అన్వేషించండి

KTR: 'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఆ లక్ష్యంతోనే కార్ రేస్ నిర్వహించామని కేటీఆర్ రియాక్షన్

Telangana News: ఈ ఫార్ములా కార్ రేస్ వ్యవహారం అసలేమీ లేదని.. కావాలనే ప్రభుత్వం రాద్ధాతం చేస్తోందని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. అసెంబ్లీ చర్చ పెట్టే దమ్ము సీఎం రేవంత్‌కు లేదని ఎద్దేవా చేశారు.

KTR Comments On Formula Car Race Issue: తెలంగాణలో ఈ ఫార్ములా కార్ రేస్ (E Formula Car Race) వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది. చంద్రబాబు ఉమ్మడి ఏపీ సీఎంగా ఉన్నప్పుడే హైదరాబాద్‌లో ఫార్ములా రేస్ 1 కోసం ప్రయత్నాలు చేశారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) తెలిపారు. ఇందుకోసం గోపన్‌పల్లిలో 580 ఎకరాల భూ సేకరణకు ప్రయత్నాలు చేశారని అన్నారు. అయితే, 2004లో ఓడిపోవడంతో కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని పక్కన పెట్టిందని చెప్పారు. తనపై ఏసీబీ కేసు నమోదు నేపథ్యంలో తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. 

దేశంలో రేసుల కోసం పోటీ ఎప్పటి నుంచో ఉందన్నారు. ఈ కేసులో ఏమీ లేదని.. అసెంబ్లీలో చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదని కేటీఆర్ మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలు ఈ కార్ రేసు కోసం పోటీ పడ్డాయని అన్నారు. 'హైదరాబాద్‌ను ఇన్నోవేషన్, రీసెర్చ్, మ్యానుఫాక్చరింగ్ హబ్ కావాలనే ఉద్దేశంతోనే ఈ కార్ రేస్ నిర్వహించాం. తాము తొలుత ఫార్ములా - 1తో సంప్రదిస్తే వారు రామన్నారు. ఎన్నో తంటాలు పడి ఒప్పించాం. 2023లో ఫిబ్రవరిలో మేము నిర్వహించిన రేస్ చూసి కేంద్ర మంత్రులు, బడా పారిశ్రామిక వేత్తలు సైతం మెచ్చుకున్నారు. రేవంత్ సర్కార్ కుంభకోణం, లంబకోణం అని కేబినెట్‌లో ఏదో సాధించినట్లు లీకులిస్తున్నారు.' అని కేటీఆర్ మండిపడ్డారు.

'అదే లక్ష్యంతో రేస్ నిర్వహించాం'

'నగరంలో ఈ కార్ రేస్ జరపాలని ఎన్నో ప్రయత్నాలు జరిగాయి. 4 కోట్ల ప్రజల మధ్య ఈ అంశంపై చర్చ పెట్టాలని అసెంబ్లీ స్పీకర్‌ను కోరాను. ఫార్ములా ఈ కార్ రేస్ అంశంపై చర్చించే సత్తా ప్రభుత్వానికి లేదు. అక్రమాలు చేశామని సర్కారు అంటోంది. అవి నిరూపించకుండా లీకులిస్తూ ఆరోపణలు చేస్తున్నారు. ఫార్ములా 1 రేస్ ట్రాక్ కోసం గోపన్‌పల్లిలో భూసేకరణ జరిగింది. అక్కడ సీఎం రేవంత్‌రెడ్డికి కూడా 15 ఎకరాల భూమి ఉంది. ఎఫ్ 1 చుట్టూ నగరాల అభివృద్ధి ఆధారపడి ఉంది. ఈవీ పాలసీ తేవాలి. భవిష్యత్ అంతా ఎలక్ట్రిక్ వాహనాలదే అవుతుందన్న ఉద్దేశంతో ఫార్ములా ఈ కార్ రేస్ పెట్టాలని నిర్ణయించాం. ముందుచూపుతో ప్రభుత్వాలు కొన్ని కార్యక్రమాలు చేస్తాయి. చేయాలి. ఈ కార్ రేసింగ్ క్రెడిట్ పొందేందుకు బీజేపీ కూడా ప్రయత్నించింది. కేంద్రం సహకారంతోనే ఈ కారు రేసింగ్ జరుగుతోందని కిషన్ రెడ్డి అన్నారు. సచిన్, ఆనంద్ మహీంద్రాతో పాటు దేశంలోని చాలామంది ప్రముఖులు ఈ కార్ రేసింగ్‌ను ప్రశంసించారు. క్రికెటర్లు, బాలీవుడ్ ప్రముఖులను ఈ కార్ రేసింగ్ ఆకర్షించింది. ప్రైవేట్ వ్యక్తులు, ప్రభుత్వం కలిపి ఈ రేస్ కోసం పెట్టిన ఖర్చు రూ.150 కోట్లు అయితే, దాదాపు రూ.750 కోట్ల ఆదాయం వచ్చింది.' అని కేటీఆర్ వివరించారు.

'లగచర్ల చరిత్రలో నిలిచిపోతుంది'

తెలంగాణ చరిత్రలో లగచర్ల పేరు నిలిచిపోతుందని కేటీఆర్ అన్నారు. 'లగచర్ల కేసులో జైలు నుంచి విడుదలైన నరేందర్ రెడ్డి, 28 మంది రైతులకు శుభాకాంక్షలు. ఓ నిరంకుశ, మూర్ఖపు ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా వారు చేసిన పోరాటం తప్పకుండా చరిత్రలో నిలిచిపోతుంది. లగచర్ల పేరు ఎప్పటికీ మర్చిపోరు. న్యాయవ్యవస్థ ద్వారా లభించిన ఈ విజయం కొడంగల్ రైతుల విజయం. మానసికంగా ఎంత చిత్రవధ చేసినా ఈ రోజు బెయిల్ సాధించుకొచ్చారు. నరేందర్ రెడ్డికి ఎన్ని అనారోగ్య సమస్యలున్నా రైతులను కాపాడాలని కోరారు.' అని కేటీఆర్ పేర్కొన్నారు.

Also Read: Case On KTR: ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 - నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీ కేసులు

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ప్రముఖ నేషనల్ మీడియా సంస్థ ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. పొలిటికల్, లైఫ్ స్టైల్, హెల్త్, డివోషనల్, ఎంటర్టైన్మెంట్, అగ్రికల్చర్, ఆస్ట్రాలజీ, స్పోర్ట్స్ వార్తలతో పాటు స్పెషల్ స్టోరీలు కూడా రాశారు. ప్రస్తుతం గత రెండున్నరేళ్ల నుంచి సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా వర్క్ చేస్తున్నారు.

Read More
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Harish Rao vs Revanth Reddy: హరీష్ రావుకు చెక్ పెట్టేందుకు రేవంత్ రెడ్డి మాస్టర్ ప్లాన్.. సిద్దిపేటకు మంత్రి పదవి ఆఫర్
హరీష్ రావుకు చెక్ పెట్టేందుకు రేవంత్ రెడ్డి మాస్టర్ ప్లాన్.. సిద్దిపేటకు మంత్రి పదవి ఆఫర్
Jeevan Reddy: ఈ 25న కాంగ్రెస్‌కు జీవన్ రెడ్డి రాజీనామా.. జగిత్యాలలో మారనున్న రాజకీయ ముఖచిత్రం
ఈ 25న కాంగ్రెస్‌కు జీవన్ రెడ్డి రాజీనామా.. జగిత్యాలలో మారనున్న రాజకీయ ముఖచిత్రం
Narendra Modi Tenure: ప్రధాని మోదీ అరుదైన ఘనత.. అత్యధిక కాలం ప్రభుత్వ అధినేతగా రికార్డ్- టాప్ 5 లిస్ట్ ఇదే
ప్రధాని మోదీ అరుదైన ఘనత.. అత్యధిక కాలం ప్రభుత్వ అధినేతగా రికార్డ్- టాప్ 5 లిస్ట్ ఇదే
Congress Jeevan Reddy: జీవన్ రెడ్డిని బుజ్జగించిన మంత్రులు -తగ్గని సీనియర్ నేత - 25న గుడ్ బై?
జీవన్ రెడ్డిని బుజ్జగించిన మంత్రులు -తగ్గని సీనియర్ నేత - 25న గుడ్ బై?

వీడియోలు

Madhu Park Ridge Issue Updates | బండ్లగూడ కూల్చివేతలు గాంధీ సరోవర్ కోసం కాదు.!
Ashwin Predicts RCB to Win IPL 2026 | ఆర్‌సీబీపై అశ్విన్ ఆసక్తికర విశ్లేషణ
Tilak Varma about Mega Family | మెగాస్టార్ పై తిలక్ వర్మ ఎమోషనల్ కామెంట్స్
Mohammad Kaif Warns Gujarat Titans | గుజరాత్ టైటాన్స్‌కు మహమ్మద్ కైఫ్ వార్నింగ్
Ishan Kishan SRH Practice Match | ఇషాన్ కిషన్‌పై యువ బౌలర్ ఫైర్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Iran US War Updates: శత్రువులపై నిషేధం.. మిత్ర దేశాలపై హర్మూజ్‌లో ఆంక్షలు లేవు: ట్రంప్ హెచ్చరికపై ఇరాన్ అధ్యక్షుడు
శత్రువులపై నిషేధం.. మిత్ర దేశాలపై హర్మూజ్‌లో ఆంక్షలు లేవు: ట్రంప్ హెచ్చరికపై ఇరాన్ అధ్యక్షుడు
CM Chandrababu: ఒక సామాన్యుడికి సీఎం చంద్రబాబు భరోసా.. చర్మకారుడి కుటుంబంలో సరికొత్త వెలుగులు
ఒక సామాన్యుడికి సీఎం చంద్రబాబు భరోసా.. చర్మకారుడి కుటుంబంలో సరికొత్త వెలుగులు
ArcelorMittal Nippon Steel Plant: రేపే అనకాపల్లి స్టీల్ ప్లాంట్‌కి శంకుస్థాపన.. రూ.1.5 లక్షల కోట్లతో AM/NS ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్
రేపే అనకాపల్లి స్టీల్ ప్లాంట్‌కి శంకుస్థాపన.. 1.5 లక్షల కోట్లతో AM/NS ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్
Moinabad Farmhouse Case: మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో కీలక పరిణామం.. వీకెండ్ పార్టీలకు 20 సార్లు డ్రగ్స్ సరఫరా!
మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో కీలక పరిణామం.. వీకెండ్ పార్టీలకు 20 సార్లు డ్రగ్స్ సరఫరా!
Simhadri Express Train: సింహాద్రి ఎక్స్ ప్రెస్ ప్రయాణికులకు ఊరట.. ట్రైన్ లో మార్పులు చేసిన రైల్వే
సింహాద్రి ఎక్స్ ప్రెస్ ప్రయాణికులకు ఊరట.. ట్రైన్ లో మార్పులు చేసిన రైల్వే
SRH Playing 11: ట్రావిస్ హెడ్- అభిషేక్ శర్మ ఓపెనింగ్.. సన్‌రైజర్స్ ప్లేయింగ్ XI ఇలా ఉండవచ్చు
ట్రావిస్ హెడ్- అభిషేక్ శర్మ ఓపెనింగ్.. SRH ప్లేయింగ్ XI ఇలా ఉండవచ్చు
World Happiness Report : ఇండియాలో జనాలు సంతోషంగా లేరట.. తాజా రిపోర్ట్​లో ఇంట్రెస్టింగ్ విషయాలు, టాప్​లో ఉన్న దేశమిదే
ఇండియాలో జనాలు సంతోషంగా లేరట.. తాజా రిపోర్ట్​లో ఇంట్రెస్టింగ్ విషయాలు, టాప్​లో ఉన్న దేశమిదే
CM Revanth Reddy: సిద్దిపేట జిల్లాలో ఆయిల్ పాం ఫ్యాక్టరీ ప్రారంభం సహా 775 కోట్ల పనులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం
సిద్దిపేట జిల్లాలో ఆయిల్ పాం ఫ్యాక్టరీ ప్రారంభం సహా 775 కోట్ల పనులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం
Embed widget