ఢిల్లీ నుంచి వచ్చిన ప్రత్యేక విమానంలో రేణిగుంట విమానాశ్రయానికి వచ్చారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా.
కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు సీఎం వైఎస్ జగన్, మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు స్వాగతం పలికారు.
రోడ్డు మార్గం గుండా కేంద్ర హోంమంత్రి, సీఎం జగన్ తిరుమలకు చేరుకున్నారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకుంటారు.
స్వామి వారి దర్శనం అనంతరం తాజ్ హోటల్లో బస చేసి ఆదివారం మధ్యాహ్నం దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో అమిత్ షా పాల్గొననున్నారు.
ఆదివారం ఉదయం నెల్లూరులోని స్థానిక కార్యక్రమాల్లో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుతో కలిసి అమిత్ షా పాల్గొననున్నారు.
సదరన్ జోనల్ సమావేశంలో రాష్ట్రాల మధ్య సహకారం, వివాదాలు, సరిహద్దు సమస్యలు, అంతర్గత భద్రత, మౌలిక సదుపాయాలు, పరిశ్రమలు, పర్యాటక అభివృద్ధి, పెండింగ్ అంశాలు, ఆర్థికాభివృద్ధి, ఎగుమతులు, కేంద్ర రాష్ట్రాల మధ్య సహకారం వంటి అంశాలపై చర్చించనున్నారు.
ఈ సమావేశంలో పాల్గొనే రాష్టాలకు సంబంధించిన 48 అంశాలపై చర్చ జరిగే అవకాశం ఉంది. దేశాభివృద్ధిలో రాష్ట్రాల భాగస్వామ్యం మరింత పెరిగేందుకు తీసుకోవాల్సిన చర్యలపై కేంద్ర హోంమంత్రి సూచనలు చేయనున్నారు.
In Pics : దిల్లీలో ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం
Kishan Reddy : ఏపీలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి టూర్, పింగళి కుటుంబ సభ్యులకు సన్మానం
In Pics: భద్రాచలంలో చంద్రబాబు పర్యటన, గత స్మృతులను గుర్తుకు తెచ్చుకున్న టీడీపీ అధినేత
CM Jagan Tour: కేంద్రం చేతిలో పని కాబట్టే ఆగుతున్నాం- లేకుంటే ఎప్పుడో చెల్లించేవాళ్లం-పోలవరం ముంపు ప్రాంతాల ప్రజలతో సీఎం జగన్
In Pics : కోనసీమ జిల్లాలో వరద బాధితులకు సీఎం జగన్ ఓదార్పు
Nikhat Zareen Gold Medal : నిఖత్ జరీన్ కు సీఎం కేసీఆర్ ఫోన్, స్వర్ణ పతకం సాధించడంపై సంతోషం వ్యక్తం
CM Jagan : వ్యవసాయం, విద్యా రంగాలకు అత్యంత ప్రాధాన్యత- సీఎం జగన్
Nikhat Zareen Wins Gold: తెలంగాణ అమ్మాయి పంచ్ పవర్ - బాక్సర్ నిఖత్కు స్వర్ణం
Shruti Haasan: నాకోసం అమ్మ నాన్న ఎవరికీ ఫోన్లు చేయలేదు - కష్టం ఎవరికైనా ఒకటే: శ్రుతిహాసన్