అన్వేషించండి

Guntur Crime News: అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్త హత్య.. చిలువురు హత్య కేసును చేధించిన పోలీసులు

గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం చిలువురులో హత్యకు గురైన వ్యాపారి కేసును పోలీసులు ఛేదించారు. అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ప్రియుడితో కలిసి భార్యనే హత్య చేసింది.

దుగ్గిరాల: గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం చిలువురులో సంచలనం సృష్టించిన హత్య కేసు మిస్టరీని మంగళగిరి రూరల్ పోలీసులు ఛేదించారు. ఈ దారుణానికి సంబంధించిన వివరాలను గుంటూరు జిల్లా ఎస్పీ వకూల్ జిందాల్ సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో మీడియా సమావేశంలో వెల్లడించారు. భార్య తన ప్రియుడు, అతని స్నేహితుడితో కలిసి పథకం ప్రకారం భర్తను హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్పీ ప్రకటించారు.

వివాహేతర సంబంధం..

గుంటూరు ఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం.. చిలువూరుకు చెందిన ఉల్లిపాయల వ్యాపారి లోకం శివనాగరాజుకు లక్ష్మీమాధురితో 2007లో వివాహమైంది. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. గతంలో విజయవాడలో థియేటర్ టికెట్‌ కౌంటర్‌లో లక్ష్మీమాధురి పనిచేసింది. ఆ సమయంలో సత్తెనపల్లికి చెందిన గోపితో ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధంగా మారింది. మరోవైపు చిన్న చూపు చూసి భర్త వ్యాపారాన్ని మాన్పించేసింది. హైదరాబాద్‌లో ట్రావెల్స్‌ నిర్వహిస్తున్న ప్రియుడు గోపి వద్దకు భర్తను ఉద్యోగానికి పంపింది. కొంతకాలానికి నాగరాజు హైదరాబాద్‌ నుంచి సొంతవూరుకి వచ్చేశాడు. భార్య వ్యవహారం నచ్చక మందలించాడు. అవి విభేదాలకు దారితీసి గొడవలు జరిగాయి. భర్త శివనాగరాజు ఇంటివద్ద నుంచే వ్యాపారం చేయడంతో గోపీని కలుసుకునే అవకాశం చిక్కడం లేదని, అతడి అడ్డు తప్పించుకోవాలని లక్ష్మీమాధురి భావించింది.


Guntur Crime News: అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్త హత్య.. చిలువురు హత్య కేసును చేధించిన పోలీసులు

అప్పడాల కర్రతో కొట్టి చంపేశారు..

 నిందితురాలు లక్ష్మీ మాధురి తన భర్త శివనాగరాజు తనను వేధిస్తున్నాడని ప్రియుడు గోపికి చెప్పడంతో ఇద్దరు కలిసి హత్యకు కుట్ర పన్నారు. ఇందుకోసం గోపి తన స్నేహితుడైన కంభంపాటి సురేష్ (ఆర్ఎంపి) వద్ద నుండి నిద్ర మాత్రలు సేకరించి మాధురికి ఇచ్చాడు. పక్కా ప్లాన్ ప్రకారం, ఈ నెల 18వ తేదీన మాధురి ఆ నిద్ర మాత్రలను పొడిగా చేసి బిర్యానీలో కలిపి భర్తకు పెట్టింది. శివనాగరాజు నిద్రమత్తులోకి జారుకున్న తర్వాత, నిందితులు అతడి కాళ్లు చేతులు పట్టుకుని, ఛాతీపై అప్పడాల కర్రతో బలంగా కొట్టి ప్రాణాలు తీశారు.


Guntur Crime News: అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్త హత్య.. చిలువురు హత్య కేసును చేధించిన పోలీసులు

హత్య అనంతరం, భర్త గుండెపోటుతో మరణించాడని నమ్మించేందుకు నిందితురాలు ప్రయత్నించింది. అయితే, మృతుడి చెవి నుంచి రక్తం వచ్చినట్లు గమనించిన పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. ప్రాథమికంగా మృతదేహంపై గాయాలు కనిపించకపోయినా, పోస్ట్‌మార్టం నివేదికలో ఛాతీ ఎముకలు విరిగినట్లు తేలడంతో హత్య విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తమదైన శైలిలో విచారణ చేపట్టడంతో లక్ష్మీమాధురి తప్పు ఒప్పుకుంది. ఆమె ఇచ్చిన వివరాలతో ప్రియుడు గోపీతో పాటు అతడి స్నేహితుడు సురేష్‌ను కూడా అరెస్ట్ చేసినట్లు ఎస్పీ వకూల్ జిందాల్ స్పష్టం చేశారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Karnataka Crime News: కర్ణాటకలో పట్టపగలే దారుణం.. యువతిని కొడవలితో నరికి చంపిన ప్రేమోన్మాది
కర్ణాటకలో పట్టపగలే దారుణం.. యువతిని కొడవలితో నరికి చంపిన ప్రేమోన్మాది
Doctor Murder Case: భర్తను పొడిచి చంపేసింది - 8 ఏళ్ల కుమారుడికీ కత్తిపోట్లు - మహిళా డాక్టర్ కిరాతకం!
భర్తను పొడిచి చంపేసింది - 8 ఏళ్ల కుమారుడికీ కత్తిపోట్లు - మహిళా డాక్టర్ కిరాతకం!
Hyderabad Drugs Seized: హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కుమారుడితో పాటు ముగ్గురు అరెస్ట్.. పరారీలో మరో నలుగురు
హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కుమారుడితో పాటు ముగ్గురు అరెస్ట్.. పరారీలో మరో నలుగురు
Fake IAS Officer Wedding Fraud: ఐఏఎస్ అంటే ఎగిరి గంతేసి పెళ్లి చేసుకున్నాడు - శోభనం నైటే కోటి నగలతో జంప్ - పాపం పెళ్లికొడుకు !
ఐఏఎస్ అంటే ఎగిరి గంతేసి పెళ్లి చేసుకున్నాడు - శోభనం నైటే కోటి నగలతో జంప్ - పాపం పెళ్లికొడుకు !

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Shabad Mass Murder Case: షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
1st Hydrogen Train: భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్
US Airstrikes On Iran: ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
AP Corona Deaths: ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
Telangana Congress Crisis: తెలంగాణ కాంగ్రెస్‌లో ముదురుతున్న సమన్వయ లోపం - వరుసగా వివాదాలు.. పీసీసీ మార్పు తప్పదా?
తెలంగాణ కాంగ్రెస్‌లో ముదురుతున్న సమన్వయ లోపం - వరుసగా వివాదాలు.. పీసీసీ మార్పు తప్పదా?
Breaking News: షాబాద్ 6 హత్యల నిందితుడు రాజ్ కుమార్ ఆత్మహత్యపై కేసు నమోదు
షాబాద్ 6 హత్యల నిందితుడు రాజ్ కుమార్ ఆత్మహత్యపై కేసు నమోదు
భారత్‌లోకి సింగపూర్ ప్రముఖ లైఫ్‌స్టైల్ మ్యాగజైన్లు.. ఎస్‌పీహెచ్ మీడియాతో ఆశ్రయు మీడియా భాగస్వామ్యం
భారత్‌లోకి సింగపూర్ ప్రముఖ లైఫ్‌స్టైల్ మ్యాగజైన్లు.. ఎస్‌పీహెచ్ మీడియాతో ఆశ్రయు మీడియా భాగస్వామ్యం
Embed widget