అన్వేషించండి

Independence Day 2026 PM Modi Speech Highlights: సప్తధార పేరుతో మోదీ సరికొత్త నినాదం- జెన్‌జీకి అధిక ప్రాధాన్యం- 80వ స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగం హైలైట్స్‌!

Independence Day 2026 PM Modi Speech Highlights: ఎర్రకోటపై 13వసారి జాతీయ జెండాను ఆవిష్కరించిన ప్రధానమంత్రి మోదీ జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా కీలక అంశాలను ఆయన హైలైట్ చేశారు.  

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • 80వ స్వాతంత్ర్య దినోత్సవం నాడు సప్తధార శక్తిని ప్రకటించి, యువతకు ప్రాధాన్యతనిచ్చారు.
  • 2047 నాటికి అభివృద్ధి చెందిన భారత్ నిర్మాణానికి ప్రధాని మోదీ సంకల్పించారు.
  • గతంలో బలహీనమైన దేశం ఇప్పుడు ప్రధాన ఆర్థిక వ్యవస్థగా ఎదిగింది.
  • కోటి మంది యువతకు ఏఐ నైపుణ్య శిక్షణ, ఉచిత కోచింగ్ అందించనున్నారు.

Independence Day 2026 PM Modi Speech Highlights:: 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ  సరికొత్త నినాదాన్ని అందించారు. సప్తధార శక్తి పేరుతో ఆయా రంగాలకు, వర్గాలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని ప్రకటించారు. ముఖ్యంగా యువతరానికి ఇచ్చే ప్రయార్టీని మోదీ పదే పదే హైలైట్ చేశారు. జెన్‌జీ ఉద్యమాల నేపథ్యంలో వారి విషయాలకు ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చారు. 

2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దాలనే తన సంకల్పాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వెల్లడించారు. ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశం అభివృద్ధి చెందిన దేశంగా మారాలనే సంకల్పం, దేశ ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని ప్రతిబింబిస్తుందని అన్నారు. ఈ సంకల్పం ప్రపంచం భారతదేశాన్ని భిన్నంగా చూసేలా చేసిందని ప్రధానమంత్రి పేర్కొన్నారు.

"ఈ రోజు భారత్‌ ఒక గొప్ప కలను కంటోంది. కొత్త శిఖరాలకు తీసుకెళ్లాలని పూర్తి సంకల్పంతో కలలు కంటోంది. ఆ కల ఏమిటంటే, 2047లో భారతదేశం తన స్వాతంత్ర్యానికి 100 ఏళ్లు పూర్తి చేసుకున్నప్పుడు, మనం కచ్చితంగా 'అభివృద్ధి చెందిన భారత్‌ను ' నిర్మించి, దానిని సాకారం చేస్తాం."

140 కోట్ల మంది పౌరుల కృషి, ప్రయత్నాల ద్వారా ఈ లక్ష్యాన్ని సాధించాలని మోదీ పేర్కొన్నారు. ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశం అభివృద్ధి చెందిన దేశంగా మారాలని సంకల్పించినప్పుడు, అది యావత్ ప్రపంచం ముందు భారత్‌ ధైర్యానికి నిదర్శనంగా నిలుస్తుందని, భారత్‌పై ప్రపంచ దృక్పథాన్ని మార్చుకునేలా చేస్తుందని ప్రధానమంత్రి అన్నారు.

పెద్ద కలలు, పట్టుదల మీ సామర్థ్యాలను పెంచుతాయి

భారత్‌ కలలు, సంకల్పం గొప్పగా ఉండాలని, ఎందుకంటే గొప్ప లక్ష్యాలు దేశ సామర్థ్యాలను కొత్త శిఖరాలకు చేర్చడంలో సహాయపడతాయని ప్రధాని మోదీ అన్నారు. "మన కలలు, సంకల్పం గొప్పగా ఉండాలి, ఎందుకంటే అవి మన సామర్థ్యాలను కొత్త శిఖరాలకు చేర్చడంలో సహాయపడతాయి" అని ఆయన అన్నారు.

చిన్న రిజల్యూషన్‌లు పని చేయవు

ప్రధాని మోదీ మాట్లాడుతూ, "ఒక దేశం తన కలలు, సంకల్పం, సామర్థ్యాలతో ముందుకు సాగినప్పుడే గొప్పగా ఎదుగుతుంది. ఇప్పుడు మనం చిన్న చిన్న సంకల్పాలతో సరిపెట్టుకోలేం. పెద్ద కలలు మన పరిధులను విస్తరింపజేస్తాయి; సంకల్పం బలంగా ఉన్నప్పుడు, మన సామర్థ్యం కూడా పెరుగుతుంది. కలలు, సంకల్పాలు ఉన్నతంగా ఉన్నప్పుడు, మన సామర్థ్యాలు ఆకాశానికి ఎగసిపడతాయి. ఈ రోజు భారత్‌ కూడా కలలు కంది, సంకల్పం పెట్టుకుంది. 2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దుతాం. మన సంకల్పం ధైర్యానికి నిదర్శనం."

12 ఏళ్లలో రక్షణ ఉత్పత్తి నాలుగు రెట్లు పెరిగింది

గత 12 ఏళ్లలో దేశంలో జరిగిన మార్పులను, వివిధ రంగాల్లో పెరిగిన ఉత్పత్తి సామర్థ్యాన్ని ప్రధానమంత్రి ప్రముఖంగా ప్రస్తావించారు. ఈ కాలంలో రక్షణ రంగ ఉత్పత్తి దాదాపు నాలుగు రెట్లు పెరిగిందని ఆయన పేర్కొన్నారు. ఎలక్ట్రానిక్స్ తయారీ దాదాపు ఏడు రెట్లు, ఆధునిక రైల్వే కోచ్‌ల ఉత్పత్తి 21 రెట్లు, మొబైల్ ఫోన్ల తయారీ 33 రెట్లు పెరిగాయని తెలిపారు. ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య, అలాగే పేటెంట్ల సంఖ్య కూడా దాదాపు నాలుగు రెట్లు పెరిగింది. ప్రధానమంత్రి ప్రకారం, డిజిటల్ లావాదేవీలు దాదాపు 100 రెట్లు పెరిగాయి.

25 కోట్ల మంది ప్రజలు పేదరికం నుంచి బయటపడ్డారు 

25 కోట్ల మంది పౌరులు పేదరికాన్ని అధిగమించి దాని నుంచి బయటపడ్డారు. ఒకప్పుడు మనల్ని 'ఫ్రాజైల్ 5' (అతి బలహీనమైన ఐదు దేశాలు)లో ఒకటిగా పరిగణించేవారు. నేడు, మనం ప్రధాన ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా పరిగణిస్తున్నారు. 2014 నాటికి, ప్రపంచం మనల్ని 'ఫ్రాజైల్ 5' జాబితాలో బంధించింది. గత 12 సంవత్సరాలుగా, మనం వేగంగా పురోగమిస్తున్నాం.

ఇరాన్-అమెరికా ఉద్రిక్తతను ప్రస్తావిస్తూ, ఇంధన సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి తాము సన్నాహాలు చేశామని, అవి ఫలించాయని అన్నారు. ఇంధన భద్రత ప్రస్తుత అవసరమని ప్రధాని మోదీ అన్నారు. "ఇంధనం లేకుండా ఈ నూతన ప్రపంచంలో ముందుకు సాగడం కష్టంగా మారింది. మనకు భారీ మొత్తంలో ఇంధనం అవసరం. 2047 నాటికి 100 గిగావాట్ల అణు విద్యుత్‌ను లక్ష్యంగా నిర్దేశించుకున్నాం."

పెట్రోల్, డీజిల్, ఎరువులను ఆయుధాలుగా వాడుతున్నారని ప్రధాని మోదీ అన్నారు. చమురు, గ్యాస్ పేరిట ప్రజలను భయపెడుతున్నారని ఆయన పేర్కొన్నారు. గత 12 ఏళ్లలో మనం ఎన్నో సంక్షోభాలను ఎదుర్కొన్నామని ప్రధాని మోదీ అన్నారు. కరోనావైరస్ కారణంగా అన్ని వ్యవస్థలు కుప్పకూలాయి. ఉక్రెయిన్ నుంచి పశ్చిమ ఆసియా వరకు... ప్రతిచోటా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు సంక్షోభంలో చిక్కుకున్నాయి. కానీ భారత్‌ సన్నాహాలు ఎంతగానో ఉపయోగపడ్డాయి. మనం మన బలాలపై నిలబడి ముందుకు సాగుతున్నాం.

ఎర్రకోట ప్రాంగణం నుంచి ప్రధాని మోదీ, జెన్ జెడ్, జెన్ ఆల్ఫా తరాలకు ఒక ముఖ్యమైన కానుకను ప్రకటించారు. ఏడాదిలోగా కోటి మంది యువతకు ఏఐ నైపుణ్యాలలో శిక్షణ ఇస్తానని ఆయన తెలిపారు. విద్యార్థులకు ఉచిత కోచింగ్‌ను కూడా ఆయన ప్రకటించారు. "అభివృద్ధి చెందిన దేశంగా భారత్‌ సాగించే ప్రయాణంలో యువత పోషించాల్సిన పాత్ర చాలా పెద్దది. ఈ రోజు, ఎర్రకోట ప్రాంగణం నుంచి నేను దేశ యువతకు ఒక ప్రకటన చేయాలనుకుంటున్నాను. రాబోయే సంవత్సరంలో 10 మిలియన్ల యువతకు ఏఐ నైపుణ్యాల శిక్షణను అందించాలని సంకల్పించాము, తద్వారా మన దేశ యువత ఏఐ రంగంలో ప్రపంచానికి నాయకత్వం వహించే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు," అని ఆయన అన్నారు.  

ఏడు సూత్రాలతో సాగిన ప్రసంగం 

ప్రధాని మోదీ ప్రసంగంలో ఏడు విషయాలను హైలైట్ చేశారు. ఇవే దేశానికి చోదక శక్తులుగా పని చేస్తాయని అన్నారు. 

  1. ఉత్పాదక రంగం
  2. వ్యవసాయ, ఆహార భద్రత
  3. సాంకేతికత, ఆవిష్కరణలు
  4. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌, కనెక్టివిటీ శక్తి
  5. రక్షణ శక్తి 
  6.  గ్రీన్ ఎనర్జీ
  7. కల్చర్ ఇన్ఫ్లూయిన్స్, సాఫ్ట్ పవర్

ఈ ఏడు రంగాలు కలిసికట్టుగా పని చేసినప్పుడే 2047 నాటికి వికసిత భారత్ కల సాకారమవుతుందని అన్నారు. 

ఉత్పాదక రంగం 

భారత్‌ కేవలం విడిభాగాలను తయారు చేసే స్థాయి నుంచి పూర్తి స్థాయి ఉత్పత్తులను తయారు చేసే స్థాయికి ఎదగాలని మోదీ పిలుపునిచ్చారు. దీని కోసం ధర, నాణ్యత, పరిమాణం నే మూడు సూత్రాలను తయారీదారులు పాటించాలని సూచించారు. భారతీయ ఉత్పత్తుల ప్యాకేజింగ్, నాణ్యత, ప్రపంచస్థాయి ప్రమాణాలతో పోటీ పడాలని ఆయన అన్నారు. 

వ్యవసాయం- ఆహార భద్రత

దేశ ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయం కీలక పాత్ర పోషిస్తూనే ఉంటుందని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. ఉత్పాదకతను పెంచడం ద్వారా దీర్ఘకాలిక ఆహార భద్రతను నిర్దారించడం, వ్యవసాయ అనుబంధ వ్యవస్థలను బలోపేతం చేయడం దీని ప్రత్యేక ఉద్దేశం 

సాంకేతికత- ఆవిష్కరణలు 

ప్రపంచం ఇప్పుడు డేటా సెంటర్లు, రోబోటిక్స్, ఎమర్జింగ్‌ టెక్నాలజీల యుగంలో ఉంది. యూపీఐ విజయంతో భారత్‌ ఇప్పటికే తన సత్తా చాటిందని, ఇప్పుడు స్వదేశీ 6G టెక్నాలజీని దేశంలోని ప్రతి మూలకు చేర్చాలని మోదీ లక్ష్యంగా పెట్టుకున్నారు. 

కనెక్టివిటీ 

మౌలిక సదుపాయాల కల్పన, అనుసంధానత దేశాభివృద్ధికి వెన్నెముక వంటివి. రహదారులు, హైవేలు, ఎక్స్‌ప్రెస్‌వేల నిర్మాణం ద్వారా రవాణ ఖర్చులను తగ్గించి, వ్యాపారాలను వేగవంతం చేయడమే దీని లక్ష్యం. 

రక్షణ శక్తి 

రక్షణ రంగంలో విదేశీ దిగుమతులను తగ్గించి అత్మనిర్భర్ సాధించడం అత్యవసరం, ముఖ్యంగా డ్రోన్ల, కౌంటర్‌ డ్రోన్ వ్యవస్థల వంటి ఆధునిక యుద్ధ తంత్ర టెక్నాలజీలో భారత్ అగ్రగామిగా ఉండాలని ప్రధాని కోరారు. 

గ్రీన్ ఎనర్జీ 

పర్యావరణహితమైన అభివృద్ధి కోసం గ్రీన్ ఎనర్జీ రంగాన్ని విస్తరించడం ఏడు ప్రమాణాల్లో మరో అంశం. పునరుత్పాద ఇంధన వనరుల వినియోగాన్ని పెంచడం ద్వారా భవిష్యత్‌ అవసరాలను తీర్చుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. 

సాఫ్ట్‌ పవర్‌ 

భారత్ దేశ సాంస్కృతి వారసత్వం ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. యోగా, హస్తకళలు, సినిమాలు, యానిమేషన్, గేమింగ్, పర్యాటక రంగాల ద్వారా భారత్‌ తన ప్రభావాన్ని మరింత పెంచుకోవాలని మోదీ సూచించారు. నేషనల్‌ పార్కులు, సాంస్కృతిక కట్టడాలు అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షించేలా అభివృద్ధి చేయాలని ఆయన అన్నారు. 

Frequently Asked Questions

2047 నాటికి భారతదేశం యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి?

2047 నాటికి, స్వాతంత్ర్యం వచ్చి 100 సంవత్సరాలు పూర్తయ్యే నాటికి, భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దాలని ప్రధాని మోదీ సంకల్పించారు. ఈ లక్ష్యం 140 కోట్ల మంది పౌరుల కృషి ద్వారా సాధించబడుతుంది.

80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ ప్రకటించిన కొత్త నినాదం ఏమిటి?

80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ

యువత కోసం ప్రధాని మోదీ ప్రకటించిన ప్రత్యేక కానుక ఏమిటి?

ప్రధాని మోదీ జెన్ జెడ్, జెన్ ఆల్ఫా తరాల యువతకు ఏడాదిలోగా కోటి మందికి ఏఐ నైపుణ్యాలలో శిక్షణ ఇస్తానని ప్రకటించారు. విద్యార్థులకు ఉచిత కోచింగ్ కూడా అందుబాటులో ఉంటుంది.

గత 12 ఏళ్లలో భారతదేశం ఆర్థికంగా ఎలా పురోగమించింది?

గత 12 ఏళ్లలో 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారు. ఒకప్పుడు 'ఫ్రాజైల్ 5'గా పరిగణించబడిన భారత్, ఇప్పుడు ప్రధాన ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా మారింది.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Independence Day 2026 PM Modi Speech Highlights: సప్తధార పేరుతో మోదీ సరికొత్త నినాదం- జెన్‌జీకి అధిక ప్రాధాన్యం- 80వ స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగం హైలైట్స్‌!
సప్తధార పేరుతో మోదీ సరికొత్త నినాదం- జెన్‌జీకి అధిక ప్రాధాన్యం- 80వ స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగం హైలైట్స్‌!
Vande Mataram at Red Fort: ఎర్రకోటపై చారిత్రక ఘట్టం! 80వ స్వాతంత్య్ర వేడుకల్లో తొలిసారిగా
ఎర్రకోటపై చారిత్రక ఘట్టం! 80వ స్వాతంత్య్ర వేడుకల్లో తొలిసారిగా "వందేమాతరం" ఆలాపన!
Breaking News:ఎర్రకోటపై 13వ సారి జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రధానమంత్రి మోదీ
ఎర్రకోటపై 13వ సారి జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రధానమంత్రి మోదీ
CJP Instagram: స్వాతంత్య్ర దినోత్సవం రోజున సీజేఐకి షాక్! ఇన్‌స్టాగ్రామ్ ఖాతా డిలీట్‌! అభిజిత్ దీప్కే ఆగ్రహం !
స్వాతంత్య్ర దినోత్సవం రోజున సీజేఐకి షాక్! ఇన్‌స్టాగ్రామ్ ఖాతా డిలీట్‌! అభిజిత్ దీప్కే ఆగ్రహం !
Advertisement

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Komatireddy Rajagopal Reddy New Party: రాజగోపాల్ రెడ్డి కొత్త పార్టీ పెడతారా? కాంగ్రెస్ పై తిరుగుబాటా లేక మంత్రి పదవి కోసం ప్రెజర్ పాలిటిక్సా?
రాజగోపాల్ రెడ్డి కొత్త పార్టీ పెడతారా? కాంగ్రెస్ పై తిరుగుబాటా లేక మంత్రి పదవి కోసం ప్రెజర్ పాలిటిక్సా?
Vande Mataram at Red Fort: ఎర్రకోటపై చారిత్రక ఘట్టం! 80వ స్వాతంత్య్ర వేడుకల్లో తొలిసారిగా
ఎర్రకోటపై చారిత్రక ఘట్టం! 80వ స్వాతంత్య్ర వేడుకల్లో తొలిసారిగా "వందేమాతరం" ఆలాపన!
YS Jagan Press Meets vs Protests: వైఎస్ జగన్ పరామర్శ రాజకీయం - రోడ్డెక్కుతున్న క్యాడర్.. ప్రెస్ మీట్లకే పరిమితమవుతున్న అధినేత! ఏపీలో వైఎస్సార్‌సీపీ ప్లాన్ ఏంటి?
వైఎస్ జగన్ పరామర్శ రాజకీయం - రోడ్డెక్కుతున్న క్యాడర్.. ప్రెస్ మీట్లకే పరిమితమవుతున్న అధినేత! ఏపీలో వైఎస్సార్‌సీపీ ప్లాన్ ఏంటి?
Telangana Politics Black Magic Allegations:తెలంగాణ రాజకీయాల్లో క్షుద్రపూజల ఆరోపణలు - రేవంత్ వర్సెస్ బీఆర్ఎస్.. మూఢనమ్మకాలతో మైండ్ గేమ్‌లు?
తెలంగాణ రాజకీయాల్లో క్షుద్రపూజల ఆరోపణలు - రేవంత్ వర్సెస్ బీఆర్ఎస్.. మూఢనమ్మకాలతో మైండ్ గేమ్‌లు?
APPSC Group 1 Scam SIT Report: ఏపీ గ్రూప్-1 అవకతవకల కేసు - సిట్ నివేదికతో కలకలం.. అధికారుల ఉద్యోగాలు రద్దు? జైలు శిక్ష తప్పదా?
ఏపీ గ్రూప్-1 అవకతవకల కేసు - సిట్ నివేదికతో కలకలం.. అధికారుల ఉద్యోగాలు రద్దు? జైలు శిక్ష తప్పదా?
IND vs SL Galle Test: భారత్ చారిత్రాత్మక 600వ టెస్ట్ సమరానికి వరుణుడి ముప్పు.. గాలే వేదికగా గిల్ సేన బోణీ కొడుతుందా.? 
భారత్ చారిత్రాత్మక 600వ టెస్ట్ సమరానికి వరుణుడి ముప్పు.. గాలే వేదికగా గిల్ సేన బోణీ కొడుతుందా.? 
CJP Instagram: స్వాతంత్య్ర దినోత్సవం రోజున సీజేఐకి షాక్! ఇన్‌స్టాగ్రామ్ ఖాతా డిలీట్‌! అభిజిత్ దీప్కే ఆగ్రహం !
స్వాతంత్య్ర దినోత్సవం రోజున సీజేఐకి షాక్! ఇన్‌స్టాగ్రామ్ ఖాతా డిలీట్‌! అభిజిత్ దీప్కే ఆగ్రహం !
Independence Day 2026 PM Modi Speech Highlights: సప్తధార పేరుతో మోదీ సరికొత్త నినాదం- జెన్‌జీకి అధిక ప్రాధాన్యం- 80వ స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగం హైలైట్స్‌!
సప్తధార పేరుతో మోదీ సరికొత్త నినాదం- జెన్‌జీకి అధిక ప్రాధాన్యం- 80వ స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగం హైలైట్స్‌!
Embed widget