అన్వేషించండి

Nellore News: రూ.కోటి కొట్టేసి.. బిచ్చగాళ్లకు రూ.500 నోట్లు పంచేశారు.. కానీ పానీపూరి ఫోన్ కాల్ పట్టించేసింది

నెల్లూరు జిల్లాలో ఇటీవల జరిగిన ఓ భారీ చోరీని పోలీసులు చాకచక్యంగా చేధించారు. ఇందులో ట్విస్ట్ ఏంటంటే దొంగలు పుణ్యక్షేత్రాలకు వెళ్లి బిచ్చగాళ్లకు రూ.500 నోట్లు పంచిపెట్టారు.

నెల్లూరు జిల్లాలో రూ.కోటీ 26 లక్షలు కొట్టేసిన నిందితుల్ని పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. వీరి కోసం 4 రాష్ట్రాల్లో గాలించారు. వారం రోజులపాటు శ్రమించి నిందితులను పట్టుకున్నారు. ఈ కేసు విచారణలో ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి.  పానీపూరీ బండి నడిపే వ్యక్తి నుంచి చేసిన ఫోన్ కాల్ నిందితుల్ని పట్టించింది. 

సంస్థ ఉద్యోగులే చోరీ

నెల్లూరు జిల్లాలో ఇటీవల భారీ చోరీ జరిగింది. ఏకంగా రూ. కోటీ 26 లక్షల సొత్తుని ముగ్గురు దొంగలు దోచుకెళ్లింది. రైటర్స్ సేఫ్ గార్డ్ ప్రైవేట్ ఏజెన్సీ వివిధ సంస్థల డబ్బును బ్యాంకుల్లో నిత్యం డిపాజిట్ చేస్తుంది. సదరు సంస్థ ఉద్యోగులైన షేక్ రబ్బాని, రఫి, మస్తాన్ ఆగస్ట్ 31వతేదీన దొంగతనానికి పాల్పడ్డారు. అక్కడి నుంచి అసలు కథ మొదలైంది. ముందుగా నెల్లూరు నుంచి జొన్నవాడ పారిపోయిన వీళ్లు అక్కడ కొంత నగదును దాచిపెట్టారు. ఆ తర్వాత ఏఎస్ పేట వెళ్లారు. అక్కడి నుంచి కావలి, కావలి నుంచి ఒంగోలు వెళ్లి బంధువుల ఇంట్లో మరి కొంత నగదు ఉంచారు. ఒంగోలు రైల్వే స్టేషన్ లో జీటీ ఎక్స్ ప్రెస్ ఎక్కి భోపాల్ పారిపోయారు. 

బిచ్చగాళ్లకు రూ.500 నోట్లు

మధ్యప్రదేశ్ లోని భోపాల్ నుంచి రాజస్థాన్ లోని అజ్మీర్ వెళ్లారు. అక్కడి నుంచి జైపూర్ ఆ తర్వాత మహారాష్ట్రలోని నాగపూర్ వచ్చారు. అక్కడి నుంచి తెలంగాణలోని ఆదిలాబాద్ వచ్చారు. ఆదిలాబాద్ నుంచి గుంటూరు, గుంటూరు నుంచి కావలి, ఏఎస్ పేట ఆ తర్వాత నెల్లూరు టౌన్ కి చేరుకున్నారు. తీరా నెల్లూరు వచ్చాక పోలీసులు వారిని చాకచక్యంగా పట్టుకున్నారు. వీరి కోసం పోలీసులు మొత్తం 4 రాష్ట్రాల్లో గాలించారు. ఈ నాలుగు రాష్ట్రాల్లో నిందితులు వివిధ పుణ్యక్షేత్రాలకు వెళ్లడం, అక్కడ బిచ్చగాళ్లకు ఒక్కొకరికి రూ.500 నోట్లు ఇవ్వడం విశేషం. కనపడిన బిచ్చగాళ్లందరికీ డబ్బులు పంచుకుంటూ వెళ్లారు.

Also Read: B.Tech Student Death: ఫ్రెండ్స్‌తో పార్టీకెళ్లాడు, వస్తుండగా క్షణాల్లో శవమయ్యాడు.. మిస్టరీగా కేసు, ఇంతకీ అసలేం జరిగింది?

పట్టించిన ఫోన్ కాల్

దొంగతనం చేసిన వెంటనే నిందితులు తమ ఫోన్లను స్విచాఫ్ చేశారు. భోపాల్ లో ఓచోట పానీపూరీ తిని, ఆ బండి నడిపే వ్యక్తి ఫోన్ నుంచి నెల్లూరుకి ఫోన్ చేశారు. ఈ ఫోన్ కాల్ తో పోలీసులు నిందితులున్న చోటును తెలుసుకున్నారు. చివరికి చాకచక్యంగా పట్టుకున్నారు. వీరి నుంచి రూ. కోటీ 11లక్షల 20 వేలు రికవరీ చేసినట్లు నెల్లూరు ఎస్సీ విజయరావు తెలిపారు. విచారణలో ప్రతిభ చూపిన పోలీసులకు రివార్డులందించారు. 

Also Read: Saidabad Girl Rape: సైదాబాద్ చిన్నారి హత్యాచార కేసు.. నిందితుడు ఎక్కడ.. సాయం చేసింది అతడి ఫ్రెండేనా?

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Tamilisai: ఎన్నికల్లో 5 సార్లు తన ఓటమిపై తమిళిసై సంచలన వ్యాఖ్యలు
Tamilisai: ఎన్నికల్లో 5 సార్లు తన ఓటమిపై తమిళిసై సంచలన వ్యాఖ్యలు
Hindupuram Politics :   కూటమిలో రెబల్ అభ్యర్థిగా పరిపూర్ణానంద - టిక్కెట్ రాకుండా బాలకృష్ణ అడ్డుకున్నారని ఆరోపణ
కూటమిలో రెబల్ అభ్యర్థిగా పరిపూర్ణానంద - టిక్కెట్ రాకుండా బాలకృష్ణ అడ్డుకున్నారని ఆరోపణ
కాంగ్రెస్‌కి ఐటీ శాఖ నోటీసులు, రూ.1,700 కోట్లు చెల్లించాలని ఆదేశం - జైరాం రమేశ్ విమర్శలు
కాంగ్రెస్‌కి ఐటీ శాఖ నోటీసులు, రూ.1,700 కోట్లు చెల్లించాలని ఆదేశం - జైరాం రమేశ్ విమర్శలు
BRS on Kadiam : కడియం నమ్మక ద్రోహి - ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని బీఆర్ఎస్ నేతల డిమాండ్
కడియం నమ్మక ద్రోహి - ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని బీఆర్ఎస్ నేతల డిమాండ్
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Kadiyam Srihari and kadiyam Kavya joins into Congress | కడియంకు రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్ | ABP DesamSun Stroke  Symptoms and Treatment | వడదెబ్బ తగిలిన వ్యక్తికి ఓఆర్ఎస్ నీళ్లు ఇవ్వొచ్చా? | ABP DesamRR vs DC Highlights IPL 2024 | Avesh Khan Bowling | చివరి ఓవర్ లో 4 పరుగులే ఇచ్చిన ఆవేశ్ ఖాన్ | ABPRR vs DC Highlights IPL 2024 | Riyan Parag Batting | పాన్ పరాగ్ అన్నారు..పరేషాన్ చేసి చూపించాడు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tamilisai: ఎన్నికల్లో 5 సార్లు తన ఓటమిపై తమిళిసై సంచలన వ్యాఖ్యలు
Tamilisai: ఎన్నికల్లో 5 సార్లు తన ఓటమిపై తమిళిసై సంచలన వ్యాఖ్యలు
Hindupuram Politics :   కూటమిలో రెబల్ అభ్యర్థిగా పరిపూర్ణానంద - టిక్కెట్ రాకుండా బాలకృష్ణ అడ్డుకున్నారని ఆరోపణ
కూటమిలో రెబల్ అభ్యర్థిగా పరిపూర్ణానంద - టిక్కెట్ రాకుండా బాలకృష్ణ అడ్డుకున్నారని ఆరోపణ
కాంగ్రెస్‌కి ఐటీ శాఖ నోటీసులు, రూ.1,700 కోట్లు చెల్లించాలని ఆదేశం - జైరాం రమేశ్ విమర్శలు
కాంగ్రెస్‌కి ఐటీ శాఖ నోటీసులు, రూ.1,700 కోట్లు చెల్లించాలని ఆదేశం - జైరాం రమేశ్ విమర్శలు
BRS on Kadiam : కడియం నమ్మక ద్రోహి - ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని బీఆర్ఎస్ నేతల డిమాండ్
కడియం నమ్మక ద్రోహి - ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని బీఆర్ఎస్ నేతల డిమాండ్
AP DSC: ఏపీలో 40 సంవత్సరాల్లో 16 డీఎస్సీలు, ఎవరి హయాంలో ఎన్ని వెలువడ్డాయంటే?
ఏపీలో 40 సంవత్సరాల్లో 16 డీఎస్సీలు, ఎవరి హయాంలో ఎన్ని వెలువడ్డాయంటే?
KK Meets Revanth Reddy: రేవంత్‌తో కేకే సమావేశం- పార్టీలోకి ఆహ్వానించిన కాంగ్రెస్ అగ్రనాయకత్వం
రేవంత్‌తో కేకే సమావేశం- పార్టీలోకి ఆహ్వానించిన కాంగ్రెస్ అగ్రనాయకత్వం
Tillu Square Movie Review - టిల్లు స్క్వేర్ రివ్యూ: సిద్ధూ జొన్నలగడ్డ, అనుపమా పరమేశ్వరన్ సినిమా హిట్టా? ఫట్టా? సినిమా ఎలా ఉందంటే?
టిల్లు స్క్వేర్ రివ్యూ: సిద్ధూ జొన్నలగడ్డ, అనుపమా పరమేశ్వరన్ సినిమా హిట్టా? ఫట్టా? సినిమా ఎలా ఉందంటే?
Tillu Square: ‘టిల్లు స్క్వేర్’ వచ్చేది ఆ ఓటీటీలోనే - టీవీ చానెల్ కూడా ఫిక్స్!
‘టిల్లు స్క్వేర్’ వచ్చేది ఆ ఓటీటీలోనే - టీవీ చానెల్ కూడా ఫిక్స్!
Embed widget