Vidyu Raman Covid: ఐదు రోజులుగా క్వారంటైన్లో... కరోనా బారిన మరో సెలబ్రిటీ?
కరోనా బారిన పడిన సెలబ్రిటీల జాబితాలో మరొకరు చేరినట్టు తెలుస్తోంది.

నటి విద్యుల్లేఖ కొవిడ్ 19 బారిన పడ్డారా? అంటే... ఆమె మాటలు చూస్తే అలాగే అనిపిస్తోంది. ఐదు రోజుల నుంచి హోమ్ క్వారంటైన్లో ఉంటున్నట్టు ఆమె తెలిపారు. అయితే... తనకు కరోనా స్పష్టంగా చెప్పలేదు. మనం అర్థం చేసుకోవాలి. అంతే! "నా సంక్రాంతి పాజిటివ్గా కనిపిస్తోంది. ఐదు రోజుల క్రితం (కరోనా) టెస్ట్ చేయించుకున్నాను. అప్పటి నుంచి హోమ్ క్వారంటైన్లోనే ఉంటున్నాను. సంజు (విద్యుల్లేఖ భర్త పేరు) కూడా తనకు తానుగా ఐసోలేట్ అయ్యాడు. తనకు నెగెటివ్ అని వచ్చింది. ఈ సంక్రాంతిని ఎప్పటికీ మర్చిపోలేను. అందరూ మాస్క్లు ధరించండి. భౌతిక దూరం పాటించడం. సేఫ్గా ఉండండి" అని విద్యుల్లేఖా రామన్ సోషల్ మీడియాలో పేర్కొన్నారు.
View this post on Instagram
ఎంత జాగ్రత్తగా ఉన్నప్పటికీ ప్రజలను కరోనా వదిలిపెట్టడం లేదు. జనవరి ప్రారంభం నుంచి పలువురు సినిమా సెలబ్రిటీలు కరోనా బారిన పడ్డారు. వారిలో సూపర్ స్టార్ మహేష్ బాబు, హీరో మంచు మనోజ్, నటి లక్ష్మీ మంచు, వరలక్ష్మీ శరత్ కుమార్, హీరోయిన్ త్రిష తదితరులు ఉన్నారు. వీరందరికీ ఇప్పుడు కొవిడ్ నెగెటివ్ అని తేలింది. కీర్తీ సురేష్ కరోనా నుంచి కోలుకుంటున్నారు.
Also Read: పెళ్లి తర్వాత బరువు పెరిగిన బుజ్జమ్మ! అంతకు ముందు ఎంత తగ్గింది? ఎందుకు తగ్గింది? అంటే...
Also Read: చిరంజీవికి మద్దతు ప్రకటించిన విజయ్ దేవరకొండ
Also Read: రావణాసుర... ఎంతమంది హీరోయిన్లు ఉన్నారో చూశారా?
Also Read: 'బంగార్రాజు' మూవీ రివ్యూ: నాగ్ vs చైతు.. బంగార్రాజులు అదరగొట్టారా?
Also Read: రౌడీ బాయ్స్ రివ్యూ: యూత్ని మెప్పించే రౌడీ బాయ్స్..
Also Read: 'సూపర్ మచ్చి' రివ్యూ: సూపర్ అనేలా ఉందా? లేదా?
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్స్క్రైబ్ చేయండి
Before You Go
Bhumika Ramesh Biography | మేఘసందేశం భూమి రియల్ లైఫ్ స్టోరీ ఇదే
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు






















