అన్వేషించండి

Guntur Crime News: అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్త హత్య.. చిలువురు హత్య కేసును చేధించిన పోలీసులు

గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం చిలువురులో హత్యకు గురైన వ్యాపారి కేసును పోలీసులు ఛేదించారు. అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ప్రియుడితో కలిసి భార్యనే హత్య చేసింది.

దుగ్గిరాల: గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం చిలువురులో సంచలనం సృష్టించిన హత్య కేసు మిస్టరీని మంగళగిరి రూరల్ పోలీసులు ఛేదించారు. ఈ దారుణానికి సంబంధించిన వివరాలను గుంటూరు జిల్లా ఎస్పీ వకూల్ జిందాల్ సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో మీడియా సమావేశంలో వెల్లడించారు. భార్య తన ప్రియుడు, అతని స్నేహితుడితో కలిసి పథకం ప్రకారం భర్తను హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్పీ ప్రకటించారు.

వివాహేతర సంబంధం..

గుంటూరు ఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం.. చిలువూరుకు చెందిన ఉల్లిపాయల వ్యాపారి లోకం శివనాగరాజుకు లక్ష్మీమాధురితో 2007లో వివాహమైంది. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. గతంలో విజయవాడలో థియేటర్ టికెట్‌ కౌంటర్‌లో లక్ష్మీమాధురి పనిచేసింది. ఆ సమయంలో సత్తెనపల్లికి చెందిన గోపితో ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధంగా మారింది. మరోవైపు చిన్న చూపు చూసి భర్త వ్యాపారాన్ని మాన్పించేసింది. హైదరాబాద్‌లో ట్రావెల్స్‌ నిర్వహిస్తున్న ప్రియుడు గోపి వద్దకు భర్తను ఉద్యోగానికి పంపింది. కొంతకాలానికి నాగరాజు హైదరాబాద్‌ నుంచి సొంతవూరుకి వచ్చేశాడు. భార్య వ్యవహారం నచ్చక మందలించాడు. అవి విభేదాలకు దారితీసి గొడవలు జరిగాయి. భర్త శివనాగరాజు ఇంటివద్ద నుంచే వ్యాపారం చేయడంతో గోపీని కలుసుకునే అవకాశం చిక్కడం లేదని, అతడి అడ్డు తప్పించుకోవాలని లక్ష్మీమాధురి భావించింది.


Guntur Crime News: అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్త హత్య.. చిలువురు హత్య కేసును చేధించిన పోలీసులు

అప్పడాల కర్రతో కొట్టి చంపేశారు..

 నిందితురాలు లక్ష్మీ మాధురి తన భర్త శివనాగరాజు తనను వేధిస్తున్నాడని ప్రియుడు గోపికి చెప్పడంతో ఇద్దరు కలిసి హత్యకు కుట్ర పన్నారు. ఇందుకోసం గోపి తన స్నేహితుడైన కంభంపాటి సురేష్ (ఆర్ఎంపి) వద్ద నుండి నిద్ర మాత్రలు సేకరించి మాధురికి ఇచ్చాడు. పక్కా ప్లాన్ ప్రకారం, ఈ నెల 18వ తేదీన మాధురి ఆ నిద్ర మాత్రలను పొడిగా చేసి బిర్యానీలో కలిపి భర్తకు పెట్టింది. శివనాగరాజు నిద్రమత్తులోకి జారుకున్న తర్వాత, నిందితులు అతడి కాళ్లు చేతులు పట్టుకుని, ఛాతీపై అప్పడాల కర్రతో బలంగా కొట్టి ప్రాణాలు తీశారు.


Guntur Crime News: అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్త హత్య.. చిలువురు హత్య కేసును చేధించిన పోలీసులు

హత్య అనంతరం, భర్త గుండెపోటుతో మరణించాడని నమ్మించేందుకు నిందితురాలు ప్రయత్నించింది. అయితే, మృతుడి చెవి నుంచి రక్తం వచ్చినట్లు గమనించిన పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. ప్రాథమికంగా మృతదేహంపై గాయాలు కనిపించకపోయినా, పోస్ట్‌మార్టం నివేదికలో ఛాతీ ఎముకలు విరిగినట్లు తేలడంతో హత్య విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తమదైన శైలిలో విచారణ చేపట్టడంతో లక్ష్మీమాధురి తప్పు ఒప్పుకుంది. ఆమె ఇచ్చిన వివరాలతో ప్రియుడు గోపీతో పాటు అతడి స్నేహితుడు సురేష్‌ను కూడా అరెస్ట్ చేసినట్లు ఎస్పీ వకూల్ జిందాల్ స్పష్టం చేశారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Aadhaar Forgery: ఇంట్లో ఇల్లాలు, ఫైవ్ స్టార్ హోటల్లో ప్రియురాలు..కానీ ఆధార్ మాత్రం ఇల్లాలిదే - ఆ భర్త అలా దొరికిపోయాడు!
ఇంట్లో ఇల్లాలు, ఫైవ్ స్టార్ హోటల్లో ప్రియురాలు..కానీ ఆధార్ మాత్రం ఇల్లాలిదే - ఆ భర్త అలా దొరికిపోయాడు!
NEET Paper Leak: రద్దు అయిన నీట్ యూజీ 2026 రీ ఎగ్జామ్‌ ఎప్పుడంటే?  మళ్లీ ఫీజు చెల్లించాలా? పాత హాల్‌టికెట్‌ ఉంటే చాలా?
రద్దు అయిన నీట్ యూజీ 2026 రీ ఎగ్జామ్‌ ఎప్పుడంటే?  మళ్లీ ఫీజు చెల్లించాలా? పాత హాల్‌టికెట్‌ ఉంటే చాలా?
Extramarital Affair: పదో తరగతి ప్రేమ - పెళ్లయ్యాక వివాహేతర బంధం - క్లైమాక్స్ చాలా వయోలెంట్ !
పదో తరగతి ప్రేమ - పెళ్లయ్యాక వివాహేతర బంధం - క్లైమాక్స్ చాలా వయోలెంట్ !
Gun Fire At Railway Station: నిడుబ్రోలు రైల్వే స్టేషన్ వద్ద ఉద్రిక్తత.. దొంగలపై కాల్పులు జరిపిన ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు
నిడుబ్రోలు రైల్వే స్టేషన్ వద్ద ఉద్రిక్తత.. దొంగలపై కాల్పులు జరిపిన ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు

వీడియోలు

“నా లవర్ మెసేజ్‌లు చదివారు”.. యానాంలో యువకుడి హైడ్రామా!
Sachin Amuzed: కర్రల కారును చూసి సచిన్ ఫిదా.. రోడ్డు పక్కన పిల్లాడిని పలకరించిన క్రికెట్ లెజెండ్
Krunal Pandya Injury: గాయపడినా.. RCBని గెలిపించేవరకూ పోరాటం ఆపని కృణాల్ పాండ్యా
Telangana Politics: మరో స్థాయికి వెళ్లిన బూతుల పంచాయతీ.. కంట్రోల్ తప్పిన పొలిటీషియన్స్
MahuaMoitra: మహువా మొయిత్రాకు షాక్.. చోర్ అంటూ నినాదాలు|

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Thalliki Vandanam Scheme: ఆంధ్రప్రదేశ్‌లో తల్లికి వందనం పథకానికి 78 లక్షల మంది అర్హులు! ఈ ప్రక్రియ పూర్తి చేసిన వారి ఖాతాల్లోనే నగదు జమ!  
ఆంధ్రప్రదేశ్‌లో తల్లికి వందనం పథకానికి 78 లక్షల మంది అర్హులు! ఈ ప్రక్రియ పూర్తి చేసిన వారి ఖాతాల్లోనే నగదు జమ!  
LPG Subsidy New Rules: ఎల్పీజీ వినియోగదారులకు బిగ్ అలర్ట్! ఆ మెసేజ్ వచ్చిందా 7 రోజుల్లో మీ సబ్సిడీ పోయినట్టే!
ఎల్పీజీ వినియోగదారులకు బిగ్ అలర్ట్! ఆ మెసేజ్ వచ్చిందా 7 రోజుల్లో మీ సబ్సిడీ పోయినట్టే!
NEET Paper Leak: రద్దు అయిన నీట్ యూజీ 2026 రీ ఎగ్జామ్‌ ఎప్పుడంటే?  మళ్లీ ఫీజు చెల్లించాలా? పాత హాల్‌టికెట్‌ ఉంటే చాలా?
రద్దు అయిన నీట్ యూజీ 2026 రీ ఎగ్జామ్‌ ఎప్పుడంటే?  మళ్లీ ఫీజు చెల్లించాలా? పాత హాల్‌టికెట్‌ ఉంటే చాలా?
TamilNadu Politics: అన్నాడీఎంకే చీలిక క్రెడిట్ విజయ్‌కే -30 మంది ఎమ్మెల్యేలతో భేటీ - బలపరీక్షలో మద్దతుగా ఓటేయడం ఖాయమే !
అన్నాడీఎంకే చీలిక క్రెడిట్ విజయ్‌కే -30 మంది ఎమ్మెల్యేలతో భేటీ - బలపరీక్షలో మద్దతుగా ఓటేయడం ఖాయమే !
Bandi Bhageerath case: కేసు కొట్టి వేయండి..మధ్యంతర బెయిల్ ఇవ్వండి - హైకోర్టులో బండి కుమారుడి పిటిషన్
కేసు కొట్టి వేయండి..మధ్యంతర బెయిల్ ఇవ్వండి - హైకోర్టులో బండి కుమారుడి పిటిషన్
Chiranjeevi: బాసూ... ఆ గ్రేస్ ఏంటి? హ్యాండ్సమ్ లుక్కేంటి? - మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ ఫోటోషూట్
బాసూ... ఆ గ్రేస్ ఏంటి? హ్యాండ్సమ్ లుక్కేంటి? - మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ ఫోటోషూట్
Liquor Shops Ban: ఆ మద్యం దుకాణాలు మూసివేయాలి.. సీఎం విజయ్ సంచలన నిర్ణయం, 2 వారాలు గడువు
ఆ మద్యం దుకాణాలు మూసివేయాలి.. సీఎం విజయ్ సంచలన నిర్ణయం, 2 వారాలు గడువు
Gun Fire At Railway Station: నిడుబ్రోలు రైల్వే స్టేషన్ వద్ద ఉద్రిక్తత.. దొంగలపై కాల్పులు జరిపిన ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు
నిడుబ్రోలు రైల్వే స్టేషన్ వద్ద ఉద్రిక్తత.. దొంగలపై కాల్పులు జరిపిన ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు
Embed widget