Abhishek Sharma Dropped T20 World Cup | టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్లో భారీ మార్పులు | ABP Desam
దక్షిణాఫ్రికా చేతిలో 76 పరుగుల తేడాతో టీమిండియా ఓడిపోవడంతో ఫ్యాన్స్ మాత్రమే కాదు మాజీ ప్లేయర్స్ కూడా మండిపడుతున్నారు. ఈ ఓటమి సెమీస్ అవకాశాలను కష్టం చేయడంతో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ( Gautam Gambhir ) కొత్త ప్లాన్ వేసారట. జింబాబ్వే, వెస్టిండీస్లతో జరగబోయే 'డూ ఆర్ డై' మ్యాచ్ల కోసం ప్లేయింగ్ ఎలెవన్లో భారీ మార్పులకు గంభీర్ సిద్ధమైయ్యాడు.
వరుస వైఫల్యాలతో సతమతమవుతున్న యువ ఓపెనర్ అభిషేక్ శర్మపై ( Abhishek Sharma ) వేటు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. పాకిస్థాన్, నెదర్లాండ్స్ మ్యాచుల్లో డకౌట్ అయిన అభిషేక్, సౌతాఫ్రికాపై కూడా కేవలం 15 పరుగులే చేసి నిరాశపరిచాడు. దీంతో అతని స్థానంలో సంజూ శాంసన్ ( Sanju Samson ) ను జట్టులోకి తీసుకోవాలని మేనేజ్మెంట్ భావిస్తోంది.
ప్రస్తుతం భారత టాపార్డర్ అంతా ఎడమచేతి వాటం బ్యాటర్లతోనే నిండిపోయింది. ఇది ప్రత్యర్థి స్పిన్నర్లకు అనుకూలంగా మారుతుండటంతో, రైట్-లెఫ్ట్ కాంబినేషన్ కోసం సంజూను తీసుకురావడం బెస్ట్ అని కోచింగ్ స్టాఫ్ భావిస్తోంది. సెమీస్ చేరాలంటే తదుపరి రెండు మ్యాచ్ల్లో భారీ విజయాలు సాధించాలి. ఈ క్రమంలో గంభీర్ తనదైన శైలిలో కఠిన నిర్ణయాలు తీసుకోబోతున్నారు. మరి సంజూ శాంసన్ రాకతో టీమిండియా తలరాత మారుతుందా లేదా చూడాలి.
ట్రెండింగ్ వార్తలు

















