అన్వేషించండి

Chiranjeevi Lakshmi Sowbhagyavathi August 19h: చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సీరియల్: మిత్రాను కిడ్నాప్ - షాక్‌లో లక్ష్మీ, వివేక్‌, జయదేవ్! లక్కీతో ఫోన్‌లో మాట్లాడింది ఏవరు?

Chiranjeevi Lakshmi Sowbhagyavathi Today Episode: మిత్రాను కిడ్నాప్ చేసినట్లు సీసీఫుటేజ్‌లో చూసి లక్ష్మీ పోలీసులకు ఏం చెప్పంది. లక్కీతో ఫోన్‌లో ఏం మాట్లాడించింది.

 
Chiranjeevi Lakshmi Sowbhagyavathi : లక్ష్మీ చెప్పడంతో వివేక్(Vivek) మిత్రాను తీసుకొచ్చేందుకు ఆడిటర్ ఇంటి వెళ్లిపోతాడు. అరవింద మాత్రం మిత్రాకు ఏమైందోనని కంగారుపడుతుంది. జాను అత్తగారిని ఇంట్లోకి తీసుకెళ్లడంతో ఎటువాళ్లు అటు వెళ్లిపోతారు. జయదేవ్‌  లక్ష్మీని పక్కకు పిలిచి అసలు ఏంటని అడుగుతాడు. మిత్రా  ఆడిటర్ ఇంటికి వెళ్లలేదని...ఫోన్ చేస్తుంటే లిప్ట్ చేయడం లేదని ఎక్కడికి వెళ్లాడో తెలియడం లేదని చెబుతుంది. 
 
దేవయాని మనీషాను  పిలిచి అడుగుతుంది. లక్ష్మీ, సంయుక్త ఒక్కటేనని నిరూపించడం కోసం మిత్రపై ఏమైనా ప్రయోగం చేశావా అని అడుగుతుంది. మిత్రాను నువ్వే కావాలని దాచిపెట్టి..లక్ష్మీని బయటకు లాగాలని చూస్తున్నావా అంటుంది. నాకు అసలు అలాంటి ఆలోచనే రాలేదని మనీషా బోరుమంటుంది
 
మిత్రా కోసం బయటకు వచ్చిన వివేక్‌కు మిత్రా ఫోన్ నుంచి కాల్ వస్తుంది. అన్నయ్యే ఫోన్ చేశాడని ఆనందంగా ఎత్తగా...అవతలి నుంచి ఎస్‌ఐ వాయిస్ వినిపిస్తుంది. బీచ్‌రోడ్డుకు దగ్గరలో ఓ కారు ఆగిపోయి ఉందని...అక్కడే ఈ ఫోన్ కూడా దొరికిందని చెబుతాడు. మీ అన్నయ్యను ఎవరో కిడ్నాప్ చేశారన్న అనుమానం కలుగుతోందని చెబుతాడు.
 
దీక్షితులుగారు మిత్రాకు గండం ముంచెత్తబోతుందని చెప్పారని జయదేవ్ లక్ష్మీకి చెబుతాడు. మిత్రాకు ప్రమాదం పొంచి ఉందని చెబుతుండగానే...వివేక్ పరుగెత్తుకుంటూ వచ్చి అసలు విషయం చెబుతాడు. అన్నయ్యను ఎవరో కిడ్నాప్ చేశారని...ఫోన్‌, కారు కూడా పోలీసుల వద్దే ఉన్నాయని చెప్పడంతో లక్ష్మీ, జయదేవ్ కంగారుపడతారు.
మనీషా మాటలను నమ్మని దేవయాని...మరోసారి ఆమెను రెట్టించి అడుగుతుంది. నువ్వు ఈ మధ్య తిక్కతిక్కగా ఆలోచిస్తున్నావని కోప్పడుతుంది. నీమీదే నాకు డౌట్ ఉందని చెబుతుంది. మిత్ర విషయంలో నేనేమీ చేయలేదని చెబుతుంది. 
 
అటు లక్ష్మీ సైతం ఈ విషయం అత్తగారికి తెలియకుండా దాచాలని జయదేవ్‌తో అంటుంది. తెలిస్తే మరింత కంగారుపడుతుందని ఆమె చెబుతుంది. మిత్రను ఈ గండం నుంచి ముందు బయటపడేయాలని లక్ష్మీ చెబుతుంది.
కిడ్నాపర్లు మిత్రాను తీసుకెళ్లి ఓ చీకటి గదిలో బందిస్తారు. అర్జునే నన్ను కిడ్నాప్ చేయించాడు కదా అంటూ మిత్రా కిడ్నాపర్లతో అనడంతో వారు కంగారుపడిపోతారు. సంయుక్త నాకు ఎక్కడ ప్రాజెక్ట్‌ ఇస్తుందోనని వాడే కిడ్నాప్ చేయించాడా అని అంటాడు. దీంతోవాళ్లు మిత్రాను హెచ్చరించి వెళ్లిపోతారు.
ఇంతలో వివేక్ అర్జున్‌కు ఫోన్ చేసి అసలు విషయం చెబుతాడు. మా అన్నయ్యను ఎవరో కిడ్నాప్ చేయించారని చెప్పగానే...అర్జున్ షాక్‌కు గురవుతాడు. బీచ్‌రోడ్డులో జరిగిందని చెప్పగానే తాను అక్కడికి వస్తున్నాని చెబుతాడు. అందరూ కలిసి మిత్రను కిడ్నాప్ చేసిన ప్రాంతానికి చేరుకుంటారు.
అంతలోనే పోలీసులు సమీపంలోని సీసీ కెమెరా ఫుటేజ్‌ పెన్‌డ్రైవ్‌లోకి తీసుకుంటారు. అర్జున్ ల్యాప్‌టాప్‌లో ఆ ఫుటేజీ పరిశీలించగా...కిడ్నాప్ ఉదంతం మొత్తం కళ్లకు కట్టినట్లు కనిపిస్తుంది. పోలీసులు మేం వారిని త్వరగానే పట్టుకుంటామని చెప్పగా....ఈ మేటర్‌ కొంచెం ఎవరికి తెలియకుండా ఎంక్వాయిరీ చేయాలని లక్ష్మీ కోరుతుంది. మనం వారిని పట్టుకోవడానికి ట్రై చేస్తున్నట్లు తెలిస్తే...నిందితులు మిత్రాకు ఏమైనా ఆపద తలపెట్టే అవకాశం ఉందని చెబుతుంది.
 
స్కూల్‌ నుంచి ఇంటికి వచ్చిన లక్కీ నానమ్మను చూసి ఆనందంతో ముద్దులు పెడుతోంది. తాను తయారు చేసిన ఫ్యామిలీ ట్రీ ఆమెకు చూపెడుతుంది. అందులో ఉన్న లక్ష్మీ ఫొటో చూసి ఈ ఫొటో నీకు ఎవరు ఇచ్చారని అడుగుతుంది. అమ్మ స్థానంలో ఈ ఫొటో పెట్టమని ఎవరు చెప్పారని అడగ్గా...సంయుక్త ఆంటీ  పెట్టమని చెప్పిందని చెబుతుంది. అంతలో లక్ష్మీ, వివేక్ అక్కడికి వస్తారు. వాళ్లను చూసిన లక్కీ నాన్న కావాలి ఎక్కడని అడుగుతుంది. మిత్రాను తీసుకుని రమ్మంటే ఉట్టి చేతులతోనే ఎందుకు వచ్చావని వివేక్‌పై అరవింద కోప్పడుతుంది. అన్నయ్య బిజీగా ఉన్నాడని చెప్పినా వినదు.వెంటనే వాడికి ఫోన్ చేయమని చెబుతుంది. లక్కీ కూడా మిత్రతో మాట్లాడాని గొడవ పెట్టడంతో లక్ష్మీ అర్జున్‌కు ఫోన్ చేస్తుంది. అర్జునే మిత్రాలా లక్కీతో మాట్లాడతాడు. త్వరగా ఇంటికి వస్తానని చెప్పడంతో లక్కీ ఫోన్ కట్‌ చేసి ఇంట్లోకి వెళ్లిపోవడంతో ఈ రోజు ఏపిసోడ్ ముగుస్తుంది.
 
 
మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Revanth Reddy : రేవంత్ రెడ్డిపై సూపర్ సీనియర్స్ అసంతృప్తి - కాంగ్రెస్ కల్చర్‌ను రేవంత్ ఇంకా వంటబట్టించుకోలేదా?
రేవంత్ రెడ్డిపై సూపర్ సీనియర్స్ అసంతృప్తి - కాంగ్రెస్ కల్చర్‌ను రేవంత్ ఇంకా వంటబట్టించుకోలేదా?
Rajendra Prasad's Daughter: రాజేంద్ర ప్రసాద్ ఇంట్లో తీవ్ర విషాదం- గుండెపోటుతో కుమార్తె మృతి
Rajendra Prasad's Daughter: రాజేంద్ర ప్రసాద్ ఇంట్లో తీవ్ర విషాదం- గుండెపోటుతో కుమార్తె మృతి
Haryana Elections 2024: హర్యానా ఎన్నికల పోలింగ్ ప్రారంభం- 90 అసెంబ్లీ స్థానాలకు 1,031 మంది పోటీ
హర్యానా ఎన్నికల పోలింగ్ ప్రారంభం- 90 అసెంబ్లీ స్థానాలకు 1,031 మంది పోటీ
Women's World Cup 2024: ఆరంభ మ్యాచ్‌లోనే భారత్‌కు బిగ్‌ షాక్, కివీస్‌ చేతిలో ఘోర ఓటమి
ఆరంభ మ్యాచ్‌లోనే భారత్‌కు బిగ్‌ షాక్, కివీస్‌ చేతిలో ఘోర ఓటమి
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Manchu Vishnu on Nagarjuna Issue | నాగార్జున, సమంత, నాగచైతన్య వెంటే ఉంటాం | ABP DesamUdhaynidhi Stalin on Pawan Kalyan Comments | పవన్ కళ్యాణ్ కామెంట్స్ కి ఉదయనిధి కౌంటర్లు | ABP DesamIsrael attack in Beirut | హిజ్బుల్లా కీలకనేత సైఫుద్దీన్ చంపేసింది ఇక్కడే | ABP DesamIsrael attack in Beirut | లెబనాన్‌ యుద్ధ క్షేత్రంలో ABP News గ్రౌండ్ రిపోర్ట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy : రేవంత్ రెడ్డిపై సూపర్ సీనియర్స్ అసంతృప్తి - కాంగ్రెస్ కల్చర్‌ను రేవంత్ ఇంకా వంటబట్టించుకోలేదా?
రేవంత్ రెడ్డిపై సూపర్ సీనియర్స్ అసంతృప్తి - కాంగ్రెస్ కల్చర్‌ను రేవంత్ ఇంకా వంటబట్టించుకోలేదా?
Rajendra Prasad's Daughter: రాజేంద్ర ప్రసాద్ ఇంట్లో తీవ్ర విషాదం- గుండెపోటుతో కుమార్తె మృతి
Rajendra Prasad's Daughter: రాజేంద్ర ప్రసాద్ ఇంట్లో తీవ్ర విషాదం- గుండెపోటుతో కుమార్తె మృతి
Haryana Elections 2024: హర్యానా ఎన్నికల పోలింగ్ ప్రారంభం- 90 అసెంబ్లీ స్థానాలకు 1,031 మంది పోటీ
హర్యానా ఎన్నికల పోలింగ్ ప్రారంభం- 90 అసెంబ్లీ స్థానాలకు 1,031 మంది పోటీ
Women's World Cup 2024: ఆరంభ మ్యాచ్‌లోనే భారత్‌కు బిగ్‌ షాక్, కివీస్‌ చేతిలో ఘోర ఓటమి
ఆరంభ మ్యాచ్‌లోనే భారత్‌కు బిగ్‌ షాక్, కివీస్‌ చేతిలో ఘోర ఓటమి
Weather Today: బంగాళాఖాతంలో అల్పపీడనం- తెలుగు రాష్ట్రాల్లో పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్
బంగాళాఖాతంలో అల్పపీడనం- తెలుగు రాష్ట్రాల్లో పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్
Navaratri 3rd day: ఇంద్రకీలాద్రిపై మూడో రోజు శనివారం అన్నపూర్ణ దేవిగా దుర్గమ్మ - ఈ అలంకారం విశిష్టత ఇదే!
ఇంద్రకీలాద్రిపై మూడో రోజు శనివారం అన్నపూర్ణ దేవిగా దుర్గమ్మ - ఈ అలంకారం విశిష్టత ఇదే!
Mysuru Dasara 2024: దసరా ఉత్సవాలకు రారాజు  మైసూరు దసరా -  రాచరికం ఉట్టిపడేలా జంబూసవారి!
దసరా ఉత్సవాలకు రారాజు మైసూరు దసరా - రాచరికం ఉట్టిపడేలా జంబూసవారి!
Pawan Kalyan: 'అపవిత్ర చర్యలకు కారకులపై చట్టప్రకారం చర్యలు' - సుప్రీంకోర్టు తీర్పును స్వాగతించిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
'అపవిత్ర చర్యలకు కారకులపై చట్టప్రకారం చర్యలు' - సుప్రీంకోర్టు తీర్పును స్వాగతించిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
Embed widget