అన్వేషించండి

Satyabhama Serial Today August 19th: సత్యభామ సీరియల్: మైత్రీ, హరి మధ్య ఉన్న సంబంధం గురించి నిలదీసిన భార్యకు హరి ఏం సమాధానం చెప్పాడు

Satyabhama Today Episode August 19th: తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్న సత్యకు క్రిష్ ఎలాంటి సేవలు చేశాడు..నేటి సత్యభామ ఏపిసోడ్‌లో చూద్దాం.

Satyabhama Today Episode: బామ్మ మాటలకు భోజనం వద్ద నుంచి లేచి వెళ్లిపోయిన క్రిష్‌...సత్య బెడ్‌రూంలోకి వెళ్తాడు. నిద్రపోతున్న సత్యను చూసి నాకు నీపై నమ్మకం లేకకాదు సత్య(Satya)....నాపైనే నీకు నమ్మకం లేదు. అందుకే నీకు దూరం అవుదామనుకున్నా...కానీ నా వల్ల కావడం లేదంటాడు. ఆమె ముఖం మీద చేయి వేసి చూడగా....ఒళ్లు కాలిపోతుంది. జ్వరం వచ్చిందని అనుకుంటుంటగా  సత్యకు మెలకువ వచ్చి లేస్తుంది. హడావుడిగా సారీ అండీ టైం చూసుకోలేదు పది నిమిషాల్లోనే వంట చేస్తాను అంటూ లేవబోతుంది. నీకు జ్వరం వచ్చింది పడుకోమని క్రిష్(Krish) అంటాడు. నా మీద కోపం లేదా అని సత్య అడగ్గా...ఎలాంటి కోపం లేదని, కొండంత నమ్మకం ఉందని క్రిష్ చెబుతాడు. ఏం ఆలోచించకుండా ప్రశాంతంగా పడుకోమని చెబుతాడు. నేను డాక్టర్‌ను తీసుకుని వస్తానని చెప్పి వెళ్లిపోతాడు.
 
మైత్రీ తల్లిదండ్రులను తీసుకుని హరి పెళ్లిపత్రికలు ఇవ్వడానికి వెళ్లబోతున్నాడని తెలుసుకున్న నందిని(Nandini)....అతన్ని ఆపేందుకు రేపు సినిమాకు వెళ్దామని ప్రపోజల్ పెడుతుంది. దీన్ని ముందే గ్రహించిన హరి(Hari)..నాకు తెలుసు నువ్వు ఇలాంటిది ఏదో పెడతావని....నేను మైత్రీ వాళ్ల తల్లిదండ్రులతో బయటకు వెళ్తున్నాననే కదా నువ్వు ఈ ప్రోగ్రాం పెట్టావ్ అని మందలిస్తాడు. ప్రతిసారీ గొడవలు పెట్టుకోకుండా కాస్త అర్థం చేసుకోమంటాడు. 
 
నందిని: లేదు..మనం రేపు ఖచ్చితంగా సినామాకు వెళ్లాల్సిందే.
హరి: ప్రతిసారీ మొండితనం చేయడం మానేయి నందిని. పరిస్థితి అర్థం చేసుకో.
నందినీ: మొండితనం చేస్తుంది ఎవరు..? నేనా నువ్వా..? ఏ భార్య అయినా భర్త లవర్‌ను ఇంటికి రానిస్తుందా..? ముచ్చట్లు పెట్టనిస్తుందా..? నేను కాబట్టి చూస్తూ చూడనట్లు వదిలేస్తున్నా.. పెళ్లికి ముందు మీ మధ్య ఏం జరిగిందా అని అడగడం లేదు.? కానీ ఇప్పుడు నా కళ్ల ముందు ఏం జరిగినా ఊరుకోను అంటున్నా...? అది తప్పా..?
హరి: నేను పెళ్లికి ముందు మైత్రీని ఇష్టపడ్డ మాట నిజం... ఆ చిన్న విషయాన్ని పెద్దది చేసి రాద్దాంతం చేస్తున్నావ్.
నందని: మగాడివి కదా నీకు అది చిన్న విషయమే...ఆడదాన్ని కదా నా భయాలు నాకు ఉంటాయి..
హరి: ఇప్పుడు ఇందులో భయపడాల్సింది ఏముంది..? మైత్రి తన పెళ్లి పనుల్లో నా హెల్ప్‌ అడిగింది చేస్తానన్నాను..
నందిని: మైత్రీ నిన్ను హెల్ఫ్‌ అడగటం కాదు...నిన్ను ఎమోషనల్ బ్లాక్‌ మెయిల్ చేస్తోంది. నాకు తెలియదనుకున్నావా..?
హరి: ఎమోషనల్ బ్లాక్‌మెయిల్ ఏంటి.?
నందిని: తప్పదు కాబట్టి మైత్రి నీకు దూరమైంది కానీ...మనసులో నుంచి నిన్ను ఇంకా దూరం చేసుకోలేదు. మీ ఇద్దరి చూపుల్లో అది అర్థమవుతోంది.
హరి: పిచ్చిపిచ్చిగా మాట్లాడకు..
నందిని: ఉన్నమాటే అంటున్నా..  నా మనసుకు అనిపించింది అంటున్నా...నేను చెప్పింది తప్పయితే రేపు నువ్వు నన్ను సినిమాకు తీసుకుని వెళ్లు  నీ నిజాయితీ నిరూపించుకో.
హరి: నీ అనుమానాలు నీ దగ్గరే దాచిపెట్టుకో...రేపు నేను మైత్రీ పేరెంట్స్‌ను తీసుుకుని వెళ్తున్నా..‌అంతే
 
డాక్టర్ వచ్చి సత్యను పరిశీలించి జ్వరం ఎక్కువగా ఉందని ఇంజెక్షన్ చేసి వెళ్తుంది. ప్రతి రెండు గంటలకు ఒకసారి జ్యూస్ తాగించాలని చెబుతుంది. బామ్మ సత్యతో మీ అమ్మకు ఫోన్ చేసి పిలిపించమంటావా అంటుంది. మీరు ఉన్నారు కదా చూసుకోవడానికి అంటుంది. బామ్మ వెళ్లిపోగానే క్రిష్‌తో సత్య మాట్లాడుతుంది.  
సత్య: మన బంధం రెండునెలల్లో విడిపోతుందని తెలుసు.. ఎవరికి వాళ్లు అయిపోతామని తెలుసు. అయినా ఎందుకు నా గురించి ఇలా తాపత్రయపడుతున్నావ్..ఎందుకు నాకు సేవలు చేస్తున్నావ్ తెలుసుకోవచ్చా..
క్రిష్‌: ఈ రెండు నెలల్లో ఏమైనా జరగొచ్చని ఎవరో నాతో అన్నారు..
సత్య: ఏం జరగొచ్చంటా..?
క్రిష్: తెలియదు.
సత్య: గట్టిగా అడగొచ్చు కదా
క్రిష్: ఎవరిని
సత్య: నీతో ఆ మాటలు అన్నవారిని.
క్రిష్: అడిగి ఇబ్బంది పెట్టుడు నాకు ఇష్టం లేదు
సత్య: అడగకపోతే ఎలా తెలుస్తుంది
క్రిష్:  ఆ ముచ్చట చెప్పిన వాళ్లపై నాకు నమ్మకం ఉంది.
సత్య: కానీ చెప్పిన వాళ్లకు తాను చెప్పిన వాటిపై నమ్మకం ఉండాలి కదా
క్రిష్: పనికిరాని మాటలు చెప్పి విసిగించొద్దని మా బామ్మ చెప్పింది. కాబట్టి నువ్వు కళ్లు మూసుకుని రెస్ట్‌ తీసుకో అని చెప్పి వెళ్లిపోతాడు.
 
అటు నందిని, హరి మాటలు విన్న వాళ్ల అమ్మ హరి వద్దకు వచ్చి మాట్లాడుతుంది. నందిని మాటలు పట్టించుకోకమ్మా అని హరి నచ్చజెబుతాడు. కానీ మైత్రీని ఇష్టపడిన సంగతి మా దగ్గర ఎందుకు దాచావ్ అని అడుగుతుంది. దాచాలని ఏం అనుకోలేదు కానీ చెప్పే లోపే అనుకోకుండా నందిని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది అంటాడు. ఇక చెప్పాల్సిన అవసరం రాలేదంటాడు. చెల్లి పెళ్లి కోసం నీ ప్రేమను త్యాగం చేశావా అంటూ నిలదీస్తుంది.
 
ఇప్పటికీ నువ్వు మైత్రీనే ఇష్టపడుతున్నావా అని వాళ్ల అమ్మ అడుగుతుంది. కానీ నందినీ పెళ్లి చేసుకున్న తర్వాత....నందినీనే ఇష్టపడుతున్నానని వేరొకరిని మనసులోకి రానివ్వలేదని చెబుతాడు. ఈ విషయం నందినీకి చెప్పినా అర్థం కావడం లేదంటాడు. నమ్మించడం చేతకాకపోతే ఆ తప్పు నీదేనని...అనవసరంగా నందిని నిందించొద్దంటుంది. భర్త ప్రేమను గౌరవించే విశాల హృదయం ఏ భార్యకు ఉండదు అంటోంది. రేపు రావడం కుదరదని మైత్రీకి చెప్పు అని చెబుతుంది. నందినీకి మాటిచ్చాని చెప్పగా....ప్రేమించే వెనక్కి తగ్గావు..దానికన్నా ఇది పెద్ద విషయమేమీ కాదని చెబుతుంది. తను అర్థం చేసుకుంటుంది. రేపు మైత్రీకి పెళ్లయిన తర్వాత నువ్వు పదేపదే తన ఇంటికి వెళితే వాళ్ల ఆయన అపార్థం చేసుకోడా..? నందినీ కూడా అంతే. ఈ విషయం పెద్దదై మహాదేవయ్యగారి వద్దకు వెళ్తే ఏం జరుగుతుందో నువ్వు ఊహించు అంటుంది. మరుక్షణం సత్య ఈ ఇంట్లో ఉంటుంది. ఈ సమస్యను మొగ్గలోనే తుంచేయమంటుంది. నందినీని బాధపెట్టకుండా చూసుకోమంటుంది. దీంతో హరి నందిని వద్దకు వెళ్లి రేపు మనం సినిమాకు వెళ్తున్నామని చెబుతాడు. దీంతో ఆమె చాలా సంతోషిస్తుంది.
జ్వరంతో బాధపడుతున్న సత్యకు రాత్రంతా సేవలు చేస్తాడు క్రిష్...అందుకు ప్రతిగా సత్య ఉదయమే రూమ్ డెకరేషన్ చేసి థ్యాంక్సు చెబుతుంది. అవసరమా ఇదంతా అంటూ క్రిష్ కోప్పడతాడు. ప్రతిదీ హైలెట్ చేయాల్సిన పనిలేదంటాడు.దీనికి సత్య నేను అత్తయ్య ఛాలెంజ్‌ తీసుకుని బోనం ఎత్తుకుని వెళ్తే...నువ్వు ఎందుకు అంత కేర్ తీసుకున్నావ్‌..నన్ను గెలిపించడానికి ఎందుకు తాపత్రయపడ్డావ్ అని అడుగుతుంది. జ్వరం వచ్చి ఎవరూ పట్టించుకోకపోయినా...నువ్వు మాత్రం ఎందుకు సేవలు చేశావ్ అని నిలదీస్తుంది. రొటీన్‌గా తీసుకుని నా ఖర్మకు నన్ను వదిలేయోచ్చు కదా..నువ్వు కూడా క్యాజువల్‌గా ఫీల్ అవ్వొచ్చు కదా అంటూ ప్రశ్నించడంతో ఈరోజు ఏపిసోడ్ ముగిసిపోతుంది.
 

టాప్ హెడ్ లైన్స్

Suhasini: వెండి తెర నుంచి బుల్లితెరకు.. తొలి సినిమా, సీరియల్ హిట్.. సుహాసిని గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు
వెండి తెర నుంచి బుల్లితెరకు.. తొలి సినిమా, సీరియల్ హిట్.. సుహాసిని గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today June 27th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: విహారికి యాక్సిడెంట్.. సిరి పాప మిస్సింగ్..! పద్మాక్షి ఉలికి పాటు..! అసలు ఆ ఇంట్లో ఏం జరుగుతుంది?
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: విహారికి యాక్సిడెంట్.. సిరి పాప మిస్సింగ్..! పద్మాక్షి ఉలికి పాటు..! అసలు ఆ ఇంట్లో ఏం జరుగుతుంది?
Godavari Serial Today June 27th: 'గోదావరి' సీరియల్: సింహాద్రి అసలు రంగు జానుకి తెలిసిపోయిందా! రామారావు ఇంట్లో ఏం జరిగింది?
'గోదావరి' సీరియల్: సింహాద్రి అసలు రంగు జానుకి తెలిసిపోయిందా! రామారావు ఇంట్లో ఏం జరిగింది?
Karthika Deepam 2 Serial Today June 27th: కార్తీకదీపం 2 సీరియల్: జ్యోత్స్నని కఠినంగా శిక్షించమని కన్న తల్లి చెప్పడానికి కారణమేంటి? జ్యోత్స్నకి దీప అంటే చాలా ఇష్టమా.. ఇదేం ట్విస్టూ!
కార్తీకదీపం 2 సీరియల్: జ్యోత్స్నని కఠినంగా శిక్షించమని కన్న తల్లి చెప్పడానికి కారణమేంటి? జ్యోత్స్నకి దీప అంటే చాలా ఇష్టమా.. ఇదేం ట్విస్టూ!

వీడియోలు

Vinicius Jr History vs Scotland | రోనాల్డో రికార్డ్స్ సమం చేసిన వినీసియస్
IND W vs BAN W T20 World Cup Highlights | బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం
Shree Charani Creates History In T20 World Cup | శ్రీ చరణి హిస్టారికల్ రికార్డ్
94-Year-Old Woman Renounces US Citizenship | US సిటిజన్‌షిప్ వద్దని తిరిగొచ్చిన బామ్మ
Bhumika Ramesh Biography | మేఘసందేశం భూమి రియల్ లైఫ్ స్టోరీ ఇదే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Indiramma Housing Scheme: ఇందిరమ్మ లబ్ధిదారులకు అలర్ట్.. ఇళ్ల శ్లాబు సైజుపై ప్రభుత్వం కీలక ఉత్తర్వులు
ఇందిరమ్మ లబ్ధిదారులకు అలర్ట్.. ఇళ్ల శ్లాబు సైజుపై ప్రభుత్వం కీలక ఉత్తర్వులు
Afghanistan Earthquake: అఫ్గానిస్తాన్‌లో 6.2 తీవ్రతతో భారీ భూకంపం.. కాశ్మీర్ నుంచి ఢిల్లీ వరకు కంపించిన భూమి
అఫ్గానిస్తాన్‌లో 6.2 తీవ్రతతో భారీ భూకంపం.. కాశ్మీర్ నుంచి ఢిల్లీ వరకు కంపించిన భూమి
Tirumala Devotees Rush: తిరుమలలో అనూహ్య రద్దీ- సోమవారం వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
తిరుమలలో అనూహ్య రద్దీ- సోమవారం వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
Made in Jonnagiri Gold Biscuits: బులియన్ మార్కెట్‌లోకి ‘మేడ్ ఇన్ జొన్నగిరి’ గోల్డ్ బిస్కెట్లు - ఏపీ మ్యాప్‌తో సరికొత్తగా కర్నూలు స్వచ్ఛమైన బంగారం!
బులియన్ మార్కెట్‌లోకి ‘మేడ్ ఇన్ జొన్నగిరి’ గోల్డ్ బిస్కెట్లు - ఏపీ మ్యాప్‌తో సరికొత్తగా కర్నూలు స్వచ్ఛమైన బంగారం!
KTR Politics: కమాండ్ కంట్రోల్ సెంటర్ చూసి మేఘాలయ సీఎం సంగ్మా షాక్: కేటీఆర్
కమాండ్ కంట్రోల్ సెంటర్ చూసి మేఘాలయ సీఎం సంగ్మా షాక్: కేటీఆర్
NRI Priest Arrest: పూజల పేరుతో లక్షలు కొట్టేసి అమెరికా పారిపోయిన దొంగ పూజారి - రిటర్న్‌లో ఎయిర్‌పోర్టులో దిగగానే పట్టేసిన పోలీసులు
పూజల పేరుతో లక్షలు కొట్టేసి అమెరికా పారిపోయిన దొంగ పూజారి - రిటర్న్‌లో ఎయిర్‌పోర్టులో దిగగానే పట్టేసిన పోలీసులు
Vizag Land Scam: డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు స్థలం కబ్జా - విశాఖలో రూ. 2 కోట్ల ల్యాండ్ వివాదంపై కేసు నమోదు!
డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు స్థలం కబ్జా - విశాఖలో రూ. 2 కోట్ల ల్యాండ్ వివాదంపై కేసు నమోదు!
Jai Moondra Cricket Career: ఐర్లాండ్ తరపున దుమ్మురేపిన రాజస్థాన్ క్రికెటర్ జై ముంద్రా.. అసలు ఎవరితను ?
ఐర్లాండ్ తరపున దుమ్మురేపిన రాజస్థాన్ క్రికెటర్ జై ముంద్రా.. అసలు ఎవరితను ?
Embed widget