అన్వేషించండి

CBSE 12th Result 2026: సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాలను విడుదల.. 85.20 శాతం మంది ఉత్తీర్ణత.. రిజల్ట్స్ లింక్

CBSE Class 12 Result 2026: CBSE బోర్డు బుధవారం 12వ తరగతి ఫలితాలను విడుదల చేసింది. విద్యార్థులు results.cbse.nic.in అనే అధికారిక వెబ్‌సైట్‌లో తమ ఫలితాలను చూసుకోవచ్చు.

కేంద్ర మాధ్యమిక విద్యా బోర్డు (CBSE) 12వ తరగతి ఫలితాలను బుదవారం విడుదల చేసింది. విద్యార్థులు తమ ఫలితాలను, మార్క్‌షీట్‌లను CBSE అధికారిక వెబ్‌సైట్లు cbse.gov.in , results.cbse.nic.in లో అందుబాటులో ఉన్న డైరెక్ట్ లింక్ ద్వారా తనిఖీ చేసుకోవచ్చు. https://cbseresults.nic.in/

ఆన్‌లైన్‌తో పాటు ఇంటర్ విద్యార్థులు ఇంటర్నెట్ లేకుండా కూడా తమ ఫలితాలను తెలుసుకునే అవకాశాన్ని కల్పించారు. ఈసారి మొత్తం ఉత్తీర్ణత శాతం 85.20 శాతంగా నమోదైంది. గత ఏడాది ఈ గణాంకం 88.39 శాతంగా ఉంది. ఈ ఏడాది సుమారు 3.19 శాతం తగ్గుదల నమోదైంది. పేపర్ స్థాయి, కఠినమైన వాల్యుయేషన్, కొత్త డిజిటల్ ప్రక్రియ ఈ మార్పునకు కారణం కావచ్చునని నిపుణులు భావిస్తున్నారు.

ఎంత మంది విద్యార్థులు పరీక్ష రాశారు?
ఈ ఏడాది 17 లక్షల కంటే ఎక్కువ మంది విద్యార్థులు పరీక్ష కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. వీరిలో 16.8 లక్షల మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. ఫలితాల్లో దాదాపు 15 లక్షల మంది విద్యార్థులు పాస్ అయినట్లు ప్రకటించారు. ఇంత భారీ సంఖ్యలో విద్యార్థులు ఉండటం అనేది దేశంలోని అతిపెద్ద విద్యా కార్యక్రమాలలో ఈ బోర్డు పరీక్ష ఒకటని తెలియజేస్తోంది. 

బాలికలదే పైచేయి 
ప్రతి ఏటా లాగే ఈసారి కూడా అమ్మాయిలే పైచేయి సాధించారు. బాలికల ఉత్తీర్ణత శాతం 88.86 శాతం కాగా, బాలురది 82.13 శాతం. అంటే అమ్మాయిలు సుమారు 6.73 శాతం ముందున్నారు. ఈ వ్యత్యాసం కేవలం అంకెలు మాత్రమే కాదు, చదువులో అమ్మాయిల ఫలితాలు పెరగడం మార్పును సూచిస్తుంది. 

టాప్ రీజియన్లు ఏవి?
తిరువనంతపురం (కేరళ): అత్యధికంగా సుమారు 99 శాతం ఉత్తీర్ణతతో అద్భుతం చేసింది. 

విజయవాడ, చెన్నై: ఇవి కూడా టాప్ రీజియన్లలో చోటు దక్కించుకున్నాయి. 

ప్రయాగ్‌రాజ్, పాట్నా వంటి ప్రాంతాల ప్రదర్శన చాలా తక్కువగా ఉంది. అక్కడ మెరుగుపడాల్సిన అవసరం చాలా ఉంది. 

ఢిల్లీలో ప్రదర్శన
దేశ రాజధాని ఢిల్లీ ఫలితాలు కూడా సంతృప్తికరంగా ఉన్నాయి.

ఢిల్లీ వెస్ట్: సుమారు 92.3 శాతం

ఢిల్లీ ఈస్ట్: సుమారు 91.73 శాతం

ఓవరాల్ ఢిల్లీ: సుమారు 91.9 శాతం

డిజిటల్ వ్యవస్థతో వచ్చిన మార్పు
ఈ ఏడాది ఫలితాల ప్రక్రియలో అతిపెద్ద ప్రత్యేకత పేపర్ల మూల్యాంకనంలో కొత్త విధానం అమలు చేస్తున్నారు. సీబీఎస్ఈ బోర్డు On-Screen Marking (OSM) వ్యవస్థను అమలు చేసింది. దీని వల్ల కలిగే ప్రయోజనాలు ఇలా ఉన్నాయి. 

పేపర్లు ఆన్‌లైన్‌లో మూల్యాంకనం చేశారు. 

మానవ తప్పిదాల అవకాశం పూర్తిగా తగ్గింది.

రిజల్ట్స్ కోసం టైం ఆదా అయ్యింది.

మొత్తం ప్రక్రియ మరింత పారదర్శకంగా మారింది.

UMANG యాప్ ద్వారా ఫలితాలు
UMANG యాప్ ఓపెన్ చేసి లాగిన్ అవ్వాలి

సెర్చ్ బాక్స్‌లో CBSE Service అని సెర్చ్ చేయండి.

“Class 12 Result” ఆప్షన్‌పై క్లిక్ చేయండి.

మీ వివరాలను ఫిల్ చేయగానే ప్రొవిజనల్ మార్క్‌షీట్ స్క్రీన్‌పై కనిపిస్తుంది.

విద్యార్థులు దీనిని డౌన్‌లోడ్ చేసుకుని సేవ్ చేసుకోవాలి.

DigiLocker ద్వారా ఫలితాల చెక్ చేయండి
- విద్యార్థులు DigiLocker యాప్ లేదా digilocker.gov.in వెబ్‌సైట్‌కు వెళ్లండి.

- నమోదిత మొబైల్ నంబర్ లేదా ఇతర ఐడెంటిటీ వివరాలతో లాగిన్ అవ్వండి.

- తరువాత Education సెక్షన్‌లోకి వెళ్లి CBSEని ఎంచుకోండి.

- అక్కడ “Class 12 Marksheet” పై క్లిక్ చేయండి.

- రోల్ నంబర్, అవసరమైన సమాచారాన్ని ఫిల్ చేయగానే మార్క్‌షీట్ స్క్రీన్‌పై కనిపిస్తుంది. ఆ షీట్ డౌన్‌లోడ్ చేసుకుని ప్రింట్ తీసిపెట్టుకోవడం మంచిది. 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

NEET Re Exam 2026 Issue: బురఖా తీసేస్తేనే ఎంట్రీ అన్న సిబ్బంది.. పరీక్ష రాయనని తెగేసి చెప్పిన విద్యార్థిని!
బురఖా తీసేస్తేనే ఎంట్రీ అన్న సిబ్బంది.. పరీక్ష రాయనని తెగేసి చెప్పిన నీట్ అభ్యర్థి!
Student Punishment: కృష్టా జిల్లాలో స్కూల్లో అమానుషం.. బాలుడిని రోజంతా గడ్డిలో కూర్చోబెట్టిన టీచర్!
కృష్టా జిల్లాలో స్కూల్లో అమానుషం.. బాలుడిని రోజంతా గడ్డిలో కూర్చోబెట్టిన టీచర్!
NEET Re Exam 2026: నీట్ యూజీ రీ ఎగ్జామ్.. అభ్యర్థులకు NTA కీలక సూచనలు, వీటిని సెంటర్లోకి అనుమతించరు
నీట్ యూజీ రీ ఎగ్జామ్.. అభ్యర్థులకు NTA కీలక సూచనలు, వీటిని సెంటర్లోకి అనుమతించరు
NEET Re-Exam: నాగ్‌పూర్ విద్యార్థికి అబుదాబి సెంటర్ వేయడానికి కారణాలు ఇవే.. ప్రాబ్లం క్లియర్ చేసిన NTA
నాగ్‌పూర్ విద్యార్థికి అబుదాబి సెంటర్ వేయడానికి కారణాలు ఇవే.. ప్రాబ్లం క్లియర్ చేసిన NTA
Advertisement

వీడియోలు

India vs Afghanistan 3rd ODI | చెన్నై వన్డేలో భారత్ క్లీన్ స్వీప్ ఖాయమా?
Shreyanka Patil Ruled Out World Cup | వరల్డ్ కప్ నుండి శ్రేయాంక పాటిల్ అవుట్
Yuvraj Singh as Delhi Capitals Coach IPL 2027 | ఢిల్లీ క్యాపిటల్స్ కోచ్‌గా యువరాజ్ సింగ్
Chandrababu With Baba Ramdev | ఉండవల్లిలో బాబా రామ్‌దేవ్‌తో సీఎం చంద్రబాబు
Godavari Heroine Anumita Dutta Life Story | గోదావరి సీరియల్ హీరోయిన్ జాను బ్యాక్‌గ్రౌండ్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
SA W Defeats IND W T20 World Cup: ప్రొటీస్ చేతిలో కంగుతిన్న టీమిండియా.. మరిజానే కాప్ ఆల్‌రౌండ్ విధ్వంసం, రికార్డు పుటల్లోకి హర్మన్ ప్రీత్..
ప్రొటీస్ చేతిలో కంగుతిన్న టీమిండియా.. మరిజానే కాప్ ఆల్‌రౌండ్ విధ్వంసం, రికార్డు పుటల్లోకి హర్మన్ ప్రీత్..
Jogi Ramesh On Illegal Mining: ఆగర్భ శ్రీమంతుడు కాదు.. భూగర్భ దోపిడీదారుడు! టీడీపీ ఎమ్మెల్యేపై చర్యలకు జోగి రమేష్ డిమాండ్
ఆగర్భ శ్రీమంతుడు కాదు.. భూగర్భ దోపిడీదారుడు! టీడీపీ ఎమ్మెల్యేపై చర్యలకు జోగి రమేష్ డిమాండ్
Vizag Techie Radha Gayatri Case: వైజాగ్ టెకీ రాధా గాయత్రి మృతి.. భర్త శ్రీచరణ్‌పై హత్యాయత్నం కేసు నమోదు చేసిన పోలీసులు
వైజాగ్ టెకీ రాధా గాయత్రి మృతి.. భర్త శ్రీచరణ్‌పై హత్యాయత్నం కేసు నమోదు చేసిన పోలీసులు
Telangana Politics: రాహుల్ గాంధీతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేయండి: సీఎం రేవంత్ రెడ్డికి రామచందర్ రావు లేఖ
రాహుల్ గాంధీతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేయండి: సీఎం రేవంత్ రెడ్డికి రామచందర్ రావు లేఖ
NEET Re Exam 2026 Issue: బురఖా తీసేస్తేనే ఎంట్రీ అన్న సిబ్బంది.. పరీక్ష రాయనని తెగేసి చెప్పిన విద్యార్థిని!
బురఖా తీసేస్తేనే ఎంట్రీ అన్న సిబ్బంది.. పరీక్ష రాయనని తెగేసి చెప్పిన నీట్ అభ్యర్థి!
Suriya 47 : సూర్య సినిమాలో మోహన్ లాల్ - అసలు నిజం ఏంటో చెప్పిన డైరెక్టర్
సూర్య సినిమాలో మోహన్ లాల్ - అసలు నిజం ఏంటో చెప్పిన డైరెక్టర్
Vaibhav Sooryavanshi World Record: వైభవ్ సూర్యవంశీ విధ్వంసం: లంక జట్టుపై 11 బంతుల్లోనే హాఫ్ సెంచరీ.. 21 ఏళ్ల రికార్డ్ స్మాష్!
వైభవ్ సూర్యవంశీ విధ్వంసం: లంక జట్టుపై 11 బంతుల్లోనే హాఫ్ సెంచరీ.. 21 ఏళ్ల రికార్డ్ స్మాష్!
Peddi : పెద్ది బ్లాక్ బస్టర్ ఈవెంట్ - వెన్యూ, డేట్ అండ్ టైం ఫిక్స్... మెగాస్టార్ వస్తారా?
పెద్ది బ్లాక్ బస్టర్ ఈవెంట్ - వెన్యూ, డేట్ అండ్ టైం ఫిక్స్... మెగాస్టార్ వస్తారా?
Embed widget