వచ్చినా 30వేల మందిని ఒక్క రోజే తీసేసిన ఒరాకిల్ -సాఫ్ట్‌వేర్ రంగంలో గగ్గోలు!
US Iran War: త్వరలో ఇరాన్‌తో యుద్ధం ముగిస్తాం.. మాకు ఏ డీల్ అవసరం లేదు: డొనాల్డ్ ట్రంప్
త్వరలో ఇరాన్‌తో యుద్ధం ముగిస్తాం.. మాకు ఏ డీల్ అవసరం లేదు: డొనాల్డ్ ట్రంప్
Anirudh Reddy: డ్రగ్స్‌ ఆరోపణల్లో కొత్త ట్విస్ట్... అనిరుధ్ రెడ్డికి రాహుల్ రామకృష్ణ ఛాలెంజ్, విష్ణు మంచు కూడా!
డ్రగ్స్‌ ఆరోపణల్లో కొత్త ట్విస్ట్... అనిరుధ్ రెడ్డికి రాహుల్ రామకృష్ణ ఛాలెంజ్, విష్ణు మంచు కూడా!
Polavaram Project: ఏపీకి గుడ్‌న్యూస్.. పోలవరం ప్రాజెక్టుకు మరో రూ.1,301 కోట్ల నిధులు విడుదల, రైతులకు ప్రయోజనం
ఏపీకి గుడ్‌న్యూస్.. పోలవరం ప్రాజెక్టుకు మరో రూ.1,301 కోట్ల నిధులు విడుదల, రైతులకు ప్రయోజనం
Embed widget