అన్వేషించండి

NCERT Corruption in judiciary: న్యాయవ్యవస్థలో అవినీతి అంటూ 8వ తరగతి పుస్తకంలో పాఠాలు - తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సీజేఐ సూర్యకాంత్

NCERT new Class 8 book : ఎన్‌సీఈఆర్‌టీ తాజాగా ఎనిమిదో తరగతి పిల్లల కోసం విడుదల చేసిన పుస్తకంలో న్యాయవ్యవస్థలో అవినీతి ఉందని చెప్పడం కలకలం రేపుతోంది. సీజేఐ సుమోటోగా కేసు నమోదు చేయాలని ఆదేశించారు.

NCERT new Class 8 book lists corruption in judiciary: నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (NCERT) విడుదల చేసిన కొత్త క్లాస్ 8 సోషల్ సైన్స్ పాఠ్యపుస్తకంలో భారత న్యాయవ్యవస్థ ఎదుర్కొంటున్న సవాళ్లపై సంచలన అంశాలను చేర్చింది.  సమాజంలో న్యాయవ్యవస్థ పాత్ర  అనే అధ్యాయంలో మొదటిసారిగా  న్యాయవ్యవస్థలో అవినీతి, భారీగా పేరుకుపోయిన కేసులు  అనే అంశాలను ప్రధాన సవాళ్లుగా పేర్కొంది. గతంలో కేవలం న్యాయవ్యవస్థ నిర్మాణం, విధులను మాత్రమే వివరించే పాఠ్యపుస్తకం, ఇప్పుడు వ్యవస్థలోని లోపాలను కూడా విద్యార్థులకు పరిచయం చేస్తోంది.                                

న్యాయవ్యవస్థలో వివిధ స్థాయిలలో ప్రజలు అవినీతిని ఎదుర్కొంటున్నారని, దీనివల్ల పేదలకు, అణగారిన వర్గాలకు న్యాయం అందడం కష్టతరమవుతోందని ఈ పుస్తకం వివరించింది. న్యాయమూర్తులు కోర్టులో , వెలుపల కూడా ఖచ్చితమైన ప్రవర్తనా నియమావళిని పాటించాలని, తీవ్రమైన ఆరోపణలు వచ్చినప్పుడు పార్లమెంటు ద్వారా అభిశంసన తీర్మానం చేపట్టి వారిని తొలగించే అవకాశం ఉందని పేర్కొంది. అలాగే, 2017-2021 మధ్య కాలంలో కేంద్రీకృత ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ  ద్వారా సుమారు 1,600 ఫిర్యాదులు అందినట్లు గణాంకాలను వెల్లడించింది.  

దేశంలోని కోర్టులలో పెండింగ్‌లో ఉన్న కేసుల వివరాలను కూడా ఈ పాఠ్యపుస్తకం వెల్లడించింది. సుప్రీంకోర్టులో దాదాపు 81,000 కేసులు, హైకోర్టుల్లో 62.40 లక్షల కేసులు,  జిల్లా,దిగువ కోర్టుల్లో ఏకంగా 4.70 కోట్ల కేసులు పెండింగ్‌లో ఉన్నట్లు పేర్కొంది. న్యాయమూర్తుల కొరత, సంక్లిష్టమైన చట్టపరమైన విధానాలు ,మౌలిక సదుపాయాల లేమి కారణంగానే ఈ భారీ బ్యాక్‌లాగ్ ఏర్పడిందని పుస్తకంలో విశ్లేషించారు.  న్యాయం ఆలస్యం కావడం అంటే న్యాయాన్ని నిరాకరించడమే అనే వాక్యాన్ని ఇక్కడ ఉదహరించారు.            

 ఈ పాఠ్యపుస్తకంలోని అంశాలపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. న్యాయవ్యవస్థను కించపరిచేలా ఉన్న ఈ వ్యాఖ్యలను తాము అనుమతించబోమని, దీనిపై సుమోటోగా కేసు నమోదు చేస్తున్నామని ప్రధాన న్యాయమూర్తి  జస్టిస్ సూర్యకాంత్ ప్రకటించారు. న్యాయవ్యవస్థ ప్రతిష్టను దెబ్బతీసేలా విద్యార్థులకు బోధించడం ఆందోళనకరమని సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ కూడా కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Ind vs Eng 2nd Semi Final: సంజూ సెంచరీ మిస్.. టీ20 వరల్డ్ కప్‌లో భారత్ రికార్డ్ స్కోరు.. ఇంగ్లాండ్‌కు బిగ్ టార్గెట్
సంజూ సెంచరీ మిస్.. టీ20 వరల్డ్ కప్‌లో భారత్ రికార్డ్ స్కోరు.. ఇంగ్లాండ్‌కు బిగ్ టార్గెట్
Bengal governor resigns : బెంగాల్ రాజకీయాల్లో పెను మార్పు - గవర్నర్ ఆనంద బోస్ రాజీనామా!
బెంగాల్ రాజకీయాల్లో పెను మార్పు - గవర్నర్ ఆనంద బోస్ రాజీనామా!
India vs England 2nd Semi Final: ఇంగ్లాండ్‌ వర్సెస్ భారత్ ప్లేయింగ్ ఎలెవన్, పిచ్ రిపోర్ట్.. ఆ 5 ప్లేయర్లతో డేంజర్!
ఇంగ్లాండ్‌ వర్సెస్ భారత్ ప్లేయింగ్ ఎలెవన్, పిచ్ రిపోర్ట్.. ఆ 5 ప్లేయర్లతో డేంజర్!
ప్రారంభమైన Nissan Gravite 7 సీటర్ కారు డెలివరీ.. ఫ్యామిలీ కోసం బెస్ట్ ఆప్షన్, ధర, ఫీచర్ల వివరాలు
ప్రారంభమైన Nissan Gravite 7 సీటర్ కారు డెలివరీ.. ఫ్యామిలీ కోసం బెస్ట్ ఆప్షన్, ధర, ఫీచర్ల వివరాలు
Advertisement

వీడియోలు

Ind vs Eng 2nd Semi Final Preview | ఫైనల్ కు కివీస్ పిలుస్తోంది..ప్రత్యర్థి ఎవరో తేలేది నేడే | ABP Desam
Dinesh karthik Counter on Pak Matches | మైఖేల్ అథర్టన్, నాసిర్ హుస్సేన్ లకు డీకే మాస్ కౌంటర్ | ABP Desam
SA vs NZ Semis 1 Highlights | టీ20 వరల్డ్ కప్ 2026 ఫైనల్ కు దూసుకెళ్లిన న్యూజిలాండ్ | ABP Desam
South Africa ICC Bad Luck Continues | మరోసారి కప్పు లేకుండానే తిరుగుముఖం పట్టిన సౌతాఫ్రికా | ABP Desam
Sanju Samson 97 vs West Indies T20 World Cup | సంజూ శాంసన్ పరుగుల సునామీ
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ind vs Eng 2nd Semi Final: సంజూ సెంచరీ మిస్.. టీ20 వరల్డ్ కప్‌లో భారత్ రికార్డ్ స్కోరు.. ఇంగ్లాండ్‌కు బిగ్ టార్గెట్
సంజూ సెంచరీ మిస్.. టీ20 వరల్డ్ కప్‌లో భారత్ రికార్డ్ స్కోరు.. ఇంగ్లాండ్‌కు బిగ్ టార్గెట్
Tolichawki building collapses : ఐదో అంతస్తు నుండి పడిన భవన నిర్మాణ కార్మికులు - ముగ్గురు మృతి - టోలిచౌకీలో విషాదం
ఐదో అంతస్తు నుండి పడిన భవన నిర్మాణ కార్మికులు - ముగ్గురు మృతి - టోలిచౌకీలో విషాదం
Bengal governor resigns : బెంగాల్ రాజకీయాల్లో పెను మార్పు - గవర్నర్ ఆనంద బోస్ రాజీనామా!
బెంగాల్ రాజకీయాల్లో పెను మార్పు - గవర్నర్ ఆనంద బోస్ రాజీనామా!
India Condoles Khamenei Death: ఖమేనీ మృతిపై తొలిసారి స్పందించిన భారత్.. సంతాపం తెలిపిన విదేశాంగ శాఖ
ఖమేనీ మృతిపై తొలిసారి స్పందించిన భారత్.. సంతాపం తెలిపిన విదేశాంగ శాఖ
AP 10th Hall Tickets: ఏపీ టెన్త్ క్లాస్ హాల్‌ టికెట్లు విడుదల.. వాట్సాప్‌లో ఇలా డౌన్‌లోడ్‌ చేసుకోండి
ఏపీ టెన్త్ క్లాస్ హాల్‌ టికెట్లు విడుదల.. వాట్సాప్‌లో ఇలా డౌన్‌లోడ్‌ చేసుకోండి
Operation Decapitation: ట్రాఫిక్ కెమెరాల హ్యాకింగ్ నుండి బంకర్ బస్టర్ల వరకు.. ఖమేనీ అంతం వెనుక CIA, మోసాద్ మైండ్ బ్లోయింగ్ ప్లాన్!
ట్రాఫిక్ కెమెరాల హ్యాకింగ్ నుండి బంకర్ బస్టర్ల వరకు.. ఖమేనీ అంతం వెనుక CIA, మోసాద్ మైండ్ బ్లోయింగ్ ప్లాన్!
Mrithyunjay OTT : మృత్యుంజయ్ ఓటీటీ ప్లాట్ ఫాం ఫిక్స్ - ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
మృత్యుంజయ్ ఓటీటీ ప్లాట్ ఫాం ఫిక్స్ - ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
Speaker chit chat: వైసీపీ సభ్యులు సభకు వస్తేనే మసాలా - జగన్ జీతం తీసుకోవడం లేదు - స్పీకర్ అయ్యన్న కీలక వ్యాఖ్యలు
వైసీపీ సభ్యులు సభకు వస్తేనే మసాలా - జగన్ జీతం తీసుకోవడం లేదు - స్పీకర్ అయ్యన్న కీలక వ్యాఖ్యలు
Embed widget