అన్వేషించండి

Delhi Air Pollution: దిల్లీలో డేంజర్ బెల్స్.... కాలుష్యంతో తగ్గిపోతున్న ఆయుష్షు... వైద్య నిపుణుల వెల్లడి

దేశ రాజధాని దిల్లీలో వాయు కాలుష్యం మరింత పెరిగింది. గాలి నాణ్యత క్షీణించింది. ఈ వాయుకాలుష్యం ప్రజల్లో తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీస్తాయని వైద్య నిపుణులు అంటున్నారు.

దేశ రాజధాని దిల్లీలో గాలి నాణ్యత అంతకంతకూ క్షీణిస్తోంది. ఎయిర్ క్వాలిటీ ఇండెట్స్(AQI) 530కు చేరడంతో గాలి పీల్చడానికి ప్రమాదకంగా మారింది. దీనిపై పర్యావరణ వేత్తలు, వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దిల్లీలో గాలి కాలుష్యానికి మానవ నిర్లక్ష్య ధోరణి కారణమని అంటున్నారు. ఏఎన్ఐతో ప్రముఖ పర్యావరణవేత్త విమ్లెందు ఝా మాట్లాడారు. వాయు కాలుష్యం వల్ల ప్రతి సంవత్సరం 15 లక్షల మంది మృతి చెందుతున్నారని తెలిపారు. వాయుకాలుష్యం కారణంగా దిల్లీ-ఎన్‌సీఆర్‌లో నివసిస్తున్న ప్రజల ఆయుష్షు 9.5 సంవత్సరాలు తగ్గిపోతుందని ఒక నివేదికలో తేలిందన్నారు. వాయు కాలుష్యంతో ప్రతి ముగ్గురిలో ఒకరు ఆస్తమా(ఉబ్బసం)తో బాధపడుతున్నారని లంగ్ కేర్ ఫౌండేషన్ పరిశోధనలో తెలిసిందని విమ్లెందు తెలిపారు. 

Also Read: ఆడ దోమతో జాగ్రత్త గురూ.. జికా వైరస్ ధాటికి ఉత్తర్‌ప్రదేశ్ గజగజ

గుండె వ్యాధుల బాధితులకు అలెర్ట్

సిస్టం ఆఫ్ ఎయిర్ క్వాలిటీ, వెదర్ ఫోర్‌కాస్టింగ్ పరిశోధన ప్రకారం దేశం రాజధాని దిల్లీలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) 533కు చేరింది. గాలి కాలుష్యం తీవ్రమైందని తెలిపింది.  వాయు కాలుష్యం వల్ల ప్రజలకు ఆరోగ్య సంబంధిత వ్యాధులు వస్తున్నాయని గంగారాం ఆసుపత్రి కార్డియాలజీ ప్రొఫెసర్ డాక్టర్ అరుణ్ మొహంతి ANIతో తెలిపారు. గుండె లేదా ఛాతీ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న వారికి ఇది మరింత ప్రమాదకరమన్నారు. 

Also Read:  తెలుగు రాష్ట్రాలపై పెట్రో పన్నుల తగ్గింపు ఒత్తిడి ! ఇప్పుడేం చేయబోతున్నారు ?

కొవిడ్ బాధితులకు మరింత ప్రమాదకరం

ఇంటర్‌స్టీషియల్ లంగ్ డిసీజ్ (ILDs), క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ (COPD)తో బాధపడుతున్న రోగులు కూడా ఈ కాలుష్యంతో మరిన్ని ఆరోగ్య సమస్యలు వస్తాయన్నారు. సుమారు 10 నుంచి 15 శాతం మంది పిల్లలు ఆస్తమా, అలెర్జీ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారని అరుణ్ మొహంతి తెలిపారు. కొవిడ్-19 నుంచి కోలుకున్న వారికి కూడా ఈ కాలుష్యం ప్రమాదకరమన్నారు. ఆస్తమా ఉన్న పిల్లల పరిస్థితి మరింత తీవ్రంగా ఉంటుందని డా.మొహంతి అన్నారు. వాయు కాలుష్యం తీవ్రమైన ఊపిరితిత్తుల వ్యాధులకు దారితీస్తుందన్నారు. అలాగే గర్భిణీ స్త్రీలలో కూడా తీవ్రమైన సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని ఆయన చెప్పారు.
(ఏఎన్ఐ సౌజన్యంతో ఈ ఆర్టికల్ రాశాము)

Also Read:  ఢిల్లీలో మళ్లీ ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం ! దీపావళి టపాసులే కారణమా?

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

National Commission for Men: మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
PM Modi: తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
IND vs SA 2nd T20 : మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!
మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!
IndiGo: సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?

వీడియోలు

Telangana Aviation Academy CEO Interview | ఇండిగో దెబ్బతో భారీ డిమాండ్.. 30వేల మంది పైలట్ లు కావాలి
నేడు భారత్, సౌతాఫ్రికా మధ్య రెండో టీ20.. బ్యాటింగే డౌటు!
రోహిత్ ఒక్కటే చెప్పాడు.. నా సెంచరీ సీక్రెట్ అదే!
ఆళ్లు మగాళ్లురా బుజ్జె! రోకోకి ప్రశంసలు.. గంభీర్‌కి చురకలు!
అప్పుడు కోహ్లీ.. ఇప్పుడు రోహిత్.. 2025లో 2019 రిపీట్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
National Commission for Men: మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
PM Modi: తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
IND vs SA 2nd T20 : మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!
మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!
IndiGo: సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
Fake liquor case: తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలు
తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలుపు
One Fast Every Month: ప్రతి నెలా ఒక ఉపవాసం - ఢిల్లీలో అంతర్జాతీయ ప్రజాసంక్షేమ సదస్సు - పిలుపునివ్వనున్న బాబా రాందేవ్
ప్రతి నెలా ఒక ఉపవాసం - ఢిల్లీలో అంతర్జాతీయ ప్రజాసంక్షేమ సదస్సు - పిలుపునివ్వనున్న బాబా రాందేవ్
Rivaba Jadeja : టీమిండియా ఆటగాళ్లు విదేశీ టూర్లకు వెళ్లి తప్పుడు పనులు చేస్తారు; రవీంద్ర జడేజా భార్య రీవాబా సంచలన కామెంట్స్
టీమిండియా ఆటగాళ్లు విదేశీ టూర్లకు వెళ్లి తప్పుడు పనులు చేస్తారు; రవీంద్ర జడేజా భార్య రీవాబా సంచలన కామెంట్స్
YSRCP Leader Pinnelli Ramakrishna Reddy: జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
Embed widget