అన్వేషించండి

5 Years Demonetisation : నోట్ల రద్దుకు ఐదేళ్లు ! నగదు చెలామణి తగ్గిందా ? బ్లాక్ మనీ బయటకు వచ్చిందా ?

నోట్ల రద్దు నిర్ణయం తీసుకుని ఐదేళ్లయింది. బ్లాక్ మనీ బయటకు వచ్చిందో లేదో స్పష్టత లేదు. నగదు చెలామణి మాత్రం తగ్గలేదు. అసలు నోట్ల రద్దు వల్ల ఏం ప్రయోజనం కలిగిందో ఎవరూ చెప్పడం లేదు.


ఐదేళ్ల క్రితం నవంబర్ 8వ తేదీని దేశంలో వంద కోట్ల మంది జనం మర్చిపోలేరు. ఒక వేళ తేదీని మర్చిపోయినప్పటికీ ఆ రోజున ప్రధానమంత్రి నరేంద్రమోడీ తీసుకున్న నిర్ణయం కారణంగా ఏర్పడిన పరిస్థితుల్లో తాము పడిన వేదన, ఆవేదన, పరిస్థితులను ఎప్పటికీ మర్చిపోరు. ఆ నిర్ణయం డిమానిటైజేషన్. పెద్ద నోట్ల రద్దు. బ్లాక్ మనీని అరికట్టడానికి అని.. నగదు చెలామణి తగ్గించడానికి అని ప్రభుత్వం చెప్పింది. దీర్ఘ కాలంలో ఫలితాలు ఉంటాయని చెప్పింది. ఇప్పటికి ఐదేళ్లయింది. మరి డిమానిటైజేషన్ ఫలితాలు కనిపిస్తున్నాయా ? ప్రజలకు ఆ ఫలాలను అనుభవిస్తున్నారా ?
5 Years Demonetisation : నోట్ల రద్దుకు ఐదేళ్లు ! నగదు చెలామణి తగ్గిందా ? బ్లాక్ మనీ బయటకు వచ్చిందా ?

Also Read : ఇక "ప్రొ బీజేపీ" కాదు ! "పెట్రో పన్నుల" రాజకీయంతో వైఎస్ఆర్‌సీపీ, టీఆర్ఎస్ ఇస్తున్న సంకేతం ఇదేనా ?

 బ్లాక్‌మనీ అంతానికే నోట్ల రద్దు అని మొదట్లో ప్రకటన ! మరి లక్ష్యం నెర వేరిందా ? 
  
పెద్ద నోట్ల రద్దు చేసినప్పుడు రూ. వెయ్యి, రూ. ఐదు వందల నోట్ల రూపంలో ఉన్న నల్లధనాన్ని పెద్దలు దాచుకున్నారని... వాటన్నింటినీ వెలికి తీస్తామని ప్రభుత్వం ప్రకటించింది. పెద్ద నోట్లు రద్దు చేసినందున ప్రతి ఒక్కరూ తమ వద్ద ఉన్న నగదును బ్యాంకుల్లో జమ చేస్తారు. అప్పుడు బ్లాక్ మనీ లెక్కలు బయటకు వస్తాయని ప్రభుత్వం భావించింది. ఆ సమయంలో సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్లపై విచారణలో రూ. మూడు లక్షల కోట్ల వరకూ బ్లాక్ మనీ ఉంటుందని అవి బ్యాంకులకు తిరిగి రావని చెప్పింది. రూ. 15 లక్షల కోట్ల పెద్ద నోట్లు ఉంటే.. రూ. 12 లక్షల కోట్లు మాత్రమే వస్తాయని  లెక్కలు చెప్పింది. కానీ ఆ తర్వాత రిజర్వ్ బ్యాంక్ ప్రకటించిన వివరాల ప్రకారం నోట్లు రద్దు చేసిన రోజు దేశంలో ఉన్న పెద్ద నోట్ల విలువ రూ.15 లక్షల 41వేల కోట్లు. బ్యాంకులకు తిరిగి వచ్చిందిరూ. 15 లక్షల 31వేల కోట్లు. అంటే..99.3 శాతం తిరిగి వచ్చాయి.
5 Years Demonetisation : నోట్ల రద్దుకు ఐదేళ్లు ! నగదు చెలామణి తగ్గిందా ? బ్లాక్ మనీ బయటకు వచ్చిందా ?

Also Read : ప్రపంచంలో ఎక్కువగా ఆరాధించే నాయకుల్లో ముందు వరుసలో మోడీ.. ఆ తర్వాతి స్థానాల్లో..

బ్లాక్ మనీ లేదా అఫీషియల్‌గా బ్లాక్ మనీని వైట్‌గా మార్చుకున్నారా ? 

దేశంలో డబ్బంతా బ్యాంకులకు చేరింది. కానీ నల్లధనం ఎంత అనేదనిపై స్పష్టత లేదు. బ్యాంకుల్లో డిపాజిట్ అయినంత మాత్రాన అంతా న్యాయబద్ధమైన డబ్బులు కాదని అందులోనే నల్లధనం ఉంది.. పట్టుకుంటామని కేంద్రం ప్రకటించింది. కానీ  ఐదేళ్లు గడిచినా ఆ నల్లధనం ఎంత అనేదానిపై స్పష్టత లేదు. ఎంత నల్లధనాన్ని పట్టుకున్నారు..?.  ఎవర్ని పట్టుకున్నారు..? ఫలానా వాళ్లు బ్లాక్‌మనీ డిపాజిట్ చేశారని గుర్తించారా..? అన్న అంశాలపై స్పష్టత లేదు. దేశంలో బ్లాక్ మనీ లేదని ఎవరూ నమ్మరు .. ఎందుకంటే ఇప్పటికీ లెక్కలు లేకుండా లావాదేవీలు జరిగిపోతున్నాయి. ఎన్నికల్లో వందల కోట్లు ఖర్చు పెడుతున్నారు. రాజకీయ పార్టీలకు లెక్కలు లేకుండా కోట్ల విరాళాలు ఇస్తున్నారు.  అంటే బ్లాక్ మనీని అధికారికంగా వైట్ చేసుకున్నారు. వారిని ప్రభుత్వం పట్టుకోలేకపోయింది.
5 Years Demonetisation : నోట్ల రద్దుకు ఐదేళ్లు ! నగదు చెలామణి తగ్గిందా ? బ్లాక్ మనీ బయటకు వచ్చిందా ?

Also Read: Delhi Air Pollution: దిల్లీలో డేంజర్ బెల్స్.... కాలుష్యంతో తగ్గిపోతున్న ఆయుష్షు... వైద్య నిపుణుల వెల్లడి

డిజిటల్ లావాదేవీలే కాదు నగదు చెలామణి కూడా పెరిగింది ! 

నోట్ల రద్దు సమయంలో కేంద్ర ప్రభుత్వం ఎక్కువగా నగదు చెలామణి ఉండటం వల్ల నల్లధనం పెరిగిందని అందుకే నగదు చెలామణిని తగ్గించడానికి నోట్ల రద్దు చేశామని తెలిపింది.  నిజానికి ప్రజల నగదు చెలామణి ఐదేళ్లలో ఏ మాత్రం తగ్గలేదు సరి కదా.. యాభై శాతం పెరిగింది. నవంబర్ 4, 2016న రూ.17.97 లక్షల కోట్లుగా ఉన్న ప్రజల వద్ద ఉన్న కరెన్సీ,  అక్టోబర్‌ 8, 2021 నాటికి  రూ. 28.30 లక్షల కోట్లకు చేరుకుంది. ఈ లెక్కన చూస్తే ఈ పెంపు ఏకంగా 57.48 శాతం ఉంది. అంటే.. నోట్ల రద్దు ముందు కన్నా  ఎప్పుడే ఎక్కువ నోట్లు చెలామణిలో  ఉన్నాయి. నగదు చెలామణి తగ్గిస్తామని నోట్లు రద్దు చేస్తే ఆది కాస్తా.. ఇవాళ ఎక్కవయింది.
5 Years Demonetisation : నోట్ల రద్దుకు ఐదేళ్లు ! నగదు చెలామణి తగ్గిందా ? బ్లాక్ మనీ బయటకు వచ్చిందా ?

Also Read : భారత ప్రధాని మోదీకి ప్రత్యేక గౌరవం.. కీలక సదస్సులలో దేశ ప్రతినిధులకు సైతం స్పెషల్ ప్రోటోకాల్స్

అసలు నోట్ల రద్దు లక్ష్యం ఏమిటి? ఆ ఫలితాలు ఎలా వస్తున్నాయో కేంద్రం క్లారిటీ ఇస్తుందా ?

నోట్ల రద్దు నిర్ణయం ఆషామాషీగా తీసుకున్నారని విపక్షాలు ఆరోపించాయి. ఆషామాషీగా తీసుకున్నా.. మేధోమథనం నిర్వహించి  తీసుకున్నా అది దేశంపై తీవ్ర ప్రభావాన్ని చూపించింది. ప్రజల జీవన ప్రమాణాలను ప్రభావితం చేసింది. ఇలాంటి సమయంలో కేంద్ర ప్రభుత్వం నోట్ల రద్దు లక్ష్యాలను.. అవి ఇస్తున్న  ఫలాలను ప్రజలకు తెలియచేయాల్సి ఉంది. అయితే కేంద్రం ఆ నిర్ణయాన్ని ఇప్పుడు గుర్తు చేసుకోవడానికి కూడా సిద్ధంగా లేని పరిస్థితులు ఉన్నాయి. పరోక్షంగా తమ నిర్ణయం వల్ల జరిగిన మేళ్లు అంటూ ఆర్థిక మంత్రి వంటి వాళ్లు  గంగిరెద్దులు ఆడించుకునేవాళ్లు కూడా డిజిటల్ లావాదేవీలు నిర్వహిస్తున్నారని సింబాలిక్‌గా చెబుతున్నారు. కానీ అసలు ఆ నిర్ణయం ప్రభావాలపై స్పష్టమైన నివేదిక మాత్రం ఇంత వరకూ వెల్లడించలేదు.
5 Years Demonetisation : నోట్ల రద్దుకు ఐదేళ్లు ! నగదు చెలామణి తగ్గిందా ? బ్లాక్ మనీ బయటకు వచ్చిందా ? 

Also Read: ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసు.. దర్యాప్తు నుంచి తొలగించడంపై సమీర్ వాంఖడే ఏమన్నారంటే..!

కష్టాలను గుర్తు చేసుకుంటున్న నెటిజన్లు !

అప్పటికప్పుడు తమ జేబుల్లో ఉన్న నోట్లు చెల్లవని తెలిస్తే ప్రజలకు ఏమవుతుంది..? బ్యాంకుల్లో ఉన్న డబ్బు ఇవ్వరని తెలిస్తే ఏం జరుగుతుంది..?  బ్యాంకులో డబ్బులున్నా టీ, టిఫిన్ చేయడానికి చేతుల్లో చిల్లర లేక కడుపు కాలితే ఎలా ఉంటుంది ?  ఆస్పత్రుల్లో బిల్లులు కట్టలేక ఇబ్బందిపడిన వారు..  పెళ్లిళ్లు లాంటి శుభకార్యాలను వాయిదా వేసుకున్న వారు... ఏటీఎంల వద్ద పడిగాపులు పడిన వారు.. తమ తమ బాధలను ప్రతీ ఏడాది నోట్ల రద్దు రోజున గుర్తు చేసుకుటూనే ఉన్నారు.  నోట్ల రద్దు ఫలాలేమో కానీ ఈ కష్టాలు మాత్రం ప్రతీ సారి హైలెట్ అవుతూనే ఉన్నాయి. కొసమెరుపేమిటంటే ఐదేళ్ల కిందట డిమానిటైజేషన్ చేపట్టిన కేంద్రం ఇప్పుడు మానిటైజేషన్ కూడా ప్రారంభించింది. అంటే కేంద్ర ప్రభుత్వ సంస్థలను లీజుకొచ్చి ఆదాయం పొందడం.  

Also Read: ఛత్తీస్‌ఘడ్‌లో ఆగని కాల్పుల మోత... మరో ముగ్గురు నక్సల్స్ మృతి

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

టాప్ హెడ్ లైన్స్

Rahul Gandhi Great Nicobar Project: అండమాన్‌లో 'కేంద్రం చేస్తున్న విధ్వంసాన్ని' చూపించేందుకు సముద్రంలో డైవ్ చేసిన రాహుల్ గాంధీ
అండమాన్‌లో 'కేంద్రం చేస్తున్న విధ్వంసాన్ని' చూపించేందుకు సముద్రంలో డైవ్ చేసిన రాహుల్ గాంధీ
India T20I & Asian Games Squads: టీమ్ ఇండియా టీ20 స్క్వాడ్  ఎంపిక‌కు బీసీసీఐ ముహూర్తం: అంద‌రి ఫోక‌స్ శ్రేయస్, వైభవ్ సూర్యవంశీ పైనే..!
టీమ్ ఇండియా టీ20 స్క్వాడ్  ఎంపిక‌కు బీసీసీఐ ముహూర్తం: అంద‌రి ఫోక‌స్ శ్రేయస్, వైభవ్ సూర్యవంశీ పైనే..!
Tamil Nadu BJP: తమిళనాడు బీజేపీలో అన్నామలై సంక్షోభం! భారీ సంఖ్యలో పార్టీని వీడుతున్న నేతలు!
తమిళనాడు బీజేపీలో అన్నామలై సంక్షోభం! భారీ సంఖ్యలో పార్టీని వీడుతున్న నేతలు!
Latha Rajinikanth Makkal Madai: తమిళనాడు రాజకీయాల్లో రజనీకాంత్ సంచలనం - ప్రజావేదిక ఏర్పాటు - సతీమణే కీలకం !
తమిళనాడు రాజకీయాల్లో రజనీకాంత్ సంచలనం - ప్రజావేదిక ఏర్పాటు - సతీమణే కీలకం !

వీడియోలు

Who Will Replace Virat in AFG ODI Series? | కోహ్లీ స్థానంలో వచ్చేది ఎవరు?
Shreyas Iyer as New India's T20 Captain? | టీమిండియా కొత్త T20 కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్
Virat Kohli Ruled Out from ODI | అఫ్గాన్ వన్డే సిరీస్‌కు విరాట్ కోహ్లీ దూరం?
Research on Vaibhav Sooryavanshi | వైభవ్ సూర్యవంశీ మైండ్‌ సెట్‌పై పరిశోధన
AB de Villiers comments On Gujarat Titans | గుజరాత్ టీమ్‌పై ఏబీ డివిలియర్స్ ఫైర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Gaddar Daughter On Pawan Kalyan: పవన్ మాటలకు గద్దర్ కుటుంబం ఎందుకు నొచ్చుకుంది? వివాదంలో వాస్తవాలేంటి.? గద్దర్ కుమార్తెతో ప్రత్యేక ఇంటర్వూ
పవన్ మాటలకు గద్దర్ కుటుంబం ఎందుకు నొచ్చుకుంది? వివాదంలో వాస్తవాలేంటి.? గద్దర్ కుమార్తెతో ప్రత్యేక ఇంటర్వూ
Latha Rajinikanth Makkal Madai: తమిళనాడు రాజకీయాల్లో రజనీకాంత్ సంచలనం - ప్రజావేదిక ఏర్పాటు - సతీమణే కీలకం !
తమిళనాడు రాజకీయాల్లో రజనీకాంత్ సంచలనం - ప్రజావేదిక ఏర్పాటు - సతీమణే కీలకం !
Kakinada Senior Assistant Shiva Kumar ACB Raids: కలెక్టర్‌లో సీనియర్ అసిస్టెంట్ - అవినీతిలోనూ సీనియరే - ఆస్తులు లెక్కేయడం కష్టమే!
కలెక్టర్‌లో సీనియర్ అసిస్టెంట్ - అవినీతిలోనూ సీనియరే - ఆస్తులు లెక్కేయడం కష్టమే!
Karnataka Congress Crisis: డీకే శివకుమార్‌కు షాక్ ఇస్తున్న మంత్రులు! కర్ణాటక కాంగ్రెస్‌లో కలకలం!
డీకే శివకుమార్‌కు షాక్ ఇస్తున్న మంత్రులు! కర్ణాటక కాంగ్రెస్‌లో కలకలం!
Revanth Reddy target GHMC :తెలంగాణ కాంగ్రెస్ టార్గెట్ పవన్ కళ్యాణ్? రేవంత్ రాజకీయ వ్యూహం ఇదేనా?
తెలంగాణ కాంగ్రెస్ టార్గెట్ పవన్ కళ్యాణ్? రేవంత్ రాజకీయ వ్యూహం ఇదేనా?
Nandus World Scam: నందనకు పదేళ్ళ జైలు శిక్ష తప్పదా? యూకే వీసా స్కామ్‌లో చట్టాలు ఏం చెబుతున్నాయ్?
నందనకు పదేళ్ళ జైలు శిక్ష తప్పదా? యూకే వీసా స్కామ్‌లో చట్టాలు ఏం చెబుతున్నాయ్?
K. Annamalai:
"అందుకే బీజేపీలో చేరా, ఏడాదిన్నర నుంచి విభేదాలు"అన్నామలై సంచలన వ్యాఖ్యలు! కొత్త రాజకీయ వేదిక ప్రకటన!
Breaking News: భూ కబ్జా కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు అరెస్టు
భూ కబ్జా కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు అరెస్టు
Embed widget