అన్వేషించండి

Tirupati Crime : పెళ్లైన ఐదు నెలలకే సాఫ్ట్ వేర్ ఇంజినీర్ పైశాచికత్వం, సూట్ కేసులో భార్య మృతదేహం కేసులో సంచలనాలు

Tirupati Crime : తిరుపతిలో ఓ కిరాతకుడు భార్యను హత్య చేశారు. ఆ పై ఆమె మృతదేహాన్ని సూట్ కేసులో పెట్టి చేపల చెరువులో పడేశాడు. ఐదు నెలల తర్వాత అసలు విషయం బయటపడింది.

Tirupati Crime : పెళ్లంటే నిండు‌ నూరేళ్ల పంట అంటారు‌ పెద్దలు. సుఖ సంతోషాలతో‌ కలకాలం కలిసి జీవించాలని ఎంతో ఆనందంతో పెళ్లి చేసుకున్న ఓ యువతి జీవితం మధ్యలోనే ముగిసిపోయింది. కోటి ఆశల నూతన జీవితంలో అడుగు పెట్టిన‌ ఆ యువతి ఆశలు అన్ని అడియాశ చేశాడు భర్త. సూటి పోటి మాటలతో, వేధింపులకు గురిచేస్తూ ఆ యువతికి నరకం చూపించాడు. ఇంతలో అత్తారింటికి వెళ్లిన ఆ యువతి ఉన్నట్టుండి అదృశ్యం అయింది. మిస్సింగ్ కేసుగా నమోదు చేసిన పోలీసులు ఐదు నెలల తరువాత మర్డర్ గా తేల్చారు. భార్య శవాన్ని సూట్ కేసులో పెట్టి చెరువులో‌ పడేసి ఆనవాళ్లు మాయం చేసిన ఘటన తిరుపతిలో కలకలం రేపుతుంది.

అసలేం జరిగింది? 

తిరుపతిలోని కొర్లగుంటకు చెందిన పద్మ అనే యువతికి, సత్యనారాయణపురానికి చెందిన వేణుగోపాల్ తో 2019లో పెద్దలు వివాహం జరిపించారు. వేణుగోపాల్ ఉద్యోగరీత్యా సాఫ్ట్ వేర్ కావడంతో చెన్నైలో కాపురం పెట్టాడు. పెళ్లైన కొత్తలో భార్యతో ఎంతో అన్యోన్యంగా, ప్రేమగా మెలిగేవాడు. నెమ్మదిగా వేణుగోపాల్ తన పైశాచికత్వం మొదలుపెట్టాడు. ‌మానసికంగా వేధింపులకు గురిచేస్తూ, అనుమానంతో అనరాని‌ మాటలు మాట్లాడుతూ చిత్ర హింసలకు గురి చేసేవాడు. పెళ్లైన ఐదు నెలలకే భర్త వేధింపులు, చిత్ర హింసలు భరించలేని పద్మ పుట్టింటికి వచ్చేసింది. పలుమార్లు ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చి తిరిగి అత్తారింటికి పంపినా వేణుగోపాల్ లో మాత్రం మార్పురాలేదు. సైకోగా ప్రవర్తిస్తూ పద్మపై అర్ధరాత్రి విరుచుకుపడేవాడు. వేణుగోపాల్ కు విడాకులు‌ ఇచ్చేమని పద్మ కుటుంబీకులు ఆలోచన చేసినా, విడాకులు తీసుకుని వేరొక వివాహం చేసుకుంటే, మరోక భర్త ఎలా ప్రవర్తిస్తాడో అని ఆందోళన చెందిన పద్మ, మరోసారి వేణుగోపాల్ కి అవకాశం ఇవ్వాలని నిర్ణయించుకుంది. 

చివరి అవకాశం 

పద్మ కుటుంబ సభ్యులు ఒప్పుకున్నాక తన కాపురం సర్దుకుంటుందనే భావనతో అత్తారింటికి ఈ ఏడాది జనవరి నెలలో వెళ్లింది పద్మ. ఇంటికి వెళ్లిన అర్ధగంటలోపే భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. కోపోద్రిక్తుడైన భర్త వేణుగోపాల్ పద్మ తలపై రోకలి బండ లాంటి చెక్కతో బలంగా కొట్టాడు. తలకు తీవ్ర గాయమై ఘటనా స్థలంలోనే పద్మ మృతి చెందింది. హత్యను కప్పిపుచ్చేందుకు వేణుగోపాల్ కుటుంబ సభ్యులు మృతదేహాన్ని మాయం చేసేందుకు ప్రయత్నం చేశారు. పద్మ మృతదేహాన్ని కొన్ని చీరలతో చుట్టి, ఒక సూట్ కేసులో ఉంచారు. అనంతరం చాకచక్యంగా వెంకటాపురం చేపల చెరువులో సూట్ కేసును పడేశారు. అప్పటి నుంచి పద్మ ఆచూకీ గానీ, ఫోన్ కాల్ గానీ కుటుంబ సభ్యులకు తెలియలేదు. అల్లుడు వేణుగోపాల్ కు కాల్ చేస్తే పద్మ మీతో మాట్లాడదు. మిమ్మల్ని కలవదు, నేను ఆఫీస్ లో ఉన్నాను అనే సమాధానం ఇచ్చేవాడు. కొన్నాళ్లుగా ఇదే సమాధానం ఇస్తుండడంపై పద్మ కుటుంబీకులకు అనుమానం వచ్చింది. 

పోలీసులకు ఫిర్యాదు

ఈ నెల 27వ తేదీ తిరుపతి ఈస్ట్ పోలీసులకు పద్మ అదృశ్యానికి అల్లుడే కారణం అని ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు వారి స్టైల్ లో విచారణ చేపట్టడంతో వేణుగోపాల్ నిజాన్ని చెప్పాడు. అతన్ని అరెస్ట్ చేసి సీన్ రీ క్రియేట్ చేశారు పోలీసులు. వేణుగోపాల్ తో పాటుగా, అతనికి సహకరించిన వేణుగోపాల్ స్నేహితుడు సంతోష్, కుటుంబ సభ్యులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. 

టాప్ హెడ్ లైన్స్

Prudhvishwar Reddy POCSO Case: తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
Hyderabad Crime News: కొబ్బరి బోండాలు నరికే కత్తితో దాడిచేసి వ్యక్తి దారుణ హత్య.. హైదరాబాద్‌లో దారుణం
కొబ్బరి బోండాలు నరికే కత్తితో దాడిచేసి వ్యక్తి దారుణ హత్య.. హైదరాబాద్‌లో దారుణం
Adulterated Spices: హైదరాబాద్‌లో భారీ కల్తీ దందా రట్టు - 25 టన్నుల నకిలీ మసాలాలు స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్!
హైదరాబాద్‌లో భారీ కల్తీ దందా రట్టు - 25 టన్నుల నకిలీ మసాలాలు స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్!
Crime News: 30 సెకన్లలో 34 కత్తిపోట్లు! స్కూల్‌లోనే టీచర్‌ను పొడిచిన ముసుగు వ్యక్తి!
30 సెకన్లలో 34 కత్తిపోట్లు! స్కూల్‌లోనే టీచర్‌ను పొడిచిన ముసుగు వ్యక్తి!

వీడియోలు

BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా
Illu Illalu Pillalu Serial Actor Sai Kumar Kola | సీరియల్ నటుడు సాయి కుమార్ కోలా రియల్ లైఫ్
Mohammed Shami Test Comeback Ends? | మహమ్మద్ షమీ కెరీర్ క్లోజ్ అయినట్టేనా?
Gundenininda Gudigantalu Serial August 5 | మలేషియా మామయ్యకు బాలు , మీనా చెక్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Megastar Chiranjeevi AP Brand Ambassador: ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా మెగాస్టార్ చిరంజీవి - కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం?
ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా మెగాస్టార్ చిరంజీవి - కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం?
Prudhvishwar Reddy POCSO Case: తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
Budget Friendly Bikes: మిడిల్ క్లాస్ వారికి లగ్జరీ ఫీల్ ఇచ్చే బెస్ట్ బైక్స్ ఇవే.. లిస్ట్ చూసేయండి
మిడిల్ క్లాస్ వారికి లగ్జరీ ఫీల్ ఇచ్చే బెస్ట్ బైక్స్ ఇవే.. లిస్ట్ చూసేయండి
Adilabad Chit Fund Fraud: చిట్‌ఫండ్స్ బాధితులకు భారీ ఊరట.. 93 మందికి రూ.2.34 కోట్ల చెక్కుల పంపిణీ
చిట్‌ఫండ్స్ బాధితులకు భారీ ఊరట.. 93 మందికి రూ.2.34 కోట్ల చెక్కుల పంపిణీ
Harish Rao: కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
YS Jagan Devarapalli Visit: కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
Hyderabad Y Shaped Flyover: హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్..! నాంపల్లి - లక్డీకాపూల్ మధ్య వై-షేప్ ఫ్లైఓవర్‌కు గ్రీన్ సిగ్నల్
హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్..! నాంపల్లి - లక్డీకాపూల్ మధ్య వై-షేప్ ఫ్లైఓవర్‌కు గ్రీన్ సిగ్నల్
TDP MP Chintakayala Vijay: న్యాయమూర్తుల కొరతపై చర్చ.. జగన్ కేసుల అంశాన్ని రాజ్యసభలో లేవనెత్తిన ఎంపీ విజయ్
న్యాయమూర్తుల కొరతపై చర్చ.. జగన్ కేసుల అంశాన్ని రాజ్యసభలో లేవనెత్తిన ఎంపీ విజయ్
Embed widget