Shivani Nagaram: తిరుమల స్వామివారి దర్శనం... 15 మినిట్స్ వివాదం... క్లారిటీ ఇచ్చిన శివానీ నాగారం
Shivani Nagaram Tirumala Controversy: తిరుమల దేవస్థానంలో శ్రీవారిని 15 నిమిషాల పాటు దర్శనం చేసుకున్నానని శివానీ నాగారం ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఆమె వ్యాఖ్యలపై తీవ్ర వ్యతిరేకత రాగా... వివరణ ఇచ్చారు.

తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏడు కొండల వెంకటేశ్వర స్వామి దర్శనం కొన్ని సెకన్లు దొరికితే చాలు అని ఎంతో మంది వెళ్తారు. ఒకట్రెండు నిమిషాల దర్శనంతో సంతృప్తి చెందే భక్తులు ఎంతో మంది. అంతకు మించి స్వామివారి ముందు నిలబడే అవకాశం రాదు. అటువంటిది పదిహేను నిమిషాల పాటు తనకు స్వామివారి దర్శన భాగ్యం కలిగిందని కథానాయిక శివానీ నాగారం చెప్పారు. ఆమె వ్యాఖ్యలపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అయ్యింది. ఈ నేపథ్యంలో ఆవిడ వివరణ ఇచ్చారు.
పదివేల రూపాయల టికెట్ కొన్నాను...
15 నిమిషాలు ఎవరూ టచ్ చేయలేదని కాదు!
'అంబాజీపేట మ్యారేజి బ్యాండు'తో కథానాయికగా పరిచయమైన తెలుగు అమ్మాయి శివానీ నాగారం. 'లిటిల్ హార్ట్స్'తో హిట్ అందుకున్నారు. సుహాస్ జంటగా శివానీ నటించిన రెండో సినిమా 'హే బల్వంత్'. తాజాగా విడుదలైంది. ఈ నేపథ్యంలో శివానీ నాగారం ఓ పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో పదిహేను నిమిషాల పాటు వెంకటేశ్వర స్వామివారి దర్శనం చేసుకున్నానని చెప్పారు. సోషల్ మీడియాలో ఆమె మాటలను ట్రోల్ చేశారు.
"అందరికీ నమస్కారం... నా పేరు శివాని నాగారం. నేను ఒక ఇంటర్వ్యూలో సక్సెస్ నుంచి చైల్డ్ హుడ్ జర్నీ, డివోషనల్ & స్పిరిచువల్ జర్నీ షేర్ చేసుకున్నా. ఆ క్రమంలో తిరుపతి గురించి మాట్లాడాను. నా 15 మినిట్స్ దర్శనం అనేది కొంచెం హైలైట్ అవుతోంది. అందుకు క్లారిటీ ఇవ్వడానికి ఈ వీడియో చేస్తున్నాను. గత ఏడాది (2025) అక్టోబర్లో ఎయిర్ పోర్ట్లో 10,500 శ్రీవాణి దర్శనం టికెట్ తీసుకున్నాం. నేను, మా అమ్మ లైనులో నిలబడి టికెట్ తీసుకున్నామండి. మా ఆధార్ కార్డులు అవన్నీ ఇచ్చాం. ఆ టికెట్స్ తీసుకున్నాక దర్శనం జరిగింది. ఆ 15 మినిట్స్ అని చెప్పడంలో నా మెయిన్ మోటివ్ ఏమిటంటే... లైనులో బిగినింగ్ నుంచి స్వామి వారి దగ్గరకు వెళ్ళినంత వరకు కొంచెం కొంచెం స్వామి వారు కనిపిస్తూ ఉంటారు. అది 15 మినిట్స్ అని నేను అందాజాగా ఫీలయ్యి... నేను 15 మినిట్స్ అన్నాను తప్ప ఆ పదిహేను నిమిషాలు నన్ను ఎవరు టచ్ చేయలేదని కాదు'' అని శివానీ నాగారం తెలిపారు.
View this post on Instagram
గతంలో స్వామివారి దర్శనం కోసం వెళ్ళినప్పుడు ఐదారు నిమిషాలు మాత్రమే భాగ్యం కలిగిందని శివానీ నాగారం చెప్పారు. ''ఇంతకు ముందు కూడా నేను సినిమాలు చేశాక... 300 రూపాయల సర్వ దర్శనం టికెట్ తీసుకొని మా ఫ్యామిలీతో వెళ్ళా. అప్పుడు కేవలం ఐదారు సెకన్లు మాత్రమే స్వామి వారిని దర్శించుకున్నా. నా జీవితంలో మొదటిసారి... 13 ఏళ్ళ తర్వాత స్వామి వారిని అంత దగ్గరగా చూశా. అది నేను చాలా హ్యాపీగా ఫీలయ్యి ఎక్సైట్మెంట్ తో చాలా షేర్ చేసుకున్నా. అయితే అది కొంచెం వేరే విధంగా వెళుతోంది. నాకు మాత్రమే కాదు... శ్రీవాణి దర్శనం టికెట్ తీసుకుని ఎవరు వెళ్లినా స్వామి వారి దర్శనం దగ్గరగా, చాలా మంచిగా జరుగుతుంది. దీనిపైన క్లారిటీ ఇవ్వడం బాధ్యతగా అనిపించి ఈ వీడియో చేశా'' అని తన టికెట్స్ చూపించారు శివానీ నాగారం.
Before You Go
Jaya Chiravuri Serials and US Life | జయ చిరవూరి రోజుకి ఎంత సంపాదిస్తుందో తెలుసా?
ట్రెండింగ్ వార్తలు






















