అన్వేషించండి
PM Kisan Yojana : రైతులకు పీఎం కిసాన్ యోజన 21వ విడత కోసం ఎదురుచూపులు! ఖాతాలో డబ్బులు ఎప్పుడు పడొచ్చంటే!
PM Kisan Yojana 21st installment: పీఎం కిసాన్ యోజన లబ్ధిదారులకు 21వ విడత త్వరలో విడుదల కావచ్చు. తాజా సమాచారం కోసం చూడండి.
కేంద్ర ప్రభుత్వం రైతుల సహాయం కోసం అనేక పథకాలు అమలు చేస్తోంది. దేశంలో చాలా మంది రైతులు వ్యవసాయం ద్వారా ఎక్కువ ఆదాయం సంపాదించలేకపోతున్నారు. అలాంటి పేద, చిన్న రైతులకు ఆర్థిక సహాయం అందించడానికి ప్రభుత్వం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనను అమలు చేస్తోంది.
1/6

ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద రైతులకు ఏడాదికి మూడుసార్లు ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తుంది. ఈ పథకం రైతుల ఆర్థిక పరిస్థితిని బలోపేతం చేయడానికి ప్రారంభించారు. ప్రభుత్వం ప్రతి నాలుగు నెలలకు ఒకసారి రైతుల ఖాతాలో 2000 రూపాయలు పంపుతుంది.
2/6

దీనితో సంవత్సరానికి మొత్తం 6000 రూపాయల సహాయం అందుతుంది. ఈ డబ్బు నేరుగా బ్యాంకు ఖాతాలో DBT ద్వారా బదిలీ చేస్తున్నారు. ఇప్పటివరకు పథకం 20 వాయిదాలు ఖాతాల్లో వేశారు. రైతులు ఇప్పుడు 21వ వాయిదా కోసం ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం త్వరలో దీని తేదీని ప్రకటించవచ్చు.
Published at : 30 Oct 2025 07:05 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion






















