అన్వేషించండి

Karnataka Express: మహారాష్ట్రలో ఘోర రైలు ప్రమాదం - పట్టాలు దాటుతుండగా ప్రయాణికులను ఢీకొన్న ఎక్స్‌ప్రెస్ రైలు, 12 మంది మృతి

Train Accident: మహారాష్ట్రలో ఘోర రైలు ప్రమాదం సంభవించింది. జల్గావ్‌లో పట్టాలపై ఉన్న ప్రయాణికులను కర్ణాటక ఎక్స్ ప్రెస్ ఢీకొని పలువురు ప్రయాణికులు మృతి చెందారు.

Several Passengers Died Due To Hit By Karnataka Express: మహారాష్ట్రలోని (Maharastra) జల్గావ్‌లో ఘోర రైలు ప్రమాదం సంభవించింది. కర్ణాటక ఎక్స్ ప్రెస్ రైలు ఢీకొని 12 మంది ప్రయాణికులు మృతి చెందినట్లు తెలుస్తోంది. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. పుష్పక్ ఎక్స్ ప్రెస్ రైలులో మంటలు వ్యాపించినట్లు వదంతులు వ్యాపించగా.. భయంతో ప్రయాణికులు చైన్ లాగారు. అనంతరం కిందకు దిగి పట్టాలు దాటుతున్న క్రమంలో పచోరా రైల్వే స్టేషన్ సమీపంలో కర్ణాటక ఎక్స్ ప్రెస్ రైలు వీరిపైకి దూసుకొచ్చి ఈ దుర్ఘటన జరిగింది. సమాచారం అందుకున్న రైల్వే సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది.

'అందుకే పుష్పక్ ఆగింది'

అటు, ఈ ఘటనపై సెంట్రల్ రైల్వే స్పందించింది. 'ప్రయాణికులు చైన్ లాగితే లఖ్‌నవూ - ముంబయి ఎక్స్‌ప్రెస్ (పుష్పక్ రైలు) ఆగింది. రైలు ఆగాక ఒక బోగీ నుంచి కొందరు ప్రయాణికులు దిగారు. వారిని మరో ట్రాక్‌లో వెళ్తోన్న బెంగుళూరు - కర్ణాటక రైలు ఢీకొట్టింది. గాయపడిన వారిని ఆస్పత్రులకు తరలించేందుకు అంబులెన్సులు పంపాం.' అని పేర్కొంది. 

పుష్పక్ ఎక్ర్‌ప్రెస్ రైలులోని ఒక కోచ్‌లో హాట్ యాక్సిల్ లేదా బ్రేక్ బైండింగ్ కారణంగా నిప్పురవ్వలు చెలరేగాయని అధికారి ఒకరు తెలిపారు. దీంతో ప్రయాణికులు భయాందోళనకు గురై చైన్ లాగారని.. కొందరు ట్రాక్‌లపై దూకేసిన సమయంలో కర్ణాటక ఎక్స్‌ప్రెస్ రావడంతో ఈ దుర్ఘటన జరిగినట్లు తమకు సమాచారం అందిందని పేర్కొన్నారు.

సీఎం దిగ్భ్రాంతి

రైలు ప్రమాద ఘటనపై సీఎం ఫడణవీస్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ విషాద ఘటన తనను తీవ్రంగా కలిచివేసిందని అన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. 'నా మంత్రివర్గ సహచరుడు గిరీశ్ మహాజన్, జిల్లా ఎస్పీ ఘటనా స్థలానికి చేరుకున్నారు. జిల్లా అధికార యంత్రాంగం మొత్తం రైల్వే అధికారులతో సమన్వయం చేస్తూ పనిచేస్తోంది. క్షతగాత్రులకు వెంటనే చికిత్స అందించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. అవసరమైన సహాయాన్ని వెంటనే అందిస్తున్నాం.' అని పేర్కొన్నారు.

Also Read: Viral Video: కాస్త చూసుకోవాలి కదా బాసూ! - కారు పార్క్ చేస్తూ రివర్స్ గేర్, ఫస్ట్ ఫ్లోర్ నుంచి కింద పడ్డ వాహనం, వైరల్ వీడియో

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Bhu Bharati Act Passbook: భూ భారతి చట్టం ప్రకారం భూమి యజమాని పాస్‌బుక్ ఎలా పొందాలి, ఎంత ఫీజు చెల్లించాలి
భూ భారతి చట్టం ప్రకారం భూమి యజమాని పాస్‌బుక్ ఎలా పొందాలి, ఎంత ఫీజు చెల్లించాలి
YSRCP:  వక్ఫ్ చట్టంపై సుప్రీంకోర్టుకు వైఎస్ఆర్‌సీపీ - రాజ్యాంగాన్ని ఉల్లంఘించారని ఆరోపణ
వక్ఫ్ చట్టంపై సుప్రీంకోర్టుకు వైఎస్ఆర్‌సీపీ - రాజ్యాంగాన్ని ఉల్లంఘించారని ఆరోపణ
Telangana Bhubharathi: అందుబాటులోకి వచ్చిన భూభారతి పోర్టల్‌- రెవెన్యూ అధికారులకు కీలక బాధ్యత అప్పగించిన సీఎం
అందుబాటులోకి వచ్చిన భూభారతి పోర్టల్‌- రెవెన్యూ అధికారులకు కీలక బాధ్యత అప్పగించిన సీఎం
AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కాంలో కీలక పరిణామం - రాజ్ కసిరెడ్డి కోసం గాలింపు - విస్తృత సోదాలు
ఏపీ లిక్కర్ స్కాంలో కీలక పరిణామం - రాజ్ కసిరెడ్డి కోసం గాలింపు - విస్తృత సోదాలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

LSG vs CSK Match Highlights IPL 2025 | లక్నో పై 5వికెట్ల తేడాతో చెన్నై సంచలన విజయం | ABP DesamNani HIT 3 Telugu Trailer Reaction | జనాల మధ్యలో ఉంటే  అర్జున్..మృగాల మధ్యలో ఉంటే సర్కార్ | ABP DesamVirat Kohli Heart Beat Checking | RR vs RCB మ్యాచులో గుండె పట్టుకున్న కొహ్లీRohit Sharma Karn Sharma Strategy | DC vs MI మ్యాచ్ లో హైలెట్ అంటే ఇదే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Bhu Bharati Act Passbook: భూ భారతి చట్టం ప్రకారం భూమి యజమాని పాస్‌బుక్ ఎలా పొందాలి, ఎంత ఫీజు చెల్లించాలి
భూ భారతి చట్టం ప్రకారం భూమి యజమాని పాస్‌బుక్ ఎలా పొందాలి, ఎంత ఫీజు చెల్లించాలి
YSRCP:  వక్ఫ్ చట్టంపై సుప్రీంకోర్టుకు వైఎస్ఆర్‌సీపీ - రాజ్యాంగాన్ని ఉల్లంఘించారని ఆరోపణ
వక్ఫ్ చట్టంపై సుప్రీంకోర్టుకు వైఎస్ఆర్‌సీపీ - రాజ్యాంగాన్ని ఉల్లంఘించారని ఆరోపణ
Telangana Bhubharathi: అందుబాటులోకి వచ్చిన భూభారతి పోర్టల్‌- రెవెన్యూ అధికారులకు కీలక బాధ్యత అప్పగించిన సీఎం
అందుబాటులోకి వచ్చిన భూభారతి పోర్టల్‌- రెవెన్యూ అధికారులకు కీలక బాధ్యత అప్పగించిన సీఎం
AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కాంలో కీలక పరిణామం - రాజ్ కసిరెడ్డి కోసం గాలింపు - విస్తృత సోదాలు
ఏపీ లిక్కర్ స్కాంలో కీలక పరిణామం - రాజ్ కసిరెడ్డి కోసం గాలింపు - విస్తృత సోదాలు
Telangana Latest News: కంచ గచ్చిబౌలి భూముల్లో జంతువుల్లేవ్- సుప్రీంకోర్టులో తెలంగాణ సర్కారు కౌంటర్ దాఖలు
కంచ గచ్చిబౌలి భూముల్లో జంతువుల్లేవ్- సుప్రీంకోర్టులో తెలంగాణ సర్కారు కౌంటర్ దాఖలు
Shaik Rasheed : మొదటి మ్యాచ్‌లో ఆకట్టుకున్న షేక్ రషీద్ - ఈ గుంటూరు మిరపకాయ్‌ స్ఫూర్తిదాయక స్టోరీ తెలుసా?
మొదటి మ్యాచ్‌లో ఆకట్టుకున్న షేక్ రషీద్ - ఈ గుంటూరు మిరపకాయ్‌ స్ఫూర్తిదాయక స్టోరీ తెలుసా?
Telangana Politics: కాంగ్రెస్ పాలనతో విసిగిపోయారు, ఎమ్మెల్యేలను సైతం కొనేందుకు రెడీ!: బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంచలనం
Telangana Politics: కాంగ్రెస్ పాలనతో విసిగిపోయారు, ఎమ్మెల్యేలను సైతం కొనేందుకు రెడీ!: బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంచలనం
Chittoor Crime News: లవ్ మ్యారేజ్ చేసుకుందని కూతుర్ని చంపేశారు! చిత్తూరులో పరువుహత్య కలకలం
లవ్ మ్యారేజ్ చేసుకుందని కూతుర్ని చంపేశారు! చిత్తూరులో పరువుహత్య కలకలం
Embed widget