Uravakonda latest News: ఉరవకొండలో వైసీపీ, టీడీపీ పోటాపోటీ నిరసనలు! నేతల అరెస్టుతో ఉద్రిక్త పరిస్థితులు!
Uravakonda latest News: ఆంధ్రప్రదేశ్ మంత్రి పయ్యావుల కేశవ్కు వ్యతిరేకంగా వైసీపీ చేపట్టిన ధర్నా ఉరవకొండలో ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది. దీంతో వైసీపీ లీడర్లను పోలీసులు అరెస్టు చేశారు.

Uravakonda latest News: ఆంధ్రప్రదేశ్లో మంత్రులు బరితెగించి ప్రైవేటు ఆస్తులు కాజేస్తున్నారని వైసీపీ ఆరోపిస్తోంది. ఉరవకొండలో మంత్రి పయ్యావుల కేశవ్కు వ్యతిరేకంగా భారీ ఎత్తున ఆందోళనకు ప్లాన్ చేసింది. ఈ నిరసన ధర్నాకు కోర్టు నుంచి కూడా అనుమతులు తెచ్చుకున్నట్టు వైసీపీ నేతలు చెబుతున్నారు. అయినా పోలీసులు ఆందోళన చేపట్టకుండా అడ్డుకున్నారని ఆరోపిస్తున్నారు. నేతల అరెస్టును పార్టీ తీవ్రంగా ఖండించింది.
ఉరవకొండలోని వేల్పుమడుగులో వైసీపీ నేతకు చెందిన భూమిని మంత్రి పయ్యావుల కేశవ్ ఆక్రమించుకున్నారని వైసీపీ విమర్శిస్తున్నారు. నియోజకవర్గంలో ఆయన భూదందా పెరిగిపోతుందని నేడు మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో ధర్నాకు పిలుపునిచ్చారు. ఆయన పిలుపు మేరకు అనంతపురం జిల్లాలోని వివిధ నియోజకవర్గాల నేతలంతా ఉరవకొండ వచ్చేందుకు ప్రయత్నాలు చేశారు.
వైసీపీ నేతల ప్రయత్నాలను పోలీసులు అడ్డుకున్నారు. ఎక్కడికక్కడ నేతలను అరెస్టు చేశారు. దీనిపై వైసీపీ లీడర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ నేతల అక్రమాలకు పోలీసులు, రెవెన్యూ అధికారులు అండగా నిలబడుతున్నారని మండిపడ్డారు. వారి అరాచకలను ప్రజల్లోకి తీసుకెళ్తామని చెప్పారు.
గుంతకల్ సబ్ డివిజన్లో పోలీస్ యాక్ట్-30 అమలులో ఉందని ఉరవకొండలో నిరసనలకు అనుమతి లేదన్నారు పోలీసులు. అయినా సరే ధర్నా నిర్వహిస్తామంటూ వీడియో విడుదల చేశారు విశ్వేశ్వర్రెడ్డి. ఈ ధర్నాకు సంఘీభావంగా వస్తున్న వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ను పోలీసులు అరెస్టు చేశారు. పెనుకొండలో మాజీ మంత్రి శంకర నారాయణ హౌస్ అరెస్ట్ చేశారు.
గత ప్రభుత్వంలో బీసీలపై దాడులు చేశారను, భూకబ్జాలకు పాల్పడ్డారని టీడీపీ ఆరోపిస్తోంది. వైసీపీ నేతలు చేస్తున్న ధర్నాలకు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టింది. దేవాలయ భూముల పరిరక్షణకు నిరసన కార్యక్రమం చేపట్టారు.
ఇరువర్గాల మధ్య సాగుతున్న పోటాపోటీ నిరసనలతో పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో జోక్యం చేసుకోవాల్సి వచ్చిందని పోలీసులు చెబుతున్నారు. అనుమతులు లేకుండా ధర్నాలు చేస్తే అరెస్టు చేశామని పేర్కొన్నారు.
ట్రెండింగ్ వార్తలు






















