అన్వేషించండి

Hyderabad Latest News: సమోసాలు కనిపిస్తే ఆగిపోయే వారి కోసమే ఈ న్యూస్! ఆ టేస్ట్ రెసిపీ గుట్టు రట్టు చేసిన పోలీసులు!

సాధారణంగా ఏదైనా ఆహార పదార్థాల తయారీ కేంద్రం నడపాలంటే ఫుడ్ సేఫ్టీ అండ్‌ స్టారండర్డ్స్‌ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి లైసెన్స్ పొందాలి. కానీ అబ్దుల్ రషీద్ నడుపుతున్న ఈ షెడ్డుకు ఎటువంటి అనుమతులు లేవు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • కుళ్ళిన పదార్థాలతో సమోసాలు తయారీ, పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
  • మూసీ తీరంలో అపరిశుభ్ర వాతావరణంలో అక్రమ వ్యాపారం సాగుతోంది.
  • నాసిరకం నూనె, కుళ్ళిన గుడ్లతో సమోసాలు తయారు చేస్తున్నారు.
  • హోటళ్లు, బేకరీలకు కల్తీ సమోసాలు సరఫరా అవుతున్నట్లు గుర్తించారు.

Hyderabad Crime News: హైదరాబాద్‌వాసులు ఇష్టమైన చిరుతిండి సమోసా వెనుక దాగి ఉన్న భయంకరమైన నిజం వెలుగులోకి వచ్చింది. పైన కరకరలాడుతూ, లోపల రచిగా అనిపించే సమోసాలు వాస్తవానికి కుళ్లిపోయిన పదార్థాలతో తయారవుతున్నాయే షాకింగ్ నిజాన్ని కుల్సుంపురా పోలీసులు బయటపెట్టారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతూ ఆపరిశుభ్ర వాతావరణంలో కల్తీ పదార్థాలతో సమోసాలు తయారు చేస్తున్న వారిని పోలీసులు పట్టుకున్నారు. 

మూసీ తీరంలో అక్రమ దందా 

కుల్సుంపురా ఇన్‌స్పెక్టర్ రాములు, ఎస్సై నర్సింహ తన టీంతో కలిసి జియాగూడ బైపాస్‌ రోడ్డులోని మూసీ తీరంలో ఉన్న ఒక షెడ్డుపై ఆకస్మిక దాడి చేశారు. గోల్కొండకు చెందిన అబ్దుల్ రషీద్  (73)అనే వ్యక్తి ఈ కేంద్రాన్ని నిర్వహిస్తున్నాడు. గత కొంత కాలంగా ఎటువంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా, ఫుడ్ సేఫ్టీ నిబంధనలను తుంగలో తొక్కి ఇక్కడ సమోసాలు తయారీ సాగుతోంది. కేవలం లాభార్జనే ధ్యేయంగా పెట్టుకున్న నిర్వాహకుడు ఐదారుగురు కార్మికులతో కలిసి ఈ అక్రమ కేంద్రాన్ని నడుపుతున్నాడు. 

Image

కళ్లపోయిన పదార్ధాలతో సమోసాలు 

పోలీసుల తనిఖీల్లో వెలుగు చూసిన దృశ్యాలు అధికారులనే విస్మయానికి గురి చేశాయి. ఈ కేంద్రంలో వినియోగిస్తున్న పదార్థాలన్నీ అత్యంత నాసిరకమైనవి, అనారోగ్యకరమైనవి. సమోసాలు నింపే మిశ్రమం కోసం కుళ్లిపోయిన కోడిగుడ్లను వినియోగిస్తున్నారు. కాలం చెల్లిన, పదే పదే మరింగించిన కల్తీ వంట నూనెలను ఇక్కడ వాడుతున్నారు. సమోసా తయారీలో ఉపయోగించే ఆలుగడ్డలు, ఇతర కూరగాయలు కూడా కుళ్లిపోయినవేనని పోలీసులు ధ్రువీకరించారు. నిల్వ ఉండిపోయిన పురుగు పట్టిన మైదా పిండిని వినియోగిస్తూ ప్రజల ఆరోగ్యానికి ముప్పు తెస్తున్నారు. 

Image

ఈ కేంద్రంలో తయారైన కల్తీ సమోసాలు కేవలం ఒక ప్రాంతానికే పరిమితం కావడం లేదు. జియాగూడ పరిసర ప్రాంతాల్లో అనేక హోటళ్లు, బేకరీలు, వీధి వ్యాపారులకు ఇక్కడి నుంచి పెద్ద మత్తంలో సరకు సరఫరా అవుతోంది. వినియోగదారులు ఆ రుచికి ఆకర్షితులవుతున్నప్పటికీ, లోపల జరుగుతున్న ఈ అక్రమ తంతూ ఎవరికీ తెలియదు. 

Hyderabad Latest News: సమోసాలు కనిపిస్తే ఆగిపోయే వారి కోసమే ఈ న్యూస్! ఆ టేస్ట్ రెసిపీ గుట్టు రట్టు చేసిన పోలీసులు!

సాధారణంగా ఏదైనా ఆహార పదార్థాల తయారీ కేంద్రం నడపాలంటే ఫుడ్ సేఫ్టీ అండ్‌ స్టారండర్డ్స్‌ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి లైసెన్స్ పొందాలి. కానీ అబ్దుల్ రషీద్ నడుపుతున్న ఈ షెడ్డుకు ఎటువంటి అనుమతులు లేవు. పూర్తి అపరిశుభ్రమైన వాతావరణంలో నేలపైనే పిండిని కలుపుతూ, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా వ్యాపారం చేస్తున్నారు. 

శుక్రవారం సాయంత్రం జరిగిన ఈ దాడిలో పోలీసులు పెద్ద మొత్తంలో మైదా, కల్తీ నూనెలు, కుళ్లిన గుడ్లు స్వాధీనం చేసుకున్నారు. నిర్వాహకుడు అబ్ధుల్ రషీద్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ దందాలో ఇంకా ఎవరి ప్రమేయం ఉంది, ఎక్కడెక్కడికి సరఫరా చేస్తున్నారు అనే కోంలో దర్యాప్తు చేస్తున్నారు. 

 

Frequently Asked Questions

హైదరాబాద్‌లో సమోసాల తయారీలో వెలుగు చూసిన భయంకరమైన నిజం ఏమిటి?

కుల్సుంపురా పోలీసులు ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతూ, అపరిశుభ్ర వాతావరణంలో కుళ్ళిపోయిన పదార్థాలతో సమోసాలు తయారు చేస్తున్న అక్రమ కేంద్రాన్ని గుర్తించారు.

సమోసాల తయారీలో ఏ కల్తీ పదార్థాలను ఉపయోగిస్తున్నారు?

కుళ్ళిపోయిన కోడిగుడ్లు, కాలం చెల్లిన నూనెలు, కుళ్ళిన ఆలుగడ్డలు, పురుగుపట్టిన మైదా పిండిని సమోసాల తయారీలో ఉపయోగిస్తున్నారు.

ఈ అక్రమ సమోసా తయారీ కేంద్రం ఎక్కడ ఉంది మరియు ఎవరు నిర్వహిస్తున్నారు?

ఈ కేంద్రం జియాగూడ బైపాస్ రోడ్డులోని మూసీ తీరంలో ఉంది, దీనిని గోల్కొండకు చెందిన అబ్దుల్ రషీద్ అనే వ్యక్తి నిర్వహిస్తున్నాడు.

ఈ కల్తీ సమోసాలు ఎక్కడెక్కడ సరఫరా అవుతున్నాయి?

జియాగూడ పరిసర ప్రాంతాల్లోని అనేక హోటళ్లు, బేకరీలు, మరియు వీధి వ్యాపారులకు ఈ కల్తీ సమోసాలు పెద్ద మొత్తంలో సరఫరా అవుతున్నాయి.

టాప్ హెడ్ లైన్స్

Singarayakonda Train Suicide: ఆస్తి కోసం బావను చంపాడు - భయంతో కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకున్నాడు - సింగరాయకొండలో విషాదం
ఆస్తి కోసం బావను చంపాడు - భయంతో కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకున్నాడు - సింగరాయకొండలో విషాదం
Mobile Phone Death: గొడవలో ఫోన్ విసిరేసిన భార్య - తలకు దెబ్బతరిగి భర్త మృతి - ఇలాంటివి కూడా జరుగుతాయి!
గొడవలో ఫోన్ విసిరేసిన భార్య - తలకు దెబ్బతరిగి భర్త మృతి - ఇలాంటివి కూడా జరుగుతాయి!
ACB Raids: పెద్దపల్లిలో అడ్డంగా దొరికిన మున్సిపల్ ఏఈ.. రూ.2 లక్షల లంచం తీసుకుంటూ బుక్కయ్యాడు
పెద్దపల్లిలో అడ్డంగా దొరికిన మున్సిపల్ ఏఈ.. రూ.2 లక్షల లంచం తీసుకుంటూ బుక్కయ్యాడు
Gun At Shopping Mall: కూకట్‌పల్లి లులు మాల్‌లో గన్ కలకలం.. యాజమాన్యంపై కేసు నమోదు
కూకట్‌పల్లి లులు మాల్‌లో గన్ కలకలం.. యాజమాన్యంపై కేసు నమోదు

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mudragada Padmanabham Funeral:ముద్రగడ పద్మనాభం అంత్యక్రియల్లో వివాదం! కుమార్తె రాకను అడ్డుకున్న కుటుంబం! కిర్లంపూడిలో ఉద్రిక్తత!
ముద్రగడ పద్మనాభం అంత్యక్రియల్లో వివాదం! కుమార్తె రాకను అడ్డుకున్న కుటుంబం! కిర్లంపూడిలో ఉద్రిక్తత!
HYDRAA Demolitions: హైడ్రా టార్గెట్ చేస్తున్న ప్రాజెక్టులన్నీ కేటీఆర్ సన్నిహితులవేనా ? - తెలంగాణ రాజకీయాల్లో తెర వెనుక ఏం జరుగుతోంది?
హైడ్రా టార్గెట్ చేస్తున్న ప్రాజెక్టులన్నీ కేటీఆర్ సన్నిహితులవేనా ? - తెలంగాణ రాజకీయాల్లో తెర వెనుక ఏం జరుగుతోంది?
Kaleshwaram Project: కాళేశ్వరం నీళ్లు వదలకుంటే హైదరాబాద్‌లో బిందెల యుద్ధమే :ABP Desamతో మాజీ ఇరిగేషన్ ఇంజనీర్ టి. వెంటేశం
కాళేశ్వరం నీళ్లు వదలకుంటే హైదరాబాద్‌లో బిందెల యుద్ధమే :ABP Desamతో మాజీ ఇరిగేషన్ ఇంజనీర్ టి. వెంటేశం
US Iran War: తీవ్ర స్థాయికి అమెరికా, ఇరాన్‌ మధ్య యుద్ధం! 20 యుద్ధనౌకలు, వందలాది ఫైటర్ జెట్‌లతో హోర్ముజ్‌తో రౌండప్‌!
తీవ్ర స్థాయికి అమెరికా, ఇరాన్‌ మధ్య యుద్ధం! 20 యుద్ధనౌకలు, వందలాది ఫైటర్ జెట్‌లతో హోర్ముజ్‌తో రౌండప్‌!
TTD Latest News: తిరుమల ట్రస్టులు, పథకాల దాత‌ల ప్రివిలేజెస్‌లో భారీ మార్పులు! ఒంటిమిట్ట అభివృద్ధికి నిధులు! టీటీడీ కీలక నిర్ణయాలు! 
తిరుమల ట్రస్టులు, పథకాల దాత‌ల ప్రివిలేజెస్‌లో భారీ మార్పులు! ఒంటిమిట్ట అభివృద్ధికి నిధులు! టీటీడీ కీలక నిర్ణయాలు! 
Telangana Latest News: 9,000 రూపాయల ఖరీదు చేసే డ్రోన్ 91 రూపాయలకే! టీబీ రోగుల పాలిట వరంలా సేవలు! 
9,000 రూపాయల ఖరీదు చేసే డ్రోన్ 91 రూపాయలకే! టీబీ రోగుల పాలిట వరంలా సేవలు! 
Visakhapatnam Latest News:వందల సంఖ్యలో జంతువుల సంరక్షణకు ఒకడే పశువైద్యుడా? విశాఖ జూలో ఉద్యోగ ఖాళీలపై అయ్యన్న విస్మయం!
వందల సంఖ్యలో జంతువుల సంరక్షణకు ఒకడే పశువైద్యుడా? విశాఖ జూలో ఉద్యోగ ఖాళీలపై అయ్యన్న విస్మయం!
Maruti S-Presso Price in Hyderabad: హైదరాబాద్‌లో మారుతి ఎస్‌ప్రెస్సో ఆన్‌రోడ్ ధరలు! వేరియంట్స్, మైలేజీ పూర్తి వివరాలు ఇవే!
హైదరాబాద్‌లో మారుతి ఎస్‌ప్రెస్సో ఆన్‌రోడ్ ధరలు! వేరియంట్స్, మైలేజీ పూర్తి వివరాలు ఇవే!
Embed widget