అన్వేషించండి
Paris Olympics 2024: తొలి విజయం సాధిస్తూ, పతక ఆశలు నిలుపుతూ
Olympic Games Paris 2024: ఈసారి భారత్కు పతక అవకాశం ఉన్న క్రీడల్లో అంచనాలను అందుకుంటూ భారత జట్లు శుభారంభం చేశాయి. ఒకవైపు భారత హాకీ జట్టు , మరోవైపు బ్యాడ్మింటన్ డబుల్స్లో తొలి విజయం అందుకున్నాయి.
తొలి విజయం సాధించిన బ్యాడ్మింటన్ డబుల్స్ జోడీ , భారత హాకీ జట్టు
1/7

ఒలింపిక్స్లో భారత హాకీ జట్టు శుభారంభం చేసింది. చివరి నిమిషం ఉత్కంఠ ఊపేసిన మ్యాచ్లో కీలక విజయాన్ని సాధించింది.
2/7

భారత కెప్టెన్ హర్మన్ప్రీత్ సింగ్ చివరి నిమిషాల్లో గోల్ చేయడంతో భారత్ హాకీ జట్టు ఈ విశ్వ క్రీడల్లో తొలి విజయాన్ని అందుకుంది. న్యూజిలాండ్పై 3-2 తేడాతో విజయం సాధించింది.
3/7

తొలుత న్యూజిలాండ్ తరఫున సామ్ లేన్ తొలి గోల్ చేయగా కాసేపటికే మన్దీప్ సింగ్ గోల్చేసి స్కోరును సమం చేశాడు. ఆ తర్వాత న్యూజిలాండ్కు చెందిన సైమన్ చైల్డ్ గోల్ చేయగా భారత్ కీలక ఆటగాడు వివేక్ సాగర్ ప్రసాద్ స్కోరును సమం చేశాడు.
4/7

59వ నిమిషంలో హర్మన్ప్రీత్ సింగ్ పెనాల్టీ కార్నర్ను గోల్గా మలచి భారత్కు విజయాన్ని అందించాడు.
5/7

మరోవైపు బ్యాడ్మింటన్ డబుల్స్లో భారత జోడీ సాత్విక్-చిరాగ్ శెట్టి 21-17, 21-14 తేడాతో ఫ్రాన్స్కు చెందిన రొనాన్ లాబర్, లూకర్ కోర్వీ జోడీపై విజయం సాధించింది.
6/7

. తొలి సెట్లో భారత జోడికి కాస్త పోటీనిచ్చిన ఫ్రాన్స్ జోడీ, రెండో సెట్లో మాత్రం చేతులెత్తేసింది.
7/7

వరుసగా రెండు సెట్లు గెలుచుకుని భారత డబుల్స్ జోడి తదుపరి రౌండ్కు అర్హత సాధించింది.
Published at : 28 Jul 2024 08:49 AM (IST)
వ్యూ మోర్
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion





















