అన్వేషించండి

Srikakulam News : ఏపీలో మరో పోలీసు సూసైడ్, ఎచ్చెర్లలో ఏఆర్ కానిస్టేబుల్ ఆత్మహత్య!

Srikakulam News : శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్లలో ఏఆర్ కానిస్టేబుల్ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. కుటుంబ సభ్యులతో గొడవపడి ఆయన ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారని తెలిపారు.

Srikakulam News : ఎచ్చెర్లలో విషాదం చోటు చేసుకుంది. ఎచ్చెర్ల సాయుధ దళాల విభాగంలో హెడ్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న ఎం. సుబ్బారావు (50) సోమవారం ఉదయం ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. వాస్తవానికి సోమవారం వీధుల్లో ఉండాల్సి ఉండగా.. డ్యూటీ మధ్యలో నుంచి వచ్చి ఇంటి దగ్గర ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతికి గల కారణాలు పూర్తిగా తెలియాల్సి ఉంది. కాగా కుటుంబ కలహాలే కారణమని స్థానికులు చెబుతున్నారు. జాతీయ స్థాయిలో బాక్సర్ గా ఎన్నో పతకాలు సాధించిన సుబ్బారావు స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం సంపాదించారు. సీనియర్ బాక్సర్ గా పేరు పొందిన సుబ్బారావు కుమారుడు ఏఆర్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నారు. ఇటీవలే కుమారుడికి వివాహమైన అనంతరం సుబ్బారావు భార్య మంచం పట్టింది. వివాహమైన కుమారుడు తన భార్యతో పాటు వేరే కాపురం పెట్టడంతో మంచం పట్టిన భార్యకు సేవలు చేయడం సుబ్బారావుకు తలకు మించిన భారమైంది. ఇదే విషయమై ఆదివారం కుమారుడు, సుబ్బారావు మధ్య వివాదం జరిగినట్టు సమాచారం. మనస్తాపానికి గురైన సుబ్బారావు రోల్ కాల్ పూర్తిచేసుకొని ఇంటికి వచ్చి ఆత్మహత్యకు పాల్పడినట్టు అనుమానిస్తున్నారు. దీనిపై ఎచ్చెర్ల పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

సర్పవరం ఎస్ఐ ఆత్మహత్య

ఇటీవల కాకినాడ జిల్లాలో ఎస్ఐ ఆత్మహత్యకు పాల్పడ్డారు. సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకుని సర్పవరం ఎస్ఐ ఆత్మహత్య చేసుకున్నారు. కాకినాడ రూరల్ సర్పవరం పోలీస్ స్టేషన్ లో ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న గోపాల కృష్ణ శుక్రవారం తెల్లవారుజామున ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఎస్సై స్వగ్రామం పెనుగంచిప్రోలు మండలం నవాబుపేట. గురువారం కోనసీమలో సీఎం బందోబస్తు ఏర్పాట్లకి వెళ్లి వచ్చారు ఎస్సై గోపాలకృష్ణ. ఆయన 2014 సంవత్సరం బ్యాచ్ కు చెందిన వారు. శుక్రవారం తెల్లవారుజామున 5 గంటలకు, ఓ గదిలో పిల్లలు భార్య నిద్రిస్తుండగా హాల్లో గన్ తో కాల్చుకుని గోపాలకృష్ణ ఆత్మహత్య చేసుకున్నారు. మృతునికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.

భార్యాభర్తలు సూసైడ్ 

జగిత్యాల రూరల్ మండలం రఘురాములకోటలో పురుగుల మందు తాగి భార్యభర్తలు ఆత్మహత్య చేసుకుంది. సింహారాజు మునింధర్(65),  సులోచన(60) పలు రకాల ఇబ్బందులతో మనస్థాపానికి గురి అయ్యి ఇంట్లోనే ఆత్మహత్య చేసుకున్నారు. ఆదివారం అర్ధరాత్రి తరువాత పురుగుల మందు తాగి భార్య భర్తలు ఆత్మహత్య చేసుకున్నారు. ఇంట్లో ఓ గదిలో పురుగుల మందు సేవించి పడి ఉండడం చూసిన కుటుంబ సభ్యులు హుటాహుటిన జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రికి తరలించేలోపు ఇద్దరూ మృతిచెందారని వైద్యులు తెలిపారు. వారి కుమారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు జగిత్యాల రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు..

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Cyber Fraud:మాజీ డీజీపీ మనవరాలి నుంచి రూ.1.2 కోట్లు కొట్టేసిన సైబర్ నేరగాళ్లు
మాజీ డీజీపీ మనవరాలి నుంచి రూ.1.2 కోట్లు కొట్టేసిన సైబర్ నేరగాళ్లు
Fire Cracker Lorry Catches Fire: హైటెన్షన్ వైర్లు తగిలి పేలిన టపాసులు, లారీ దగ్ధం.. రంగారెడ్డి జిల్లాలో ఘటన
హైటెన్షన్ వైర్లు తగిలి పేలిన టపాసులు, లారీ దగ్ధం.. రంగారెడ్డి జిల్లాలో ఘటన
Hyderabad Latest News: సమోసాలు కనిపిస్తే ఆగిపోయే వారి కోసమే ఈ న్యూస్! ఆ టేస్ట్ రెసిపీ గుట్టు రట్టు చేసిన పోలీసులు!
సమోసాలు కనిపిస్తే ఆగిపోయే వారి కోసమే ఈ న్యూస్! ఆ టేస్ట్ రెసిపీ గుట్టు రట్టు చేసిన పోలీసులు!
Pradip Guruji: మంచి పనులు చేయడానికి డబ్బుల్లేవని దొంగ నోట్లు ముద్రించాడట - ఈ గురూజీ మామూలోడు కాదు!
మంచి పనులు చేయడానికి డబ్బుల్లేవని దొంగ నోట్లు ముద్రించాడట - ఈ గురూజీ మామూలోడు కాదు!

వీడియోలు

Late Marriage Effect on Women | 40ఏళ్లు దాటినా పెళ్లంటే ఇష్టపడని మహిళలు, ఆరోగ్యంపై ఊహించని ప్రభావం
Harshit Rana Ruled Out IPL 2026 | హర్షిత్ దూరం, పతిరణ రాక ఆలస్యం. కష్టాల్లో కేకేఆర్ | ABP Desam
Laxman Sivaramakrishnan Commentary BCCI | కామెంటరీకి శివరామకృష్ణన్ గుడ్ బై | ABP Desam
SRH Players Injury IPL 2026 Jack Edwards | గాయంతో సన్‌రైజర్స్‌కు స్టార్ ఆల్‌రౌండర్ దూరం | ABP Desam
MS Dhoni Injured in CSK Practice Camp IPL 2026 | ధోనీ మోకాలి గాయం ? | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
EPFO ​​3.0: పీఎఫ్ విత్‌డ్రాలపై కేంద్రం అప్డేట్.. 5 లక్షల వరకు క్లెయిమ్‌లు ఆటోమేటిక్‌గా పూర్తి
PF విత్‌డ్రాలపై కేంద్రం అప్డేట్.. 5 లక్షల వరకు క్లెయిమ్‌లు ఆటోమేటిక్‌గా పూర్తి
AP Rains Alert: ఏపీలో భారీ వర్షాలు, పిడుగుల వార్నింగ్.. 10 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ
ఏపీలో భారీ వర్షాలు, పిడుగుల వార్నింగ్.. 10 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ
Andhra Praedesh News: ప్రభుత్వరంగ సంస్థలు, గురుకుల సొసైటీ స్కూల్ ఉద్యోగుల ఏజ్ లిమిట్ పెంపు
ప్రభుత్వరంగ సంస్థలు, గురుకుల సొసైటీ స్కూల్ ఉద్యోగుల ఏజ్ లిమిట్ పెంపు
Harish Rao: శ్రమ మాది.. శిలాఫలకం రేవంత్ రెడ్డిది - సిద్దిపేట పర్యటనపై హరీశ్ రావు బహిరంగలేఖ
శ్రమ మాది.. శిలాఫలకం రేవంత్ రెడ్డిది - సిద్దిపేట పర్యటనపై హరీశ్ రావు బహిరంగలేఖ
Fast Printout: జిరాక్స్ షాప్ వద్ద క్యూ లైన్ ఉందా? QwikPrint మెషిన్ కనిపిస్తే ప్రింటౌట్ తీసుకోండి
జిరాక్స్ షాప్ వద్ద క్యూ లైన్ ఉందా? QwikPrint మెషిన్ కనిపిస్తే ప్రింటౌట్ తీసుకోండి
Fire Cracker Lorry Catches Fire: హైటెన్షన్ వైర్లు తగిలి పేలిన టపాసులు, లారీ దగ్ధం.. రంగారెడ్డి జిల్లాలో ఘటన
హైటెన్షన్ వైర్లు తగిలి పేలిన టపాసులు, లారీ దగ్ధం.. రంగారెడ్డి జిల్లాలో ఘటన
Cyber Fraud:మాజీ డీజీపీ మనవరాలి నుంచి రూ.1.2 కోట్లు కొట్టేసిన సైబర్ నేరగాళ్లు
మాజీ డీజీపీ మనవరాలి నుంచి రూ.1.2 కోట్లు కొట్టేసిన సైబర్ నేరగాళ్లు
New ATM Rules From April 1:ఏప్రిల్ 1 నుండి కొత్త ఏటీఎం నిబంధనలు - ఈ విషయాలు తెలియకపోతే చాలా నష్టపోతారు!
ఏప్రిల్ 1 నుండి కొత్త ఏటీఎం నిబంధనలు - ఈ విషయాలు తెలియకపోతే చాలా నష్టపోతారు!
Embed widget