అన్వేషించండి

Payyavula Kesav: రాష్ట్రంలో సినిమా సమస్యలు తప్ప మరే సమస్యల్లేవా?... మంత్రులు తిట్టడం తప్ప మాట్లాడడం మానేశారు... పీఏసీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్

రాష్ట్రంలో సినిమా సమస్యలు తప్ప మరే సమస్యలు లేనట్లు వైసీపీ సర్కార్ వ్యవహరిస్తుందని పయ్యావుల కేశవ ఆరోపించారు. రైతుల కష్టాల గురించి మంత్రులు ఎందుకు చర్చించడంలేదని ప్రశ్నించారు.

రాష్ట్రంలో మరే సమస్యలు లేనట్లు సినిమా టిక్కెట్ల ధరల గురించే మంత్రులు చర్చిస్తున్నారని టీడీపీ ఎమ్మెల్యే, పీఏసీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్ అన్నారు. రైతుల జీవితాల్లో సినిమా కష్టాలకు మించిన కష్టాలు ఉన్నాయన్నారు. వాటి గురించి ఎందుకు చర్చించడం లేదని ప్రశ్నించారు. రైతు సమస్యలు, తగ్గిన ఉద్యోగుల జీతాలు, నిరుద్యోగుల కోసం మంత్రులు ఎప్పుడైనా చర్చించారా అని పయ్యావుల విమర్శించారు.

Also Read: నాలుగు గంటల భేటీ మధ్యలో రొయ్యల బిర్యానీ లంచ్ ! చివరికి ఏమి తేల్చారంటే ?

మంత్రులు మాట్లాడడం మర్చిపోయారు 

ఏపీ స‌చివాల‌యంలో సోమవారం పీఎసీ స‌మావేశం జ‌రిగింది. ఈ స‌మావేశానికి అధికారులు హాజ‌రు కాక‌పోవ‌టంపై పీఏసీ ఛైర్మన్ ప‌య్యావుల కేశ‌వ్ అభ్యంత‌రం తెలిపారు. సంబంధిత అధికారుల‌కు కోవిడ్ సోకితే మిగిలిన అధికారులు కూడా స‌మావేశానికి గైర్హాజరు అవ్వడాన్ని ఆయన తప్పుబట్టారు. అనంత‌రం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర మంత్రులు తిట్టడం తప్ప మాట్లాడడం మానేశారని ఎద్దేవా చేశారు. ఈ రాష్ట్రంలో సినిమాలకు మించిన సమస్యలు చాలా ఉన్నాయన్నారు. పీఏసీ సమావేశంలో విద్యుత్ కొనుగోళ్లపై చర్చ జరిగిందని, కోవిడ్ కారణంగా సంబంధిత అధికారి సమావేశానికి రాలేకపోయారన్నారు. కమిటీకి ఇవ్వాల్సిన సమాచారాన్ని కూడా ఇవ్వలేదని తెలిపారు. అజెండాకు సంబంధించిన సమాచారాన్ని ఇవ్వకపోవడాన్ని పీఏసీ కమిటీ తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేసిందన్నారు. 

Also Read: ఓడిపోతే రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటా... నర్సాపురం వెళ్తున్నా రెండు రోజులు అక్కడే ఉంటా... ఎంపీ రఘురామ

ఓటీఎస్ పేరుతో అక్రమంగా డబ్బు వసూలు

ఓటీఎస్‌ పేరుతో పేదల నుంచి డబ్బు వసూలు చేస్తున్న ఈ ప్రభుత్వానికి ప్రజలే వన్‌టైమ్‌ సెటిల్‌మెంట్‌ చేయబోతున్నారని పయ్యావుల కేశవ్‌ విమర్శించారు. గుంటూరు జిల్లా నకరికల్లు మండలం కుంకలగుంటలో ఎన్టీఆర్‌ కాంస్య విగ్రహాన్ని ఆదివారం ఆవిష్కరించారు. రాజకీయాల్లో సామాజిక విప్లవం తీసుకొచ్చిన మహానీయుడు ఎన్టీఆర్‌ అని అన్నారు. వైసీపీ ప్రభుత్వం మూడేళ్ల కాలంలో అన్ని వర్గాలకూ అన్యాయం చేస్తూ రాష్ట్రాన్ని 20 ఏళ్లు వెనక్కి తీసుకెళ్లారని ఆరోపించారు. 

Also Read: జగన్ చుట్టూ ప్రమాదకర వ్యక్తులు ! ఎవరిని ఉద్దేశించి ఆర్జీవీ ఇలా చెబుతున్నారు ?

Also Read: కేజీహెచ్ పేరు మార్చడం కాదు చేతనైతే విశాఖ రైల్వే జోన్ సాధించండి.... బీజేపీ నేతలకు మంత్రి అవంతి స్ట్రాంగ్ కౌంటర్

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP Weather: ఏపీలో మాడు పగిలేలా ఎండలు, ఈ ప్రాంతాల్లో తీవ్ర వడగాల్పులు - విపత్తుల సంస్థ వార్నింగ్
ఏపీలో మాడు పగిలేలా ఎండలు, ఈ ప్రాంతాల్లో తీవ్ర వడగాల్పులు - విపత్తుల సంస్థ వార్నింగ్
IPL 2024: బెంగళూరుదే తొలి బాటింగ్, ప్లే ఆఫ్ ఆశ నెరవేరేనా
బెంగళూరుదే తొలి బాటింగ్, ప్లే ఆఫ్ ఆశ నెరవేరేనా
Telangana Graduate MLC :  తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఉపఎన్నిక - కాంగ్రెస్ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్నకు చాన్స్
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఉపఎన్నిక - కాంగ్రెస్ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్నకు చాన్స్
Sajjala Ramakrishna: ఆ ట్వీట్ చూస్తే పశువులు కూడా అసహ్యించుకుంటాయి - సజ్జల ఘాటు స్పందన
ఆ ట్వీట్ చూస్తే పశువులు కూడా అసహ్యించుకుంటాయి - సజ్జల ఘాటు స్పందన
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Paritala Sunitha Files Nomination | వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ప్రకాష్ రెడ్డిపై పరిటాల సునీత ఫైర్Singanamala YCP MLA Candidate Veeranjaneyulu | శింగనమల ఎమ్మెల్యే అభ్యర్థి వీరాంజనేయులు ఇంటర్వ్యూCongress Leader Feroz Khan |ఒవైసీ ఓడిపోతే నేను రాజకీయాలు వదిలేస్తా: ABP Straight Talkలో ఫిరోజ్‌ఖాన్SRH vs RCB AT Uppal | Fans Reactions | ఉప్పల్ వద్ద ఫ్యాన్స్ రచ్చ.. కోహ్లీ ఫ్యాన్సే పాపం..! | ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Weather: ఏపీలో మాడు పగిలేలా ఎండలు, ఈ ప్రాంతాల్లో తీవ్ర వడగాల్పులు - విపత్తుల సంస్థ వార్నింగ్
ఏపీలో మాడు పగిలేలా ఎండలు, ఈ ప్రాంతాల్లో తీవ్ర వడగాల్పులు - విపత్తుల సంస్థ వార్నింగ్
IPL 2024: బెంగళూరుదే తొలి బాటింగ్, ప్లే ఆఫ్ ఆశ నెరవేరేనా
బెంగళూరుదే తొలి బాటింగ్, ప్లే ఆఫ్ ఆశ నెరవేరేనా
Telangana Graduate MLC :  తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఉపఎన్నిక - కాంగ్రెస్ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్నకు చాన్స్
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఉపఎన్నిక - కాంగ్రెస్ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్నకు చాన్స్
Sajjala Ramakrishna: ఆ ట్వీట్ చూస్తే పశువులు కూడా అసహ్యించుకుంటాయి - సజ్జల ఘాటు స్పందన
ఆ ట్వీట్ చూస్తే పశువులు కూడా అసహ్యించుకుంటాయి - సజ్జల ఘాటు స్పందన
Nominations Over :  తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం-  ఏపీలో అసెంబ్లీ ఎన్నికల ఫీవర్ !
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం- ఏపీలో అసెంబ్లీ ఎన్నికల ఫీవర్ !
DGP  Ravi Gupta : ఎయిర్ లైన్స్ సేవాలోపం - తెలంగాణ డీజీపీ ఏం  చేశారో తెలుసా ?
ఎయిర్ లైన్స్ సేవాలోపం - తెలంగాణ డీజీపీ ఏం చేశారో తెలుసా ?
మీ పిల్లలు హార్లిక్స్‌ని ఇష్టంగా తాగేస్తున్నారా? అది హెల్తీ డ్రింక్ కాదట - ఆ సంస్థే ఒప్పుకుంది
మీ పిల్లలు హార్లిక్స్‌ని ఇష్టంగా తాగేస్తున్నారా? అది హెల్తీ డ్రింక్ కాదట - ఆ సంస్థే ఒప్పుకుంది
Fact Check: ముస్లింలకు ఆస్తులు పంచి పెడతామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందా? బీజేపీ చేసిన ఆ ఆరోపణల్లో నిజమెంత?
Fact Check: ముస్లింలకు ఆస్తులు పంచి పెడతామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందా? బీజేపీ చేసిన ఆ ఆరోపణల్లో నిజమెంత?
Embed widget