By: ABP Desam | Updated at : 10 Jan 2022 10:38 PM (IST)
Edited By: Satyaprasad Bandaru
మున్నేరులో చిన్నారుల గల్లంతు
కృష్ణాజిల్లా చందర్లపాడు మండలం ఏటూరు గ్రామం వద్ద మున్నేరులో ఐదుగురు పిల్లలు గల్లంతయ్యారు. గ్రామానికి చెందిన 8 నుంచి 13 ఏళ్ల మధ్య వయసున్న ఐదుగురు పిల్లలు సోమవారం మధ్యాహ్నం మున్నేరు వైపు వెళ్లారు. రాత్రి అవుతున్నా పిల్లలు ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు వారి ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు. పిల్లల బట్టలు, వారి సైకిళ్లు మున్నేరు ఒడ్డున ఉండటంతో ఆ పరిసర ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టారు. గ్రామస్తుల కూడా మున్నేరు పరిసర ప్రాంతాల్లో పిల్లల కోసం గాలిస్తున్నారు. పోలీసులకు సమాచారం అందించగా... సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు. పిల్లల ఆచూకీ తెలియకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. గల్లంతైన వారు చరణ్, బాల యేసు, అజయ్, రాకేష్, సనిగా పోలీసులు గుర్తించారు. స్థానిక ఎమ్మెల్యే మొండితోక జగన్మోహనరావు ఘటనాస్థలికి చేరుకుని గాలింపు చర్యలను పర్యవేక్షిస్తున్నారు.
Also Read: ధరలు దిగిరావాలి.. జగన్ దిగిపోవాలి.. నినాదంతో టీడీపీ రాష్ట్ర వ్యాప్త నిరసనలు
ఈతకు వెళ్లి గల్లంతు..!
చందర్లపాడు మండలం ఏటూరు గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. కృష్ణానదిలో స్నానం చేయడానికి వెళ్లి ఐదుగురు విద్యార్థులు గల్లంతయ్యారు . ఏటూరు గ్రామానికి చెందిన చరణ్, బాల యేసు, అజయ్, రాజేష్, సన్నీలు సంక్రాంతి సెలవులు రావడంతో సరదాగా ఈత కొట్టేందుకు కృష్ణానదిలోకి వెళ్లినట్లు స్థానికులు తెలిపారు. విద్యార్థులు ఎంతసేపటికి ఇంటికి రాకపోవడంతో కృష్ణా నది వైపు వెళ్లారని తల్లిదండ్రులకు స్థానికులు తెలపడంతో... విద్యార్థులు కృష్ణా నదిలో దిగినట్లు గుర్తించి పోలీస్ రెవెన్యూ ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. సమాచారం తెలుసుకున్న అధికారులు సంఘటనా స్థలానికి వెళ్లి విద్యార్థులు ఎక్కడ ఉన్నారనే దానిపై గాలింపు చర్యలు చేపట్టారు. ఈ విద్యార్థులు స్థానిక ప్రభుత్వ పాఠశాలలో 7వ తరగతి చదువుతున్నట్లు తెలిసింది. గల్లంతైన వారు చరణ్ , బాల యేసు(13), అజయ్, రాకేష్ , సన్నీగా గుర్తించారు.
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్స్క్రైబ్ చేయండి
Jeedimetla News : ఇంట్లో దాచిన రూ.4 లక్షలు ఇరవై రోజుల్లో ఖర్చుపెట్టేసిన పిల్లలు
Begumbazar Honour Killing : బేగంబజార్ పరువు హత్య కేసు, కర్ణాటకలో నలుగురు నిందితులు అరెస్టు
Husband Murder : 'మీ భర్తను ఎలా చంపాలి' అనే పుస్తకం రాసిన రచయిత్రి, ఆపై పక్కా ప్లాన్ తో భర్త మర్డర్!
Hyderabad Honour Killing Case: మార్వాడీ అబ్బాయి, యాదవ్ అమ్మాయి లవ్ మ్యారేజీ, అంతలోనే పరువు హత్యపై పోలీసులు ఏమన్నారంటే !
Honour Killing: హైదరాబాద్లో మరో పరువు హత్య - యువకుడిపై కత్తులతో విచక్షణారహితంగా దాడి చేసి దారుణం
Bigg Boss OTT Telugu: గ్రాండ్ ఫినాలేకి రంగం సిద్ధం - ఇదిగో ప్రోమో
NTR31: క్రేజీ రూమర్ - ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమాలో కమల్ హాసన్?
Kanika Kapoor Second Marriage: 'పుష్ప' సింగర్ రెండో పెళ్లి చేసుకుంది - ఫొటోలు చూశారా?
Pooja Hegde: ‘కేన్స్’లో పూజా హెగ్డేకు చేదు అనుభవం, ఆమె కోసం వారు నిద్రాహారాలు మానేశారట!