అన్వేషించండి

Nellore News: రూ.కోటి కొట్టేసి.. బిచ్చగాళ్లకు రూ.500 నోట్లు పంచేశారు.. కానీ పానీపూరి ఫోన్ కాల్ పట్టించేసింది

నెల్లూరు జిల్లాలో ఇటీవల జరిగిన ఓ భారీ చోరీని పోలీసులు చాకచక్యంగా చేధించారు. ఇందులో ట్విస్ట్ ఏంటంటే దొంగలు పుణ్యక్షేత్రాలకు వెళ్లి బిచ్చగాళ్లకు రూ.500 నోట్లు పంచిపెట్టారు.

నెల్లూరు జిల్లాలో రూ.కోటీ 26 లక్షలు కొట్టేసిన నిందితుల్ని పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. వీరి కోసం 4 రాష్ట్రాల్లో గాలించారు. వారం రోజులపాటు శ్రమించి నిందితులను పట్టుకున్నారు. ఈ కేసు విచారణలో ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి.  పానీపూరీ బండి నడిపే వ్యక్తి నుంచి చేసిన ఫోన్ కాల్ నిందితుల్ని పట్టించింది. 

సంస్థ ఉద్యోగులే చోరీ

నెల్లూరు జిల్లాలో ఇటీవల భారీ చోరీ జరిగింది. ఏకంగా రూ. కోటీ 26 లక్షల సొత్తుని ముగ్గురు దొంగలు దోచుకెళ్లింది. రైటర్స్ సేఫ్ గార్డ్ ప్రైవేట్ ఏజెన్సీ వివిధ సంస్థల డబ్బును బ్యాంకుల్లో నిత్యం డిపాజిట్ చేస్తుంది. సదరు సంస్థ ఉద్యోగులైన షేక్ రబ్బాని, రఫి, మస్తాన్ ఆగస్ట్ 31వతేదీన దొంగతనానికి పాల్పడ్డారు. అక్కడి నుంచి అసలు కథ మొదలైంది. ముందుగా నెల్లూరు నుంచి జొన్నవాడ పారిపోయిన వీళ్లు అక్కడ కొంత నగదును దాచిపెట్టారు. ఆ తర్వాత ఏఎస్ పేట వెళ్లారు. అక్కడి నుంచి కావలి, కావలి నుంచి ఒంగోలు వెళ్లి బంధువుల ఇంట్లో మరి కొంత నగదు ఉంచారు. ఒంగోలు రైల్వే స్టేషన్ లో జీటీ ఎక్స్ ప్రెస్ ఎక్కి భోపాల్ పారిపోయారు. 

బిచ్చగాళ్లకు రూ.500 నోట్లు

మధ్యప్రదేశ్ లోని భోపాల్ నుంచి రాజస్థాన్ లోని అజ్మీర్ వెళ్లారు. అక్కడి నుంచి జైపూర్ ఆ తర్వాత మహారాష్ట్రలోని నాగపూర్ వచ్చారు. అక్కడి నుంచి తెలంగాణలోని ఆదిలాబాద్ వచ్చారు. ఆదిలాబాద్ నుంచి గుంటూరు, గుంటూరు నుంచి కావలి, ఏఎస్ పేట ఆ తర్వాత నెల్లూరు టౌన్ కి చేరుకున్నారు. తీరా నెల్లూరు వచ్చాక పోలీసులు వారిని చాకచక్యంగా పట్టుకున్నారు. వీరి కోసం పోలీసులు మొత్తం 4 రాష్ట్రాల్లో గాలించారు. ఈ నాలుగు రాష్ట్రాల్లో నిందితులు వివిధ పుణ్యక్షేత్రాలకు వెళ్లడం, అక్కడ బిచ్చగాళ్లకు ఒక్కొకరికి రూ.500 నోట్లు ఇవ్వడం విశేషం. కనపడిన బిచ్చగాళ్లందరికీ డబ్బులు పంచుకుంటూ వెళ్లారు.

Also Read: B.Tech Student Death: ఫ్రెండ్స్‌తో పార్టీకెళ్లాడు, వస్తుండగా క్షణాల్లో శవమయ్యాడు.. మిస్టరీగా కేసు, ఇంతకీ అసలేం జరిగింది?

పట్టించిన ఫోన్ కాల్

దొంగతనం చేసిన వెంటనే నిందితులు తమ ఫోన్లను స్విచాఫ్ చేశారు. భోపాల్ లో ఓచోట పానీపూరీ తిని, ఆ బండి నడిపే వ్యక్తి ఫోన్ నుంచి నెల్లూరుకి ఫోన్ చేశారు. ఈ ఫోన్ కాల్ తో పోలీసులు నిందితులున్న చోటును తెలుసుకున్నారు. చివరికి చాకచక్యంగా పట్టుకున్నారు. వీరి నుంచి రూ. కోటీ 11లక్షల 20 వేలు రికవరీ చేసినట్లు నెల్లూరు ఎస్సీ విజయరావు తెలిపారు. విచారణలో ప్రతిభ చూపిన పోలీసులకు రివార్డులందించారు. 

Also Read: Saidabad Girl Rape: సైదాబాద్ చిన్నారి హత్యాచార కేసు.. నిందితుడు ఎక్కడ.. సాయం చేసింది అతడి ఫ్రెండేనా?

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Viral News: న్యాయం కోసం వెళితే.. టీచర్స్ బ్రాండ్ మద్యం బాటిళ్లు కావాలంటూ ఎస్ఐ డిమాండ్!
న్యాయం కోసం వెళితే.. టీచర్స్ బ్రాండ్ మద్యం బాటిళ్లు కావాలంటూ ఎస్ఐ డిమాండ్!
Tamil Nadu Explosion: బాణసంచా ఫ్యాక్టరీలో ఘోర ప్రమాదం, పేలుడు ధాటికి 10 గదులు ధ్వంసం.. శిథిలాల కింద 60 మంది !
బాణసంచా ఫ్యాక్టరీలో ప్రమాదం, పేలుడు ధాటికి 10 గదులు ధ్వంసం.. శిథిలాల కింద 60 మంది !
Constable Dies in Road Accident: డ్యూటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. అక్కడికక్కడే కానిస్టేబుల్ మృతి- వికారాబాద్ జిల్లాలో ఘటన
డ్యూటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. కానిస్టేబుల్ మృతి- వికారాబాద్ జిల్లాలో ఘటన
Palnadu Crime News: లాయర్ హత్య కేసులో ట్విస్ట్.. వివాహేతర సంబంధం కోసం కానిస్టేబుల్ దారుణం!
పల్నాడులో లాయర్ హత్య కేసులో ట్విస్ట్.. వివాహేతర సంబంధం కోసం కానిస్టేబుల్ దారుణం!

వీడియోలు

SRH Bowling Disaster vs PBKS IPL 2026 | SRH బౌలింగ్ వైఫల్యంపై ఫ్యాన్స్ ఫైర్
Ayush Mhatre Retired Out IPL 2026 | సీఎస్కే మేనేజ్మెంట్ పై విమర్శల వర్షం
Sanju Samson Salute Celebration | కోచ్ కోసం సంజూ శాంసన్ సెల్యూట్
CSK vs DC IPL 2026 Sanju Samson Century | సంజూ శాంస‌న్ ఫాస్టెస్ట్ సెంచ‌రీ
IPL 2026 CSK vs DC Highlights | బోణీ కొట్టిన చెన్నై

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Strait of Hormuz: హర్మూజ్‌పై భారత్‌కు ఇరాన్ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. టోల్ ఛార్జీలతో పాటు రాకపోకలపై కీలక ప్రకటన
హర్మూజ్‌పై భారత్‌కు ఇరాన్ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. టోల్ ఛార్జీలతో పాటు రాకపోకలపై కీలక ప్రకటన
Kavitha And Sharmila: జగన్, కేటీఆర్‌లు ముందు పరిష్కరించుకోవాల్సింది కుటుంబ సమస్యలే - షర్మిల, కవితలు చీల్చే ఓట్లే శాసిస్తాయా?
జగన్, కేటీఆర్‌లు ముందు పరిష్కరించుకోవాల్సింది కుటుంబ సమస్యలే - షర్మిల, కవితలు చీల్చే ఓట్లే శాసిస్తాయా?
Praful Hinge Social Media : ఒకే మ్యాచ్‌తో ప్రఫుల్‌కు ఫుల్ క్రేజ్‌ !మైదానంలో వికెట్ల వేటతో సోషల్ మీడియాలో ఫాలోవర్స్ సునామీ!
ఒకే మ్యాచ్‌తో ప్రఫుల్‌కు ఫుల్ క్రేజ్‌ !మైదానంలో వికెట్ల వేటతో సోషల్ మీడియాలో ఫాలోవర్స్ సునామీ!
Tamil Nadu Assembly Elections: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో జయలలిత, కరుణానిధిలదే కీలక పాత్ర - ఏఐతో మాయ చేస్తున్న పార్టీలు!
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో జయలలిత, కరుణానిధిలదే కీలక పాత్ర - ఏఐతో మాయ చేస్తున్న పార్టీలు!
DOST Notification 2026: తెలంగాణలో డిగ్రీ ప్రవేశాల షెడ్యూల్ విడుదల.. ఈ 15 నుంచి దోస్త్ రిజిస్ట్రేషన్లు ప్రారంభం
తెలంగాణలో డిగ్రీ ప్రవేశాల షెడ్యూల్ విడుదల.. ఈ 15 నుంచి దోస్త్ రిజిస్ట్రేషన్లు ప్రారంభం
Sudigali Sudheer : సుడిగాలి సుధీర్‌తో దీపిక పిల్లి లాక్ అయిందా?.. అసలు మ్యాటర్ ఏంటంటే?
సుడిగాలి సుధీర్‌తో దీపిక పిల్లి లాక్ అయిందా?.. అసలు మ్యాటర్ ఏంటంటే?
AP Sarpanch Elections: 5 ఏళ్ల తర్వాత సర్పంచ్ ఎన్నికల విజేతను తేల్చిన కోర్ట్.. కోనసీమలో అనూహ్య పరిణామం
5 ఏళ్ల తర్వాత సర్పంచ్ ఎన్నికల విజేతను తేల్చిన కోర్ట్.. కోనసీమలో అనూహ్య పరిణామం
What Is Quantum Computer: నేడే ఏపీలో క్వాంటం కంప్యూటర్ ప్రారంభం.. దీనివల్ల కలిగే ప్రయోజనాలు ఇవే
నేడే ఏపీలో క్వాంటం కంప్యూటర్ ప్రారంభం.. దీనివల్ల కలిగే ప్రయోజనాలు ఇవే
Embed widget