అన్వేషించండి

Naa Sami Ranga OTT: ఓటీటీలోకి 'నా సామిరంగ'- స్ట్రీమింగ్ ఎక్కడ? ఎప్పటి నుంచంటే..

నాగార్జున హీరోగా నటించిన ‘నా సామిరంగ’ ఓటీటీ స్ట్రీమింగ్ కు రెడీ అవుతోంది. సంక్రాంతి బరిలో నిలిచిన ఈ సినిమా త్వరలో డిజిటల్ రిలీజ్ కాబోతున్నట్లు డిస్నీ ప్లస్‌ హాట్‌ స్టార్‌ అధికారికంగా వెల్లడించింది.

Nagarjuna's Naa Saami Ranga Locks OTT Release Date: టాలీవుడ్ స్టార్ హీరో  అక్కినేని నాగార్జున ప్రధాన పాత్రలో రూపొందిన రీసెంట్ మూవీ ‘నా సామిరంగ’. సంక్రాంతి కానుకగా జనవరి 14న ఈ సినిమా విడుదల అయ్యింది. ఈ చిత్రంతో పాటు 'హనుమాన్‌', 'గుంటూరు కారం', 'సైంధవ' సినిమాలు సైతం రిలీజ్ అయ్యాయి. అయినప్పటికీ ఈ మూవీ మంచి విజయాన్ని అందుకుంది. వసూళ్ల పరంగానూ సత్తా చాటింది. గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన ఈ  యాక్షన్ ఎంటర్‌టైనర్‌ కు విజయ్ బిన్నీ దర్శకత్వం వహించారు. థియేటర్లలో ప్రేక్షకులను అలరించిన ఈ సినిమా ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందా? అని సినీ అభిమానులు ఎదురు చూస్తున్నారు.

ఫిబ్రవరి 17 నుంచి ‘నా సామిరంగ’ ఓటీటీ స్ట్రీమింగ్

ఈ నేపథ్యంలో ‘నా సామిరంగ’ ఓటీటీ విడుదలకు సంబంధించి ఆడియెన్స్ కు గుడ్ న్యూస్ అందింది. ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ను డిస్నీ+ హాట్‍ స్టార్ అధికారికంగా ప్రకటించింది. ఇప్పటికే ఈ మూవీ హక్కులను ఫ్యాన్సీ అమౌంట్ కు  డిస్నీ+ హాట్‍ స్టార్ సొంతం చేసుకుంది. తాజాగా ఈ సినిమాకు డిజిటల్ రిలీపై కీలక ప్రకటన చేసింది. ఫిబ్రవరి 17 నుంచి స్ట్రీమింగ్ అవుతుందని వెల్లడించింది. ఈ మేరకు నాగార్జున మీసం తిప్పే చిన్న క్లిప్ ను సదరు ఓటీటీ సంస్థ షేర్ చేసింది.

నాగార్జునకు కలిసి వచ్చిన సంక్రాంతి సెంటిమెంట్

1980 గ్రామీణ నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించారు దర్శకుడు విజయ్ బిన్నీ. ఈ చిత్రంలో నాగార్జున ఊర మాస్ గెటప్, అంతకు మించిన మాస్ యాక్షన్, అదిరిపోయే డైలాగుతు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. తన సినిమాలకు బాగా కలిసి వచ్చే సంక్రాంతికి ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు నాగార్జున. ఆయన సెంటిమెంట్ ఈ సారి కూడా వర్కౌట్ అయ్యింది. పెద్ద చిత్రాలతో గట్టి పోటీ ఎదురైనా ఈ సినిమా చక్కటి విజయాన్ని అందుకుంది. ఈ చిత్రంలో  నాగార్జున సరసన అషికా రంగనాథ్ హీరోయిన్‍గా నటించింది. యువ నటులు అల్లరి నరేష్, రాజ్ తరుణ్  కీలకపాత్రలు పోషించారు. ఈ చిత్రంలో నరేష్ కు జోడీగా మిర్నా మీనన్, రాజ్ తరుణ్ కు జోడీగా రుక్సాన్ థిల్లాన్ నటించింది.

శేఖర్ కమ్ముల, ధనుష్ చిత్రంలో నటిస్తున్న నాగ్

‘నా సామిరంగ’ సినిమా విజయం తర్వాత నాగార్జున ఏ ప్రాజెక్ట్ చేస్తున్నారు అనే విషయంలో ఇప్పటి వరకు ఎలాంటి క్లారిటీ లేదు. కానీ, శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తమిళ హీరో ధనుష్ ప్రధాన పాత్రలో ఓ సినిమా తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో నాగార్జున కీలక పాత్ర పోషించబోతున్నారు. ఈ విషయాన్ని చిత్రబృందం ఇప్పటికే అధికారికంగా ప్రకటించింది. అయితే, ఈ సినిమాలో ఆయన అతిథి పాత్రలో కనిపించబోతున్నారా? లేదంటే పూర్తి స్థాయిలో నటిస్తున్నారా? అనే విషయంపై మేకర్స్ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.  

Read Also: మెయిద్దీన్ భాయ్ కి షాక్! రజనీ మూవీకి మరీ ఇంత తక్కువ ఓపెనింగ్సా?

టాప్ హెడ్ లైన్స్

Aadarsha Kutumbam: వెంకీ మామ సినిమాలో డింపుల్ స్టెప్పులు... 'ఆదర్శ కుటుంబం'లో స్పెషల్ సాంగ్?
వెంకీ మామ సినిమాలో డింపుల్ స్టెప్పులు... 'ఆదర్శ కుటుంబం'లో స్పెషల్ సాంగ్?
Gundeninda Gudigantalu Sep17th: మనోజ్‌కోసం జావ కాసిన రోహిణి..కిచెన్‌లో నుంచి బయటకు గెంటేసిన ప్రభావతి
గుండెనిండా గుడిగంటలు: మనోజ్‌కోసం జావ కాసిన రోహిణి..కిచెన్‌లో నుంచి బయటకు గెంటేసిన ప్రభావతి
Karthika Deepam 2 Serial Today September 17th: కార్తీకదీపం 2 సీరియల్: నడిరోడ్డు మీద ఉన్న ఫ్యామిలీ కోసం కార్తీక్, దీపల వెతుకులాట! సూరజ్ సాయం!
కార్తీకదీపం 2 సీరియల్: నడిరోడ్డు మీద ఉన్న ఫ్యామిలీ కోసం కార్తీక్, దీపల వెతుకులాట! సూరజ్ సాయం!
Jagadhatri Serial Today September16th: కేదార్‌పై వైజయంతి,నిషిక హత్యాయత్నం..సమయానికి వచ్చి కాపాడిని రాగిణి
జగద్ధాత్రి సీరియల్: కేదార్‌పై వైజయంతి,నిషిక హత్యాయత్నం..సమయానికి వచ్చి కాపాడిని రాగిణి

వీడియోలు

Gundenininda Gudigantalu Serial September 11
India vs Afghanistan T20I Series 2026 | అఫ్గానిస్తాన్‌ సిరీస్‌కు ముందు టీమ్ ఇండియాకు బిగ్ రిలీఫ్
India Vs Afghanistan T20 | టీ20 మ్యాచ్‌ నిర్వహణకు ఢిల్లీ పోలీస్ గ్రీన్ సిగ్నల్
Women's Asia Cup 2026 IND vs BAN Semifinal | ఆసియా కప్‌ ఫైనల్లో టీమిండియా
Ashish Nehra India Head Coach Rumors | టీమిండియా కోచ్ పోస్ట్ పై నెహ్రా ఫన్నీ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
EPFO Wage Ceiling Hike: ఉద్యోగులకు కేంద్రం భారీ గుడ్ న్యూస్.. ఈపీఎఫ్ వేతన పరిమితి రూ.25 వేలకు పెంపు
ఉద్యోగులకు కేంద్రం భారీ గుడ్ న్యూస్.. ఈపీఎఫ్ వేతన పరిమితి రూ.25 వేలకు పెంపు
Death Sentence For Maoists: జీరమ్ లోయ ఊచకోత కేసు.. 10 మంది మావోయిస్టులకు మరణశిక్ష విధించిన NIA కోర్టు
జీరమ్ లోయ ఊచకోత కేసు.. 10 మంది మావోయిస్టులకు మరణశిక్ష విధించిన NIA కోర్టు
KCR Family Assets: కేసీఆర్ ఫ్యామిలీ భూముల వివరాలు, ఎవరి పేరిట ఎన్ని ఎకరాలు- సభలో వెల్లడించిన సీఎం రేవంత్ రెడ్డి
కేసీఆర్ ఫ్యామిలీ భూముల వివరాలు, ఎవరి పేరిట ఎన్ని ఎకరాలు- సభలో వెల్లడించిన సీఎం రేవంత్ రెడ్డి
CM Chandrababu In Tirumala: వేంకటేశ్వర స్వామివారి కృపతోనే ప్రాణాలతో ఉన్నా.. తిరుమలలో సీఎం చంద్రబాబు భావోద్వేగం
వేంకటేశ్వర స్వామివారి కృపతోనే ప్రాణాలతో ఉన్నా.. తిరుమలలో సీఎం చంద్రబాబు భావోద్వేగం
Viral News: విశాఖలో రోడ్డు పక్కన కుప్పలుగా పడి ఉన్న చిరిగిన కరెన్సీ నోట్లు 
విశాఖలో రోడ్డు పక్కన కుప్పలుగా పడి ఉన్న చిరిగిన కరెన్సీ నోట్లు 
AP Police Recruitment: ఏపీలో పోలీస్ కొలువులు.. 2050 ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్
ఏపీలో పోలీస్ కొలువులు.. 2050 ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్
YSRCP Vizianagaram: బొత్స కుటుంబానికి జగన్ బిగ్ షాక్ - నెల్లిమర్ల ఇన్‌ఛార్జ్ మార్పు వెనుక ఉత్తరాంధ్ర పొలిటికల్ గేమ్?
బొత్స కుటుంబానికి జగన్ బిగ్ షాక్ - నెల్లిమర్ల ఇన్‌ఛార్జ్ మార్పు వెనుక ఉత్తరాంధ్ర పొలిటికల్ గేమ్?
NRI Become IAS: ఎన్ఆర్ఐలు UPSC సివిల్ సర్వీసెస్ పరీక్షలు రాయొచ్చా?.. ఐఏఎస్ అవ్వాలంటే అర్హతలేంటి?
ఎన్ఆర్ఐలు UPSC సివిల్ సర్వీసెస్ పరీక్షలు రాయొచ్చా?.. ఐఏఎస్ అవ్వాలంటే అర్హతలేంటి?
Embed widget