అన్వేషించండి

NEET Paper Leak: రద్దు అయిన నీట్ యూజీ 2026 రీ ఎగ్జామ్‌ ఎప్పుడంటే?  మళ్లీ ఫీజు చెల్లించాలా? పాత హాల్‌టికెట్‌ ఉంటే చాలా?

పేపర్ లీక్ ఆరోపణలతో నీట్ యూజీ 2026 పరీక్షలను కేంద్రం రద్దు చేసింది. ఇద్దరు మాస్టర్ మైండ్‌లను అదుపులోకి తీసుకున్నారు. ఇంత వరకు ఓకే కానీ రీ ఎగ్జామ్ ఎప్పుడు పెడతారనే టెన్షన్ విద్యార్థుల్లో ఉంది. 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • నీట్ యూజీ పరీక్షలో ప్రశ్నపత్రం లీక్, 120 ప్రశ్నలు సరిపోలాయి.
  • పేపర్ లీక్ కేసులో కీలక సూత్రధారులు అరెస్ట్, సీబీఐకి విచారణ.
  • జూన్ నెలలో నీట్ యూజీ రీ-ఎగ్జామ్, కొత్త అడ్మిట్ కార్డులు జారీ.

NEET UG New Exam Date: భారత్‌లో వైద్య విద్యలో ప్రవేశాల కోసం నిర్వహించే అతి పెద్ద ప్రవేశ పరీక్ష నీట్ యూజీ (NEET UG 2026) ప్రస్తుతం తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోంది. మే 3వ తేదీన దేశవ్యాప్తంగా జరిగిన ఈ పరీక్షలో ప్రశ్నపత్రం లీక్ అయిందన్న ఆరోపణలు రావడంతో, అధికారులు పరీక్షను రద్దు చేయాలని నిర్ణయించారు. ఈ నిర్ణయం సుమారు 22 లక్షల మంది విద్యార్థులపై ప్రభావం చూపుతోంది. ఈ కుంభకోణం వెనుక ఉన్న వ్యక్తులు ఎవరు? విద్యార్థులు ఇప్పుడు ఏం చేయాలి? మళ్లీ పరీక్ష ఎప్పుడు ఉంటుంది? వంటి కీలక అంశాల గురించి తెలుసుకుందాం. 

పరీక్ష రద్దుకు కారణం ఏంటీ?

మే 3న నిర్వహించిన నీట్ పరీక్షలో అక్రమాలు జరిగినట్టు ప్రాథమిక విచారణలో తేలింది. ప్రధానంగా రాజస్థాన్‌కు చెందిన స్పెషల్ ఆపరేషన్ గ్రూప్‌ జరిపిన దర్యాప్తులో దిగ్భ్రాంతికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. దర్యాప్తు అధికారులు ఒక చేతితో రాసిన గెస్‌ పేపర్‌ స్వాధీనం చేసుకున్నారు. ఆ పత్రంలో ఉన్న ప్రశ్నలను అసలు పరీక్షా పత్రంతో పోల్చి చూడగా ఏకంగా 120 ప్రశ్నలు మ్యాచ్ అయినట్టు పోలీసులు గుర్తించారు. ఇందులో 90 బయాలజీ ప్రశ్నలు, 30 కెమిస్ట్రీ ప్రశ్నలు ఉన్నట్టు సమాచారం.  ఇంత భారీ స్థాయిోల ప్రశ్నలు ముందే బయటకు రావడంతో పరీక్ష పారదర్శకతపై నమ్మకం సన్నగిల్లింది. ఫలితంగా పరీక్ష రద్దుకు దారి తీసింది. 

నిందితులు ఎవరు? దర్యాప్తు ఎక్కడ వరకు వచ్చింది?

ఈ పేపర్ లీక్ వ్యవహారంలో కీలక సూత్రధారులుగా భావిస్తున్న మనీష్‌ యాదవ్, రాకేష్‌ మాండవ్రియాలను రాజస్థాన్‌ ఎస్‌ఓజీ పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు. ఈ నెట్‌వర్క్ ఇంకా ఎంత మందికి విస్తరించిందనే కోణంలో విచారణ సాగుతోంది. అయితే ఈ కేసు తీవ్రతను పరిగణలోకి తీసుకున్న కేంద్ర ప్రభుత్వం, ఈ వ్యవహారాన్ని సమగ్రంగా విచారించేందుకు సీబీఐకి బాధ్యతలు అప్పగించింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ  కూడా సీబీఐకి సహకారం అందిస్తామని అవసరమైన రికార్డులు, సాక్ష్యాలు అందజేస్తామని స్ఫష్టం చేసింది. 

రీ ఎగ్జామ్‌ ఎప్పుడు ఉంటుంది?

పరీక్ష రద్దు కావడంతో విద్యార్థులంతా తదుపరి పరీక్ష తేదీ కోసం ఎదురు చూస్తున్నారు. అధికారిక సమాచారం ప్రకారం నీట్ యూజీ 2026 రీ- ఎగ్జా్‌ జూన్‌ నెలలో నిర్వహించే అవకాశం ఉంది. గతంలో 2024లో ఇలాంటి పరిస్థితుల్లో పరీక్ష రద్దు అయినప్పుడు జూన్ 23న రీ ఎగ్జామ్ నిర్వహించారు. కాబట్టి విద్యార్థులు జూన్ మాసంలో పరీక్షకు సిద్ధంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. పూర్తి స్థాయి ఫలితాలు ఈ రీ ఎగ్జామ్‌ పూర్తి అయిన తర్వాతే విడుదలవుతాయి. 

విద్యార్థులకు కీలక సమాచారం 

పరీక్ష రద్దు, రీ ఎగ్జామ్‌ప్రక్రియపై విద్యార్థులు, తల్లిదండ్రులకు ఉన్న సందేహాలను ఎన్టీఏ కొన్ని వివరణలు ఇచ్చింది. 

రీ ఎగ్జామ్‌ కోసం విద్యార్థులు కొత్తగా దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదు. మే 2026 పరీక్ష కోసం మీరు ఇచ్చిన వివరాలు, అభ్యర్థిత్వం, మీరు ఎంచుకున్న పరీక్షా కేంద్రాల సమాచారమే తదుపరి పరీక్షకు వర్తిస్తుంది. మళ్లీ ఫీజు కట్టాల్సిన పని లేదు. రీ ఎగ్జామ్‌ కోసం ఎటువంటి అనపు ఫీజు వసూలు చేయరు. అంతే కాకుండా గతంలో చల్లించిన ఫీజును రీ ఫండ్ చేస్తామని, ఎన్టీఏ తన అంతర్గత వనరులతోనే ఈ పరీక్షను మళ్లీ నిర్వహిస్తారు. 

పాత హాల్ టికెట్ చెల్లదు. రీ ఎగ్జామ్‌ కోసం ఎన్టీఏ కొత్త అడ్మిట్ కార్డులను జారీ చేస్తుంది. పరీక్ష తేదీలు, అడ్మిట్ కార్డుల షెడ్యూల్‌ను అధికారిక వెబ్‌సైట్ ద్వారా వెల్లడిస్తారు. సోషల్ మీడియాలో వచ్చే అనధికార వార్తలను నమ్మొద్దని ఎన్టీఏ హెచ్చరించింది. 

వైద్య విద్య అనేద దేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైంది. ఒక సీటు కోసం లక్షలాది మంది పోటీ పడుతున్నారు. 22 లక్షల మంది హాజరైన పరీక్షలో ఇలాంటి అక్రమాలు జరగడం విద్యార్థుల మానిక స్థైర్యాన్ని దెబ్బతీస్తుంది. అయితే విద్యార్థులు నిరాశ చెందకుండా, రీ ఎగ్జామ్ కోసం తన ప్రిపరేషన్ కొనసాగించడం మంచిది. పరీక్షకు సంబంధించిన తాజా అప్‌డేట్ కోసం విద్యార్థులు ఎన్టీఏ హెల్‌పైన్ నెంబర్‌లు 011-40759000/011-68227700కు కాల్ చేయవచ్చు లేదా neetug2026@nta.ac.inకు మెయిల్ చేయవచ్చు. అధికారి సమాచారం కోసం neet.nta.nic.in వెబ్‌సైట్‌ను గమనిస్తూ ఉండాలి. 

మరిన్ని ఆసక్తికరమైన వార్తల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి

Frequently Asked Questions

నీట్ యూజీ పరీక్షను ఎందుకు రద్దు చేశారు?

మే 3న జరిగిన నీట్ పరీక్షలో ప్రశ్నపత్రం లీక్ అయిందని, 120 ప్రశ్నలు ముందుగానే బయటకు వచ్చాయని ఆరోపణలు రావడంతో పరీక్షను రద్దు చేశారు.

పేపర్ లీక్ కేసులో ఎంత మందిని అరెస్టు చేశారు?

పేపర్ లీక్ కేసులో కీలక సూత్రధారులుగా భావిస్తున్న మనీష్ యాదవ్, రాకేష్ మాండవ్రియాలను రాజస్థాన్ పోలీసులు అరెస్టు చేశారు. దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది.

నీట్ యూజీ రీ-ఎగ్జామ్ ఎప్పుడు జరుగుతుంది?

అధికారిక సమాచారం ప్రకారం, నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ జూన్ నెలలో జరిగే అవకాశం ఉంది. విద్యార్థులు జూన్ మాసంలో పరీక్షకు సిద్ధంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.

రీ-ఎగ్జామ్ కోసం విద్యార్థులు మళ్ళీ దరఖాస్తు చేయాలా?

లేదు, విద్యార్థులు రీ-ఎగ్జామ్ కోసం కొత్తగా దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదు. పాత దరఖాస్తు వివరాలు, అభ్యర్థిత్వం, పరీక్షా కేంద్రాల సమాచారమే వర్తిస్తుంది.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Chandrababu Meets Pawan Kalyan: ముంబైకి వెళ్లి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు
ముంబైకి వెళ్లి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు
Nagarjuna Yadav Arrest: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు.. వైసీపీ నేత నాగార్జున యాదవ్ అరెస్ట్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు.. వైసీపీ నేత నాగార్జున యాదవ్ అరెస్ట్
Bengaluru Crime News: ఇంట్లోకి చొరబడి ప్రైవేట్ పార్ట్ చూపించి అసభ్య ప్రవర్తన.. ఫ్లిప్‌కార్ట్ డెలివరీ ఏజెంట్ అరెస్ట్
ఇంట్లోకి చొరబడి ప్రైవేట్ పార్ట్ చూపించి అసభ్య ప్రవర్తన.. ఫ్లిప్‌కార్ట్ డెలివరీ ఏజెంట్ అరెస్ట్
Harish Rao On CM Revanth Reddy: రైతులకు నీళ్లు అడిగితే, రక్తం పారిస్తా అంటావా? షాబాద్ ఉన్మాదికి సీఎంకు తేడా లేదు : హరీష్ రావు
రైతులకు నీళ్లు అడిగితే, రక్తం పారిస్తా అంటావా? షాబాద్ ఉన్మాదికి సీఎంకు తేడా లేదు : హరీష్ రావు
Advertisement

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Meets Pawan Kalyan: ముంబైకి వెళ్లి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు
ముంబైకి వెళ్లి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు
Nagarjuna Yadav Arrest: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు.. వైసీపీ నేత నాగార్జున యాదవ్ అరెస్ట్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు.. వైసీపీ నేత నాగార్జున యాదవ్ అరెస్ట్
Bengaluru Crime News: ఇంట్లోకి చొరబడి ప్రైవేట్ పార్ట్ చూపించి అసభ్య ప్రవర్తన.. ఫ్లిప్‌కార్ట్ డెలివరీ ఏజెంట్ అరెస్ట్
ఇంట్లోకి చొరబడి ప్రైవేట్ పార్ట్ చూపించి అసభ్య ప్రవర్తన.. ఫ్లిప్‌కార్ట్ డెలివరీ ఏజెంట్ అరెస్ట్
Harish Rao On CM Revanth Reddy: రైతులకు నీళ్లు అడిగితే, రక్తం పారిస్తా అంటావా? షాబాద్ ఉన్మాదికి సీఎంకు తేడా లేదు : హరీష్ రావు
రైతులకు నీళ్లు అడిగితే, రక్తం పారిస్తా అంటావా? షాబాద్ ఉన్మాదికి సీఎంకు తేడా లేదు : హరీష్ రావు
Viral News: 6 ఏళ్ల మనవరాలికి కారు డ్రైవింగ్ నేర్పిస్తున్న ఎస్ఐ, రంగారెడ్డిలో ఖాకీ నిర్వాకం
మెయిన్ రోడ్డుపై 6 ఏళ్ల మనవరాలికి కారు డ్రైవింగ్ నేర్పిస్తున్న ఎస్ఐ, రంగారెడ్డిలో ఖాకీ నిర్వాకం
Team India Coaching Staff Shakeup: గంభీర్ కోచింగ్ స్టాఫ్ లో బిగ్ వికెట్ డౌన్.. టీమిండియా వరుస ఓటముల వేళ ఊహించని ట్విస్ట్!
గంభీర్ కోచింగ్ స్టాఫ్ లో బిగ్ వికెట్ డౌన్.. టీమిండియా వరుస ఓటముల వేళ ఊహించని ట్విస్ట్!
Mancherial Police Operation: మంచిర్యాలలో అర్ధరాత్రి పోలీసుల భారీ సెర్చ్ ఆపరేషన్: 171 వాహనాలు, అక్రమ మద్యం స్వాధీనం
మంచిర్యాలలో అర్ధరాత్రి పోలీసుల భారీ సెర్చ్ ఆపరేషన్: 171 వాహనాలు, అక్రమ మద్యం స్వాధీనం
FIFA World Cup Semi Final Thriller: ఫిఫా వరల్డ్ కప్ సెమీఫైనల్స్ కు చేరిన టాప్ ఫోర్ జట్లు.. ఇంగ్లాండ్ తో ఆర్జెంటీనా హై-వోల్టేజ్ ఫైట్, ఫ్రాన్స్ తో స్పెయిన్ ఢీ!
ఫిఫా వరల్డ్ కప్ సెమీఫైనల్స్ కు చేరిన టాప్ ఫోర్ జట్లు.. ఇంగ్లాండ్ తో ఆర్జెంటీనా హై-వోల్టేజ్ ఫైట్, ఫ్రాన్స్ తో స్పెయిన్ ఢీ!
Embed widget