అన్వేషించండి

Nellore News: రూ.కోటి కొట్టేసి.. బిచ్చగాళ్లకు రూ.500 నోట్లు పంచేశారు.. కానీ పానీపూరి ఫోన్ కాల్ పట్టించేసింది

నెల్లూరు జిల్లాలో ఇటీవల జరిగిన ఓ భారీ చోరీని పోలీసులు చాకచక్యంగా చేధించారు. ఇందులో ట్విస్ట్ ఏంటంటే దొంగలు పుణ్యక్షేత్రాలకు వెళ్లి బిచ్చగాళ్లకు రూ.500 నోట్లు పంచిపెట్టారు.

నెల్లూరు జిల్లాలో రూ.కోటీ 26 లక్షలు కొట్టేసిన నిందితుల్ని పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. వీరి కోసం 4 రాష్ట్రాల్లో గాలించారు. వారం రోజులపాటు శ్రమించి నిందితులను పట్టుకున్నారు. ఈ కేసు విచారణలో ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి.  పానీపూరీ బండి నడిపే వ్యక్తి నుంచి చేసిన ఫోన్ కాల్ నిందితుల్ని పట్టించింది. 

సంస్థ ఉద్యోగులే చోరీ

నెల్లూరు జిల్లాలో ఇటీవల భారీ చోరీ జరిగింది. ఏకంగా రూ. కోటీ 26 లక్షల సొత్తుని ముగ్గురు దొంగలు దోచుకెళ్లింది. రైటర్స్ సేఫ్ గార్డ్ ప్రైవేట్ ఏజెన్సీ వివిధ సంస్థల డబ్బును బ్యాంకుల్లో నిత్యం డిపాజిట్ చేస్తుంది. సదరు సంస్థ ఉద్యోగులైన షేక్ రబ్బాని, రఫి, మస్తాన్ ఆగస్ట్ 31వతేదీన దొంగతనానికి పాల్పడ్డారు. అక్కడి నుంచి అసలు కథ మొదలైంది. ముందుగా నెల్లూరు నుంచి జొన్నవాడ పారిపోయిన వీళ్లు అక్కడ కొంత నగదును దాచిపెట్టారు. ఆ తర్వాత ఏఎస్ పేట వెళ్లారు. అక్కడి నుంచి కావలి, కావలి నుంచి ఒంగోలు వెళ్లి బంధువుల ఇంట్లో మరి కొంత నగదు ఉంచారు. ఒంగోలు రైల్వే స్టేషన్ లో జీటీ ఎక్స్ ప్రెస్ ఎక్కి భోపాల్ పారిపోయారు. 

బిచ్చగాళ్లకు రూ.500 నోట్లు

మధ్యప్రదేశ్ లోని భోపాల్ నుంచి రాజస్థాన్ లోని అజ్మీర్ వెళ్లారు. అక్కడి నుంచి జైపూర్ ఆ తర్వాత మహారాష్ట్రలోని నాగపూర్ వచ్చారు. అక్కడి నుంచి తెలంగాణలోని ఆదిలాబాద్ వచ్చారు. ఆదిలాబాద్ నుంచి గుంటూరు, గుంటూరు నుంచి కావలి, ఏఎస్ పేట ఆ తర్వాత నెల్లూరు టౌన్ కి చేరుకున్నారు. తీరా నెల్లూరు వచ్చాక పోలీసులు వారిని చాకచక్యంగా పట్టుకున్నారు. వీరి కోసం పోలీసులు మొత్తం 4 రాష్ట్రాల్లో గాలించారు. ఈ నాలుగు రాష్ట్రాల్లో నిందితులు వివిధ పుణ్యక్షేత్రాలకు వెళ్లడం, అక్కడ బిచ్చగాళ్లకు ఒక్కొకరికి రూ.500 నోట్లు ఇవ్వడం విశేషం. కనపడిన బిచ్చగాళ్లందరికీ డబ్బులు పంచుకుంటూ వెళ్లారు.

Also Read: B.Tech Student Death: ఫ్రెండ్స్‌తో పార్టీకెళ్లాడు, వస్తుండగా క్షణాల్లో శవమయ్యాడు.. మిస్టరీగా కేసు, ఇంతకీ అసలేం జరిగింది?

పట్టించిన ఫోన్ కాల్

దొంగతనం చేసిన వెంటనే నిందితులు తమ ఫోన్లను స్విచాఫ్ చేశారు. భోపాల్ లో ఓచోట పానీపూరీ తిని, ఆ బండి నడిపే వ్యక్తి ఫోన్ నుంచి నెల్లూరుకి ఫోన్ చేశారు. ఈ ఫోన్ కాల్ తో పోలీసులు నిందితులున్న చోటును తెలుసుకున్నారు. చివరికి చాకచక్యంగా పట్టుకున్నారు. వీరి నుంచి రూ. కోటీ 11లక్షల 20 వేలు రికవరీ చేసినట్లు నెల్లూరు ఎస్సీ విజయరావు తెలిపారు. విచారణలో ప్రతిభ చూపిన పోలీసులకు రివార్డులందించారు. 

Also Read: Saidabad Girl Rape: సైదాబాద్ చిన్నారి హత్యాచార కేసు.. నిందితుడు ఎక్కడ.. సాయం చేసింది అతడి ఫ్రెండేనా?

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Tiger and Leopard Deaths: వేర్వేరు ప్రమాదాల్లో పులి, చిరుతపులి మృతి.. విచారణకు పవన్ కళ్యాణ్ ఆదేశాలు
వేర్వేరు ప్రమాదాల్లో పులి, చిరుతపులి మృతి.. విచారణకు పవన్ కళ్యాణ్ ఆదేశాలు
Aravali Contraversi: ఆరావళి పర్వతాలను మైనింగ్ మాఫియాకు అప్పగించేస్తున్నారా? -అసలేం జరుగుతోంది?
ఆరావళి పర్వతాలను మైనింగ్ మాఫియాకు అప్పగించేస్తున్నారా? -అసలేం జరుగుతోంది?
YSRCP activist arrest: రాజకీయ అహంకారంతో చెలరేగిపోతున్న వారికి ఏపీ పోలీసుల షాక్ ట్రీట్‌మెంట్ - నడిపించుకుంటూ తీసుకెళ్తున్నారు !
రాజకీయ అహంకారంతో చెలరేగిపోతున్న వారికి ఏపీ పోలీసుల షాక్ ట్రీట్‌మెంట్ - నడిపించుకుంటూ తీసుకెళ్తున్నారు !
Harish Rao: తప్పుడు కేసుల్ని పెట్టే పోలీసుల్ని వదిలి పెట్టేది లేదు - ట్యాపింగ్ కేసు నోటీసుల ప్రచారంపై హరీష్ రావు హెచ్చరిక
తప్పుడు కేసుల్ని పెట్టే పోలీసుల్ని వదిలి పెట్టేది లేదు - ట్యాపింగ్ కేసు నోటీసుల ప్రచారంపై హరీష్ రావు హెచ్చరిక

వీడియోలు

Delhi Bangladesh High Commissionerate | బంగ్లాదేశ్ హైకమిషనరేట్‌ను ముట్టడించిన హిందూ సంఘాలు | ABP
1 Crore to Pak U-19 Players | పాక్ ఆటగాళ్లకి ఒక్కొక్కరికీ కోటి రూపాయలు | ABP Desam
Shubman Gill vs Yashasvi Jaiswal | t20 వరల్డ్ కప్ 2026 ఇండియన్ స్క్వాడ్ లో జైస్వాల్ కి చోటు దక్కల్సింది | ABP Desam
Virat Kohli Under Pant Captaincy | పంత్ కెప్టెన్సీలో బరిలోకి దిగబోతున్న విరాట్ కోహ్లీ | ABP Desam
Vaibhav Suryavanshi Shoe Controversy | పాక్ పేసర్‌కు వైభవ్ సూర్యవంశీ షూ చూపించిన ఘటనపై క్లారిటీ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tiger and Leopard Deaths: వేర్వేరు ప్రమాదాల్లో పులి, చిరుతపులి మృతి.. విచారణకు పవన్ కళ్యాణ్ ఆదేశాలు
వేర్వేరు ప్రమాదాల్లో పులి, చిరుతపులి మృతి.. విచారణకు పవన్ కళ్యాణ్ ఆదేశాలు
Aravali Contraversi: ఆరావళి పర్వతాలను మైనింగ్ మాఫియాకు అప్పగించేస్తున్నారా? -అసలేం జరుగుతోంది?
ఆరావళి పర్వతాలను మైనింగ్ మాఫియాకు అప్పగించేస్తున్నారా? -అసలేం జరుగుతోంది?
YSRCP activist arrest: రాజకీయ అహంకారంతో చెలరేగిపోతున్న వారికి ఏపీ పోలీసుల షాక్ ట్రీట్‌మెంట్ - నడిపించుకుంటూ తీసుకెళ్తున్నారు !
రాజకీయ అహంకారంతో చెలరేగిపోతున్న వారికి ఏపీ పోలీసుల షాక్ ట్రీట్‌మెంట్ - నడిపించుకుంటూ తీసుకెళ్తున్నారు !
Harish Rao: తప్పుడు కేసుల్ని పెట్టే పోలీసుల్ని వదిలి పెట్టేది లేదు - ట్యాపింగ్ కేసు నోటీసుల ప్రచారంపై హరీష్ రావు హెచ్చరిక
తప్పుడు కేసుల్ని పెట్టే పోలీసుల్ని వదిలి పెట్టేది లేదు - ట్యాపింగ్ కేసు నోటీసుల ప్రచారంపై హరీష్ రావు హెచ్చరిక
Shambhala Review : బడ్జెట్... హార్డ్ వర్క్ నో కాంప్రమైజ్ - 'శంబాల' థియేటర్స్‌లో చూస్తేనే ఫీల్... హీరో ఆది సాయికుమార్ ఇంటర్వ్యూ
బడ్జెట్... హార్డ్ వర్క్ నో కాంప్రమైజ్ - 'శంబాల' థియేటర్స్‌లో చూస్తేనే ఫీల్... హీరో ఆది సాయికుమార్ ఇంటర్వ్యూ
Indian Railways: అస్సాంలో ఏనుగుల మృతితో రైల్వేశాఖ కీలక నిర్ణయం.. AI టెక్నాలజీతో ప్రమాదాలకు చెక్
అస్సాంలో ఏనుగుల మృతితో రైల్వేశాఖ కీలక నిర్ణయం.. AI టెక్నాలజీతో ప్రమాదాలకు చెక్
Top Selling Hatchback: నవంబర్ 2025లో నంబర్ 1 హ్యాచ్‌బ్యాక్ స్విఫ్ట్.. హ్యుందాయ్, టాటాల పొజిషన్ ఇదే
నవంబర్ 2025లో నంబర్ 1 హ్యాచ్‌బ్యాక్ స్విఫ్ట్.. హ్యుందాయ్, టాటాల పొజిషన్ ఇదే
Tirupati Govindarajaswamy Temple: వైసీపీ హయాంలో గోవిందరాజస్వామి ఆలయంలో 50 కేజీల బంగారం గోల్ మాల్ ఆరోపణలు - విజిలెన్స్ విచారణ
వైసీపీ హయాంలో గోవిందరాజస్వామి ఆలయంలో 50 కేజీల బంగారం గోల్ మాల్ ఆరోపణలు - విజిలెన్స్ విచారణ
Embed widget